‘‘భూమి పుత్రుడి’’ పట్టుదల ‘‘భూ భారతి’’!..రైతుల కలలు నిజం చేసిన ‘‘పొంగులేటి’’.

`ధరణి దారిద్య్రం పారదోలారు.

`భూ భారతి ఒక నూతన విప్లవం.

`రైతుల కళ్లలో నిండుతున్న సంతోషం.

`రైతులకు భోరోసా నింపుతున్న గొప్ప నూతన ఆవిష్కారం.

`ఆరేళ్ల రైతు గోసకు చరమగీతం.

`భూ భారతి తెచ్చి రైతులకు సంజీవని చేశారు.

`ధరణిలో ఎదురైన 15 సమస్యలకు భూ భారతిలో పరిష్కారం చూపారు.

`ఆరేళ్లుగా రైతులు ఎదుర్కొంటున్న అవస్థలను తొలగిస్తున్నారు.

`ఆన్‌ లైన్‌ మోసాలకు అడ్డుకట్ట వేస్తున్నారు.

`ప్రతి తహసీల్దారు కార్యాలయంలో నలుగురు ప్రత్యేక సిబ్బందితో జాప్యం లేకుండా చూస్తున్నారు.

`కాలయాపన లేని శీఘ్రతర పరిష్కారం కనుగొన్నారు.

`వేలాది మంది రైతుల సమస్యలు తీర్చుతున్నారు.

`పచ్చని పల్లెలో పెట్టిన ధరణి చిచ్చును ఆర్పుతున్నారు.

`రైతుల మధ్య ధరణి పెంచిన వైషమ్యాలను చెక్‌ పెడుతున్నారు.

`భూ భారతి తెచ్చి రైతుల జీవితాలలో వెలుగులు నింపుతున్నారు.

`మళ్ళీ పల్లెల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తున్నారు.

`రైతుల మధ్య వైషమ్యాలు లేకుండా ఆగోగ్యకరమైన సుహృద్భావం ఏర్పరుస్తున్నారు.

`పరిష్కారం కావని తెల్లబోయిన రైతుల సమస్యలు చిటికెలో నెరవేర్చుతున్నారు.

`పైలెట్‌ ప్రాజెక్టులోనే అద్భుతమైన ఫలితాలు చూస్తున్నారు.

`రాష్ట్ర వ్యాప్త అమలుతో రైతులు వేడుకలు చేసుకోనున్నారు.

`ధరణి దుర్మార్గం నుంచి బైడపడి ఊపిరిపీల్చుకుంటున్నారు.

`జీవితకాలం శిక్షలా మారిన ధరణి దరిద్రం పోయినందుకు సంబరపడుతున్నారు.

`దటీజ్‌ ‘‘పొంగులేటి’’ అని రైతులు కొనియాడుతున్నారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

 పట్టుదలకు మారు పేరు రెవిన్యూ, రిజిస్ట్రేషన్ల్‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. అది రాజకీయంగానైనా, పాలనా పరంగానైనా తన చిత్త శుద్ది ఎంత గొప్పదో అనేక సార్లు నిరూపించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తర్వాత రాష్ట్రంలో ఎక్కువగా కష్టపడుతున్నమంత్రి ఎవరు అనే ప్రశ్నకు ఒకటే సమాధానం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. ఆయన వున్నంత ఆక్టివ్‌గా మరే మంత్రి కూడా లేరన్న వార్తలున్నాయి. రాజకీయంగా ఆయన ఎప్పుడూ ఎంత ఆక్టివ్‌గా వుంటారో..మంత్రిగా పాలనా పరంగా కూడా అంతకు మించి దూకుడుగా వుంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ప్రభుత్వం తన పని తీరును ప్రజలు హర్షించేలా చూసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి పేరు తెస్తున్నారు. ముఖ్యంగా ధరణి విషయంలో ఆయన చూపిన శ్రద్ద అంతా ఇంతా కాదు. అంతే కాదు ఇంత తొందరగా భూభారతి అమలులోకి వచ్చిందటే మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చూపిన చొరవ హర్షనీయమనే చెప్పాలి. అటు అధికారులను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ, భూభారతి డెవలప్‌ మెంటుపై చర్చలు పెట్టారు. సమీక్షలు చేపట్టారు. దానిపై విసృతమైన చర్చ జరిగేలా చూశారు. అందరి సూచనలు, సలహాలు తీసుకున్నారు. రైతుల సమస్యలపై అధ్యయనం చేయించారు. అందిరకీ ఆమోదయోగ్యమైన కార్యక్రమంగా భూ భారతి రూపు దిద్దేలా చేశారు. భూ పరిపాలనలో తనదైన ముద్ర వేశారు. రాజకీయంగా కూడా అంతే ..ఆయన తలపెట్టిన ఏ కార్యక్రమమైనా సరే దిగ్విజయంకోసం పని చేసే విధానం అందిరకీ నచ్చేలా వుంటుంది. తన ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చిన శ్రీనివాస్‌రెడ్డి తన దారిలో అడ్డంకులు ఎదుర్కొన్నారు. తన దారికి అడ్డు పడిన పుల్లలను పూచిక పుల్లలుగా తొక్కుకుంటూ పైకొచ్చారు. నాయకుడికి ధైర్యం కూడా ఎంతో ముఖ్యమనేది శ్రీనివాస్‌రెడ్డి నిరూపించారు. తొలుత ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎదురులేని నాయకుడిగా వచ్చారు. కాని కొందరి మాటలు నమ్మి తన అడుగులకు ఆయన ముందర కాళ్లకు బంధం వేసుకున్నారు. అది తొందరగానే గ్రహించారు. పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఎవరి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి రాలేదు. వ్యక్తిగత ప్రతిష్టతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజా సేవలో ఎవరూ చేయలేనంత సేవ చేసి ప్రజల మన్నననలు పొందారు. నాయకుడికన్నా, ముందుకు ప్రజా సేవకుడిగా ఆయన చేసిన సేవలు ప్రజల గుండెల్లో పెట్టుకున్నారు. ఆయనను రాజకీయంగా ఆదరించారు. రాజకీయాల్లోకి వస్తూ వస్తూనే ఆయనతోపాటు ఎంతో మందిని నాయకులను చేశారు. ఎంతో మంది నాయకులకు రాజకీయ జీవితం ఇచ్చారు. తనతో పాటు సమానమైన హోదా కల్గిన ప్రజా ప్రతినిధులుగా తయారు చేశారు. అలాంటి నాయకుడికి కూడా అడ్డంకులు ఏర్పరిచారు. నమ్మిన వాళ్లే ఆయనను వెన్ను పోటు పొడిచారు. అయినా ఆయన కుంగిపోలేదు. లక్ష్య సాధనలో వెనుకంజ వేయలేదు. ప్రజా సేవలో ఆయన మడమ తిప్పలేదు. ప్రజలకు సేవ చేయడంలో ఆయన వెనుదిగిరి చూడలేదు. అందుకే ఆయన రాజకీయాలను శాసించే స్ధాయికి ఎదిగారు. తన సొంత జిల్లాలో రాజకీయాలను తన కనుసైగలతో శాసించే స్ధాయికి ఎదిగారు. అదీ ఒక నిబద్దత వున్న నాయకుడి అంకితభావం అని నిరూపించారు. ఖమ్మం అంటే పొంగులేటి అంటే ఖమ్మం అనేంతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఖమ్మం జిల్లా రాజకీయాలకు పెద్దదిక్కుగా మారారు. ఉమ్మడి ఖమ్మం ప్రజలకు పెద్దన్నగా సేవలు చేస్తున్నారు. అందుకే ఆయన ఖమ్మం జిల్లా ప్రజలకు ఏది చెబితే అది, ఎంతచెబితే అంత అన్నట్లు రాజకీయాలను శాసించగలుగుతున్నారు. గతంలో ఎంత పెద్ద నాయకుడు కూడా చేయలేని సాహసాలు చేశారు. రాజకీయంగా సవాళ్లు విసిరారు. ఎదరులేదనుకున్న బిఆర్‌ఎస్‌ను మట్టికరిపించారు. తాను చేసిన శపధాన్ని నిలబెట్టుకున్నారు. అలా శపథం చేసి నిలబెట్టుకున్న నాయకులు చరిత్రలో ఒక్క పొంగులేటి తప్ప మరే నాయకుడు లేదు. విజయం సాధించిన నాయకుడు శ్రీనివాస్‌ రెడ్డికి తప్ప మరెవరికీ సాధ్యం కాలేదు. అలాంటి నాయకుడు పాలనలో భాగస్వామి అయితే ఎలా వుంటుందో కూడా చూపిస్తున్నారు. తన శాఖకు వన్నె తెస్తున్నారు. గత ప్రభుత్వం ధరణి పోర్టల్‌ తేవడం వల్ల కొన్ని లక్షల మంది రైతులు ఆగమయ్యారు. తాతల తరాల నుంచి లేని ఇబ్బందులు గత ప్రభుత్వం ధరణి తెచ్చి రైతుల నెత్తిన పిడుగులు వేశారు. నిజాం కాలం తర్వాత అత్యుత్తమైన భూ విధానం తీసుకొస్తామని చెప్పి, చిల్లం చిల్లంచేశారు. ప్రశాంతంగా వున్న పల్లెల్లో లేని పోని సమస్య సృష్టించారు. ఎవరి భూములు ఎటు వెళ్లాయో తెలియకుండాపోయాయి. రైతుల మధ్య కలతలు చెలరేగాయి. భూ వివాదాలు మళ్లీ మొదటికొచ్చాయి. ఎంతో మంది అన్నదమ్ముల మధ్య కొట్లాటలు తెచ్చాయి. కుటుంబాలలో పగలు రగించాయి. అయినా అంతా బాగుందంటూ గత ప్రభుత్వ మసి బూసి మారేడు కాయ చేయడానికే ప్రయత్నం చేసింది. దాంతో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. రైతులు తమ భూములను తామవే అని చెప్పుకోవడానికి కూడా ఆరేళ్లపాటు నరకం చూశారు. లక్షలు ఖర్చు చేసుకున్నారు. అప్పుల పాలై ఆగమాయ్యారు. తమ భూములు తమకు కాకుండా చేసిన గత ప్రభుత్వాన్ని దింపేశారు. ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలు తెచ్చుకున్నారు. ఎన్నికల ముందు ప్రజలకు హమీ ఇచ్చినట్లే కాంగ్రెస్‌ ప్రభుత్వం తక్కువ సమయంలోనే భూ భారతిని తెచ్చింది. భూ భారతి కోసం మంత్రి పొంగులేటి పడిన శ్రమ అంతా ఇంతా కాదు. ప్రజలకు వీలైనంత తొందరగా మేలైన పనులు చేయాలని, వారికి ఊరట కల్గించాలని, భరోసా కల్పించాలని మంత్రి పొంగులేటి దగ్గరుండి భూ భారతి రూపకల్పన చేయించారు. రైతుల కళ్లలో ఆనందం నింపారు. ఆరేళ్లపాటు పడరాని పాట్లు పడిన రైతులు ఇప్పుడు భూ భారతి వల్ల ఎంతో మేలు పొందుతున్నారు. చిన్న చిన్న సమస్యలు కూడా చిటికెలో పరిష్కారమయ్యేలా పోర్టర్‌ రూపొందించారు. రైతులకు కొత్త లోకాన్ని ఆవిష్కరించారు. తమ భూములపై రైతులకు కొండంత ధైర్యం భూ భారతితో నింపారు. అందుకు ప్రజలు కూడా మంత్రి పొంగులేటి కృషిని ప్రశంసిస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలలో ప్రముఖంగా ఆన్‌లైన్‌ పట్టాలున్నా రైతులకు కొత్త పాసు పుస్తకాలు ఇవ్వలేదు. దాంతో ఎంతో మంది రైతుల పాసు పుస్తకాల కోసం నిత్యం తహసిల్ధార్‌, ఆర్డీవో, కలెక్టర్‌ కార్యాలయాల చుట్టూ తిరిగేవారు. ఇక భూదాన్‌, వక్ఫ్‌, దేవాదాయ భూములంటూ పట్టా లాండ్స్‌ను కూడా పివోబిలో నమోదు చేయడం వల్ల ఎంతో మంది ఇబ్బందులు పడ్డారు. ధరణిలో రైతుల పేరిట వుండాల్సిన భూముల కంటే తక్కువ విస్తీర్ణం చూపించిన సందర్బాలు అనేకం వున్నాయి. వీటిపై ఎన్ని పిర్యాధులు వచ్చినా అప్పటి పాలకులు స్పందించలేదు. సర్వేనెంబర్లు మిస్‌ చేశారు. సాదాబైనామాలు కూడా రెగ్యులరైజ్‌ చేస్తామని చెప్పి పదేళ్లు కాలయాపన చేశారు. ఆ భూములకు కూడా లేని పోని సమస్యలు సృష్టించారు. ఇలా ధరణిపోర్టలో 15 రకాల సమస్యలు సృష్టించినట్లు గుర్తించారు. ఇక రైతులు అందరూ ఆన్‌లైన్‌లో ధరకాస్తు చేసుకోవాలనడం సాద్యం కాని పని. రైతులు ఎలాంటి కాగితం మీద పిర్యాదు ఇచ్చినా తీసుకునేలా భూ భారతికి వెసులుబాటు కల్పించారు. ప్రతి తహసిల్ధార్‌ కార్యాలయంలో కనీసం నలుగురు సపోర్టింగ్‌ టీమ్‌ ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే కొన్ని సంవత్సరాలుగా రైతులు పడరాన్ని పాట్లు పడుతున్నారు. వాటి నుంచి సత్వర విముక్తి కావాలని ప్రభుత్వం ఎంతో దూరదృష్టితో ఆలోచిస్తోంది. అంతే కాకుండా భూ భారతిలో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. గ్రామాల్లోనే సదస్సులు ఏర్పాటు చేసి, రైతుల నుంచి పిర్యాధులు స్వీకరించాలి. అప్పుడు పొరపాట్లు జరగడానికి ఒక్క శాతం కూడా ఆస్కారం వుండదు. ప్రజలందరి ముందు రైతులు తప్పుడు పిర్యాధులు చేసుకునేందుకు కూడా వీలుండదు. ఎందుకంటే గ్రామాలల్లో ఏ రైతు భూమి ఏమిటన్నది దాదాపు అందరికీ అవగాహన వుంటుంది. ఒక వేళ ఎవరైనా తప్పుడు పిర్యాదులు చేయాలని చూసినా వెంటనే తెలిసిపోతుంది. పైగా రైతులకు సులభమైన రీతిలో అర్ధమయ్యేలా ఫార్మేట్‌ రూపొందించారు. ఇలా రైతులకు అన్ని రకాలుగా వెసులుబాటు కల్పించేలా చట్టం రూపకల్పన జరిగింది. రైతులకు ఎంతో మేలు చేసేలా రూపకల్పన జరిగింది. లేని పోని గొప్పలకు పోయి, గత ప్రభుత్వం తెచ్చిన ధరణి మూలంగా ఎంతో మందిరైతులు మానసిక వేధనకు గురయ్యారు. తట్టుకోలేని ఎంతోమంది చనిపోయారు. ఎన్నో రైతు కుటుంబాలు సమస్యలు ఎదుర్కొన్నాయి. వాటన్నింటికీ ఒక్కటే పరిష్కారం భూ భారతి. రైతుల కలలు నెరవేరుస్తోంది. అది శ్రీనివాస్‌ రెడ్డి నిబద్దతను నిరూపిస్తోంది.

నీతిలేని పవన్‌!? మాటలకు తెలంగాణ ఉద్యమకారుల హెచ్చరిక

`పవన్‌ పూటకో వేషం తెలంగాణలో చెల్లదు!?

`పవన్‌ను వెనుకేసుకొచ్చే వారి ఆటలు కూడా సాగవు

`తెలంగాణ అంటే నవ్వులాట రాజకీయాలు కాదు

`ఉద్వేగరితమైన తెలంగాణ రాజకీయాలను కలుషితం చేస్తేమంటే చూస్తూ ఊరుకోం

`ఇసంత రమ్మంటే ఇళ్లంత నాదే అనే రకం!

`జనసేన పుట్టింది తెలంగాణలో అంటే తరిమి, తరిమి కొడతాం!

`నీ ఊసరవెళ్లి రాజకీయాలు సాగవు!

`ఉద్యమ కారుల ప్రాణాలు త్యాగం చేసిన నేల

`కొట్లాడి సాధించుకున్న తెలంగాణపై గద్దలు వాలితే ఈకలు పీకేస్తాం

`కన్నెత్తి చూస్తే గుడ్లతో గోలీలాడతాం

`ఉద్యమ కారుల తనువులు చాలిస్తుంటే రెచ్చ గొట్టిన చరిత్ర పవన్‌ది

`తెలంగాణ విడిపోతే 11 రోజులు అన్నం తినలేదని చెప్పి ఏపిలో ఓట్లు అడుక్కున్నావ్‌

`తెలంగాణ వ్యతిరేకులకు చోటు లేదు

`అవకాశవాది పవన్‌కు అసలే వుండదు

`తెలంగాణ అంటే ఆత్మ గౌరవం

`పూటకో మాట మాట్లాడే పవన్‌ అవకాశ రాజకీయం

`పుట్టిన గడ్డ ఏపికి ముందు సేవ చెయ్యి!

`నమ్మి గెలిపించినందుకు అభివృద్ధి చేయి

`తెలంగాణ జోలికొస్తే తరిమి కొడతాం

`ప్రాంతేతరుడి పొలిమేర వరకు తరమాలని చెప్పిన కాలోజీ వారసులం

హైదరాబాద్‌,నేటిధాత్రి:   

అయ్యోనివా..నువ్వు అవ్వోనివా..తెలంగాణకు నువ్వు పాలోడివా అన్న పాట ఇంకా తెలంగాణ జనం మర్చిపోలేదు. ఉద్యమ పురిటి వాసనలు తెలంగాణలో పోలేదు. తెలంగాణ అంటేనే ఉద్యమ రూపం. కలిసి సాగుదామంటే తెలంగాణలో వున్నంత సఖ్యత ఎక్కడా వుండుదు. కాని ఎప్పుడైతే పెత్తనం ఆలోచనలు ఏపి నాయకులు ఎవరు చేసినా తెలంగాణ సమాజం చీరి చింతకు కడుతుంది. అరవై ఏళ్లపాటు నిరంతరం పోరాటం చేసి, వేలాది మంది అమరులైన త్యాగం మళ్లీ ఏపి నాయకులు ఇక్కడ రాజకీయం చేయడానికా? తెలంగాణను మళ్లీ ఆగం చేయడానికా? నరనరాల్లో మనుషులే కాదు, జీవ జాతులన్నీ, చెట్టు చేమ, పుట్టా, ఆకు, అలము కూడా తెలంగాణ ఉద్యమ దీరత్వాన్ని నింపుకొని వున్నవే. వాటిని కదిలించే ప్రయత్న ఎవరు చేసినా పసిగడుతుంటాయి. పొలిమేర ఆవలకు తరిమేస్తుంటాయి.అందుకే కాలోజీ అన్నట్లు ప్రాంతేతరుడు తెలంగాణలో వేలు పెడితే ప్రాంతం పొలిమేర వరకు తరిమేయమన్నారు. అదే తెలంగాణ సమాజం ఆచరిస్తోంది. తెలంగాణ సాదించి అదే చేస్తోంది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ వుంటే, తెలంగాణమీద కుట్రలు చేసి, మళ్లీ మర్రి చూడకుండా ఏపికి వెళ్లిన చంద్రబాబును చూసి పవన్‌ కల్యాణ్‌ నేర్చుకోవాలి. జనసేన తెలంగాణలో పుట్టిందని చెబితే తెలంగాణ పార్టీ అయిపోదు. మది నిండా విషపు ఆలోచనలు నింపుకునే ఏపి నాయకులను తెలంగాణ సమాజం ఇక వెయ్యేళ్లయినా క్షమించదు. ఇలాగే చిరంజీవి మెగాస్టార్‌ అని లేని కిరీటాన్ని పెట్టుకొని , ఎన్టీఆర్‌ గెలిచారు. నేను గెలవనా? అనుకొని పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ప్రజారాజ్యం పెట్టుకున్నాడు. ఏమైంది? ఎన్టీఆర్‌కు, చిరంజీవికి నక్కకు నాగలోకానికి వున్నంత తేడా వుందని విసిరి అవతల పడేశారు. తెలంగాణ ప్రకటనకు ముందు సామాజిక తెలంగాణ అని ప్రజలను నమ్మించి మోసం చేయాలని చిరంజీవి చూశారు. అసలు సామాజిక తెలంగాణ అంటే అర్దమేమిటంటే నీళ్లు నమిలాడు. తెలంగాణ ప్రకటన రాగానే జై సమైక్యాంద్ర అన్నాడు. అలాంటి చిరంజీవి తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ ఏపి నాయకుడే అవుతాడు తప్ప, తెలంగాణ నాయకుడు ఎప్పుడూ కాదు. ఎందుకంటే వారి మనసు వేరు, నిజం వేరు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏపి ప్రజలే పవన్‌ను నమ్మలేదు. ఒక్క సీటు కూడా గెలిపించలేదు. పవర్‌ స్టార్‌ అని తనకు తానే గొప్పలు చెప్పుకొని, లేని స్టార్‌ డ్రమ్‌ను చూపించుకునేందుకు ఎన్ని ఎత్తులు వేసినా ఏపి జనం నమ్మలేదు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తే ఒక్క సీటు ఇవ్వలేదు. దాంతో అసలైన పవన్‌ బైటకు వచ్చాడు. అబద్దాలు చెప్పితే తప్ప గెలవలేనని నిర్ణయం తీసుకున్నాడు. చెప్పిన మాటే చెప్పి, చెప్పి, ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతం వాడినే అంటూ మాట్లాడి అమాయకులైన ప్రజలను నమ్మించాడు. అయితే ఒంటరిపోరుతో గెలవలేదు. కూటమి జట్టుకట్టి 20 సీట్లు గెలిచారు. అలాంటి పవన్‌ జనసేన పుట్టింది తెలంగాణలో అంటూ పల్లవి పాడితే తెలంగాణ జనం నమ్మరు. ఆదరించరు. తెలంగాణకు పవన్‌ కూడా ఒక శత్రువే. తెలంగాణ వచ్చిన తర్వాత 11 రోజుల పాటు ఉప వాసం వున్నానని, అన్నం తినాలనిపించలేదని అన్నాడు. ఇంట్లోనుంచి బైటకు రావాలంటే కూడా మనసొప్పలేదన్నాడు. తెలంగాణపై అంతటి విషం పెంచుకున్న పవన్‌ తెలంగాణలో వేలు పెట్టాలని చూసినా ప్రజలు సహించరు. 

ఆ మధ్య షర్మిల కూడా తెలంగాణలో పార్టీ పెట్టింది. నాలుగు రోజులు హడావుడి చేసింది. ఆ సమయంలోనే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఒక మాట సూటిగా చెప్పారు. ఏపికి చెందిన వారికి తెలంగాణలో రాజకీయం ఏమిటి? కొట్లాడి సాదించుకున్న తెలంగాణలో మీ ఉనికికి చోటెక్కడిది. రాజకీయం కోసం తెలంగాణలో ప్రగతి, అభివృద్ది విషయంలో మాట్లాడుకోవడానికైనా, పొట్లాడుకోవడానికైనా మేం చాలా మందిమి వున్నాం. తెలంగాణ రాజకీయాల్లో ఏపి నాయకులు వేలు పెడితే సహించమని స్పష్టం చేసిన సందర్భం వుంది. పిపిసి. అధ్యక్షుడుగా వున్నప్పుడే రేవంత్‌రెడ్డి షర్మిల విషయంలో అలాంటి అలా స్పందించిన రేవంత్‌ రెడ్డి, ఏ ఇతర ఏపి నాయకులు పెత్తనానికి వచ్చిన సహించరు. అలాగే తెలంగాణ మేధావి వర్గం కూడా వారిని ఆహ్వనించదు. ఒకవేళ బిజేపి తన ఉనికికోసం, సీట్ల సాధన కోసం, అధికారం కోసం జనసేనతో కలిసి వచ్చినా దీర్ఘ కాలంలో తెలంగాణకు తీరని నష్టం జరుగుతుందే తప్ప మేలు జరగదు. తెచ్చుకున్న తెలంగాణకు బిజేపి ద్రోహం చేసినట్లే అవుతుంది. 

ఆంధ్రా పార్టీలు, నాయకులు ఎప్పుడూ తెలంగాణ బాగు కోరుకోరు. తెలంగాణ బాగు పడాలని కోరుకోరు. ఏపి ప్రజలకన్నా,తెలంగాణ ప్రజలు సంతోషంగా వుండాలని ఎప్పుడూ కోరుకోరు. అదే నిజమైతే అరవై ఏళ్లపాటు తెలంగాణను గోస పెట్టకపోయేవారు. తెలంగాణ నాయకులను పాలనలో సమ ప్రాదాన్యం కల్పించేవారు. కేవలం సీట్లు ఎక్కువున్నాయన్న మందబలంతో ఆనాటి నుంచి తెలంగాణ వచ్చేదాక అన్యాయమే చేశారు. తప్ప ఏనాడు రాజకీయంగా తెలంగాణను ఎదగనీయలేదు. ఆర్ధిక పరిపుష్టి కల్గించలేదు. తెలంగాణ రైతును ఆదుకోలేదు. తెలంగాణను ఏ రంగంలో ఎదగనీయలేదు. అన్ని రంగాలను ఆగం చేశారు. తెలంగాణను ఆగం చేశారు. అందుకే 1969 ఉద్యమం వచ్చింది. వందలాది మందిని కాల్చి చంపారు. తెలంగాణ ఉద్యమాన్ని కర్కషంగా అణిచివేశారు. తెలంగాణ నాయకులు చేతనే తెలంగాణ కంట్లో పొడిపించారు. అవకాశవాద నాయకులను అడ్డం పెట్టుకొని ఆధిప్యతం చెలాయించారు. తర్వాత కూడా ఆరని మంటలా తెలంగాణ ఉద్యమం సాగుతూనే వచ్చింది. 2000 సంవత్సరం నుంచి మళ్లీ కేసిఆర్‌ రూపంలో ఉద్యమం మొదలైంది. ఉప్పెనలా మారింది. తెలంగాణ వచ్చింది. ఉద్యమ కాలంలో అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నాలు అనేకం చేశారు. అణిచివేశారు. కేసులు పెట్టారు. ఉద్యమకారులను జైలు పాలు చేశారు. తెలంగాణ యువకులు ఆత్మాహుతి చేసుకుంటున్నా కనికరించలేదు. ఎందుకంటే ఒక ప్రాంతం మీద పెత్తనం అంటే నాయక వర్గాలకు తరతరాల ఆదాయమే కాదు, పదవీ వ్యామోహం కూడా దాగి వుంటుంది. ఒక ప్రాంత నాయకులు మరో ప్రాంత నాయకులను బానిసలుగా చేసుకొని రాజకీయం చేయడం అహాంకారానికి నిదర్శనం. అది తట్టుకోలేని తెలంగాణ సమాజం 2000 తర్వాత మరింత ఎదురుతిరిగింది. తెలంగాణ సాధించుకున్నది. దాంతో ఆంధ్రా నాయకులకు కంటి మీద కనుకులేదు. హైదరాబాద్‌ను వదిలివెళ్లాలంటే మనసొప్పడంలేదు. నిజానికి ఏపి నాయకులకు ఆ ప్రాంతం మీద మమకారం లేదు. కాని పెత్తనం కావాలి. పదవులు కావాలి. అందుకే ఇప్పటికీ ఏపికి చెందిన ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా నాలుగు రోజులు ఏపిలోవుంటారు. మిగతా మూడు రోజులు తెలంగాణలో వుంటారు. ఆస్ధులన్నీ ఇక్కడుంటాయి. పెత్తనం అంతా అక్కడ చేస్తారు. ఈ తిరుడుగు కన్నా, మళ్లీ తెలంగాణను వశం చేసుకోవాలన్న కుట్రను తెలంగాణ వచ్చిన మరుసటి రోజు నుంచే మొదలు పెట్టారు. ఇక మేక వన్నె పులి లాగా తెలంగాణలో వుంటే తెలంగాణ ప్రజలను, ఏపిలో వుంటే ఏపి ప్రజలను నమ్మించేలా సినిమా డైలాగులు చెప్పి ఏపి డిప్యూటీసిఎం. పవన్‌ నమ్మిస్తూనే వున్నారు. ఒంటరి రాజకీయం కలిసి రావడం లేదని తెలుసుకొని , కూటమి జట్టు కట్టి, బిజేపిని ఒప్పించి, తెలుగుదేశంతో జతకట్టి ఎన్నికలకు వెళ్లారు. ఇచ్చిన సీట్లు తీసుకున్నాడు. బిజేపి తెలుగుదేశం పుణ్యమా? అని గెలిచాడు. ఇక అప్పటి నుంచి తెలంగాణలో కూడా రాజకీయం చేయాలన్న ఆసక్తిని పవన్‌ పెంచుకుంటున్నారు. ఇక్కడ తెలంగాణ ప్రజలు గమనించాల్సిన విషయం ఏమిటంటే ఏపికి చెందిన ఏ నాయకుడు జై తెలంగాణ అనడు. అంటే ప్రత్యేక భావన ఉట్టిపడుతుంది. ఆ మాట అనాలంటే ధైర్యం కావాలి. అది నిజాయితీ వున్న నాయకులే అనగలరు. కాకపోతే మోసం చేయాలనుకునే వారు కూడా అనగలరు. అదే దారిలో నడిచే పవన్‌ ఇంత వరకు జై తెలంగాణ అనేలేదు. కాని తెలంగాణలో రాజకీయం చేయాలని కలలు కంటున్నారు.

Fine rice is boon for poor people

 

· Govt. Support will be continued to millers

· Civil Supplies Commissioner Devendrasingh Chauhan gave interview to ‘Neti Dhathri’ Editor Katta Raghavendra Rao 

· Fine rice distribution caused people to feel happy

· ‘Fine rice’ distribution is a revolutionary decision

· People are appreciating the State Government in this regard.

· ‘It is fortunate for me to launch this programme during my tenure’.

· ‘This remains a challenge in discharging my duties’.

· ‘We have proved that distribution of fine rice is possible.

· This remains an example for the sincerity of the Government

· Millers have key role in distribution of fine rice

· All types of required assistance extended to millers

· Any miller can approach me to explain their problems

· Fine rice distribution is depends on the strength of millers system

· ‘ISO’ also issued certificate for distribution of fine rice 

· ‘Five Star’ rating remains an example for the success of fine rice distribution

· People are now feeling happy

· Representatives from other states inquiring about this fine rice distribution

· Jharkhand minister and officials came here to know about his fine rice distribution

· We explained them with power point presentation

· Representatives from five states already came here and observed at field level

· They took some advises regarding the distribution method of this fine rice.

· Four decades back then Govt. Implemented one kg rice for Rs.2/-

· Now present Govt. Successfully implementing this free rice distribution.

· Telangana remains No.1 in food security.

 

Katta Raghavendra Rao: ‘Namaste Sir’

Devendra Sing Chowhan: ‘Namaste’

Katta: ‘How are you sir?’

Chowhan: ‘Fine…what about you?’

Katta: “Happy sir…there is wide spread positive talk on fine rice. How is the impact of this fine rice distribution among the people?

Chowhan: Really speaking this is an excellent feeling. Providing sufficient food to poor people is really a best scheme. No other scheme can be compared with this scheme. This is mainly meant to fulfill the daily needs of the people. Especially the schemes related to food, shelter, cloth remains in the hearts of people forever. Such governments those implementing these schemes will always receive the support of the people. Providing daily essentials to people is not new. In previous so many governments implemented them. But distribution of fine rice to poor is totally different when compare with them because it provides food security for the needy people. Rs.2/- per kg rice scheme had been implemented since 1985, which provided food security to people. This scheme implemented just four decades back. In those days I think fine rice cost around Rs.4/- per kg. After some time some other governments felt it is not possible to distribute rice at a cost of Rs.2/- per kg and raise the cost to Rs.5/-. After NTR government, during the tenure of Kotla Vijayabhaskar Reddy as Chief Minister, rice distributed to poor with a cost of Rs.1.90 per kg. Later Chandrababu Naidu government increased the rate. After winning the 2004 elections, Dr. YS Rajasekhar Reddy implemented Rs.2/- per Kg. Rice scheme. Then the market price of rice was around Rs.10/- per kg. Later Kirankumar Reddy reduced the cost further to Rs.1/- per kg. Since then, rice distribution has been continuing with affordable prices to poor. When compare to previous schemes, the present distribution of fine rice is unique one and revolutionary in nature. At present fine rice market price is around Rs.50/- per kg. In this situation free distribution of fine rice is really an appreciable one. In previous when ‘doddu biyyam’ distributed, people used to sell out it in the market and continue to purchase fine rice. News regarding this situation published in news papers also. Now distribution of fine rice caused some burden free on poor people. Now it is very happy to see that entire society transformed to the level of consuming the fine rice. Especially the poor people are very happy towards the government for providing them fine rice. They are also happy to consume such fine rice. In previous, these poor people used to sell out their ‘doddu biyyam’ in the market and used to purchase fine rice paying higher prices. Now that situation has been changed. There is no difference in between poor, middle class and upper class. All people have been consuming fine rice equally.

‘Katta’: How you are feeling on receiving ‘ISO’ certificate?

‘Chowhan: ‘I can’t explain this happiness in words. While issuing the certificate they identified the fact about quality rice being distributed to poor. This rice contains more nutrients than the fine rice that available in the market. That means Government not only concentrating on food security but also on health security. This is the main reason name and fame received for ‘fine rice’ scheme implementing in Telangana. In this back ground ISO certificate issued to Civil Supplies department. Now people are happily consuming the fine rice. I wish them all to lead happy and healthy life.

Katta: What is the impact of this scheme in other states?

Chowhan: The implementation of fine rice scheme created repercussions in other states. Now there is growing demand for fine rice distribution in other states. Government representatives from other states are telephoning to give some time to know about this scheme. Jharkhand minister along with government officials came here and observed how this scheme has been implemented. They felt astonished on successful implementation of this scheme. We have explained them with power point presentation on how the scheme being implemented in Telangana. After knowing about this, they returned to their state with fixed mind to implement this scheme. Really speaking this scheme is the brain child of Chief Minister Revanth Reddy. Minister Uttamkumar Reddy also has been working hard for proper implementation of this scheme. As head of implementing authority I feel very happy for the success of this scheme. 

Katta: Rice millers have key role in implementation of this scheme. But it is said that they are also facing some problems.

Chowhan: Yes Rice millers play key role in implementing this scheme. On this occasion I express my congratulations to them.

Katta: It is said that millers wants to meet you to detail their problems.

Chowhan: They are always welcome to meet me. They can tell me the problems being faced. I am available for every miller and they can meet me any time to get proper solutions for the problems being faced. There is no discrimination between small and big miller. Even if you know about any problem they faced, can bring it to my notice. I will immediately attend and resolve the issue being faced. I am ready to give appointment to any miller who wants to meet me. Millers have key role in making success this fine rice scheme in the state. There is no question of negligence. Any miller in single or in group will get immediate appointment with me. I am always being available for them.

Katta Raghavendra Rao: Thank you sir. Let us meet once again.

Chowhan: Thanks…always welcome.

కూకీ మిలిటెంట్లతో మణిపూర్‌లో అశాంతి

సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతున్న మిలిటెంట్లు

వీరు మనదేశ పౌరులు కాదు

మయన్మార్‌ నుంచి వచ్చి కూకీ ప్రజలపై ఆధిపత్యం

మత్తుమందుల అక్రమరవాణా, బలవంతపు వసూళ్లు, హత్యలు వీరి నిత్యకృత్యం

మైతేయీల మతసంప్రదాయాలను అడ్డుకుంటున్న కూకీలు

సుప్రీంకోర్టు జడ్జినే బార్‌ అసోసియేషన్‌లోకి అనుమతించని వైనం

మణిపూర్‌లో శాంతి ఎండమావేనా?
హైదరాబాద్‌,నేటిధాత్రి:
మణిపూర్‌లో మైతేయి, కూకీల మధ్య హింసాకాండ జరిగి మే 3తో సరిగ్గా రెండేళ్లు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎటువంటి హింసాత్మక సంఘటనలు జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంది. ఇంపాల్‌, చురాచంద్‌పూర్‌, కంగ్‌పోక్పీ జిల్లా కేంద్రాల్లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల చేశారు. ఈ సందర్భంగా మైతేయి వర్గానికి చెందిన సామాజిక సంస్థ ‘కోఆర్డినేటింగ్‌ కమిటీ ఆన్‌ మణిపూర్‌ ఇన్‌టిగ్రిటీ’ మే 3న ఒక సదస్సును ఏర్పాటు చేసింది. ప్రజలు తమ అన్ని పనులు మానుకొని మరీ ఈ సదస్సుకు రావాలని పిలుపునివ్వడంతో, ఎక్కడ ఏవిధమైన అల్లర్లు జరగకుండా పోలీసులు డేగ కళ్లతో నిఘాను కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో కూకీ మెజా రిటీ ప్రాంతాల్లో కూకీ విద్యార్థి సంఘం ‘ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ జోమీ స్టూడెంట్స్‌’ బంద్‌కు పిలుపుని చ్చింది. అంతేకాదు చురాచంద్‌పూర్‌ జిల్లా కేంద్రంలో ‘ఇండీజినియస్‌ ట్రైబల్‌ లీడర్స్‌ ఫోరం’ ఏ ర్పాటుచేసిన ఈవెంట్‌లో పాల్గనాలని ఈ విద్యార్థిసంఘం కూకీలకు పిలుపునిచ్చింది. రెండేళ్ల క్రితం జరిగిన హింసాకాండకు నిరసనగా ప్రజలు తమ ఇళ్లపై నల్లజెండాలు ఎగురవేయాలని కూడా ఈ సంఘం కోరింది. మే 2023 నుంచి ఇంపాల్‌ లోయ వాసులైన మైతేయీలు, చుట్టుపక్కల పర్వత ప్రాంతాల్లో నివసించే కూకీ`జో గ్రూపుల మధ్య జరిగిన హింసాకాండలో 240 మంది ప్రాణాలు కోల్పోగా, 6వేలకు పైగా గాయపడ్డారు. మరో 60వేల మంది నిరాశ్రయులయ్యారు. ఇక్కడి పరిస్థితులు అదుపులోకి రాకపోవడం ముఖ్యమంత్రి ఎన్‌.బీరేన్‌సింగ్‌ గత ఫిబ్రవరి 9న రాజీనామా చేయడంతో, కేంద్రం అదేనెల 13వ తేదీనుంచి మణిపూర్‌లో రాష్ట్రపతిపాలన విధించింది. ఇటీవల మైతేయీ, కూకీ తెగలకు చెందిన పౌరహక్కుల సంఘాల నాయకులు మరియు నా గా, మైతేయీ, కూకీ తెగలకు చెందిన ప్రజాప్రతినిధుల మధ్య సయోధ్య చర్చలకు ప్రోత్సహించి నా పలితం లేదు.
క్యాన్సర్‌లా పరిణమించిన కూకీ మిలిటెన్సీ
సస్పెన్షన్‌ ఆఫ్‌ ఆపరేషన్‌ (ఎస్‌ఓఓ) కింద కూకీ మిలిటెంట్‌ గ్రూపుల కార్యకలాపాలు ఇప్పుడు మణిపూర్‌ను క్యాన్సర్‌ రోగంలాగా పీడిస్తున్నాయి. నిజానికి ఈ ఒప్పందం కూకీ, మైతేయీ తెగల మధ్య శాంతి స్థాపనకోసం ఉద్దేశించింది. అయితే ఈ ఒప్పందాన్ని అడ్డంపెట్టుకొని, కూకీ మిలి టెంట్లు, కూకీ ప్రజల గ్రామాల్లో తిష్టవేసి, ప్రభుత్వ అధికార వ్యవస్థను ఎంతమాత్రం లెక్కచేయ కుండా తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నారు. నిజానికి ఈ కూకీ మిలిటెంట్లు భారతీయులు కా దు. మయన్మార్‌నుంచి సరిహద్దులు దాటి మనదేశంలో ప్రవేశించి కూకీ తెగల ప్రజలు నివసిం చే పర్యత ప్రాంతాల్లో సమాంతర ప్రభుత్వాన్నే నడుపుతున్నారని చెప్పాలి. భారత్‌, బంగ్లాదేశ్‌, మయన్మార్‌ ప్రాంతాల్లో నివసించే కూకీ తెగల ప్రజలతో కూడిన ‘కూకీలాండ్‌’ ఏర్పాటు వీరి ప్రధానడిమాండ్‌. నిజానికి కూకీ మిలిటెంట్లు ఎస్‌ఓఓ ఒప్పందాన్ని ఖాతరు చేయడంలేదు. బలవంతపు వసూళ్లు, ఆయుధాల అక్రమరవాణా, వేధింపులకు పాల్పడటం వీరికి నిత్యకృత్యమైంది. ఒకవిధం గా చెప్పాలంటే 2023 మే నెలలో రెండు తెగల మధ్య హింస ప్రజ్వరిల్లడానికి ముందే వీరు ఇటువంటి కార్యకలాపాలు యదేచ్ఛగా నిర్వహిస్తూ వచ్చారు. స్థానిక పోలీసుల నిర్లక్ష్య వైఖరి కూడా వీరిని ప్రోత్సహించినట్లవుతోంది. ఒక్కోసారి వీరు పాల్పడుతున్న స్థానిక నేరాలు, దేశ భద్రతకు ముప్పుగా మారుతుండటం వర్తమాన చరిత్ర.
మిలిటెంట్ల కాల్పులతోనే హింస ప్రారంభం
2023 మే నెలలో ప్రజ్వరిల్లిన హింస నిజానికి కూకీ మిలిటెంట్లు ఎస్‌ఓఎస్‌ ఒప్పందాన్ని ఉల్లం ఘించి, మైతేయీ గ్రామాలపై కాల్పులు జరపడంతో ప్రారంభమైంది. అప్పుడు మైతేయీ ప్రజ లు తమకు అందుబాటులో ఉన్న సంప్రదాయ తుపాకులతో ఎదురుదాడులకు దిగడంతో హింస తీవ్రరూపం దాల్చింది. తర్వాత గవర్నర్‌ అజయ్‌కుమార్‌ భల్లా ఆయుధాలను అప్పగించాలని కో రడంతో, మైతేయీ ప్రజలు తమవద్ద వున్న ఆయుధాలను ప్రభుత్వానికి అప్పగించారు. కానీ కు కీ తెగలవారు కొద్ది మంది మాత్రమే ఆయుధాలు అప్పగించడంతో ఇప్పటికీ వారివద్ద అధునాత న అయుధాలున్నాయన్న ఆరోపణలున్నాయి. ముఖ్యంగా గ్రామరక్షక దళాలుగా వున్న కూకీల చేతిలో ఇటువంటి ఆయుధాలున్నాయని మైతేయీలు ఆరోపిస్తున్నారు.
ఉన్నతస్థాయివారికీ ఇబ్బందులు
ఇక్కడ కొనసాగుతున్న అరాచక పరిస్థితి ఉన్నతస్థాయికి చెందిన వారిని కూడా ఇబ్బందికి గురి చేస్తున్నది. ఉదాహరణకు ఈ ఏడాది మొదట్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎన్‌.కోటేశ్వర్‌ (ఈయన మైతేయీ తెగకు చెందినవారు)ను చురాచంద్‌పూర్‌ స్థానిక బార్‌ అసోసియేషన్‌లోకి ప్రవేశిం చకుండా అడ్డుకున్నారు. నిజానికి ఈ సంఘటన స్థానిక లీగల్‌ మరియు పౌర హక్కుల సంఘాలను నిర్ఘాంతపోయేలా చేసింది. దేశ అత్యున్నత న్యాయస్థానానికి చెందిన న్యాయమూర్తిని కేవలం మైతేయీ తెగకు చెందిన వాడన్న కారణంగా ఈవిధంగా అనుమతించకపోవడానికి మించిన అ రాచకం మరేదైనా వుంటుందా? ఇది మిలిటెంట్లు చేసిన పనికాదు. చట్టం, రాజ్యాంగం బాగా తెలిసిన వారు పాల్పడిన చర్య.
మైతేయీలపై ఆంక్షలు
ఇదిలావుండగా మైతేయీ తెగల ప్రజలు ఏటా ఏప్రిల్‌ నెలలో ‘తాంగ్‌జిల్‌ పర్వతం’పైకి తీర్థయా త్రకు వెళ్లి అక్కడ మతపరమైన కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీ. కొన్ని తరాలుగా ఈ ఆచారాన్ని మైతేయీలు పాటిస్తున్నారు. అయితే కూకీ`జో తెగకు చెందిన ఆరు సంస్థలు ఈ యాత్ర జరుపకూడదని మైతేయీలకు హెచ్చరికలు జారీచేశాయి. ఇది మైతేయీ తెగ ప్రజల సాంస్కృతిక హక్కుపై నేరుగా జరిపిన దాడి! రాజ్యసభ ఎం.పి. తితులార్‌ కింగ్‌ సనజౌబా లీషిం బా తీవ్రంగా ఖండిరచారు. పౌరహక్కుల సంఘాలు కూడా కూకీ తెగల వ్యవహారశైలిని తీవ్రంగానిరసించాయి. కూకీాజో తెగకుచెందిన థాన్‌లాన్‌ వింగ్‌జాజిన్‌ వాల్టే హింస ప్రారంభమైన తొలినాళ్లలో తీవ్రంగా గాయపడ్డారు. కోలుకున్న తర్వాత ఒక టెలివిజన్‌ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, రెండు తెగల మధ్య శాంతి సుస్థిరతలు నెలకొనాల్సిన అవసరం వున్నదని చెప్పడంతో శాంతిపై ఆశలు చిగు రిరించాయి. కొద్దిరోజుల తర్వాత విచిత్రంగా ఆయన మాటమార్చి ‘ప్రత్యేక పాలన’ మాత్రమే మణి పూర్‌లో శాంతికి దోహదం చేస్తుందని మరో వీడియో విడుదల చేయడంతో కూకీ మిలిటెంట్లు ఆయనచేత అలా బలవంతంగా చెప్పించారన్న సంగతి స్పష్టమైంది. కూకీ తెగలో ఉదారవాదుల ను మిలిటెంట్లు తమ నియంత్రణలో వుంచుకుంటున్నారనేదానికి ఇది ఒక ఉదాహరణ.ఏప్రిల్‌ 21న కాంగ్‌పోక్పీ జిల్లా ఎస్‌.పి. ఆఫీస్‌ నుంచి ఒక ప్రకటన వెలువడిరది. కె.పొన్‌లెన్‌ గ్రామంలో, కాంగ్‌చుప్‌ ఏరియా ప్రొటెక్షన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కమిటీ (కేఏపీడీసీ) ఏప్రిల్‌ 30న ఏర్పాటు చేసిన సమావేశం వద్దకు వెళ్లాల్సిన అవసరం లేదంటూ స్థానిక సివిల్‌ పోలీసులు, మణిపూర్‌ రైఫిల్స్‌ (ఎంఆర్‌), ఇండియా రిజర్వ్‌ బెటాలియన్లను ఆదేశిస్తూ జారీచేసిన ప్రకటన ఇది. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసింది కూకీ ఇన్పీ తెగవారు.
రాష్ట్రపతి పాలనతో పరిస్థితి అదుపు
గత ఫిబ్రవరిలో రాష్ట్రపతిపాలన విధించిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితుల్లో మార్పువచ్చింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా నిర్దేశాలున్నప్పటికీ, రాష్ట్రంలో ఇప్పటికే స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేదు. తెగలమధ్య అనుమానాలు ఇంకా సమసిపోలేదు. కేంద్ర సంస్థలు మౌనాన్ని పాటించడం కూడా ప్రజల్లో ఒకరమైన అస్పష్టత కొనసాగుతోంది. నిజం చెప్పాలంటే మణిపూర్‌ తన ‘ఉనికి’ కోసం పోరాడుతోంది. ముఖ్యంగా కూకీ మిలిటెంట్ల కార్యకలాపాలు, మాదక ద్రవ్యాల అక్రమర వాణా, తత్సంబంధిత హింసాత్మక సంఘటనలు రాష్ట్రంలో శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయి. వీరి ప్రభావం పౌరసమాజం, రాజకీయాలు, శాంతిభద్రతలు, సాం స్కృతిక సంస్థల పై తీవ్రంగా వుంటోంది. తగిన చర్యలు తీసుకోవడంలో కేంద్రం తాత్సారం చేసే కొద్దీ, ఈ కూకీ మిలిటెంట్లు మరింత బలపడతారు. మతసహనం పాటింపులో పక్షపాత వైఖరి అనుసరించడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు. ఇది ప్రజాస్వామ్య సమర్థకుల్లో విశ్వాసాన్ని దె బ్బతీస్తుంది. వాస్తవానికి మైతీయీలు, కూకీలు పరస్పరం శాంతినే కోరుకుంటున్నారు. కానీ సమస్యల్లా మిలిటెంట్లతోనే! ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న రాష్ట్రపతిపాలన పరిపాలనా పరంగా ఒక సానుకూల దశగా వుండాలి. ముఖ్యంగా శాంతి సుస్థిరతలు నెలకొల్పేదిగా, తెగల మధ్య సామరస్యాన్ని పెంపొందించడానికి దోహదపడేదిగా వుండాలి. ఇదే సమయంలో అక్రమాలకు పాల్పడే ముష్క రులను నియంత్రించాలి. తద్వారా కొత్త ప్రభుత్వం సక్రమంగా పాలన కొనసాగించే వాతావరణాన్ని కల్పించగలగాలి. ఇది d సాధించేవరకు, మణిపూర్‌ను ‘చట్టం’ పాలిస్తుందా లేక తుపాకుల ఆధిపత్యం కొనసాగుతుందా అనేది మాత్రం ప్రశ్నార్థకంగా మిగిలిపోక తప్పదు!

ఉద్రిక్తతల నడుమ కోలుకుంటున్న కాశ్మీరం

ఆర్థికంగా దెబ్బకొట్టిన ఒకే ఒక సంఘటన

మూకుమ్మడిగా బుకింగ్‌లు రద్దుచేసుకున్న పర్యాటకులు

రద్దు చేసుకున్నవారిలో ముంబై, పూణె, బెంగళూరు, పశ్చిమ బెంగాల్‌ పర్యాటకులు

స్థానికుల్లో ఉగ్రవాదులపట్ల ఆగ్రహావేశాలు

జీవనోపాధిని దెబ్బకొట్టారన్న బాధ

ఇప్పుడిప్పుడే మళ్లీ వస్తున్న పర్యాటకులు

పరిస్థితి చక్కబడితే మళ్లీ పర్యాటకుల సందడి 

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

కశ్మీర్‌లోని పహల్గామ్‌లో 26మంది అమాయక పర్యాటకును ఉగ్రమూకలు పొట్టనపెట్టుకున్న సంఘటన జరిగి పదిరోజులు కావస్తోంది. ఇప్పటికీ పహల్గామ్‌ ప్రాంతం ఈ షాక్‌నుంచి తేరుకోలేదు. అయితే ఇప్పుడిప్పుడే పర్యాటకులు వస్తుండటంతో స్థానికుల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. పదిరోజులవరకు పోటెత్తిన పర్యాటకులతో కళకళలాడిన పహల్గామ్‌ ప్రాంతం ఉగ్రసంఘటనతో ఒక్కసారిగా వెలవెలపోయింది. అప్పటివరకు పర్యాటకుల వల్ల వస్తున్న ఆదాయంతో ఎంతో సంతోషంగా వున్న స్థానికుల్లో జీవనాధారం కోల్పోవడంతో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. శీతాకాలం వారికి ఎటువంటి ఆదాయం వుండదు. ఈ ఎండాకాలంలోనే సంపాదించుకునే ఆదాయమే కశ్మీరీలకు ఏడాది పొడవునా కడుపునా జీవనం గడవడానికి ఆధారం. అటువంటిది ఒక్కసారిగాఆదాయం కోల్పోవడంతో వారిలో తీవ్రమైన నిరాశ ఆవహించిందన్న మాట వాస్తవం. ఎందుకంటే కశ్మీర్‌ సందర్శించే ఒక పర్యాటకుడు రోజుకు సగటున రూ.10వేలు ఖర్చు చేస్తాడు. పర్యాట కుల సంఖ్యను బట్టి ఈ ఆదాయాన్ని లెక్కిస్తే, ఈ రంగం ఎంత చక్కటి జీవనోపాధిని కలిగిస్తున్నదీ అర్థమవుతుంది. ఎంతోకష్టపడి నిర్మించుకున్న ఆకాశహార్మ్యాన్ని ఒక్క అగ్గిపుల్లతో భస్మీపటలం చేయొచ్చు. ప్రస్తుతం పహల్గామ్‌ సంఘటన ద్వారా ఉగ్రవాదులు చేసిన పని ఇదే. పర్యాటక ‘హార్మ్యాన్ని’ కుప్పకూల్చడానికి యత్నించారు.

పర్యాటకానికి తాత్కాలిక బ్రేక్‌

 1988ా89 ప్రాంతంనుంచి అశాంతి, హింసాకాండ మధ్య నలిగిపోయిన కాశ్మీరంలో, 370 అధికరణం రద్దు తర్వాత ప్రగతి ఉషోదయ కాంతులు ప్రారంభమయ్యాయి. మాల్స్‌, సినిమా ధియేటర్లు తెరుచుకున్నాయి, హోటళ్లు, రిసార్టులు పర్యాటకులతో కళకళలాడాయి. స్థానిక కశ్మీరీలు తమ జీవనోపాధికి సంపాదించుకునే అవకాశాలు మళ్లీ మామూలు స్థితికి చేరుకోవడంతో వారి లో సుఖ సంతోషాలు మళ్లీ ప్రారంభయ్యాయి. గత ఆరేళ్లుగా ఎటువంటి ఉగ్రసంఘటన లేకపోవడంతో కశ్మీర్‌ వేగంగా మామూలు స్థితికి చేరుకుంది. సరిగ్గా ఇదేసమయంలో పాకిస్తాన్‌ ప్రేరిత ఉగ్రవాదులు పహల్గామ్‌లో పర్యాటకులను పొట్టనపెట్టుకోవడంతో ఇన్నేళ్లుగా క్రమంగా నెలకొంటూ వచ్చిన మామూలు స్థితికి బ్రేక్‌ పడిరది. ఒక్కసారిగా దుకాణాలు, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. పర్యాటకులు తమ స్వస్థలాలకు వెళ్లిపోయారు. తమ జీవితాలు మళ్లీ కొడిగట్టిపోతాయన్న భయం స్థానికుల్లో వ్యక్తమైంది. నిర్మానుష్యంగా వున్న ఈ ప్రాంతం మాదిరిగానే, కళతప్పిన కళ్లతో మళ్లీ స్థానికుల్లో దీనావస్థ మొదలైంది. జీవనోపాధి కోల్పోయిన స్థానికుల్లో మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా ఈ సంఘటన నేపథ్యంలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.

కట్టిపడేస్తున్న కశ్మీర్‌

కానీ భూతల స్వర్గమైన కశ్మీర్‌ పర్యాటకులను తన అందచందాలతో కట్టిపడేస్తూ పదేపదే వచ్చేలాఆహ్వానిస్తూనే వుంటుంది. ఇప్పుడు సరిగ్గా జరుగుతున్నదిదే. ఉగ్ర సంఘటన తర్వాత నిస్తేజంగా మిగిలిన పహల్గామ్‌ ప్రాంతంలో మళ్లీ పర్యాటకుల రాక మొదలైంది. నిజానికి ఉగ్రసంఘటన జరిగిన పహల్గామ్‌కు మూడు కిలోమీటర్ల దూరంలోని బైసరాన్‌ పర్వతాగ్రంపై వున్న పచ్చిక మైదానాల ప్రదేశాన్ని ‘స్విడ్జర్లాండ్‌ ఆఫ్‌ ఇండియా’ అని పేర్కొంటారు. ప్రభుత్వం కూడా భద్రతా కార ణాల రీత్యా మొత్తం 87 పర్యాటక ప్రదేశాల్లో 48 వరకు ప్రభుత్వం మూసివేసింది. దూష్‌పత్రి, కోకెరాంగ్‌, దుక్సుమ్‌, సింథన్‌ టాప్‌, అచ్ఛాబల్‌, బంగస్‌ వ్యాలీ, మార్గాన్‌ టాప్‌, తోసా మైదాన్‌ వంటి పర్యాటక ప్రదేశాలు మూసివేసిన వాటిల్లో వున్నాయి.బుద్గాం లోని దూధ్‌పత్రి, అనంతనాగ్‌లోని వెరినాగ్‌ వంటి సుందర ప్రదేశాల్లోకి కూడా ప్రస్తుతం పర్యాటకులను అనుమతించరు. వీటి మూసివేతను అధికారికంగా ప్రకటించకపోయినా, వీటి ఎంట్రీ ప్రదేశాలు తాళాలు వేసి వుంటున్నాయి. గుల్‌మార్గ్‌, సోన్‌మార్గ్‌, మొఘల్‌ గార్డెన్స్‌, దాల్‌ లేక్‌ వంటి ప్రముఖ పర్యాటక ప్రాం తాలు ఇంకా తెరిచే వున్నాయని చెబుతున్నప్పటికీ మొఘల్‌ గార్డెన్స్‌లోకి ప్రవేశించే గేట్లు తెరుచుకోవడంలేదు.

ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో ఏళ్లు…

పాక్‌ ప్రేరిత ఉగ్రవాదంతో సతమతమైన ఈ ప్రాంతం, తిరిగి ఇప్పటి స్థాయికి చేరుకోవడానికి ఎన్నో ఏళ్లు పట్టిందనేది నిజం. గత ఏడాది కశ్మీర్‌ను సందర్శించిన వారి సంఖ్య 20మిలియన్లను దాటడం, ఇక్కడ పర్యాటకం ఏ స్థాయిలో ఊపందుకున్నదీ వెల్లడిస్తున్నది. అయితే ఉగ్రసంఘటనతర్వాత పూణె, ముంబయి, బెంగళూరు మరియు పశ్చిమ బెంగాల్‌ ప్రాంతాలకు చెందిన పర్యాటకులు పెద్దసంఖ్యలో తమ బుకింగ్‌లను రద్దు చేసుకున్నారనేది టూర్‌ ఆపరేటర్లు చెబుతున్న మాట. 80 నుంచి 90శాతం బుకింగ్స్‌ రద్దయ్యాయని టూర్‌ ఆపరేటర్లు చెబుతున్నారు. అయితే అడ్వాన్స్‌ మొత్తాలను చెల్లించిన పర్యాటకులు మాత్రం తమ పర్యాటక ప్రణాళికను యధాతథంగా కొనసాగిస్తున్నారని వారు చెబుతున్నారు. ఇదిలావుండగా ఈ సంఘటన నేపథ్యంలో, ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన చీనాబ్‌ రైల్వే వంతెన ప్రారంభం మరింత ఆలస్యం కాక తప్పదు. ఈ ప్రాంతంలోకి ఇప్పుడిప్పుడే వస్తున్న పెట్టు బడులపై కూడా ప్రభావం పడే అవకాశముంది. ఇప్పటికే వున్న వ్యాపారాలు బిక్కుబిక్కు మంటూ కొనసాగించక తప్పని పరిస్థితి! ఇదిలావుండగా జమ్ము కశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా ఏప్రిల్‌ 28న అసెంబ్లీలో చాలా ఉద్వేగంగా మాట్లాడుతూ, మరణించిన 26మంది పేర్లు చదివి వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వీరిని క్షమించమని అడగడానికి కూడా మాటలు రావడంలేదన్నారు. 

ఒక్క దాడితో మొత్తం తల్లక్రిందులు

నిజానికి 2025లో కశ్మీర్‌ జీఎస్‌డీపీ 7.06%గా వుండగలదని అంచనా. ఇది దేశ జీడీపీ కంటే ఎక్కువ! 2019 నుంచి 2025 వరకు రాష్ట్ర సమ్మిళిత వార్షిక ప్రగతి (సీఏజీఆర్‌) 4.89%గా న మోదైంది. ఫలితంగా 2025 ఆర్థిక సంవత్సరం రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,54,703గా న మోదైంది. ఉగ్ర సంఘటనలు కూడా 2018లో 223 జరగ్గా 2023నాటికి 46కు పడిపోయాయి. సోపోర్‌ మండి వార్షిక టర్నోవర్‌ 2024లో రూ.7వేల కోట్లకు చేరుకుంది. కుప్వారా, బండిపుర, బారాముల్లా, బుద్గాం ప్రాంతాల ప్రజల జీవనోపాధిని ఈ మండి సుస్థిరం చేసింది. అదేవిధం గా 2020లో 34 లక్షలమంది పర్యాటకులు కశ్మీర్‌ను సందర్శిస్తే, 2024 నాటికి వీరి సంఖ్య 2.36కోట్లకు చేరుకోవడం విశేషం. ఈ నాలుగేళ్ల కాలంలో పర్యాటకుల సంఖ్య ఇంత విపరీతంగా పెరగడం రాష్ట్ర ఆర్థిక పుష్టికి దోహదం చేసింది. ప్రస్తుతం కశ్మీర్‌లో పర్యాటక రంగంపై ఆధారపడి 1500 హౌజ్‌ బోట్లు, మూడువేలకు పైగా హోటల్‌ రూమ్‌లు, టాక్సీ ఆపరేటర్లు, టూర్‌ గైడ్‌లు, చేనేత వస్తువుల అమ్మకందార్లు, చిన్న గుర్రాలు (పోనీ)ల నిర్వాహకులు ఆధారపడి బతుకు తున్నారు. పాక్‌ ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌ ప్రకటన, తర్వాత నాలుగు రోజులకు జరిగిన ఉగ్రదాడి ఈ మొత్తం కశ్మీర్‌ ఆర్థిక వ్యవస్థను, ప్రజల జీవనోపాధులను అంధకారంలోకి నెట్టేసిందన డం అతిశయోక్తి కాదు. 

ఆత్మవిశ్వాసంతో పర్యాటకులు

వాస్తవానికి 1989 నుంచి పతాకస్థాయికి చేరిన ఉగ్రవాదం నేపథ్యంలో భద్రతా దళాలపైనే, ముష్కరులు దాడులు చేస్తూ వచ్చారు. కానీ ఈసారి సాధారణ పర్యాటకులను పొట్టనపెట్టుకోవడంతో, సర్వేసర్వత్రా వారిపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. పహల్గామ్‌ వంటి ప్రాంతాలు రాష్ట్రానికి పర్యాటకపరంగా అత్యధికంగా ఆదాయాన్ని సమకూరుస్తాయి. సంఘటన తర్వాత ప ర్యాటకుల సంఖ్య పడిపోతే, స్థానికుల జీవనోపాధి మాత్రమే కాదు, రాష్ట్ర ఆదాయం కూడా భారీగా పడిపోతుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. శాల్వలు అమ్ముకునేవారు, డ్రైవర్లు, రి సార్టుల్లో పనిచేసే వర్కర్లు మొదలైనవారిలో ప్రస్తుతం అయోమయం నెలకొంది. అయితే ఇప్పుడిప్పుడే మళ్లీ వస్తున్న యాత్రికులతో స్థానికుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. దాడి తర్వాత ఈ ప్రాంతాన్ని సందర్శించిన వారిలో ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అతుల్‌ కులకర్ణి వున్నారు. వియత్నాం కు చెందిన పర్యాటకులు కూడా పహల్గామ్‌లో సందడి చేశారు. తాము తొలిసారి కశ్మీర్‌ను సందర్శిస్తున్నామని, ఇక్కడి అందాలు తమను మంత్రముగ్ధులను చేస్తున్నాయని, తాము ఇక్కడి సౌం దర్యాన్ని ఆస్వాదిస్తున్నామని చెప్పడం విశేషం. భదేర్వాప్‌ా ప్రాంతాన్ని నేపాలీ సందర్శకుడు సందడి చేశాడు. ఇక్కడి పచ్చికమైదానంలో తిరుగుతూ ప్రకృతి అందాలను ఆస్వాదించాడు. అంతేకా దు ఇక్కడికి వస్తున్న పర్యాటకులు కశ్మీర్‌లో పర్యటించాలన్న తమ నిర్ణయంలో ఎటువంటి మా ర్పు లేదని దృఢ నిశ్చయంతో చెబుతుండటం విశేషం. ఏదో ఒక్క సంఘటన జరిగిందని పర్యాటకులు తమ బుకింగ్స్‌ను రద్దు చేసుకో వద్దని, కశ్మీర్‌ ఎల్లప్పుడూ తన స్వచ్ఛమైన సౌందర్యంతో పర్యాటకులకు ఆహ్వానం పలుకుతూనే వుంటుందని ప్రకృతి ప్రేమికులు చెబుతున్న మాట!

సన్న బియ్యం.. పేదలకు వరం.మిల్లర్లకు ఎప్పుడూ వుంటుంది సహకారం.

తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు సన్న బియ్యం సరఫరా, మిల్లర్ల సమస్యలపై ‘‘నేటిధాత్రి’’ ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు అడిగిన ప్రశ్నలకు పౌరసరఫరాల శాఖ కమీషనర్‌ ‘‘దేవేంద్ర సింగ్‌ చౌహాన్‌’’ ఇచ్చిన సమాధానాలు…
`సన్న బియ్యం సరఫరా తెలంగాణ ప్రజల కళ్లలో నిండిన ఆనందం.

`సన్న బియ్యం అందించడం విప్లవాత్మక నిర్ణయం.

`రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల నుంచి ప్రశంసలు.

`నేను కమీషనర్‌గా వున్న సమయంలో ప్రారంభం గొప్ప అనుభూతి.

`నా ఉద్యోగ నిర్వహణలో ఇదొక ఛాలెంజ్‌.

`సన్న బియ్యం సరఫరా సాధ్యమే అని నిరూపించాం.

`పాలకుల చిత్తశుద్ధికి ఇది నిదర్శనం.

`సన్న బియ్యం సరఫరాలో మిల్లర్ల పాత్ర కీలకం.

`మిల్లర్లకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు వుంటాయి.

`ఏ మిల్లరైనా సరే నేరుగా వచ్చి వారి సమస్యలు చెప్పుకోవచ్చు.

`మిల్లర్ల వ్యవస్థ ఎంత బాగుంటే సన్న బియ్యం సరఫరా అంత బాగుంటుంది.

`సన్న బియ్యం సరఫరాపై ‘‘ఐఎస్‌ఓ’’ సర్టిఫికేట్‌ కూడా అందించింది.

`‘‘ఫైవ్‌ స్టార్‌’’ రేటింగ్‌తో సన్న బియ్యం సరఫరా సక్సెస్‌ అయ్యింది.

`ప్రజలు ఎంతో సంతోషంగా వున్నారు.

`ఇతర రాష్ట్రాల ప్రతినిధులు వచ్చి సన్న బియ్యం సరఫరా మీద వివరాలు తెలుసుకుంటున్నారు.

`తాజాగా జార్ఖండ్‌ నుంచి మంత్రితో పాటు, అధికారులు వచ్చారు.

`వారికి పరవ్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇవ్వడం జరిగింది.

`ఇప్పటికే ఐదు రాష్ట్రాల నుంచి ప్రతినిధులు వచ్చి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

`వారి రాష్ట్రాలలో అమలు కోసం అవసరమైన సలహాలు తీసుకున్నారు.

`‘‘నలభై ఏళ్ల’’ క్రితం రెండు రూపాయలకు కిలో బియ్యం పథకం.

`ఇప్పుడు ఉచితంగా సన్న బియ్యం సరఫరా చేయడమంటే గొప్ప కార్యక్రమం.

`ఆహార భద్రతలో తెలంగాణ నెంబర్‌ వన్‌.

హైదరాబాద్‌,నేటిధాత్రి

కట్టా రాఘవేంద్రరావు: సార్‌..నమస్తే..

దేవేంద్రసింగ్‌ చౌహాన్‌: నమేస్తే…

కట్టా: ఎలా వున్నారు?

చౌహాన్‌: బాగున్నాను..మీరు.

కట్టా: హపీ సార్‌…సన్నబియ్యం ఒక సంచలనం అంటున్నారు. ప్రజల్లో ఎలాంటి ప్రభావం కనిపిస్తోంది?

చౌహాన్‌: నిజం చెప్పాలంటే ఇది ఒక అర్భుతమైన ఫీలింగ్‌ అని చెప్పాలి. పేద వారికి కడుపు నిండా అన్నం పెట్టడం కంటే గొప్ప పథకం ఏముంటుంది. ప్రజల కనీస అవసరాలు తీర్చడమే ప్రభుత్వాల లక్ష్యం. అందులోనూ కూడు, గూడు, గుడ్డ కూడా సమకూర్చే పథకాల అమలు చేసిన ప్రభుత్వాలు ప్రజల హృదయాలలో నిలిచిపోతాయి. నిజానికి ప్రజలను ఆకలి బాధలు పడకుండా ప్రభుత్వాలు చూడడం ఇప్పుడు కొత్తగా వచ్చింది కాకపోకపోయినా, సన్న బియ్యం పధకం కొత్తగా వుంది. ప్రజలకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రజలు ఎంతో సంతోషపడుతున్నారు. ప్రభుత్వాలు ప్రజల ఆకలి తీర్చడంమొదలు పెట్టి కొన్ని దశాబ్దాలౌతోంది. కాని ఇంత విసృత స్ధాయిలో ప్రజలకు ఆహారభద్రత కల్పించడం అన్నది కొంత కాలం నుంచి మాత్రమే వస్తోంది. ముఖ్యంగా 1985 నుంచి ఈ పధకం గొప్పగా అమలు జరుగుతోంది. అప్పుడు రెండు రూపాయలకు కిలో బియ్యం పధకం అన్నది ఇప్పటికీ అమలు జరుగుతుండడం మంచి పరిణామం. అయితే రెండు రూపాయలకు కిలో బియ్యం పధకం అమలు మొదలై ఇప్పటికీ 40 సంవత్సరాలు గుడుస్తోంది. అప్పుడు మార్కెట్‌లో బియ్యం రేటు కూడా నాకు తెలిసి రూ.4 వరకు వుండొచ్చు. అప్పట్లో సన్న బియ్యం కూడా అదే ధరలో వుండొచ్చు. తర్వాత ప్రజలకు రెండు రూపాయలకు కిలో బియ్యం ఇవ్వడం సాద్యం కావడంలేదని కిలో బియ్యం రూ.5కు పెంచిన ప్రభుత్వంకూడా వుంది. కాని 1985లో ఎన్టీఆర్‌ సమయంలో రెండు రూపాయలకు కిలో బియ్యం అమలు జరిగిన తర్వాత కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వం 1.90పైసలకు కిలో బియ్యం అందించింది. తర్వాత చంద్రబాబు నాయకుడు ప్రభుత్వం దాని ధర పెంచింది. 2004 ఎన్నికల్లో రాజశేఖరరెడ్డి కిలో రెండు రూపాయలకు మళ్లీ ఆ పదకం అమలు చేశారు. అయితే అప్పటికి మార్కెట్‌లో బియ్యం పది రూపాయలకు పైనే వుంది. తర్వాత కిరణ్‌ కుమార్‌ రెడ్డి దానిని రూపాయికి చేశారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు బియ్యం సరఫరాచేస్తున్నప్పటికీ సన్నబియ్యం సరఫరా అన్నది ఒక విప్లవాత్మకమైనది. గతంలో ప్రభుత్వాలు హమీలు ఇచ్చాయి. కాని అమలు చేయలేదు. ఇప్పుడు మార్కెట్‌లో సన్న బియ్యం దరలు రూ.50 వరకు పలుకుతున్నాయి. అలాంటి సమయంలో ఉచితంగా సన్న బియ్యం ఇవ్వడం అన్నది గొప్ప విషయం. ఎవరైనా ప్రశంసించాల్సిందే. అంతే కాకుండా అది నేను కమీషనర్‌గా వున్న సమయంలో అమలు కావడం కూడా నా అదృష్టం. మొన్నటి వరకు ఇచ్చిన దొడ్డు బియ్యం విషయంలో అనేక రకాల వార్తలు వుండేవి. ఆ బియ్యం ప్రజలు అమ్ముకొని, సన్న బియ్యం కొనుగోలు చేసుకునేవారు అనే వార్తలున్నాయి. కాని ఇప్పుడు ఆ బియ్యం స్ధానంలో సన్న బియ్యం ఇవ్వడం వల్ల, పేద ప్రజలపై కొంత భారం తగ్గింది. అందరూ సన్న బియ్యం తినే సమాజ నిర్మాణం జరిగిందంటే మామూలు విషయం కాదు. సామాన్యులకు సన్న బియ్యం తినాలన్న ఆశ తీర్చిన ప్రభుత్వాన్ని ప్రజలు ఎంతో హర్షిస్తున్నారు. బియ్యం తీసుకెళ్లిన వారు ఎంతో సంతోషంగా తింటున్నారు. గతంలో బియ్యం అమ్ముకొని మరిన్ని రూపాయలు కలుపుకొని సన్న బియ్యం కొంత మంది తెచ్చుకునేవారు. కాని ఇప్పుడే పేద, మద్య తరగతి, ఉన్నత వర్గం అన్న తేడా లేదు. తెలంగాణలో అందరూ సన్న బియ్యం తింటున్నారంటే గొప్ప విషయం.

కట్టా: సన్న బియ్యం పధకం అమలుపై ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ వచ్చింది? ఎలా ఫీల్‌ అవుతున్నారు?

చౌహాన్‌: ఇక ఆ సందర్భం మాటల్లో చెప్పలేనిది. ఎందుకంటే సన్న బియ్యం ఇస్తున్నామా? లేదా? అన్నదే కాదు ఎంత క్యాలిటీ బియ్యం ఇస్తున్నామన్నది కూడా గుర్తించారు. మార్కెట్‌లో లభించే బియ్యం కన్నా, అదనంగా పోషకాలు వుండే బియ్యం కూడా కలిపి, ప్రజలకు ఆహార భద్రతే కాదు, ఆరోగ్య భద్రత కూడా చేకూర్చేలా బియ్యం సరఫరా జరుగుతోంది. అందుకే అంతర్జాతీయ స్దాయిలో తెలంగాణలో సన్న బియ్యం పధకం పేరుగాంచింది. ఐఎస్‌ఓ సర్టిఫికెట్‌ పౌరసరసరఫరాల శాఖకు అందించింది. అది ఎంతో ఆనందాన్నిస్తుంది. ప్రజలు ఎంతో సంబురంగా సన్న బియ్యం తింటున్నారు. వాళ్లంతా ఆరోగ్యంగా, ఆనందంగా వుండాలని కోరుకుంటున్నాను.

కట్టా: ఈ పథకం అమలుపై ఇతర రాష్ట్రాలలో ఏదైనా ప్రభావం వుందా?

చౌహాన్‌: తెలంగాణలో సన్న బియ్యం పధకం అమలు అన్నది ఒక సంచనలంగా మారింది. అన్ని రాష్ట్రాలలో ఈ డిమాండ్‌ ఊపందుకున్నది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల నుంచి వారి ప్రభుత్వ ప్రతినిధులు తెలంగాణకు వస్తున్నారు. ఇంకా అనేక రాష్ట్రాల నుంచి వస్తామని ఫోన్లు చేస్తున్నారు. సమయం కావాలని కోరుతున్నారు. తాజాగా రaార్ఖండ్‌ రాష్ట్ర మంత్రితోపాటు, ప్రతినిధి బృందం రావడం జరిగింది. ఎలా సాద్యమౌతుందన్న దానిపై వారికి పూర్తి వివరాలు అందించడం కూడా జరిగింది. అందుకు అవసరమైన డెమోతోపాటు, పవర్‌ పాయింట్‌ ప్రెసెంటేషన్‌ ఇవ్వడం జరిగింది. దానికి వాళ్లంతా ఆశ్యర్యపోయారు. తప్పకుండా తమ రాష్ట్రాలలో కూడా అమలు చేయడానికి కృషి చేస్తామన్నారు. దేశంలో ఒక్క తెలంగాణలోనే సన్న బియ్యం అమలు చేయడం అన్నది నిజంగా సాహసోపేతమైన నిర్ణయం. అందుకు ప్రభుత్వానికి ఎంతో చిత్తశుద్ది, అంకితభావం వుంటే తప్ప జరగదు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి మానస పుత్రికగా సన్న బియ్యం పధకం అందరూ చెప్పుకుంటున్నారు. మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సన్నబియ్యం పదకం అమలు కోసం ఎంతో కృషి చేస్తున్నారు. ఆ బాద్యతలు నిర్వర్తిన్న నాకు కూడా ఎంతో సంతోషంగా వుంది.

కట్టా: మీకు మరో ప్రశ్న. సన్న బియ్యం పదకం అమలులో కీలకమైన రైస్‌ మిల్లర్లు వారి సమస్యలున్నాయంటున్నారు?

చౌహాన్‌: నిజమే… సన్నబియ్యం పదకం అమలులో కీలకమైన పాత్ర పోషిస్తున్నది రైస్‌మిల్లర్లే. వారు బాగుంటేనే ఈ పదకం అమలు ఇంకా గొప్పగా సాగుతుంది. వారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను.

కట్టా: మిల్లర్లు మీ దగ్గరకు రాలేకపోతున్నారట? వారి సమస్యలు చెప్పుకుంటారట?

చౌహన్‌: తప్పకుండా…రాష్ట్రంలోని ఏ మిల్లరైనా సరే నా వద్దకు రావొచ్చు. వారి సమస్యలు చెప్పుకోవచ్చు. అందుకు నేను ఎప్పుడూ సిద్దంగా వుంటాను. ఎలాంటి అపోహలు వద్దు. ఇంత పెద్ద సన్నబియ్యం కార్యక్రమం విజయవంతంగా అమలు జరగాలంటే ప్రతి మిల్లర్‌ కూడా ఎంతో ముఖ్యమే. అందులో చిన్నా పెద్దా అనే తేడాలేదు. మీ దృష్టికి వచ్చిన సమస్యలు కూడా మాకు చెప్పొచ్చు. మీ వద్దకు వచ్చి, సమస్యలు చెప్పిన మిల్లర్‌ను నా వద్దకు పంపించండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్పాయింట్‌ మెంటు ఇస్తాను. వారి సమయం కేటాయించడంలో ఎలాంటి జాప్యం వుండదు. తెలంగాణ ఆహార భద్రతలో నెంబర్‌ వన్‌గా వుందంటే అందులో మిల్లర్ల పాత్ర కూడా వుంది. అలాంటి మిల్లర్లను నిర్లక్ష్యం చేయడం అనే సమస్యే ఉత్పన్నం కాదు. మిల్లర్లు ఒక్కరొస్తారా? లేక కొంతమంది కలిసి వస్తారా? అన్నది వారి ఇష్టం. నేను ఎప్పుడైనా వారికి అందుబాటులో వుంటాను.

కట్టా రాఘవేంద్రరావు: ధన్యవాదాలు సార్‌. మళ్లీ కలుద్దాం.

దేవేంద్ర సింగ్‌ చౌహన్‌: ధాంక్స్‌..ఆల్వేస్‌ వెల్‌కం.

ఈ ‘‘ప్రశ్న’’కు బదులేది ‘‘రోహిణి’’?

`సిఐడి విచారణ తప్పుల తడక అన రోహిణి యాజమాన్యం చెప్పినట్లేనా?

`సిఐడి విచారణ నివేదిక వివరాలు తెలియకుండానే చికిత్స పొందని వారిని యాజమాన్యం గుర్తించిందా?

`రోహిణి స్టాంపులు, తప్పుడు తయారు చేసిన వివరాలు ‘‘రోహిణి’’ ఎందుకు బైటపెట్టలేదు?

`వారిపై కేసులు ఎందుకు నమోదు చేయలేదు?

`‘‘సిఐడి’’ విచారణలో ఆ వివరాలు ఎందుకు వెల్లడిరచ లేదు?

`వెల్లడిరచినా ‘‘సిఐడి’’ రోహిణి పేరు జాబితాలో చేర్చిందా?

`హన్మకొండలో ఎన్నో ఆసుపత్రులుండగా ‘‘రోహిణి’’ పేరుతో మాత్రమే అక్రమాలు చేశారా?

`‘‘రోహిణి’’ ఆసుపత్రికి అనుకూలంగా ‘‘కోర్టు ఆర్డర్‌’’ కాపీ మీడియాకు ఎందుకు విడుదల చేయలేదు?

`ప్రభుత్వం జారీ చేసిన ‘‘జీవో’’, జాబితా మీడియాలో ప్రచురితం కోసమే విడుదల చేశారు.

`మీడియా తన కర్తవ్యాన్ని మాత్రమే నిర్వర్తించింది.

`మీడియాకు గడువు ఇచ్చే హక్కు ‘‘రోహిణి’’కి లేదు.

`ప్రభుత్వ ‘‘జీవో’’ ఆధారంగానే మీడియా వార్తలు రాసింది.

`‘‘రోహిణి’’ ఆసుపత్రి తప్పు చేయకపోయినా ‘‘సిఐడి’’ విచారణ తప్పని యాజమాన్యం చెబుతోంది!

`‘‘సిఐడి’’ వ్యవస్థనే ‘‘రోహిణి’’ యాజమాన్యం శంకిస్తోంది!

`తప్పు ‘‘సిఐడి’’ మీద నెట్టేసి ‘‘రోహిణి’’ తప్పించుకోవాలనుకుంటోంది!

`ఒక రకంగా ప్రభుత్వాన్నే లిరోహిణి’’ యాజమాన్యంసవాలు చేసినట్లైంది!

`మీడియా మీద తోసేస్తే సరిపోతుందా?

`మీడియా కోరుకునేది కూడా అదే నిజమేమిటో నిగ్గు తేలాలి?

హైదరాబాద్‌,నేటిధాత్రి:
‘‘రోహిణి ఆసుపత్రి’’ యాజమాన్యం నుంచి ప్రజలకు, పత్రికా విలేకరులకు స్పష్టీకరణ పేరుతో ఒక నోట్‌ విడుదల చేశారు.అందులో ఇటీవల కొన్ని డిజిటల్‌ పత్రికలు, యూట్యూబ్‌ ఛానల్స్‌ రోహిణి ఆసుపత్రి యాజమాన్యం మీద నిరాధారమైన ఆరోపణలు చేయడం జరిగిందన్నారు.ఇదే మాట మీద ఆసుపత్రి యాజమాన్యం నిలబడుతుందా అనేది స్పష్టం చేయాల్సిన అవసరం వుంది.మీడియాలో వచ్చినవి అబద్దాలు, ఆరోపణలు, వాస్తవ విరుద్దాలని రోహిణి ఆసుపత్రి చెబుతోంది. ఇక్కడ యాజమాన్యం గమనించాల్సిన విషయం ఏమిటంటే మీడియాలో వచ్చిన వార్తలు అబద్దాలు కాదు. ఆరోపణలు అసలే కాదు. వాస్తవ విరుద్దమైనవి అని దులిపేసుకుంటే సరిపోదు.’’సిఐడి’’ ద్వారా చేసిన విచారణ తర్వాత రూపొందించిన జాబితాలో ఆసుపత్రి పేరు అనుమానాస్పదంగా వుందని నింద ప్రభుత్వం మీద వేస్తున్నారా? లేక ‘‘సిఐడి’’ విచారణ లోప భూయిష్టంగా వుందని యాజమాన్యం భావిస్తుందా? అదే నిజమైతే యాజమాన్యం ప్రభుత్వం మీద కూడా దావా వేయవచ్చు. ‘‘సిఐడి’’కి కూడా నోటీసులు పంపవచ్చు. యాజమాన్యం ఆ దిశగా ముందుకు సాగుతుందా? స్పష్టం చేయాలి. ఎందుకంటే యాజమాన్యం నేరుగా ‘‘ప్రభుత్వాన్నే స్పష్టంగా దోషి’’ అంటోంది. అనుమానాస్పదంగా జాబితాలో ‘‘రోహిణి’’ పేరు వుందని చెప్పడం ‘‘రోహిణి’’ ఆసుపత్రి చేస్తున్న మరో నేరం. ‘‘సిఎంఆర్‌ఎఫ్‌’’ నిధుల అక్రమాల నేపథ్యంలో ‘‘రోహిణి’’ ఆసుపత్రి యాజమాన్యం, డాక్టర్లు, లేదా సిబ్బందికి ఎలాంటి సంబంధం లేదని చెప్పడమంటే ప్రభుత్వ పెద్దలు నిర్లక్ష్యంగా నిధులు విడుదల చేశారని సూటిగా ఆరోపణలు చేసినట్లు భావించాల్సి వుంటుంది. ప్రభుత్వం ‘‘సీఐడి’’ విచారణకు ఆదేశించినది నిజమే. కానీ ఇప్పటివరకు ఆ రిపోర్ట్‌ను అధికారికంగా విడుదల చేయలేదు అని ‘‘రోహిణి’’ ఆసుపత్రి వర్గాలు నిర్థారణకు వచ్చిందా? ఏ అధికారిక సమాచారం మేరకు ఈ విషయం స్పష్టం చేస్తున్నారో చెప్పాలి. ఇక ‘‘సిఐడి’’ నివేదిక అనేది పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టేది కాదు.రహస్య విచారణలకు సంబంధించిన ఏ విషయాన్ని ప్రభుత్వం బహిర్గతం చేయదు.ఈ విషయం యాజమాన్యానికి తెలియకపోవడం విడ్డూరం.’’సిఐడి’’ నేరుగా తన నివేదికను బహిరంగ పర్చదు. ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుంది. ఆ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం ప్రత్యేకంగా జివో విడుదల చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన జివో కాపీలోనే ‘‘రోహిణి’’ ఆసుపత్రి పేరును చేర్చడం జరిగింది. ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో ‘‘రోహిణి’’ పేరు వుంది. ‘‘రోహిణి’’ ఆసుపత్రి పేరును అనుమానాస్పదంగా ‘‘సిఐడి’’ చేర్చిందనడం కూడా నేరంగా పరిగణిస్తారు. ‘‘రోహిణి’’ ఆసుపత్రి పేరుతో ఎవరో నకిలీ స్టాంపులు, బిల్లులు తయారు చేసినట్లు చెప్పి యాజమాన్యం తప్పించుకోవాలని చూసినా చెల్లదు. మరింత కఠినమైన శిక్ష బాధ్యులౌతారు. అంతేకాకుండా ‘‘సిఐడి’’ బోగస్‌ విచారణ చేపట్టిందని, ‘‘సిఐడి’’ విచారణ సరైన పద్ధతిలో జరగలేదని యాజమాన్యం సూటిగా ఆరోపణలు చేసినట్లౌతుంది. ఎవరు నకిలీ, ఏది నకిలి అని తేల్చలేనంత అసమర్థంగా ‘‘సిఐడి’’ విచారణ చేసిందని యాజమాన్యం ప్రతికా ప్రకటన ద్వారా స్పష్టం చేసినట్లైంది. దీనిని ‘‘సిఐడి’’ పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం వుంది. ఒక ప్రైవేట్‌ ఆసుపత్రి ఏకంగా ‘‘సిఐడి’’ వ్యవస్థనే శంకిస్తోంది. అంటే నేరుగా ప్రభుత్వానికే సవాలు విసిరింది. ‘‘సిఐడి’’ చేసిన విచారణ తప్పు అని ‘‘రోహిణి’’ ఆసుపత్రి అంటోంది.’’సిఐడి’’ వెంటనే స్పందించాల్సిన అవసరం వుంది. లేకుంటే ‘‘సిఐడి’’ వ్యవస్థకే మచ్చ వస్తుంది. ‘‘సిఐడి’’ నివేదికే బైటకు రాలేదంటున్న ‘‘రోహిణి’’ యాజమాన్యం నివేదికలో ‘‘సిఐడి’’ పొందుపర్చిన పేర్లు ఎలా తెలిసింది? ఆ పేషెంట్లు మా ఆసుపత్రిలో చికిత్స చేసుకోలేదని ఎలా చెబుతున్నారు? మీడియా వద్ద ‘‘సిఐడి’’ రిపోర్ట్‌ వుందా? అని యాజమాన్యం ప్రశ్నిస్తోంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘‘జివో’’ కూడా ‘‘బోగస్‌’’ అని యాజమాన్యం నిర్థారించినట్లేనా? ‘‘సిఐడి’’ రిపోర్ట్‌ లో వున్న పేర్లు యాజమాన్యానికి ఎలా తెలిశాయి. ‘‘సిఐడి’’ రోహిణి ఆసుపత్రి యాజమాన్యాన్ని విచారణకు పిలువలేదా?ఆసుపత్రికి వచ్చి విచారణ చేయలేదా? మా ఆసుపత్రి యాజమాన్యాన్ని సంప్రదించకుండానే ‘‘సిఐడి’’ రిపోర్ట్‌ తయారు చేసిందని ‘‘రోహిణి’’ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయా? ‘‘సిఐడి’’ రాలేదని నిర్థారిస్తున్నారా? అందుకు ఐదు రోజుల గడువు సిఐడికి ఇస్తున్నారా? రాష్ట్ర ప్రభుత్వానికి గడువు విధిస్తున్నారా? ఎందుకంటే మీడియాకు గడువు విధించే అధికారం రోహిణి యాజమాన్యానికి లేదు. ప్రభుత్వమే మీడియాకు ‘‘జీవో’’ తో పాటు జాబితాను ప్రచురణ కోసమే విడుదల చేశారు. అధికారికంగా విడుదల చేసిన జాబితాను అనుసరించే మీడియా తన కర్తవ్యాన్ని నిర్వర్తించింది. యాజమాన్యానికి నిజంగా ధైర్యం వుంటే ప్రభుత్వం విడుదల చేసిన జాబితా తప్పు అని ప్రకటన చేయాలి. మీడియా మీద తోసేసి చేతులు దులుపుకుంటామంటే సరిపోదు. ఇక ‘‘సీఎంఆర్‌ఎఫ్‌’’ నిధులు రోగుల ఖాతాలకు నేరుగా వెళ్లేలా వ్యవస్థ ఉంది. నిజమే…మరి ఈ ఆసుపత్రి పేరుతో నిధులు విడుదల జరుగుతుంటే ఇంత కాలం యాజమాన్యం ఏం చేసినట్లు? ‘‘సిఐడి’’ విచారణకు వచ్చినప్పుడు ఆ బిల్లులు మా ఆసుపత్రికి సంబంధం లేదని ఎందుకు చెప్పలేదు? చెబితే ‘‘సిఐడి’’ విచారణ ఆ దిశగానే జరిగేది. తెలంగాణలో ఇన్ని ఆసుపత్రులు వుండగా 28 ఆసుపత్రులు తప్పులు చేసినట్లు తేలింది? ఇక మీడియాను సవాలు చేసిన యాజమాన్యం కోర్టు ఉత్తర్వులు ఎందుకు పొందుపర్చలేదు? రోహిణి యాజమాన్యం ఈ విషయాలపై స్పష్టత ఇవ్వాలి.

జనగణనతో పాటు కులగణన

కేంద్ర రాజకీయ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ నిర్ణయం

`విపక్షాలను డిఫెన్స్‌లో పడేసిన బీజేపీ

`కులగణనపై విపక్ష దాడులకు చెక్‌ పెట్టేందుకే ఈ నిర్ణయం

`ఈ నిర్ణయంతో బిహార్‌లో ఎన్డీఏ కూటమికి గెలుపు అవకాశాలు మరింత మెరుగు

`బిహార్‌, కర్ణాటక, తెలంగాణల్లో కులగణన నిర్వహించిన ప్రభుత్వాలు

`రాజకీయ, సామాజిక ఒత్తిళ్ల ప్రభావం కులగణనపై వుండే అవకాశం

`జనాభాలెక్కలతో పాటే నిర్వహిస్తే కచ్చితమైన ఫలితాలు రాగలవు

`కులవ్యవస్థ మరింత బలపడే అవకాశం

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలోని రాజకీయ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ (సీసీపీఏ) బుధవా రం సమావేశమై కులగణన విషయంలో అత్యంత కీలక నిర్ణయం తీసుకోవడం ద్వారా ఈ అంశాన్ని ఒక అస్త్రంగా మలచుకొని ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న విపక్షాలకు గట్టి షాక్‌ ఇచ్చిందనే చెప్పాలి. ముఖ్యంగా త్వరలో బీహార్‌లో ఎన్నికలు జరుగనున్న తరుణంలో ఈ కులగణన అంశాన్ని కాంగ్రెస్‌ నేతృత్వంలోని విపక్షాలు రాజకీయం చేస్తున్నాయి. ప్రస్తుతం ఏన్డీఏ కూటమికినేతృత్వం వహిస్తున్న జేడీయూ, గతంలో మహాఘట్‌బంధన్‌లో భాగస్వామిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో కులగణన చేసింది. ఈ గణన ప్రకారం రాష్ట్రంలో 75శాతం వెనుకబడిన వర్గాలున్నట్టు తేలింది. అయితే కులగణను బీజేపీ మొదటినుంచి వ్యతిరేకిస్తున్నది. కులాలుగా, వర్గాలుగా హిందువులను ముక్కలుగా చీల్చే ప్రక్రియగా దీన్ని పేర్కొంటూ వచ్చింది. బిహార్‌లో కులగణను ప్రధాన అస్త్రంగాచేసుకొని కాంగ్రెస్‌ తదితర విపక్షాలు ప్రచారం కొనసాగించడం భాజపాకు మింగుడు పడటం లేదు. ఎన్నికల వాతావరణం తమకే సానుకూలంగా వున్నాయన్న సంకేతాలు స్పష్టంగా వెలువడు తున్నప్పటికీ, తమకు ప్రతికూలంగా మారే ఏ చిన్న అంశాన్ని నిర్లక్ష్యం చేయకూడదన్న ఉద్దేశంతో, కులగణనపై తన అభిప్రాయాన్ని మార్చుకోవడం ద్వారా, విపక్షాలకు ముందరికాళ్లకు బంధం వేసేవిధంగా, జనాభాలెక్కలతో పాటు కులగణన కూడా చేపట్టడానికి నిర్ణయించింది. సీసీపీఏ తీసుకున్న నిర్ణయంతో బిహార్‌లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన జనతాదళ్‌ యునైటెడ్‌, రాష్ట్రీయ లోక్‌సమతాపార్టీ నాయకుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. ఇప్పటివరకు కాంగ్రెస్‌ సహా విపక్షాల దాడిని ఎదుర్కోవడంలో డిఫెన్స్‌లో పడిపోయిన ఈ పార్టీలు ఇప్పుడు, విపక్షాలపై తమ ప్రతిదాడులను మరింత తీవ్రం చేసేందుకు ముందడుగులు వేస్తున్నాయి.

వాయిదా పడుతున్న జనగణన

నిజానికి జనగణన 2020లో చేపట్టాల్సివుంది. కానీ కోవిడ్‌ మహమ్మారి కారణంగా వాయిదాపడిరది. రాజ్యాంగ నిర్దేశం ప్రకారం ప్రతి పదేళ్లకోమారు జనగణన చేపట్టాలి. దీని ప్రకారం 2021 నాటికి జనాభా లెక్కల వివరాలు ప్రచురితం కావాల్సి వుంది. కానీ అది ఇప్పటివరకు వాయి దా పడుతూ వచ్చింది. ఇదిలావుండగా కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ సామాజిక న్యా యం జరగాలంటే కులగణన తప్పనిసరని గతంలో గట్టిగా వాదిస్తున్నారు. ముఖ్యంగా వెనుకబడినవర్గాల వారు విద్యవిషయంలో ఇప్పటికీ అన్యాయానికి గురవుతున్నారనేది ఆయన ప్రధాన ఆరోపణ. అన్నివర్గాల ప్రజలకు వనరులను సమాన ప్రాతిపదికన అందుబాటులోకి తీసుకువరావాలంటే కులగణన తప్పదని కాంగ్రెస్‌ గట్టిగా వాదిస్తోంది. 1927, మార్చి 20న డాక్టర్‌ బాబాసాహెబ్‌అంబేద్కర్‌ కులవివక్షను తీవ్రంగా విమర్శించారు. ఆరోజున నీటికోసం జరిపిన మహద్‌ సత్యాగ్ర హం సందర్భంగా మాట్లాడుతూ, ‘నీటికోసం మాత్రమేకాదు, గౌరవం, సమానత్వం కోసం జరిపేపోరాటం ఇది’ అంటూ పేర్కొన్న అంశం ప్రస్తావనార్హం. ఇదిలావుండగా భాజపా రాహుల్‌పై ఎ దురుదాడి చేస్తూ కుటుంబ పాలనలో కాంగ్రెస్‌ తమపార్టీకి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకుల ను ఎంతగా అవమానించిందో తెలుసుకోవాలని కోరింది. వెనుకబడిన వర్గాలకు చెందిన నాయకులను పైకి ఎదగనీయకుండా తొక్కేసిన చరిత్ర కాంగ్రెస్‌దంటూ భాజపా ఆరోపిస్తూ వచ్చింది. అయితే కుల గణన ద్వారానే అసలు నిజాలు బయటకు వస్తాయని రాహుల్‌ గాంధీ కూడా ఎదురుదాడి చేయడం వర్తమాన రాజకీయ పరిణామం. 

కులగణన రాజకీయం

రాజకీయ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ నిర్ణయాలను విలేకర్లకు వివరిస్తూ కేంద్ర రైల్వేశాఖ మం త్రి అశ్విన్‌ వైష్ణవ్‌, కేవలం తమ రాజకీయ లబ్దికోసమే కులగణను ఇండీ కూటమి పార్టీలు లేవ నెత్తుతున్నాయని విమర్శించారు. కాగా రాజ్యాంగంలోని 246వ అధికరణలోని 69వ నిబంధన జనగణనను కేంద్ర ప్రభుత్వ బాధ్యతగా స్పష్టంగా పేర్కొంది. అయితే బిహార్‌, కర్ణాటక, తెలంగాణ వంటి రాష్ట్రాలు దీన్ని పట్టించుకోకుండా కులగణన పూర్తిచేశాయి. అయితే ఇది కేవలం రాజ కీయ కోణంలోనే తమ ప్రయోజనార్థం చేపట్టిన కార్యక్రమమని, ఇందులో ఎటువంటి పారదర్శకత లేదని అశ్వనివైష్ణవ్‌ స్పష్టం చేస్తూ, కేంద్రం జనగణనతో పాటు చేపట్టే కులగణన ఎంతో పారదర్శకంగా, నిక్కచ్చిగా వుండబోతున్నదని స్పష్టం చేశారు. కొన్ని రాష్ట్రాలు కులగణన పేరుతో ని ర్వహించిన సర్వేలు సమాజంలో అనుమానాలు రేకెత్తించేవిగా వున్నాయని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలోనే కులగణను, జనాభాలెక్కలతో పాటు చేపడితే స్పష్టమైన ఫలితాలు వస్తాయన్నారు. పదేళ్ల క్రితం సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కర్ణాటకలో కులగణన నిర్వహిం చింది. అయితే రాష్ట్రంలో బలమైన వర్గాలుగా వున్న వక్కళిగలు, లింగాయత్‌లనుంచి తీవ్ర వ్యతి రేకత రావడంతో ఆ నివేదికను ఇటీవలి కాలం వరకు ప్రభుత్వం బయటపెట్టడం సాధ్యంకాలే దు. బలీయమైన కులాల ప్రభావ తీవ్రతను ఇది మరోసారి బహిర్గతం చేసింది. ఈ కులగణనలో తమకు సరైన ప్రాతినిధ్యం లభించలేదని ఇప్పటికీ ఈ రెండు వర్గాలు తీవ్రంగా విమర్శిస్తున్నా యి కూడా. 

బిహార్‌లో తొలి కులగణన

కులగణన అవసరాన్ని నొక్కి చెబుతున్న విపక్ష పార్టీలు, దీనివల్ల ప్రతి కులంలో జనాభా సంఖ్య స్పష్టంగా తెలుస్తుంది కనుక దీని ఆధారంగా ఆయా వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు పరచ వచ్చునని వాదిస్తున్నాయి. కానీ ఓటు బ్యాంకు రాజకీయాలకోసం విపక్షాలు హిందూసమాజాన్ని ముక్కలుగా విడగొట్టి తమ పబ్బం గడుపుకోవాలని చూస్తునాయనేది భాజపా వాదన. అధికార,విపక్ష పార్టీల మాట ఎట్లా వున్నా, దేశంలో కులగణన జరిపిన మొట్టమొదటి రాష్ట్రం బిహార్‌. 2023లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో 36శాతం రాష్ట్రజనాభా అత్యంత వెనుకబడిన స్థా యిలో వున్నట్టు తేలింది. బిహార్‌ రాష్ట్రం మొత్తం జనాభా 13కోట్లలో 27.13% మంది ప్రజలు వెనుకబడిన వర్గాల కిందికి వస్తారు. 15.52% సాధారణ కేటగిరి ప్రజలుగా తేలింది. ఈ కులగణను రెండు దశల్లో నిర్వహించారు. మొదటి దశలో కుటుంబాల వారీగా జరపగా, రెండో దశలో సామాజిక, ఆర్థిక, కులపరంగా నిర్వహించారు. ఇప్పటికే కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ తమ పార్టీ అధికారంలోకి వస్తే, ఎస్సీ/ఎస్టీ/బీసీలకు ప్రస్తుతం విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో కల్పిస్తున్న రిజర్వేషన్‌ సదుపాయ పరిమితి 50%ని ఎత్తేస్తామని ఇప్పటికే ప్రకటించడం గమనార్హం. 

ఇప్పటివరకు మూడు కులగణనలు

దేశంలో మొట్టమొదటి కులగణన 1871ా72లో నాటి బ్రిటిష్‌ వలసవాద ప్రభుత్వం చేపట్టింది. రెండో కులగణను 1931లో బ్రిటిష్‌ ప్రభుత్వం నిర్వహించింది. దాని తర్వాత 2011లో మాత్రమే కేంద్ర ప్రభుత్వం సామాజిక ఆర్థిక మరియు కులగణనను నిర్వహించింది. దీని ప్రకారం దే శంలో 46.7లక్షల కుల/ఉపకుల గ్రూపులున్నట్టు తేలింది. అయితే సేకరించిన సమాచారం స్థి రంగా లేకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. నిజానికి కులగణన వల్ల లాభనష్టాలు రెండూ వున్నాయి. ముందుగా ప్రయోజనాల విషయానికి వస్తే ఏఏ కులాల్లో ఎంతమంది జనాభా వున్నారనేది స్పష్టమవుతుంది. రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను జనాభా ఆధారంగా రూపకల్పన చేయవచ్చు. ఇదే సమయంలో పేదరికంలో మగ్గే వర్గాలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందుబాటులోకి తేవచ్చు. అంతేకాదు విద్య, ఆరోగ్యం వంటి రంగాల్లో ఆయా వర్గాల ప్రజలకు మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకురావచ్చు. అయితే ఈ కులగణనలో కొన్ని ప్రతికూలతలు కూడా వున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో అగ్రకులాలు, వెనుకబడిన కులాల పేర్లలో కొద్ది తేడా మాత్రమే కనిపిస్తుంది. ఉదాహరణకు ‘సెన్‌’ అనే కులం బెంగాల్‌లో అగ్రవర్ణం కాగా, ‘సెయిన్‌’ ఓబీసీ వర్గానికి చెందినది. చిన్న స్పెల్లింగ్‌ తప్పు జరిగినా పథకాల అమలు తారుమారు కావడం ఖాయం. బిహార్‌ కులగణనలో కొన్ని వివాదాలు చోటుచేసుకున్న సంగతిని గుర్తుంచుకోవాలి. బిహార్‌ కులగణనలో ఎన్యూమరేటర్లకు సరైన శిక్షణ ఇవ్వలేదని, అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన జరగలేదన్న విమర్శలు వచ్చాయి. రాజకీయ, సామాజిక ఒత్తిళ్ల కారణంగా సమాచారాన్ని తారుమారుచేసే అవకాశాలు అధికమన్న విమర్శలు వచ్చాయి. సమాజంలో కులవ్యవస్థ మరింత కఠినంగా మారే ప్రమాదం ఏర్పడిరది. ఈ కులగణన నేపథ్యంలో, అధిక జనాభా కలిగిన కులాలవారు తమ నిష్పత్తికి అనుగుణంగ ప్రయోజనాలు కల్పించాలన్న డిమాండ్‌ చేయడం మొదలుపెట్టారు. ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాలను కులాల ఆధారంగా అమలు చేయడమనేది ఒక ప్రామాణికతను సంతరించుకునే పరిస్థితి నెలకొంది. కులగణన చేపట్టేముందు ఇటువంటి ప్రతికూలతలను కూడా ప్రభుత్వాలు దృష్టిలో వుంచుకోవాలి. కాకపోతే ఈ కులగణన చేపట్టిన రాష్ట్రప్రభుత్వాల ముఖ్య ఉద్దేశం ప్రజల సంక్షేమం అనేదానికంటే, అధిక జనాభా కలిగిన వర్గాలకు ఎక్కువ రాయితీలు, సంక్షేమ పథకాలు అమలు చేయడం ద్వారా రాజకీయ లబ్దిపొందాలన్న ఉద్దేశం మాత్రమే కనిపిస్తోంది. ఎందుకంటే మనదేశంలో స్వాతంత్య్రానంతరం కాలక్రమంలో అన్ని రాజకీయ పార్టీలు చిత్తశుద్ధి రాజకీయాలకు సమాధికట్టి, దానికి ఎప్పటికప్పుడు పాలరాతితో అద్భుతమైన ‘అవినీతి’ కళాఖండాలను జోడిస్తూ ప్రపంచపు వింతల్లో ఒకటిగా పరగణించే ‘తాజ్‌మహల్‌’ను తలదన్నే స్థాయిలో తీర్చిదిద్దాయి. దీనికి ఎప్పటికప్పుడు మరింత నగిషీల సొబగులు చేర్చడం తప్ప సంక్షేమం అమల్లో చిత్తశుద్ధి అనేదానికి ఎప్పుడో ‘తర్పణాలు’ వదిలేశాయి. ఒక్కపక్క కులరహిత సమాజం రావాలని సుద్దులు చెప్పే పార్టీలు తమ స్వార్థం కోసం కులవ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నాయి. నిజంగా పార్టీలకు చిత్తశుద్ధి వుంటే, సమాజంలో ‘ధనిక’, ‘పేద’ అనే రెండు వర్గాలనే గుర్తించి (కుల,మతాలకతీతంగా) పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేసినప్పుడు మాత్రమే అంబేద్కర్‌ ఆశయాలను సాధించినట్టుగా పరిగణించాలి. అంతేకాని స్వార్థం కోసం ఆ మహనీయుని పేరును ఉపయోగించుకోవడం అలవాటు కాకూడదు!

పాపాల రోహిణి..సీజ్‌ కాలేదెందుకని!?

`కాపాడుతున్న అదృశ్య శక్తి ఎవరు?

`సీఎం. రేవంత్‌ రెడ్డి ఆదేశాలు దిక్కరిస్తున్నదెవరు?

`‘‘సిఐడి’’ విచారణలో తేలిన నిజం.

Rohini super speciality hospital hanamkonda

`రోహిణిని ముట్టుకునే ధైర్యం లేదా!మూసేసే శక్తి లేదా!?

`అలాంటప్పుడు జాబితాలో ఎందుకు చేర్చారు!

`చిన్నా చితకా ఆసుపత్రులు మూసేసి, రోహిణి ని ఎందుకు వదిలేశారు!

`ప్రభుత్వ ఉత్తర్వులు బేఖాతరు చేస్తున్నారా?

`మామూళ్ల మత్తులో వదిలేస్తున్నారా?

`ధైర్యం చాలడం లేదని చెబుతున్నారా?

`అవినీతికి పాల్పడిన ఆసుపత్రులు మూసి, రోహిణి వైపు ఎందుకు చూడడం లేదు?

`వైద్య ఆరోగ్య శాఖ పెద్దల సమాధానం అర్థం లేనిది.

`‘‘డిహెచ్‌’’ ను అడిగితే ‘‘డిఎంఅండ్‌హెచ్‌ఓ’’ లకు ఆదేశాలిచ్చామంటారు.

`‘‘డిఎంఅండ్‌హెచ్‌ఓ’’ లు ‘‘కలెక్టర్‌’’ ఆదేశాలు కావాలంటారు.

`ఈ తికమక వ్యవహారం ఒక్క రోహిణికే ఎందుకు?

`ప్రభుత్వమే భయపడిపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటి?

`‘‘సిఎంఆర్‌ఎఫ్‌’’ నిధులను దుర్వినియోగంపై ‘‘సిఐడి’’ విచారణ ఎందుకు వేసినట్లు?

`‘‘సిఐడి’’ విచారణ చేసి ఆసుపత్రుల లిస్ట్‌ ఇచ్చిన తర్వాత మీన మేషాలెందుకు?

`ఆది నుంచి రోహిణి వివాదాలే! అక్రమాలే!!

`సరైన ‘‘ఫైర్‌ సేఫ్టీ’’ లేక ఏం జరిగిందో తెలుసు.

`‘‘కాలం చెల్లిన మందుల అమ్మకాలతో’’ పట్టుపడిన వైనం తెలుసు.

`ఇప్పుడు ‘‘సిఎంఆర్‌ఎఫ్‌’’. నిధుల గోల్‌మాల్‌ చూస్తున్నాం.

`రోహిణి సీజ్‌ కాకుండా అడ్డుపడుతున్నదెవరు?

`ఎందుకు జాప్యం చేస్తున్నారు?

`కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నదెవరు?

ఒకటి కాదు. రెండు కాదు..ఒకసారి కాదు. రెండు సార్లు కాదు..అనేకసార్లు హన్మకొండలో వున్న రోహిణీ ఆసుపత్రి మీద ఆరోపణలున్నాయి. వివాదాలు చెలరేగాయి. మోసాలు, ద్రోహాలు, పాపాలు చేసినట్లు రుజువులు కూడా అయ్యాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రుల అడ్డగోలు సంపాదనలు, సిఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల కుంభకోణాలపై సిఐడి చేత విచారణలు చేపట్టాయి…దర్యాప్తులు కూడా చేయించాయి. అందులోనూ రోహిణీ ఆసుపత్రి పేరు జాబితాలో వుంది. ఈ ఆసుపత్రిలో సిఎంఆర్‌ఎఫ్‌ రీఎంబర్స్‌ మెంటులో పెద్దఎత్తున అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. లెక్కలు తేల్చారు. ముఖ్యమంత్రి సహాయ చెక్కుల నిధుల గోల్‌మాల్‌కు పెద్దఎత్తున రోహిణీ ఆసుపత్రి పాల్పిడినట్లు తేలింది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నిధుల విషయంలో 28 ఆసుపత్రులు తప్పుడు, అనుమానాస్పద బిల్లులు సమర్పించి, కోట్ల రూపాయల నిధులను కొట్టేసినట్లు సిఐడి విచారణలో వెల్లడైంది. అందులో ప్రముఖ హన్మకొండలోని రోహిణీ ఆసుపత్రి కూడా వుంది. క్రిమినల్‌ ఎస్టాబ్లిష్‌ మెంట్‌ యాక్ట్‌`2010 ప్రకారం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. ఆయా ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తున్నారు. ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో ఆసుపత్రులను సీజ్‌ చేశారు. కాని హన్మకొండలోని రోహిణీ ఆసుపత్రి వైపు వైద్యశాఖ ఉన్నతాదికారులు కన్నెత్తిచూడడం లేదు. సిఐడి జరిపిన విచారణలో పెద్దఎత్తున రోహిణీ ఆసుపత్రి సిఎంఆర్‌ఎఫ్‌ నిధుల వ్యవహారంలో పెద్దఎత్తున నిధుల గోల్‌మాల్‌కు పాల్పడినట్లు తేలినా, ఎందుకు అధికారులు స్పందించడంలేదు. అలసత్వం ఎందుకు చేస్తున్నారు. రోహిణీని సీజ్‌ చేయడంలో ఎందుకు ముందు,వెనుకాడుతున్నారు. రోహిణీ ఎన్ని పాపాలు చేసుకుంటూ పోతున్నా జిల్లా అదికార యంత్రాంగం పట్టించుకోదా? నేరాలు రుజువైనా చర్యలు తీసుకోకుండా ఊరుకుంటారా? వెంటనే ఆ ఆసుపత్రులను రిజిస్ట్రేషన్‌ రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను జిల్లా అదికారులు దిక్కరిస్తున్నారా? ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశాలను కూడా అదికారులు బేఖాతరు చేస్తున్నారా? రోహిణీ చేస్తున్న మోసాలు చూసి చూడనట్లు వదిలేద్దామనుకుంటున్నారా? ప్రజల ప్రాణాలు తోడేస్తున్నా, ప్రభుత్వ నిధులు కాజేస్తున్నా పట్టించుకోరా? రోహిణీ ఆసుపత్రిపై ఎన్ని వివాదాల చుట్టుముట్టినా ఇప్పటి వరకు వదిలేశారు. ఇప్పుడు సిఐడి దర్యాప్తు రిపోర్టును కూడా పక్కన పెడతారా? లేదా జాబితా నుంచి రోహిణీ ఆసుపత్రి పేరు తొలగిస్తారా? ఏం చేయాలనుకంటున్నారు? ఇలా రోహిణీలాంటి ఆసుపత్రులు బరితెగించి ప్రభుత్వ సొమ్మును కోట్లలో మెక్కుతుంటే కూడా వదిలేయాలనుకుంటున్నారా? రాష్ట్ర ప్రభుత్వం చేయించిన దర్యాప్తును చెత్తబుట్టకు పరిమితం చేస్తారా? అలాంటప్పుడు వ్యవస్దలెందుకు? విచారణలెందుకు? ఆ దర్యాప్తులెందుకు? నివేదికలు ఎందుకు? ఆసుపత్రులు ఎన్ని తప్పులు చేసినా వదిలేసినప్పుడు, ప్రభుత్వం అనవసరంగా వాటిపై నిఘాలు పెట్టడం ఎందుకు? ప్రజల పన్నులతో వ్యవస్దలను నిర్మాణం చేయడమెందుకు? ప్రాణాలు పోయాల్సిన రోహిణీ లాంటి ఆసుపత్రిలో ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలౌతున్నప్పుడు చూసీ, చూడనట్లు వదిలేశారు. గతంలో అనేక తప్పుల మీద తప్పులు చేసినా ఉపేక్షిస్తూనేపోయారు. ఇప్పటికే అనేకసార్లు ప్రజా సంఘాలు రోహిణీ మీద చర్యలు తీసుకోవాలంటూ ధర్నాలు, నిరసలు చేపట్టారు. అప్పుడూ చర్యలు తీసుకున్నది లేదు. ఇప్పుడు సాక్ష్యాత్తు రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టిన విచారణలో రోహణీ ఆసుపత్రి దోషి అని తేలింది. నిదుల గోల్‌ మాల్‌ చేసినట్లు వెల్లడైంది. అయినా అదికారుల్లో చలనం లేదు. కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదు. రోహిణీ ఆసుపత్రి సీజ్‌ చేయడానికి అదికారులు ధైర్యం చేయడంలేదు. ప్రభుత్వానికన్నా పెద్ద వ్యక్తులు ఎవరైనా వున్నారా? వాళ్లేమైనా ప్రభుత్వ అధికారులను ఆపుతున్నారా? తప్పుల మీద తప్పులు, నేరాల మీద నేరాలు చేస్తూ పోతోంది. ఇవన్నీ వాస్తవాలు కాదా? రోహిణీ మరింత దోపిడీకి వైద్య వర్గాలు సహకరిస్తున్నట్లు కాదా? రోహిణీ ఆసుపత్రిని ముట్టుకునే ధైర్యం ఎవరూ చేయడం లేదు. ఆ ఆసుపత్రి వైపు వెళ్లేందుకు అదికారులు కుంటి సాకులు చెబుతున్నారు. అంటే అధికారులు కూడా తప్పులు చేసి వుండాలి. లేకుంటే ఆసుపత్రి వర్గాలకు భయపడుతూనైనా వుండాలి. ఇందులో ఏది నిజమో అధికారులే చెప్పాలి. రోహిణీని ముట్టుకునే శక్తి లేనప్పుడు ఆ ఆసుపత్రిని జాబితాలో ఎందుకు చేర్చారు? చిన్నా చితకా ఆసుపత్రులను హడావుడిగా రాత్రికి రాత్రి మూసేశారు. రోహిణీ ఆసుపత్రి వైపు కన్నెత్తి చూడాలంటే అదికారులు భయపడుతున్నారు. అధికారులు మామూళ్ల మత్తులో వదిలేస్తున్నారా? లేక ధైర్యం చాలడం లేదని చేతులెత్తేస్తున్నారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అవినీతికి పాల్పడిన తర్వాత ఎంత పెద్ద ఆసుపత్రి అయితే ఏమిటి? దాని వెనక ఎంత పెద్దవాళ్లు వుంటే ఏమిటి? అదికారులు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడంపోవడం విచారకరం. ఇక్కడ విచిత్రమైన విషయమేమిటంటే రోహిణీ ఆసుపత్రిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని డైరక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ను ప్రశ్నిస్తే, డిఎంఅండ్‌హెచ్‌ఓలకు ఆదేశాలు జారీ చేశామని చెబుతున్నారు. డిఎంఅండ్‌హెచ్‌వోలతో మాట్లాడితే కలెక్టర్‌ ఆదేశాలు ఇంకా రాలేదని తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రభుత్వమే ఆ ఆసుపత్రుల లైసెన్సులు రద్దుచేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడా కలెక్టర్‌ దగ్గరుండి పర్యవేక్షించాలని సూచించలేదు. సిఐడి నివేదికలో ఏమైనా పొరపాట్లు వున్నాయా? తేల్చమని కలెక్టర్లను కోరలేదు. అలాంటప్పుడు ఆసుపత్రులను సీజ్‌ చేయడానికి కలెక్టర్‌ ఎందుకు? కలెక్టర్‌ను ఎందుకు బద్‌నాం చేస్తున్నారు? అది కూడా సరే అనుకున్నా, కలెక్టర్‌ దృష్టికి జిల్లా వైద్యాధికారులు తీసుకెళ్లారా? అంటే అదీ లేదు. కాని కలెక్టర్‌ పేరు చెప్పి జాప్యం చేస్తున్నారు. ఇలాంటి తికమక వ్యవహారాలు ఒక్క రోహిణీకే ఎందుకు? తెలంగాణలో ఇప్పటి వరకు సీజ్‌ చేసిన ఏ ఆసుపత్రి విషయంలో అదికారులు ఇలా మీన మేషాలు లెక్కించలేదు. కనీసం ఆయా ఆసుపత్రులకు వారం రోజులకన్నా ఎక్కువ గడువు ఇవ్వలేదు. కాని రోహిణీకి మాత్రమే ఈ మినహాయింపు ఎందుకు అన్నది అందరూ అడుగుతున్న ప్రశ్న. ప్రభుత్వ వైద్యాదికారులే ఆసుపత్రి వర్గాలకు భయపడుతుంటే, సామాన్యులకు న్యాయంచేసేదెవరు? సామాన్యులకు అండగా నిలిచేదెవరు? ఆది నుంచి రోహిణీ విషయంలో అన్నీ వివాదాలే. గతంలో ఫైర్‌ సేప్టీలేకపోవడంతో ఆసుపత్రిలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఆసుపత్రిలో మంటలు చెలరేగి రోగులుకూడా చనిపోయిన సందర్భాలున్నాయి. ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం. అంటే ఆసుపత్రి యాజమాన్యం ఎంత నిర్లక్ష్యంగా వుందో ఆ సంఘటనతో తేలిపోయింది. అప్పుడే ఆసుపత్రి మీద చర్యలు తీసుకోవాల్సి వుంది. కాని అప్పుడూ అదికారులు ధైర్యం చేయలేదు. కనీసం ఆసుపత్రికి నోటీసులు కూడా జారీచేయలేదు. తర్వాత అదే ఆసుపత్రిలో కాలం చెల్లిన మందులను మెడికల్‌ షాపుల ద్వారా రోగులకు అంటగడుతూ వచ్చారు. ఆ విషయంలో కూడా రోహిణీ ఆసుపత్రిలో అక్రమ సంపాదన పైత్యం వెలుగు చూసింది. అదే ఆసుపత్రిలో వైద్యానికి వచ్చిన రోగులకు గడువు ముగిసిపోయిన, కాలం చెల్లిన మందులను అదే ఆసుపత్రి వైద్యానికి ఇస్తే ఏం జరగుతుందో తెలియందా? అంత దుర్మార్గానికి ఒడిగట్టిన ఆసుపత్రిపై ప్రభుత్వ వర్గాలకు ప్రేమ ఎందుకు? అధికారులకు ఆసుపత్రి మీద మమకారమెందుకు? ఏ ఆసుపత్రిలోనైనా ఇంత దుర్మార్గం వుంటుందా? వైద్యానికి వచ్చిన రోగులకు పాడైపోయిన మందుల చేత వైద్యం చేసే ఆసుపత్రులు ప్రపంచంలో ఎక్కడైనా వుంటాయా? ఆ ఆసుపత్రికి రోగులంటే ఎంత నిర్లక్ష్యమో! ఇక్కడే తేలిపోయింది. పట్టుబడిరది. అయినా చర్యలు తీసుకున్నది లేదు. ఆసుపత్రిని సీజ్‌ చేసిందిలేదు. ఇప్పుడు కూడా ఆసపత్రిపై చర్యలు తీసుకుంటారన్ననమ్మకం లేదని ప్రజా సంఘాలు అంటున్నాయి. సిఎంఆర్‌ఎఫ్‌ నిధుల గోల్‌ మాల్‌ జరిగిందని తెలిసి ప్రభుత్వం వేసిన సిఐడి విచారణకు క్రెడిబిలిటీ లేనట్లేనా? రోహిణీ ఆసుపత్రికి మినహాయింపు ఇచ్చినట్లేనా? రోహిణీ ఎన్ని పొరపాట్లు చేసినా అదికారులు ఉపేక్షించుకుంటూ పోతూనే వుంటారా? ఎవరు సమాధానం చెబుతారు?

బెంగాల్‌ హిందూ ఓటర్లను ఆకర్షించలేకపోతున్న బీజేపీ

సంస్థాగత బలం లేకపోవడం పెద్ద లోటు

బలమైన కార్యకర్తల బేస్‌ అవసరం

ఓటర్లను పోలింగ్‌ బూత్‌ల వద్దకు తీసుకువచ్చే క్షేత్రస్థాయి కార్యకర్తలు లేరు

గ్రామీణ, పట్టణ ప్రాంత పేదలకోసం మమత అమలు చేస్తున్న పథకాలు

బీజేపీ పట్ల బెంగాలీల్లో వ్యతిరేక భావం

భాజపాను ఉత్తరాది పార్టీగా పరిగణిస్తున్న బెంగాలీలు

ప్రభుత్వ మద్దతుతో రెచ్చిపోతున్న రాడికల్‌ ముస్లింలు

భద్రత కొరవడి బిక్కుబిక్కు మంటున్న హిందువులు

వక్ఫ్‌ బిల్లు అల్లర్లలో హిందువుల ఆస్తుల విధ్వంసం

ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో రెండోతరగతి పౌరులుగా హిందువులు

హిందువులపై దాడులు సర్వసాధారణం

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ముస్లిం మెజారిటీ ప్రాంతాల్లో తమపై దాడులు జరుగుతున్నా, రెండో తరగతి పౌరులుగా పరిగణిస్తున్నా, మమతా బెనర్జీ ముస్లింల బుజ్జగింపు రాజకీయాలు అనుసరిస్తున్నప్పటికీ, పశ్చిమబెంగాల్‌ హిందువుల్లో చాలామంది ఇంకా తృణమూల్‌ కాంగ్రెస్‌కే ఓటు వేస్తుండటం విచిత్రమనిపిస్తుంది. ఇటీవల వక్ఫ్‌ బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్రంలో అల్లర్లు జరిగిన ముర్షిరాబాద్‌ జిల్లాకు చెందిన జఫ్రాబాద్‌ అనే ఒక చిన్న పట్టణంలో మైనారిటీలుగా వున్న హిందువులకు చెందిన ఏ ఒక్క ఇల్లుదాడికి లేదా లూటీకి గురికాకుండా లేదంటే అతిశయోక్తి కాదు. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో పెచ్చరిల్లిన హింస ప్రభావాన్ని ఇక్కడి హిందువులు చవిచూశారు. ఈ చిన్న పట్టణం కోల్‌కతాకు 284 కిలోమీటర్ల దూరంలో వుంది. ఇక్కడ 25వేల మంది ముస్లిం జనాభా వుంటే, హిందువు లు కేవలం 5100 మాత్రమే. షంషేర్‌గంజ్‌ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఈ పట్టణం వుంది. ఈ నియోజకవర్గంలో 2.16లక్షల మంది ఓటర్లుండగా ఇందులో 80శాతం మంది ముస్లిం లే. ఈ నియోజకవర్గంలో ముస్లిం అభ్యర్థి తప్ప మరొకరు గెలవరు. ముస్లిం మెజారిటీ ప్రాంతా ల్లో హిందువుల బతుకులు ఎంత దుర్భరంగా వుంటాయనేదానికి జఫ్రాబాద్‌ పట్టణం ఒక ఉదా హరణ మాత్రమే! మమతా బెనర్జీ ముస్లింల బుజ్జగింపు రాజకీయాల పుణ్యమాని, ఇక్కడి హిందువులు ఎన్ని బాధలు పడుతున్నా పోలీసులు కూడా పట్టించుకోరు. రాష్ట్రంలో ముస్లింలు మెజారిటీలుగా వున్న అన్ని ప్రాంతాల్లో హిందువుల పరిస్థితి ఇట్లాగే కొనసాగుతోంది. 

హిందువుల్లో ఓటింగ్‌ శాతం తక్కువ

పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 7.6కోట్లు. వీరిలో హిందువులు 68శాతం. హిందువుల్లో బెంగాలీ హిందువులు 54శాతం వుంటే, గుజరాతీలు, మార్వాడీలు, యు.పి, బిహార్‌ ప్రాంతా లనుంచి వచ్చిన వారు, గూర్ఖాలు, గిరిజనులు కలిసి 14శాతం వుంటారు. అంటే బెంగాలీ హిం దువులు 4.1 కోట్లు కాగా, బెంగాలేతర హిందువుల సంఖ్య 1.6కోట్లు. ఇక రాష్ట్రంలో ముస్లిం ఓటర్ల సంఖ్య 2.43కోట్లు. బెంగాల్‌లో సాధారణంగా ఓటింగ్‌ శాతం 80శాతానికి పైగా నమోద వుతుంది. ముస్లిం ఓటర్లు 90 నుంచి 94శాతం వరకు తమ ఓటు హక్కును వినియోగించుకుం టే, హిందువులు కేవలం 65శాతం మంది మాత్రమే పోలింగ్‌ బూత్‌లకు వెళతారు. అంటే రా ష్ట్రంలోని మొత్తం 5.16 కోట్ల హిందువుల్లో కేవలం 3.5కోట్ల మంది మాత్రమే ఓటు హక్కు విని యోగించుకుంటున్నారు. అదే 2.43కోట్లమంది ముస్లింలలో 2.18కోట్లమంది ఓట్లు వేస్తారు. దీవల్ల రాష్ట్రంలోని 42 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలైన మొత్తం ఓట్లను పరిశీలిస్తే హిందువుల ఓట్లు కేవలం 3.16లక్షలు మాత్రమే అధికంగా పోలవడం గమనార్హం. 

హిందువుల్లో 66శాతం మంది బీజేపీకి మద్దతు

2024 లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌కు 2.75కోట్ల ఓట్లు (45.76%) పోల్‌ కాగా, బీజేపీకి 2.33 కోట్ల (38.73%) ఓట్లు పోలయ్యాయి. అంటే తృణమూల్‌ కాంగ్రెస్‌కు బీజేపీ కంటే 42.37లక్షల ఓట్లు మాత్రమే అధికంగా పడటం గమనార్హం. ఈ ఎన్నికల్లో బీజేపీకి పడిన ఓట్లు మొత్తం హిందువులవే. 3.51కోట్లమంది హిందువులు ఓటుహక్కును వినియోగించుకోగా, ఇం దులో 2.33కోట్ల మంది బీజేపీకే తమ ఓట్లు వేసినట్లు తేలుతోంది. అంటే మొత్తం పోలైన హిందూ ఓట్లలో 66శాతం మంది బీజేపీకి అనుకూలంగా ఓటువేసారని స్పష్టమవుతోంది. అంటే మిగిలిన 34శాతం (1.18కోట్లు) ఇతర పార్టీలు ముఖ్యంగా తృణమూల్‌ కాంగ్రెస్‌కు ఓటు వేసారను కోవాలి. వీరిలో కాంగ్రెస్‌, లెఫ్ట్‌ పార్టీలకు 64లక్షల మంది హిందువులు అనుకూలంగా ఓటు వేయగా మిగిలినవారు తృణమూల్‌ కాంగ్రెస్‌కు మద్దతు పలికారు. 

ఈ విశ్లేషణను పరిశీలిస్తే 34శాతం మంది హిందువులు ఇంకా తృణమూల్‌ కాంగ్రెస్‌, కాంగ్రెస్‌ మరియు లెఫ్ట్‌ పార్టీలకు ఎందుకు ఓటు వేస్తున్నారనే ప్రశ్న సహజంగానే ఉదయిస్తుంది.

హిందువులపై యదేచ్ఛగా దాడులు

 హిందువుల వేడుకలు, ఊరేగింపులపై యదేచ్ఛగా దాడులు జరుగుతున్నాయి. హిందువుల పండుగల సందర్భంలో తీవ్రమైన ఆంక్షలు విధిస్తోంది. హిందువుల పట్ల ప్రభుత్వం పూర్తి పక్షపాత వైఖరిని అవలంబిస్తోంది. ఇస్లామిక్‌ ఛాందసవాదులు నిర్హేతుక కోర్కెలకు తలగ్గి ఎన్నో తరాలుగా కొనసాగుతున్న హిందువుల పండుగలు, వేడుకలపై మమత ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోంది. హిందువులపై దాడులకు, హింసాకాండకు పాల్పడిన ఇస్లామిక్‌ ఛాందసవాదులపై చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించవు. దీన్ని అలుసుగా తీసుకొని మతఛాందసవాదులు యదేచ్ఛగా పేట్రేగిపోతున్నారు. హిందువులు మెజారిటీగా ఉన్న ప్రాంతాల్లో కూడా ఇస్లామిస్టులు దాడులకు తెగబడటానికి ప్రధాన కారణం మమతా బెనర్జీ ప్రభుత్వం అండ వున్నదన్న ధైర్యంతోనే! ఉదాహరణకుచందన్నాగోర్‌ సబ్‌డివిజన్‌కు చెందిన చంపదాని పట్టణంలో హిందువుల జనాభా 76%. కానీ ఏప్రిల్‌ 11న శుక్రవారం నమాజు ముగిసిన తర్వాత ఇస్లామిక్‌ రాడికల్స్‌ హిందువుల ఆస్తులపై పెద్దఎత్తున దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్‌ మీడియాలో వైరలయ్యాయి. హిందువులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. కర్రలు, లాఠీలు పట్టుకొని స్వైరవిహారం చేస్తున్న రాడికల్‌ ముస్లింలు, పోలీసులను కూడా తరిమివేశారు. 

ఇస్లామిక్‌ రాడికల్స్‌ దాడులనుంచి తమను తాము కాపాడుకోవడానికి బెంగాలేతర హిందూ యువకులు గ్రూపులుగా ఏర్పడి ఇస్లామిస్టులను నిరోధిస్తున్నప్పుడు, పోలీసులు వీరినే నియంత్రించా రు తప్ప దాడులకు పాల్పడిన వారిని పల్లెత్తుమాట అనుకపోవడం బెంగాల్‌లో జరుగుతున్న అరాచక పాలనకు నిదర్శనం. ఆవిధంగా తాము మెజారిటీగా ఉన్న ప్రాంతాల్లో కూడా హిందువుల కు రక్షణ లేకుండా పోయింది. బెంగాల్‌లోని గ్రామీణ, పట్టణ, సెమి అర్బన్‌ ప్రాంతాలకు చెందిన హిందువులకు ఈ దాడుల అనుభవాలు వెన్నాడుతున్నాయి. 

పేదలకు అనుకూల పథకాలు

మమతా బెనర్జీ ప్రభుత్వం ఎంత గొప్పలు చెప్పుకునా, రాష్ట్రంలో కమతాల విస్తీర్ణం కుంచించుకు పోతుండటంతో వ్యవసాయ దిగుబడులు గణనీయంగా పడిపోతున్నాయి. ఫలితంగా గ్రామీణ, సెమీ అర్బన్‌ ప్రాంతాల్లో అత్యధికశాతం ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారు. మమతా బెనర్జీ అమ లు చేస్తున్న పథకాల వల్ల, లక్షల సంఖ్యలో బాలబాలికలు పాఠశాలలకు వెళ్లగలుగుతున్నారు. ఉన్నత విద్యకూడా అందుబాటులోకి వచ్చింది. ఇందుకు ప్రతిగా మమతా బెనర్జీ ఆయా వర్గాల ఓట్లను కోరుతున్నారు. తమకు అందుతున్న పథకాల ప్రయోజనం నేపథ్యంలో ఆయా ప్రాంతాలకు చెందిన పేద హిందువులు తృణమూల్‌ కాంగ్రెస్‌కే అనుకూలంగా వుంటున్నారు. ఇదే సమ యంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రయోజనాలు పొందు తుండటం ఓటుబ్యాంకు పటిష్టంగా వుండటానికి మరో కారణం. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే, ప్రభుత్వ భూమిలో ఒక టీస్టాల్‌ లేదా దుకాణాన్ని నడుపుకోవడం, పన్నులు చెల్లించకుండా చట్టవిరు ద్ధంగా ఆటోరిక్షాలు నడుపుకోవడానికి పేదలకు స్థానిక తృణమూల్‌ నాయకులనుంచి మద్దతు లభిస్తోంది. అదేవిధంగా చట్టవిరుద్ధంగా మైక్రో ఎంటర్‌ప్రైజెస్‌లను నడుతున్న లక్షల సంఖ్యలో ప్రజలు కూడా తృణమూల్‌కు గట్టి మద్దతుదార్లుగా వున్నారు. 

స్థానిక పార్టీగా బీజేపీకి గుర్తింపు లేదు

చాలామంది బెంగాలీ హిందువులు బీజేపీని బయటినుంచి వచ్చిన పార్టీగా పరిగణిస్తారు. బీజేపీ చేసుకున్న కొన్ని స్వయంకృతాపరాధాలు కూడా ఇందుకు కారణం. ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా తృణమూల్‌ కాంగ్రెస్‌, ప్రజల్లో బీజేపీకి వ్యతిరేకంగా విస్తృత ప్రచారం చేసింది. ముఖ్యంగా బీజేపీ ఉత్తరభారత్‌కు చెందిన పార్టీగా ఇక్కడి ప్రజలు పరిగణిస్తారు. తమకు బీజేపీకి ఎంత మాత్రం పొసగదన్న అభిప్రాయం దృఢంగా వుంది. ఇదే సమయంలో భాజపాకు రాష్ట్రంలో గట్టి సంస్థాగత బేస్‌ ఇంకా ఏర్పడలేదు. అటువంటి బేస్‌ ఏర్పడితే, ఓటర్లు ధైర్యంగా పోలింగ్‌ బూత్‌లకు వెళ్లి ఓటుహక్కును వినియోగించుకోగలుగుతారు. అరాచకానికి, హింసాత్మక రాజకీయాలకు పెట్టింది పేరుగా వున్న బెంగాల్‌లో ఏ రాజకీయ పార్టీ అయినా తన మద్దతుదార్లకు రక్షణ క ల్పించే స్థితిలో వుండాలి. బీజేపీకి అటువంటి సంస్థాగత బలం లేకపోవడంతో ఎంతోమంది హిందువులు పార్టీకి అనుకూలంగా ఉన్నప్పటికీ పోలింగ్‌ బూత్‌లకు రావడానికి భయపడుతున్నారు. అంతేకాదు బూత్‌ స్థాయిలో రిగ్గింగ్‌ను అడ్డుకునేందుకు అవసరమైన కార్యకర్తల బలం బీజేపీకి లేదు. ఇక పట్టణ ప్రాంత బెంగాలీలు ప్రత్యేకించి కోల్‌కతా నగరానికి చెందిన హిందువులు లెఫ్ట్‌ పార్టీలకు అనుకూలం. ఎప్పుడైతే కమ్యూనిస్టులు తెరమరుగైపోయారో వీరంతా తృణమూల్‌ కాం గ్రెస్‌ మద్దతుదార్లుగా మారిపోయారు. వీరు బీజేపీని మతతత్వ పార్టీగా విస్తృతంగా ప్రచారం చే స్తున్నారు. రాష్ట్రంలోని కొన్ని నియోజకవర్గాల్లో బెంగాలేతరుల జనాభా అధికం. వీరంతా తృణ మూల్‌ కాంగ్రెస్‌కే ఓటు వేస్తారు. ఇటువంటి బెంగాలేతర వర్గాలనుంచి ప్రముఖ నాయకులను ఆకర్షించడంలో బీజేపీ ఇంకా సఫలీకృతం కాలేదు. దీంతో పాటు వీరిని విస్మరించడం కూడా పార్టీకి ప్రతికూలతగా మారింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాలకు అనుకూలుడైన సమర్థ నాయకుడిని ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఏర్పడిరది. హిందువుల్లోని అన్ని వర్గాలను ఆకర్షించగలిగే ఛరిష్మా నాయకుడు లేకపోవడం పార్టీకి పెద్దలోటుగా మారింది. ఇన్ని కారణాల నేపథ్యంలో ముస్లింల బుజ్జగింపు రాజకీయాలు నడిపే పార్టీలకు హిందూ ఓటర్లు అనుకూలంగా వుండటంలో పెద్ద విశేషమేం లేదు. బలం వున్నవాడి వైపే వీరు మొగ్గు చూపుతున్నారు. ఇదే తృణమూల్‌కు లాభం.

అధికారులుగా చేయలేని సేవ..నాయకులుగా చేస్తారా?

-రాజకీయాలంటే మాటలు కాదు..అధికారుల పెత్తనం అసలే కాదు!

-అప్పుడు జనానికి దూరం…ఇప్పుడు దగ్గరయ్యేందుకు ఆరాటం?

-అధికారులు రాజకీయాలు…రాణించలేక అవస్థలు!

-రాజకీయాలలోకి అధికారులు..సక్సెస్‌ కాలేక తలనొప్పులు!

-ఏదో ఒక పార్టీలో చేరి పదవులు పొందిన వారున్నారు.

-ప్రత్యేకంగా పెత్తనం చేయాలనుకొన్న వారు ఊగిసలాడుతున్నారు.

-మీడియా ప్రాపకం కోసం పాకులాడుతున్నారు.

-అతి విశ్వాసంతో రాజకీయాలను ఏలుదామనుకున్నారు.

-రాణించలేక చతికిలపడిపోతున్నారు.

-ఒంటరి పోరాటంలో అలసిపోయి పార్టీల పంచన చేరుతున్నారు.

-అక్కడ గుర్తింపు కోసం ఆరాపడుతున్నారు.

-నిన్నటిదాకా పోరాటం చేసిన వారి పంచన చేరిన వారు వున్నారు.

-రెండు తెలుగు రాష్ట్రాలలో ఇలాంటి వారున్నారు.

-ఉనికి కోసం తహతహలాడుతున్నారు.

-అధికారిగా వున్నప్పుడు ప్రజలకు దూరంగా వున్నారు.

-రిటైర్‌ అయ్యాక రాజకీయాలలో చేరి జనాన్ని ఉద్దరిస్తామంటారు.

-రాజకీయ పదవుల కోసం అర్రులు చాస్తున్నారు.

-సవాలు చేసిన పార్టీలు పంచన చేర్చుకునేందుకు రాయబారాలు చేస్తున్నారు.

-వున్న పేరును చెడగొట్డుకొని, విమర్శల పాలౌతున్నారు.

-రాజకీయ విశ్లేషకుల పాత్రలు పోషిస్తూ నిత్యం మీడియాలో వుంటున్నారు.

-ప్రతి సమస్య మీద ఏదో ఒక డిబేట్‌ లో పాల్గొంటున్నారు.

-ఎప్పటికైనా అవకాశాలు రాకపోతాయ అని ఎదురుచూస్తున్నారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఉద్యోగులు ముదిరితే నాయకులౌతారంటే ఇదేనేమో! రాను రాను రాజకీయాల్లోకి ఉద్యోగులు పెద్దఎత్తున వచ్చే అవకాశాలుకూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగులుగా ఎడాపెడా సంపాదించి, తర్వాత వాటిని రాజకీయాల కోసం కొంత ఖర్చు చేసి, మరింత దోచుకునేందుకు మార్గం వేసుకునే వారు చాలా మంది క్యూలో వున్నట్లున్నారు. తొండ ముదిరితే ఊసరవెళ్లి అవుతుందన్నది ఎంత నిజమే ఉద్యోగులు నాయకులైతే కూడా అదే జరుగుతుంది. అంతకు మించి ప్రజలు కూడా వారి నుంచి ఏదీ ఆశించడం లేదు. నిజాయితీగా ఉద్యోగం చేసిన ఎంత పెద్ద అధికారులైనా ఇప్పటికీ సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాని కొంత మంది మాత్రమే రాజకీయాల్లో అడుగు పెడుతున్నారు. వాళ్లేమీ జీవితాలు త్యాగంచేసిన వారు కాదు. ఉద్యోగం చేసిన నాడు వారి జీతాల నుంచి జనానికి సేవ చేసిన వారు కాదు. కాని ఆగష్టు 15, జనవరి 26 నాడు పుటక్కున దేశ భక్తి పుట్టుకొచ్చి, జెండా వందనం అయిపోగానే చట్టుక్కున మర్చిపోయినట్లే వుంటుంది. ఉద్యోగం చేసినంత కాలం వారి జీవిత కాలం మొత్తం సామాన్యుడిని దగ్గర తీసుకున్న సందర్భాలే వుండవు. కాని అంతా అయిపోయాక రాజకీయాల్లోకి వచ్చే ముందుకు ఎవరూ చూడని, వినని ముచ్చట్లన్నీ చెప్పేస్తుంటారు. జనాన్ని నమ్మించే ప్రయత్నాలు చేస్తుంటారు. అలా రాజకీయాల్లోకి వచ్చిన వారిలో సక్సెస్‌ రేటు చాలా తక్కువ. ఇయితే ఇక్కడ కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పుకోవాలి. తమకు తాము గొప్ప బలవంతులమని, అతి విశ్వాసానికి వెళ్లిన నాయకులెవరూ తెలుగు రాష్ట్రాలలో సక్సెస్‌ అయిన వారు లేరు. ముందుగా చెప్పుకోవాల్సిన నాయకుడు జయప్రకాశ్‌ నారాయణ్‌. ఏకంగా లోక్‌సత్తా అనేపార్టీ పెట్టారు. ఉద్యోగానికి రాజీనామా చేసి అవినీతి రహితసమాజ నిర్మాణం కోసం పోరాటం చేస్తానన్నాడు. ఉమ్మడి రాష్ట్ర్రంలో ఓ పదేళ్ల పాటు రాజకీయం చేశాడు. కాని ప్రజలు ఆదరించలేదు. పైగా ఆయనకు రాజకీయాలు చేసేంత సొమ్మెక్కడిది అని జనం ప్రశ్నించుకున్నారు. ఒక దశలో హైదరాబాద్‌ నగరమే కాదు, ఉమ్మడి రాష్ట్రంలోని అనేక నగరాల్లో లోకస్‌ సత్తాను ముందుగా విస్తరించాలని చూశారు. ఆ రోజుల్లో హైదరాబాద్‌తోపాటు, అనేక నగరాల్లో లోక్‌ సత్తా గురించి ఆయన చేసిన ప్రచారం కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఆ సొమ్ము ఎక్కడిది? అన్న ప్రశ్న మొదలైంది. దాంతో అప్పటి నుంచి ఆయన పతనం కూడా మొదలైంది. ఏపి ప్రజలు ఆదరించలేదు. తెలంగాణ ప్రజలు దరి చేర్చుకోలేదు. తెలంగాణ ఉద్యమం మీద లేని పోని కిరికిరి పెట్టే ప్రయత్నం చేసి మొదటికే మోసం తెచ్చుకున్నాడు. 2009లో ఓసారి జనం నమ్మి చూద్దామని కూకట్‌ పల్లి నుంచి గెలిపించారు. కాని ఆయన నాయకుడిగా పనిచేయలేదు. అమెరికాలో రాజకీయం ఇలా వుంటుంది. లండన్‌లో ఇలా వుంటుంది. ఇక్కడ కూడా అదే అమలు చేద్దామన్నట్లు మాటలు చెప్పారు. ప్రజలకు దూరమయ్యారు. రేషన్‌ కార్డు కోసం మన దేశంలో నాయకుడికి దగ్గరకు వెళ్లడమే ప్రజలకు అలవాటు. అదే రివాజు. తర్వాత అదికారులకు అర్జీలు పెట్టుకుంటారు. ఇలాంటి సమయంలో రేషన్‌ కార్డు కావాలంటే రెవిన్యూ కార్యాలయానికి వెళ్లి ధరఖాస్తు చేసుకోవాలి. నా దగ్గరకు వస్తే నేనేం చేస్తా?అని అన్నట్లు వార్తలు వచ్చాయి. అంతే సామాన్యుడికి ఎంత దగ్గరగా వుంటే నాయకుడు అంత ప్రజల గుండెల్లో వుంటాడు. అధికారికి ప్రజలకు దూరం వుండడమే తెలుసు. డాబు, దస్కం చూపించడమే అలవాటు. అలాంటి వారు ప్రజలకు చేరువ కావడం అన్నది దుర్లభం. ఎంత మంది అదికారి అనే పేరున్నా, నేరుగా ప్రజలకు సేవ చేసే నాయకుడు కాలేదు. 1999 ఎన్నికల్లో చంద్రబాబు నాయకుడు తటస్ధులను రాజకీయాల్లోకి తీసుకొచ్చి, సరికొత్త రాజకీయం చూపిస్తానన్నాడు. ఎన్నికల్లో మాజీ సిబిఐ డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేసిన విజయరామారావును ఖైరతాబాద్‌ నుంచి పోటీ చేయించారు. అలా మరి కొంత మందికి అవకాశాలు కల్పించారు. ఆ ఎన్నికల్లో వాళ్లంతాగెలిచారు. అందులో ఓ నలుగురికి కూడా మంత్రి పదవులు ఇచ్చారు. ఆ నలుగురు ఆ తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు. ప్రజలకు గుర్తు కూడా లేరు. కాకపోతే ఒక్కసారైనా గెలిచారు. మంత్రి పదవులు కూడా అనుభవించారు. అలా ఒకపార్టీని నమ్ముకొని రాజకీయాలు చేసిన ఉద్యోగులు అంతో ఇంతో రాజకీయంగా కూడా రాణించారు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన మాజీమంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ లాంటి వారు రాజకీయాలలో ఇప్పటికీ కీలకభూమిక పోషిస్తున్నారు. తొలి తెలంగాణ మండలి చైర్మన్‌గా పనిచేసిన స్వామీ గౌడ్‌ ఉద్యోగ సంఘ నాయకుడిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారు. తర్వాత బిఆర్‌ఎస్‌లో చేరి ఎమ్మెల్సీ అయ్యారు. తెలంగాణ వచ్చిన తర్వాత తొలి మండలి సభకు చైర్మన్‌ అయ్యారు. మహబూబాబాద్‌ ఎమ్మెల్యేగా పనిచేసిన శంకర్‌ నాయక్‌ కూడా తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నారు. తర్వాత మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. అలా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఎమ్మెల్సీ కోదండరాం రాజకీయాల్లోకి వచ్చారు. పార్టీ పెట్టారు. కాని ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయనే గెలవలేకపోయారు. బిఆర్‌ఎస్‌లో చేరి వుంటే ఎప్పుడో రాజకీయంగా మరో స్ధాయిలో వుండేవారు. కాని ఆయన వేసిన తప్పటడుగుల మూలంగా పార్టీ పెరిగింది లేదు. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో గెలిచింది లేదు. కాకపోతే గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్దతు తెలిపడంతో ఇటీవల ఎమ్మెల్సీ అయ్యారు. 2023 ఎన్నికల ముందు పోలీస్‌ ఉన్నతాధికారిగా పనిచేసిన ఆర్‌ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌ , తన ఉద్యోగానికి రాజీనామాచేసి రాజకీయాల్లోకి వచ్చారు. ఆయనను బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. అయినా దాన్ని కాదనుకొని రాజకీయాల్లోకి వచ్చారు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వంమీద తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. తానే స్వయంగా ఒక రాజకీయ పార్టీ పెట్టాలని అనుకున్నారు. కాని బిఎస్పీ పార్టీలో చేరి ఆ పార్టీ తెలంగాణ కన్వీనర్‌గా పనిచేశారు. గత ఎన్నికల్లో ఆయన కూడా పోటీ చేశారు. అప్పుడు గాని రాజకీయాలంటే ఏమిటో ఆయనకు అర్ధం కాలేదు. దాంతో బిఎస్పీని వదిలేసి బిఆర్‌ఎస్‌లో చేరారు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అదికారంలో వున్నప్పుడే ఆయన పార్టీలో చేరితే ఆయన రాజకీయం మరోలా వుండేది. కాని ఆయన అడుగడుగునా కేసిఆర్‌ను విమర్శిస్తూ వెళ్లారు. ఒక రకంగా బిఆర్‌ఎస్‌ ఓటమికి ఆయన కూడా నీటి బొట్టుగా మారారు. అప్పుడు కేసిఆర్‌ను తూర్పార పట్టిన ప్రవీణ్‌ కుమార్‌ ఇప్పుడు ఆకాశానికెత్తుకుంటున్నారు. అంటే ఉద్యోగులు కూడా అవకాశ వాద రాజకీయాలు చేయడానికి మాత్రమే వచ్చారని అర్దం చేసుకోవచ్చు. గతంలో కూడా ఉద్యోగులు కొంత మంది రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెస్‌లో చేరి పదవులు పొందిన వారున్నారు. వరంగల్‌ ఎంపిగా రెండు సార్లు గెలిచిన సిరిసిల్ల రాజయ్య ఒకప్పుడు ఉద్యోగం చేసిన వారే. ప్రస్తుత మహబూబాబాద్‌ ఎంపి బలరాం నాయక్‌ కూడా ఒకప్పుడు ఉద్యోగి. ఆయన గతంలో ఎంపిగా గెలిచి కేంద్రంలో మంత్రి పదవి నిర్వహించారు. ఈసారి మళ్లీ ఎంపిగా గెలిచారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒక టీచర్‌గా పనిచేసిన స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, గత నాలుగు దశాబ్ధాలుగా రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తూ వస్తున్నారు. ఒకటి రెండు ఓటములు తప్ప ఆయన వరుస విజయాలు సాదిస్తూవచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో సుమారు 9 సంవత్సరాలపాటు మంత్రిగా పనిచేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత నాలుగేళ్లపాటు ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా కొనసాగుతూ వున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏపి మాజీ ముఖ్యమంత్రి జగన్‌ కేసును పర్యవేక్షించిన సిబిఐ. జాయింట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన ఇంటిపేరు జేడిగా స్ధిరపర్చుకున్న లక్ష్మి నారాయణ రాజకీయాల్లో విజయాలు చవి చూడలేకపోతున్నారు. సొంతంగా పార్టీ పెట్టి చతికిలపడిపోయారు. కొన్ని పార్టీలు తిరిగి అక్కడ కూడా నెగల్లేక పోయారు. ఇప్పుడు రాజకీయాలపై యువత అవగాహన కార్యాక్రమాలు చేపడుతున్నారు. మీడియాలో విశ్లేషకులుగా పనిచేస్తున్నారు. ఎంతో సమర్ధవంతమైన అధికారిగా ఆయనకు వున్న పేరును రాజకీయాల్లోకి వచ్చి చెడగొట్టుకున్నారు. ప్రజల్లో వున్న గుర్తింపు తనకు తానే చెరిపేసుకున్నారు. ఒకప్పుడు ఆయన మాట కోసం మీడియా ఎగబడిపోతుండేది. ఇప్పుడు తన మాటలు చెప్పడంకోసం మీడియా సంస్దల చుట్టూ లక్ష్మినారాయణ తిరగాల్సి వస్తుంది. ఉద్యోగం చేసినప్పుడు ఆయన ప్రజలకు ఏంసేవ చేశారో లేదోగాని, రాజకీయాల్లోకి వచ్చి సేవ చేద్దామనుకుంటు ప్రజలు స్వాగతించలేదు.
ఇక పెద్దఎత్తున అవినీతి ఆరోపణలు ఎదుర్కొన వారు కూడా రాజకీయాల్లోకి వచ్చారు. రాణించాలని కూడా చూస్తున్నారు. వారిపై మరో ప్రత్యేక కధనం త్వరలో…

‘‘కేసిఆర్‌ గర్జన’’..’’కాంగ్రెస్‌ లో తర్జనభర్జన!’’

-ప్రజలంతా కొత్త ‘‘కేసీఆర్‌’’ ను చూశారు

-చాలా కాలం తర్వాత ‘‘కేసీఆర్‌’’ ను చూసిన ఆనందంలో కేరింతలు కొట్టారు

-‘‘కేసీఆర్‌’’ ప్రసంగంలో ఉగ్రరూపం కన్నా, సమగ్ర రూపానికి విలువిచ్చారు

-శాంతంగా మాట్లాడుతూనే అద్భుతమైన సెటైర్లు వేశారు

-తెలంగాణకు కాంగ్రెస్‌ విలన్‌ అన్నారు

-కాంగ్రెస్‌ వైఫల్యాలను జనం చేత చెప్పించారు

-మొదటి సారి ప్రజలను ‘‘అన్నలు’’ అని పలుసార్లు సంబోధించారు

-తనదైన శైలికి భిన్నంగా కొత్త ‘‘కేసీఆర్‌’’ ను చూపించారు

-ఒక్కో పథకం ప్రస్తావిస్తూ చురకలు అంటించారు

కాంగ్రెస్‌ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు

-తన కళ్ల ముందే తెలంగాణ తెర్లవుతుంటే తట్టుకోలేకపోతున్నాన్నారు

-మళ్ళీ వచ్చేది బీఆర్‌ఎస్‌ పార్టీయే అని శ్రేణులలో భరోసా నింపారు

-ఏడాదిన్నర సమయం కాంగ్రెస్‌ కు ఇచ్చానన్నారు

-ఇక ఆగేది లేదంటూనే ఆవేశంతో కాకుండా ఆలోచనతో ముందుకెళ్ధామన్నారు

-పనిలో పనిగా పోలీసు శాఖను హెచ్చరించారు

-బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియాను ప్రశంసించారు

-స్వయంగా నేనే శ్రేణులకు అందుబాటులో వుంటానన్నారు

-సభ ఊహించినట్లే సక్సెస్‌ అయింది

-డ్రోన్‌ కళ్లకందనంత సభా ప్రాంగణం నిండిపోయింది

-నింగి వంగి నేల పొంగిందన్నట్లు జనం వచ్చారు

నిర్వాహకులు ‘‘ఎమ్మెల్సీ పోచంపల్లి’’, ‘‘ఎమ్మెల్సీ తక్కల్లపల్లి’’ ‘‘పెద్ది’’,’’దాస్యం’’ లను అభినందించారు

-అశేష జనవాహిని చూసి కేసీఆర్‌ మురిసిపోయారు

-ఖమ్మం నుంచి అత్యధికంగా ప్రజలు తరలివచ్చారు

-రాజ్యసభ సభ్యుడు ‘‘వద్దిరాజు’’ అందరికన్నా ఎక్కువ మందితో సభకు వచ్చారు

హైదరాబాద్‌,నేటిధాత్రి:

బిఆర్‌ఎస్‌ రజతోత్సవ రోజున ప్రకృతి పరంగా కూడా ఒక అద్భుతం జరిగింది. ఇది ఎవరూ ఊహించలేదు. అసలు ఊహకుకూడా అందలేదు. మండు వేసవిలో 45 డిగ్రీల ఎండలో సభకు జనం ఎలా వస్తారో..ఎండలో సభలో ఎలా వుంటారో అని అందరూ అనుకున్నారు. నిప్పులు కక్కే ఎండలను తట్టుకొని వచ్చేదెంత మంది అని కూడా అనుకున్నారు. కాని బిఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు వాతావరణం సహకరించడం అన్నది గొప్ప విషయం. విశేషం కూడా. గతంలో ఎప్పుడూ ఇలా జరిగింది లేదు. మండు వేసవిలో తెలంగాణ మలయమారుతంలాగా మారిపోవడం అందర్నీ ఆశ్చర్యపర్చింది. తెలంగాణ వ్యాప్తంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు వాతావరణం చల్లగా మారిపోయింది. సభ జరగడానికి ఒక రోజు ముందుకు కూడా నిప్పులు వేడిమి వుంది. సభ తెల్లారి కూడా మళ్లీ ఎండ విపరీతంగా కాసింది. సభ జరిగిన రోజు మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు చల్లని వాతావరణం మాత్రమే వుంది. ఇదెలా సాధ్యమైందన్నది కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. కేసిఆర్‌ సభ అంటే వాతావరణం కూడా ఎంత సహకరించిందో అర్ధం చేసుకోవచ్చు. అంతే కాదు ఒక్కసారిగా ఒక్క పూట చల్లబడిన వాతావరణం సాయంత్రానికి వర్షం కురిస్తే కూడా ఇబ్బందే అయ్యేది. కాని అటు వాన లేదు. ఇటు ఎండ లేదు. చల్లదనం మాత్రమే కనిపించింది. బిఆర్‌ఎస్‌ సభ ఊహకందనంత విజయం సాధించింది. ప్రకృతి కూడా బిఆర్‌ఎస్‌కు రజతోత్సవ శుభాకాంక్షలు తెలియజేసినట్లైంది.
సింహ శ్వాసలో వేడి, గర్జనలో వాడి రెండు ఎలా వుంటాయో బిఆర్‌ఎస్‌ రజతోత్సవ సభలో అధినేత కేసిఆర్‌ ఏక కాలంలో చూపించారు. కాంగ్రెస్‌ పార్టీ మీద నిప్పులుచెరిగారు. అదే సమయంలో బిఆర్‌ఎస్‌ పుట్టుక, తెలంగాణ ఉద్యమం, సాధనలను ఎంతో అర్ధవంతంగా వివరించారు. కేసిఆర్‌ రజతోత్సవ సభలో చేసిన వ్యాఖ్యలపై ఏం మాట్లాడాలో కాంగ్రెస్‌పార్టీకి అర్ధం కాకుండాపోతోంది. నాయకులు తర్జన భర్జన అవుతున్నారు. లక్షలాది మంది సాక్షిగా కేసిఆర్‌ కాంగ్రెస్‌ వైఫల్యాలను ఎండగట్టారు. పనిలోపనిగా ప్రజల చేత ఆ వైఫల్యాలను చెప్పించారు. దాంతో లక్షల మంది కాంగ్రెస్‌ పధకాలు అమలు కావడం లేదని చెప్పినట్లైంది. నిజానికి కేసిఆర్‌ తన శైలికి భిన్నంగా ఇలాంటి నినాదాలు చేయించారు. తాను మాత్రమే కాదు, తెలంగాణ ప్రజలంతా ముక్తకంఠంతో కాంగ్రెస్‌ను తూర్పారపట్టినట్లైంది. ఇక సభ విషయానికి వస్తే రజత్సోతవ సభలో సరికొత్త కేసిఆర్‌ను జనం చూశారు. ఒకప్పటి ఉద్యమ కేసిఆర్‌వేరు. ఇప్పుడుకేసిఆర్‌ వేరు. ఆ కేసిఆర్‌లో ఉరిమే ఉత్సాహం మాత్రమే కనిపించేంది. కాని ఇప్పుడు ఉప్పెనలాంటి కేసిఆర్‌ను జనం చూశారు. బిఆర్‌ఎస్‌ అధికారంలోవున్నా లేకున్నా, ప్రజల గుండెల్లో మాత్రం సుస్ధిరంగా వుందని నిరూపించారు. సహజంగా సభ నిర్వహణ అంటే బిఆర్‌ఎస్‌ను మించిన పార్టీలేదు. దేశంలోని ఏ పార్టీకి ఇంత పెద్దసభలు నిర్వహించడం సాధ్యం కాదు. అది ఒక్క కేసిఆర్‌కు మాత్రమే అని మరోసారి నిరూపించినట్లైంది. ఉద్యమ కాలంలో కొన్ని వందల సభలు కేసిఆర్‌ నిర్వహించారు. ఆ సభలకు కూడా ఎప్పుడూ లక్షకు తక్కువ కాకుండా ప్రజలు హజరయ్యేవారు. అప్పటికే ఉభయ తెలుగు రాష్ట్రాలలో వున్న తెలగువాళ్లే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగు ప్రజలకు టివిలకు అతుక్కుపోయేవారు. కేసిఆర్‌ ప్రసంగిస్తున్నంత సేపు చూపు తిప్పుకునేవారు కాదు. పదేళ్ల పాలన తర్వాత కూడా కేసిఆర్‌ క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించినట్లైంది. బి ఆర్‌ఎస్‌ వేసిన అంచనాకు మించి ప్రజలు వచ్చారు. కోట్లాది మంది ప్రజలు అటు టివిలలో, ఇటు అరచేతిలో మెబైల్స్‌ ద్వారా కేసిఆర్‌ ప్రసంగం ఆధ్యాంతం వీక్షించారు. ఏడాదిన్నర తర్వాత ఇంతటి సభ జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. కేసిఆర్‌ ఒక్క పిలుపు చాలు..లక్షలాది మంది తరలివస్తారని మరోసారి రుజువైంది. ఇక మళ్లీ కేసిఆర్‌ యుగం మొదలైందా? అన్నట్లు జనం తండోపతండాలుగా వచ్చారు. పుట్టల నుంచి చీమలు చేరినట్లు చేరారు. సభా ప్రాంగణంలో ఎటు చూసినా జన సందోహమే..వీరితోపాటు కేసిఆర్‌ సభకు హజరు కాలేక ట్రాఫిక్‌లో చిక్కుకున్న జనం మరో లక్షన్నర వరకు వుంటారని కూడా తెలుస్తోంది. సభా ప్రాంగణానికి చేరుకోలేక, ట్రాపిక్‌లో చిక్కుకొని వెనక్కి వెళ్లలేక, ముందుకు రాలేక, బస్సుల్లోనే అందరూ సెల్‌ఫోన్లలో కేసిఆర్‌ ప్రసంగం విన్నారు. చాలా కాలం తర్వాత కేసిఆర్‌ను చూసిన ఆనందంలో ప్రజలు కేరింతలు కొట్టారు. కేసిఆర్‌ను జయజయ ధ్వానాలతో ఆహ్వానించారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం మరొకటి వుంది. ఈసారి కేసిఆర్‌ ప్రసంగంలో ఉగ్రరూపం కనిపించలేదు. సమగ్ర రూపాన్ని సంతరించుకున్న ప్రసంగం కనిపించింది. ఇది కేసిఆర్‌కు భిన్నమైన కొత్త శైలి. పైగా ఎంతో శాంతంగా మాట్లాడుతూనే అద్భుతమైన సెటైర్లు వేస్తూ కేసిఆర్‌ ప్రసంగం సాగింది. అదే సమయంలో అప్పుడూ, ఇప్పుడూ, ఎప్పుడూ తెలంగాణకు విలన్‌ కాంగ్రెస్‌ అంటూ కేసిఆర్‌ అనగానే సభా ప్రాంగణమంతా దద్దరిల్లిపోయింది. ఇదే ఊపులో కాంగ్రెస్‌ చేసిన వాగ్ధానాలను ఉటంకించిన కేసిఆర్‌, ఆ వైఫల్యాలను ప్రజల చేత ఒకటికి రెండు సార్లు చెప్పించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఎంగట్టారు. ఇదిలా వుంటే ప్రజలను అన్నలారా అంటూ కేసిఆర్‌ సంబోధించడం కూడా మరో ప్రత్యేకత. ఉద్యమ సమయంలో మాత్రమే ఒకటి రెండు సార్లు అన్నట్లు గుర్తు. కాని తర్వాత తాను పెద్దకొడుకును అని అనేవారు కాని, సభకు వచ్చిన వారిని అన్నలని సంబోధించడం కూడా కొత్తగా వుంది. కేసిఆర్‌లో మార్పు స్పష్టంగా కనిపించింది. తనదైన శైలికి భిన్నంగా కొత్త కేసిఆర్‌ను చూపించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేక చతికిలపడుతున్న ఒక్కో పథకాన్ని ఏకరువు పెడుతూ, దెప్పి పొడిచారు. కొత్త రకం చురకలు అంటించారు. మొత్తంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద చల్లటి వాతావరణంలో నిప్పులు చెరిగారు. పదేళ్లలో తెలంగాణ రూపు రేఖలు మార్చానన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ వల్ల తెలంగాణ తెర్లు అవుతుంటే తట్టుకోలేకపోతున్నానంటూ జీరగొంతుతో అన్నారు. ఒక దశలో భావోద్వేగానికి గురయ్యారు. దాంతో ప్రజలకు కేసిఆర్‌కు తెలంగాణ మీద వున్న మమకారాన్ని తెలుసుకున్నారు. ప్రజలు ఏమాత్రం దిగులు చెందొద్దని, వచ్చేది మళ్లీ బిఆర్‌ఎస్‌ పార్టీయే అని సభ సాక్షిగా ప్రకటించారు. దాంతో సభ మొత్తం కేసిఆర్‌ నినాదాలతో మారు మ్రోగిపోయింది. ఏడాదిన్నర కాలం మౌనంగా వున్నాను. కాంగ్రెస్‌ పార్టీకి సమయం ఇచ్చాం. ఇక ఊరుకునేది లేదు. ఆగేది లేదు. పాలకపక్షంలో వున్నా, ప్రతిపక్షంలో వున్నా ప్రజా పక్షమే మన బిఆర్‌ఎస్‌ అని అన్నారు. ఇక నేను జనక్షేత్రంలోకి వచ్చే సమయం ఆసన్నమైందన్నారు. పనిలో పనిగా పోలీసు శాఖను కూడా హెచ్చరించారు. పోలీసులు బిఆర్‌ఎస్‌ నాయకులపై చూపిస్తున్న అత్యుత్సాహాన్ని ప్రశ్నించారు. రాసి పెట్టుకోండి అని వారికి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. బిఆర్‌ఎస్‌ శ్రేణులు ఎక్కడా తగ్గొద్దని చెప్పారు. సోషల్‌ మీడియా బిఆర్‌ఎస్‌ వారియర్స్‌ మీద కేసులు నమోదు చేయడాన్ని కేసిఆర్‌ ఖండిరచారు. వారికి బిఆర్‌ఎస్‌ అండగా వుంటుందని చెప్పారు.

పోచంపల్లి, పెద్ది, దాస్యంలకు కేసిఆర్‌ ప్రశంస: బిఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ ఏర్పాట్లను తమ భుజస్కంధాల మీద వేసుకొని రేయింబవళ్లు కష్టపడి ఇంత పెద్ద సభ సక్సెస్‌కు కారకులైన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ చీఫ్‌ విప్‌. దాస్యం వినయ్‌ బాస్కర్‌, మాజీ ఎమ్మెల్యే,ఉమ్మడి వరంగల్‌ జిల్లా ఒకప్పటి బిఆర్‌ఎస్‌ అధ్యక్షుడు పెద్ది సుదర్శన్‌రెడ్డిలను సభావేదిక సాక్షిగా కేసిఆర్‌ ప్రశంసించారు. వారు ముగ్గురికి ప్రత్యేకంగా ధన్యవాదాలుతెలియజేశారు. ఈ ముగ్గురు పేర్లు కేసిఆర్‌ ప్రస్తావిస్తున్నప్పుడు జనం నుంచి పెద్దఎత్తున కేరింతలు, చప్పట్లు వినిపించాయి. ఎందుకంటే వరంగల్‌ సభ అంటే గతంలో జరిగిన మహా గర్జనకు సరిసమానంగా వుండాలి. లేకుంటే అంతకు మించి వుండాలి. ఏ మాత్రం తక్కువైనా మాట వస్తుంది. అందుకే ముగ్గురు నాయకులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని రాత్రింబవళ్లు కష్టపడి, ప్రతి క్షణం పర్యవేక్షిస్తూ సభ ఏర్పాటు చూసుకున్నారు. కేసిఆర్‌ నుంచి ప్రసంసలు అందుకున్నారు.

ఖమ్మం ఈస్‌ ద మోస్ట్‌…వద్దిరాజు ఈస్‌ ద బెస్ట్‌: వరంగల్‌ రజత్సోతవ సభకు అన్ని జిల్లాల కంటే ఖమ్మం జిల్లా నుంచి అత్యధికంగా ప్రజల హజరైనట్లు తెలుస్తోంది. అన్ని జిల్లాలను మించి రాజ్యసభ సభ్యుడు, బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు వద్దిరాజు రవిచంద్ర గత పదిహేను రోజులుగా పకడ్భంధీగా చేసిన ప్లాన్‌ ప్రకారం ప్రజలు తరలివచ్చారు. నిజానికి వద్దిరాజు చూపిన చొరవ మిగతా జిల్లాలు కూడా చూపించి వుంటే వరంగల్‌ సభ మరో రకంగా వుండేదన్న మాటలు కూడా వినిపించాయి. 1200 ఎకరాలు కూడా సరిపోయేది కాదు. ఎక్కడ చూసినా కనీసం ఓ 50 కిలోమీటర్లు ట్రాఫిక్‌ జామ్‌ అయ్యేది అని చర్చించుకున్నారు. ఖమ్మం నుంచి లక్షలాదిగా ప్రజలు తరలివచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. దాంతో వద్దిరాజు రవిచంద్రను అదినేత కేసిఆర్‌ కూడా అభినందించారు. ఏ ఖమ్మం గుమ్మంలో ఇబ్బంది ఎదురైందో అదే ఖమ్మం నుంచి లక్షలాదిగా ప్రజలు రజతోత్సవ సభకు తరలిరావడం అంటే సామాన్యమైన విషయం కాదు. పైగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖమ్మం దారిలోనే ఎక్కువ ఇబ్బందులకు గురిచేసిట్లుకూడా బిఆర్‌ఎస్‌ ఆరోపించింది. ఖమ్మం నుంచి వస్తున్న వాహనాలను ఎక్కడిక్కడ అడ్డుకునే ప్రయత్నాలు కూడా పెద్దఎత్తున జరిగాయి. వాటిని కూడా తట్టుకొని వద్దిరాజు సమన్వయంచేసుకుంటూ లక్షలాది మంది సభకు హజరయ్యేలా చూశారు. కేసిఆర్‌ నుంచి వద్దిరాజు ప్రత్యేకంగా ప్రశంసలు అందుకున్నారు.

రజతోత్సవం.. గులాబీ జయ కేతనం!

`తెలంగాణ జన జాతర…బీఆర్‌ఎస్‌ 25 ఏళ్ల వేడుక

`ఉద్యమ ప్రస్థానంలో ఉరకలెత్తిన తెలంగాణ పార్టీ

`ముక్కోటి తెలంగాణ చేత జై తెలంగాణ అని జై కొట్టించిన పార్టీ

`ప్రజలంతా గుండెల్లో పెట్టుకున్న జెండా గులాబీ జెండా

`తెలంగాణ అంతా గులాబీ మయం

రజతోత్సవ సభకు అడుగడుగునా ఆటంకాలు ఏర్పరచి, సభ జరగకుండా అడ్డంకులు సృష్టించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన కుట్రలను తిప్పి కొట్టి, బీఆర్‌ఎస్‌ పార్టీ రజతోత్సవ సభ గురించి తరతరాలు చెప్పుకునేలా నిర్వహిస్తామంటున్న ‘‘బీఆర్‌ఎస్‌’’ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ‘‘ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు’’, ‘‘నేటిధాత్రి’’ ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ తో జనజాతర గురించి పంచుకున్న విషయాలు ఆయన మాటల్లోనే..

`వరంగల్‌ నిండా బీఆర్‌ఎస్‌ జన సందోహం

`ఎటు చూసినా గులాబీ రెపరెపలే

`ఎక్కడ విన్నా గులాబీ పాటలే

`తెలంగాణ అంతటా రజతోత్సవ చర్చలే

`గులాబీ దండు కదులుతోంది…వడి వడిగా వరంగల్‌ చేరుతోంది

`గులాబీ సైనికుల తెలంగాణ కవాతు కోసం కళకళలాడుతోంది

`జనం గుండెలు నిండుగా గులాబీ వనం విరబూస్తోంది

`ఎప్పుడెప్పుడు గులాబీ జాతర అని ఎదురుచూస్తోంది

`లక్షలాది మంది వరంగల్‌ సభకు వస్తున్నారు

`కేసీఆర్‌ అంటేనే తెలంగాణ జీవం

`కేసీఆర్‌ మాటలే తెలంగాణకు వేదం

`ఆవిరైపోతున్న నీళ్లు కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి

`తెలంగాణను ఎడారిగా మార్చిన కాంగ్రెస్‌ పై నీళ్లే కన్నెర్ర చేస్తున్నాయి

`అడుగంటుతున్న భూ గర్భజలాలు ఆక్రోషిస్తున్నాయి

`ఎడారిగా మారిన బీళ్లు కాంగ్రెస్‌ను నోళ్లు తెరిచి తిడుతున్నాయి

`నమ్మినందుకు తెలంగాణ తల్లికి చుక్క నీరందక వాగులు, వంకలు శాపాలు పెడుతున్నాయి

`మళ్ళీ కేసిఆర్‌ పాలన వస్తే గాని మాగాణ కళకళలాడతాయని గుర్తు చేస్తున్నాయి

`కేసిఆర్‌ పాలనే తెలంగాణకు స్వర్ణయుగం

`మళ్ళీ కేసిఆర్‌ పాలన కోసం ఎదురుచూస్తోంది తెలంగాణ జనం

హైదరాబాద్‌,నేటిధాత్రి:

రామ దండు గురించి రామాయణంలో చదవాం..పెద్దలు చెప్పగా విన్నాం..ఇప్పుడు కేసిఆర్‌ దండు కళ్లారా చూడండి. గులాబీ దండు గురించి రేపటి తరానికి చెప్పండి. భవిష్యత్తులో రామ దండు గురించేకాదు, గులాబీ దండు గురించి కూడా చెప్పుకుంటారు. వరంగల్‌లో జరిగే బిఆర్‌ఎస్‌ వజ్రోత్సవ సభను చూస్తే కాంగ్రెస్‌ పార్టీకి, బిజేపికి ముచ్చెటమటలు పట్టాలి. ఉక్కపోతలు పోయాయి. కంటిమీద కునుకు కూడా లేకుండా చేయాలి. అదే మా లక్ష్యం. అదే బిఆర్‌ఎస్‌ పార్టీ సభతో మా రజతోత్సవం. మళ్లీ తెలంగాణలో గులాబీ జయకేతనం కోసం తొలి అడుగుకు శ్రీకారం. బిఆర్‌ఎస్‌ పార్టీ 25 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భం. బిఆర్‌ఎస్‌ రజతోత్సవం అంటే పార్టీ పండుగ మాత్రమే కాదు. తెలంగాణ జన జాతర. ఉద్యమ కాలంలో ఎలా అయితే ప్రజలు బిఆర్‌ఎస్‌కు సభలకు బ్రహ్మరధం పట్టేవారో..ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజల్లో, బిఆర్‌ఎస్‌ అభిమానుల్లో అదే జోష్‌ కనిపిస్తోంది. అదే ఊపుతో తెలంగాణ మొత్తం వరంగల్‌ వైపు కదులుతోంది. ముఖ్యంగా తెలంగాణ రైతాంగం ఎడ్ల బండ్ల నిండా గులాబీ జెండాలు ఎగరేసుకుంటూ, రెపరెపలాడుతున్న జెండాలతో కొన్ని వేల బండ్లు వరంగల్‌ వైపు జతన్నాధ రధచక్రాలు కదులుతున్నట్లు దూసుకువస్తున్నాయి. తెలంగాణ చైతన్యాన్ని మేలు కొలుపేలా కేసిఆర్‌ రధ చక్రాలుగా రైతులు పరుగులందుకుంటూ వస్తున్నారు. కేసిఆర్‌కు జేజేలు కొట్టుకుంటూ వస్తున్నారు. ఇదీ బిఆర్‌ఎస్‌ అంటే. అదే కేసిఆర్‌ తెలంగాణ ప్రజల్లో చైతన్యమంటే..అదే తెలంగాణ ప్రజలకు కేసిఆర్‌ అందించిన చైతన్యమంటే అంటున్న ఉద్యమ కారుడు, సీనియర్‌ బిఆర్‌ఎస్‌ నాయకుడు, బిఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్‌రావు, నేటి దాత్రి ఎటిటర్‌ కట్టా రాఘవేంద్రరావుతో చెప్పిన రజత్సోవసభ విశేషాలు ఆయన మాటల్లోనే.
..ఉద్యమ కాలంలో ఉరకల్తెని పార్టీ బిఆర్‌ఎస్‌. ఇప్పటికీ బిఆర్‌ఎస్‌ అంటే తెలంగాణలో ప్రజలకు ఒక ఆర్తి. కేసిఆర్‌ అంటేనే ఒక నమ్మకం. ఒక వ ఇశ్వాసం. ప్రజల మేలు కోరే ఏకైక నాయకుడుగా గుర్తింపు వుంది. అయినా తెలంగాణ రాజకీయాల్లో కేసిఆర్‌ను మించిన నాయకుడు లేడు. తెలంగాణ కోసం కొట్లాడిన నాయకుడు కేసిఆర్‌. తెలంగాణ సాదన కోసం బిఆర్‌ఎస్‌ పార్టీ పెట్టిన నాయకుడు కేసిఆర్‌. తన రాజకీయ జీవితాన్ని ఫణంగా పెట్టిన నాయకుడు కేసిఆర్‌. తెలంగాణ వస్తుందో..రాదో తెలియని సమయంలో పిడికిలెత్తి జై తెలంగాణ అని గర్జించిన నాయకుడు కేసిఆర్‌. బిఆర్‌ఎస్‌ పార్టీ పెట్టినా జై తెలంగాణ అంటూ ఎవరు వస్తారో..రారో తెలియని అమోమయ పరిసి ్దతుల్లో బిఆర్‌ఎస్‌ జెండా ఎగరేసిన నాయకుడు కేసిఆర్‌. తర్వాత కొన్ని లక్షల మంది కేసిఆర్‌ను తయారు చేసి, మూడున్నర కోట్ల మంది తెలంగాణ ప్రజల చేత జై తెలంగాణ అని నినదింపజేసిన నాయకుడు కేసిఆర్‌. ఎంత కొట్లాడినా తెలంగాణ రాకపోతే విఫలనాయకుడిగా మిగలడం కన్నా, తెలంగాణ తెచ్చిన నాయకుడుగానే చరిత్రలో నిలవాలన్న సంకల్పంతో అడుగులేసిన ఏకైక నాయకుడు కేసిఆర్‌. తన చావుతోనైనా తెలంగాణ వస్తుందంటే చావు నోట్లో తలపెట్టేందుకు కూడా ఏ మాత్రం ఆలోచించని గొప్ప నాయకుడు కేసిఆర్‌. కేసిఆర్‌ చచ్చుడో..తెలంగాణ వచ్చుడో అని కఠినమైన నిర్ణయం తీసుకొని ఆమరణ దీక్ష చేపట్టిన నాయకుడు కేసిఆర్‌. తెలంగాణ సమాజమంతా వద్దని వారించినా, తెలంగాణ తేకపోతే నా ఉద్యమం వృధా..నేను తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకోలేని నాయకుడుగా బతకలేనని నిర్ణయం తీసుకున్న నాయకుడు కేసిఆర్‌. బహుషా ప్రపంచ చరిత్రలోనే కేసిఆర్‌ లాంటి ఉద్యమ కారుడు మరొకరు లేకపోవచ్చు. ఉద్యమాలు చేసిన వాళ్లు ఎందురో వున్నారు. కాని ఫలితం ఆశించకుండా ఉద్యమాలు చేసిన వాళ్లున్నారు. కాని ఫలితమే తెలంగాణ అంతిమ లక్ష్యం కావాలని కొట్లాడిని ఏకైక నాయకుడు కేసిఆర్‌. అందుకే తెలంగాణ సాధించగలిగారు. అంతటి బలమైన సంకల్పాన్ని పూనారు. అంతిమంగా తెలంగాణ సాధించి తెలంగాణ ప్రజల చేతుల్లో పెట్టారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని రెపరెపలాడిరచారు. ఇలాంటి నాయకుడు నిన్నటి తెలంగాణ చరిత్రలో ఎవరూ లేరు. భవిష్యతు తెలంగాణకు అవసరం లేదు. ఎందుకంటే బంగారం లాంటి తెలంగాణను తయారు చేసి కేసిఆర్‌ ఎప్పుడో పెట్టారు. తెలంగాణ తేవడమే కాదు, తెచ్చినతెలంగాణను బంగారు తెలంగాణ చేసిన నాయకుడు కూడా కేసిఆర్‌. ఇలా రెండు రకాల విజయాలను తెలంగాణకు అందించిన గొప్ప పాలకుడు కేసిఆర్‌. ప్రపంచ రాజకీయ ముఖ చిత్రంలోనే కేసిఆర్‌ లాంటి నాయకుడు మరొకరు వుండరు. అందుకే తెలంగాణ అంటేనే కేసిఆర్‌..కేసిఆర్‌ అంటేనే తెలంగాణ..అలా అందమైన, అధ్భుతమైన, పాడి పంటలతో అలరాలుతూ, రైతులు రాజులుగా వర్ధిల్లుతున్న తెలంగాణను ఇప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆగం చేస్తోంది. కేసిఆర్‌ పదేళ్ల పాలనలో రైతులంతా సుఖ సంతోషాలతో వున్నారు. మూడేళ్లలోనే కాళేశ్వరం నిర్మాణం చేసి, తెలంగాణలో ప్రతి మూలన చివరి ఆయ కట్టు వరకు సాగు నీరిచ్చిన అపర భగీరధడు కేసిఆర్‌. తెలంగాణ తెచ్చిన ఆరు నెలల్లోనే మిషన్‌ కాకతీయ తెచ్చి, తెలంగాణలోని చెరువులన్నీటింటికీ పూర్వ వైభవం తెచ్చారు. చెరువులు బాగు చేయించారు. పూర్వం చెరువు ఎలా వుండేదో అలా తీర్చిదిద్దారు. రైతులే స్వయంగా పాలు పంచుకొని, బండ్లల్లో, ట్రాక్టర్లలో చెరువు మట్టి తీసుకెళ్లి, పొలాల్లో చల్లుకున్నారు. నిండిన చెరువు నుంచి ఊటలు మళ్లి, బావులు నిండడంతో సాగును పండుగ చేసుకున్నారు. ఇరవై నాలుగు గంటల కరంటు ఇచ్చి రైతు కష్టం తీర్చాడు. అర్ధరాత్రి, అపరాత్రి ఇచ్చిన కరంటు మూలంగా ఏ ఒక్క రైతు చనిపోకుండా చూసుకున్నారు. ఇరవైనాలుగు గంటల నాణ్యమైన విద్యుత్‌ అందించడంతో రైతు తన వెసులుబాటును చూసుకొని, అవసరమైన మేరకు పొలానికి నీరు పెట్టుకున్నారు. పదేళ్లు బంగారు పంటలు పండిరచుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీ వస్తూ వస్తూనే రైతుకు కష్టం తెచ్చింది. రైతుల కళ్లలో కన్నీరు నింపింది. కాంగ్రెస్‌ కృత్రిమకరువును తెచ్చి రైతను అరిగోస పెడుతోంది. భూగర్భంలో చుక్క నీరు లేకుండా చేయడంతో ఆవిరైతున్న నీళ్లు రైతుకు అందక కన్నీళ్లు పెట్టుకుంటున్నాయి. తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చిన కాంగ్రెస్‌ ప్రభత్వంపై ఆవిరైతున్న నీళ్లే కన్నెర్ర చేస్తున్నాయి. తెలంగాణలో అడుగుంటున్న భూగర్భజలాలు కాంగ్రెస్‌ పాలకుల మీద ఆక్రోషం వెల్లగక్కుతున్నాయి. ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌..ఒక్క ఛాన్స్‌ ప్లీజ్‌ అంటూ తెలంగాణ ప్రజలను వేడుకుంటే కనికరించి, గెలిపించినందుకు తెలంగాణ తల్లి ఒడిలో చుక్క నీరులేకుండా చేస్తున్నారు. మళ్లీ ఒట్టిపోతున్న వాగులు, వంకలు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి శాపాలు పెడుతున్నాయి. ఎడారిగా మారిన పొలాల బీళ్లు నోరు తెరిచి, కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్వాకాన్ని చూసి నోళ్లు తెరిచి తిడుతున్నాయి. అందుకే కళ్లు మండుతున్న రైతు బిఆర్‌ఎస్‌ రజతోత్సవసభలో ప్రభుత్వంపై సభ స్పూర్తి, సాక్షిగా, మళ్లీ కేసిఆర్‌ పాలన కోసం కంకణం కట్టుకున్నామని చెప్పేందుకు తరలివస్తున్నారు. జై తెలంగాణ నినాదాలు చేసుకుంటూ దండు కట్టి వస్తున్నారు. అలా వస్తున్న రైతులను చూస్తే జనం గుండెల నిండా గులాభీ వనం విరబూసినట్లు కనిపిస్తోంది. కనువిందు చేస్తోంది. బిఆర్‌ఎస్‌ శ్రేణులో సంబురం నింపుతోంది. ఎప్పుడెప్పుడు బిఆర్‌ఎస్‌ రజతోత్సవ సభ అని ఎదరుచూసి, అందరూ బయలుదేరుతున్నారు. ఇప్పటికే దూరపు జిల్లాల నుంచి లక్షల మంది రైతులు మూడు రోజుల ముందే భయలుదేరి వస్తున్నారు. మిగతా రైతులు బయలుదేరుతున్నారు. లక్షలాది మంది ప్రజలు వరంగల్‌ నగరానికి చేరుకుంటున్నారు. ఎందుకంటే కేసిఆర్‌ అంటేనే తెలంగాణ జీవం. కేసిఆర్‌ మాటలే తెలంగాణకు వేదం. రజతోత్సవ సభకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించాలని చూశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసిన ఆ కుట్రలన్నీంటినీ తిప్పి కొట్టి సభ ఏర్పాటు చేసుకుంటున్నాం. బిఆర్‌ఎస్‌ పార్టీ రజత్సోవం అంటే తరతరాలు గర్వంగా చెప్పుకునేలా నిర్వహిస్తాం.. వచ్చే ఎన్నికల్లో కేసిఆర్‌ నాయకత్వానా గులాబీజెండాను ఎగరేస్తాం..బిఆర్‌ఎస్‌కు ఎదురులేదు..కేసిఆర్‌ నాయకత్వానికి తిరుగులేదని ఎలుగెత్తి చాటుతాం…కేసిఆర్‌ కీర్తి ప్రపంచం చెప్పుకునేలా నడుచుకుంటాం.

ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం

ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం

కరీంనగర్, నేటిధాత్రి:

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ సీపీఐ కరీంనగర్ జిల్లా సమితి ఆధ్వర్యంలో కమాన్ చౌరస్తా వద్ద ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఉగ్రవాదుల దుర్మార్గపు చర్యల వల్ల అమాయక ప్రజలు, పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని, ఉగ్రవాదులను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందినదని సీపీఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి ఆరోపించారు. ఈకార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొయ్యడ సృజన్ కుమార్, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, టేకుమ్మ సమ్మయ్య, జిల్లా కౌన్సిల్ సభ్యులు పైడిపల్లి రాజు, కిన్నెర మల్లవ్వ, పిట్టల సమ్మయ్య, బీర్ల పద్మ, కటికరెడ్డి బుచ్చన్న యాదవ్, బ్రామండ్లపెల్లి యుగేందర్, బోనగిరి మహేందర్, నలువాల సదానందం, సాయవేణి రాయమల్లు తదితరులు పాల్గొన్నారు.

ఈనెల 27న జరిగే బిఆర్ఎస్ సభకు చీమల దండువలే

ఈనెల 27న జరిగే బిఆర్ఎస్ సభకు చీమల దండువలే తరలి వెళ్దాం-భూక్య తిరుపతి నాయక్

కరీంనగర్, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా చింతకుంట గ్రామ ముఖ్య కార్యకర్తల సమావేశం గ్రామశాఖ అధ్యక్షులు పైడిపాల సతీష్ అధ్యక్షతన జరిగింది. ఈసమావేశానికి హాజరైన కొత్తపెళ్లి మాజీ వైస్ ఎంపీపీ భూక్యా తిరుపతి నాయక్ మాట్లాడుతూ ప్రపంచంలోనే కనీవిని ఎరుగని రీతిలో మొట్టమొదటిసారి పన్నెండు లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్న పార్టీ బిఆర్ఎస్ పార్టీ అని ఈసభ చరిత్రలో నిలిచిపోతుందని ఈసభకు చింతకుంట గ్రామం నుండి చీమల దండులా తరలిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల గుండె ధైర్యమే కేసీఆర్‌. ఆయన నాయకత్వమే శ్రీరామరక్ష. ఇది ప్రజల్లో ఉన్న భావన. తెలంగాణ భవిష్యత్తును ఉజ్వలంగా మార్చాలనేది కేసీఆర్‌ సంకల్పం. ఈదిశగా వరంగల్‌ సభా వేదిక నుంచి ప్రజలకు విశ్వాసం కల్పిస్తారు కెసిఆర్. ఇరవై ఐదువ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న గులాబీ జెండా మరో యాభై ఏళ్ల పాటు కూడా తెలంగాణ ప్రజలకు అండగా ఉంటుంది. వచ్చే రెండు, మూడు దశాబ్దాల పాటు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలే ఉంటాయి. మన గళం, బలం, దళం, గులాబీ దండు. ఈదండులో చింతకుంట గ్రామం నుండి చీమల దండులా కదలి రావాలని విజ్ఞప్తి చేశారు. ఈకార్యక్రమంలో యువజన విభాగం మండల అధ్యక్షులు గుర్రాల జయప్రకాశ్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రేణిగుంట రాజు, మైనార్టీ విభాగo అధ్యక్షులు సయ్యద్ చాంద్ పాషా, బిఆర్ఎస్ నాయకులు కర్ణకంటి స్వప్న, గుబిరె సుజాత, వరలక్ష్మి, బిఆర్ఎస్ నాయకులు చిట్టిపల్లి నరేందర్, బెజ్జంకి సంపత్, భానతూ శ్రీకాంత్, మహేష్ గౌడ్, కమల్ గౌడ్, మణిదీప్, మల్లేశం, రవి, భాస్కర్ నాయక్, అమృత్, శంకర్, శశిధర్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం

ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం

#ఆర్టీసీ సంస్థ మనందరిదీ దానిని కాపాడుకునే బాధ్యత ప్రయాణికులదే.

# నర్సంపేట డిఎం ప్రసన్న లక్ష్మి

నల్లబెల్లి , నేటి ధాత్రి:

 

తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ (టీజిఎస్ ఆర్టిసి ) ఆర్టీసీ బస్సు లో ప్రయాణం అన్ని రకాల భద్రతతో పాటు సురక్షితమని నర్సంపేట డిపో మేనేజర్ ప్రసన్నలక్ష్మి పేర్కొన్నరు
శుక్రవారం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండు పరిసరాలను ఆమె పరిశీలించారు. బస్టాండ్ లో గల సౌకర్యాలపై ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు..
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. ఇటీవల డైల్ యువర్ డిఎం కార్యక్రమా ద్వారా ప్రయాణికుల సూచనలను సలహాలను స్వీకరించి వారి కోరిక మేరకు అదనపు బస్సు ట్రిప్పులను ఆయా ప్రాంతాలకు ప్రయాణికుల సౌకర్యార్థం నిమిత్తం పెంచడం జరిగిందన్నారు.
ఆర్టీసీ మన సంస్థ దానిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అన్నారు. ప్రైవేట్ వాహనాల ప్రయాణం వద్దు మన ఆర్టీసీ బస్సులో ప్రయాణం ముద్దు అని ప్రయాణికులకు తెలియజేశారు.
సమయపాల పాటించి ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆమె సిబ్బందిని ఆదేశించారు
ఈ కార్యక్రమంలో సిబ్బంది ప్రయాణికులు. స్థానికులు. తదితరులు పాల్గొన్నారు..

మృతురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం.!

మృతురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన మాజీ కౌన్సిలర్ బండారు కృష్ణ
వనపర్తి నేటిదాత్రి

 

వనపర్తి పట్టణంలో 15వ వార్డులో భాస్కర్ సతీమణి శ్రీమతి శారద ఇటీవల మృతి చెందారు .ఈ విషయం తెలియడంతో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ బండారు కృష్ణ మృతురాల కుటుంబానికి 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేశారు బండారు కృష్ణ వెంట మున్నూరు సురేందర్ అభిషేక్ డాక్టర్ దానియల్ వినయ్ కుమార్ మహేష్ భరత్ కుమార్ ఇంతియాజ్ మృతురాలి కుటుంబానికి సంతాపం తెలిపారు

కారులో వార్… ఉద్యమకారులను పట్టించు కోని

కారులో వార్… ఉద్యమకారులను పట్టించు కోని గండ్రరమణారెడ్డి వర్గం

జెండా ఎజెండా కింద పని చేస్తాం

బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం

శాయంపేట నేటిధాత్రి:

 

హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కేంద్రంలో టిఆర్ఎస్ కార్యకర్తల మధ్య ప్రచన్నయుద్ధం జరుగుతుంది. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవన్నట్లు ఇద్దరు పెద్ద నాయకుల కార్యకర్తల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. రమణారెడ్డి వర్గం టిఆర్ఎస్ పార్టీ మండలంలో మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు మధుసూదనాచారి వర్గాన్ని పిలువక పోవడంతో చారి కార్యకర్తలకు ఆగ్రహం వ్యక్తం చేశారు ఉద్యమనేత చారి గండ్ర వెంకటరమణారెడ్డి కార్యకర్తలు ఇరు వర్గాల మధ్య వాగ్దిత్వానికి దిగడం ఇందుకు నిదర్శనం. మొదటగా మేము కెసిఆర్, మధుసూదనా చారి టిఆర్ఎస్ జెండా పట్టుకుని ఉద్యమంలో తిరగడం జరిగింది. మేము బతికున్నంత కాలం కేసీఆర్ , మధుసూదనా చారి ఎజెండా కిందనే పనిచేస్తా మని అన్నారు.మా పార్టీలోకి వలసగా వచ్చిన బీఆర్ఎస్ లీడర్లు మా ఉద్యమ కారులను పట్టించుకోకపోవడం దీనిపై అధిష్టానాన్ని తెలియ పరచడం కోసం సిద్ధంగా ఉన్నామని అన్నారు. గతంలో చేసిన పనులకు బిల్లులు రాక నానా అవస్థలు పడుతుండడం జరుగుతుంది. ముఖ్యంగా మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీకి కమిటీలు, యూత్ కమిటీలు నిర్వహించి న కూడా ప్రాధాన్యత కల్పించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం

 

BRS

ఈనెల 27 బీఆర్ఎస్ రజ తోత్సవ సభను విజయవంతం చేద్దామని అన్నారు. ప్రతి గ్రామం నుండి బీఆర్ఎస్ కార్యకర్తలు,ప్రజలు లక్షలాదిగా తరలివెళ్లి విజయవంతం కోసం మండల ఉద్యమ నాయకులు అందరూ కంకణం కట్టుకున్నా రు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కన్వీనర్ పొడిశెట్టిగణేష్, మండల అధ్యక్షుడు ఇమ్మిడిశెట్టి రవీందర్,సీనియర్ ఉద్యమ కారుల నాయకులు బలిజే నరసింహారావులు,వికలాం గుల రాష్ట్ర నాయకులు గజ్జి శంకర్ ,మాజీ యూత్ మండల అధ్యక్షులు నాగరాజు, బెరుగు తరుణ్ గోపి, కొత్తగట్టు సాయి, ముంజలా నాగరాజు,గాదె రాజేందర్,రాజు మహ్మద్, సదానందం తదితరులు పాల్గొన్నారు.

అమరుల సంస్మరణ సభను జయప్రదం చేయాలి.!

అమరుల సంస్మరణ సభను జయప్రదం చేయాలి: సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి
ప్రజా సమస్యలపై ఉదృత పోరాటాలు చేయాలి
నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి :

ఈనెల 30న గట్టుప్పల మండల కేంద్రంలోని ఎస్విఎల్ ఫంక్షన్ హాల్ లో జరిగే అమరుల సంస్మరణ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి అన్నారు. శుక్రవారం గట్టుప్పల మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజా సమస్యలపై ఉదృత పోరాటాలు చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పాలకులు మారిన ప్రజా సమస్యలు మాత్రం “ఎక్కడ వేసిన గొంగడి అక్కడే “అన్న చందంగా మారిందని పాలక ప్రభుత్వాలను ఆయన విమర్శించారు. మూడోసారి అధికారంలోకి వచ్చిన బిజెపి నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ కార్పోరేట్ శక్తులకు అనుకూలంగా పనిచేస్తుందని ఆయన విమర్శించారు. జిల్లాలో పలుచోట్ల భూ సమస్యలు ఉన్నాయని గత పది సంవత్సరాలుగా ఏ ఒక్కరికి కూడా ఇంటి స్థలాలు ఇవ్వలేదు అని, ఇంటి స్థలాల కోసం ప్రజలు ఆందోళనలు చేస్తున్న ప్రభుత్వ మాత్రం ఇప్పటివరకు పరిష్కరించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దున్నే వాడికి భూమి కావాలని, వెట్టి చాకిరి విముక్తి కోసం ఎర్రజెండాలను ఎత్తుకొని వేలాదిమంది కమ్యూనిస్టు కార్యకర్తలు తమ ప్రాణాలర్పించారని ఆయన అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వాన్ని పునికి పుచ్చుకున్న మునుగోడు ప్రాంత సిపిఎం నాయకులు కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో ప్రజా ఉద్యమాలలో అగ్ర బాగాన ఉండి అమరులైనారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు జరపాలని ప్రజలకు నష్టం కలిగించే విధానాలను ఎండగడుతూ అమరవీరుల ఆశయాల కోసం సమరశీల పోరాటాలు నిర్వహించాలని ఆయన అన్నారు. మే 20 జరిగే దేశవ్యాప్త సమ్మెను కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని అయన పిలుపునిచ్చారు ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వకుండా అనర్హులను ఎంపిక చేస్తున్నారని, రాజకీయ జోక్యం లేకుండా నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లుఇవ్వాలని లేనియెడల సిపిఎం ఆధ్వర్యంలో ఆందోళనలు పోరాటాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు. .సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం మాట్లాడుతూ, అమరవీరుల ఆశయ సాధన కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఆయన అన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న44 కార్మిక చట్టాలను రద్దుచేసి నాలుగు లేబర్ కోడ్ లు గా మార్చి కార్మిక హక్కులను కాలరాస్తుందని ఆయన విమర్శించారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేను వాడ వాడలా ఘనంగా నిర్వహించాలని ఆయన అన్నారు. 77 ఏండ్ల స్వతంత్ర భారతంలో కార్మికుల రెక్కల కష్టంతో నిర్మించుకున్న ప్రభుత్వ రంగ సంస్థలను స్వదేశీ, విదేశీ కార్పొరేట్ శక్తులకు దారా దత్తం చేస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండ శ్రీశైలం, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి కట్ట నరసింహ, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కర్నాటి మల్లేశం, చాపల మారయ్య, మండల నాయకులు బొట్టు శివకుమార్, కర్నాటి సుధాకర్, కర్నాటి వెంకటేశం, ఖమ్మం రాములు, టేకుమెట్ల కృష్ణ, రావుల నరసింహ, అచ్చిన శ్రీనివాస్, వల్లూరి శ్రీశైలం, పెదగానినరసింహ తదితరులు పాల్గొన్నారు.

పహల్గాంలో ముష్కరుల దాడిని ఖండించిన ముస్లిం

పహల్గాంలో ముష్కరుల దాడిని ఖండించిన ముస్లిం మైనార్టీలు
జమ్మికుంట మండల ముస్లిం మైనారిటీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
జమ్మికుంట :నేటిధాత్రి

 

జమ్మికుంట పట్టణంలో ముస్లిం మైనారిటీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో జమ్మూ కాశ్మీర్ అన్నం తిన్నావా లోని వైశారణ్ లోయలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన పైశాచిక మరణకాణం ఖండిస్తూ నిరసన ర్యాలీ కార్యక్రమం చేశారు
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ ఉగ్రవాదానికి మతోన్మాదమే తప్ప మతాలతో సంబంధం ఉండదని అలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పడానికి ప్రతి ఒక్క భారతీయుడు సిద్ధంగా ఉన్నాడని పేర్కొంటూ విభిన్న మత సంస్కృతులకు నిలయం మన దేశానికే గర్వకారణమైన జమ్ము కాశ్మీర్లో గతంలో ఉన్న విపత్కర పరిస్థితులను ఎదురుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370 ని రద్దు పరుస్తూ జమ్మూ కాశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన నేపథ్యంలో ఉగ్రవాద మూలాలు లేని జమ్మూ కాశ్మీర్లో ప్రజలు పర్యటన పర్యటన సురక్షితంగా ఉన్నారు అని యావత్ దేశం సంతోషించే ఈ తరుణంలో గతంలో పుల్వామా ఘటన కంటే దారుణమైన రీతిలో పహాల్గాం ఘటన జరగడం చాలా బాధాకరమని అన్నారు ఈ కార్యక్రమంలో జమ్మికుంట మండలం ముస్లిం ఐక్యవేదిక నాయకులు మౌలానా నజీర్, జాకీర్, షేక్ సాబీర్ అలీ, డాక్టర్ ఫిరోజ్, సర్వర్ పాషా ఫయాజ్,ఖాదర్ సుఫియాన్,సల్మాన్, సబ్జాద్,సాదిక్, అమీర్ షేక్, అప్రోజ్, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version