తుప్పాశి గాడి తోలు మందం… జఫ్ఫా జోకర్‌ బ్రహ్మీ గాని కావురం!?

దయాకర్‌ రావు తెలంగాణ రాజకీయాల్లో టాల్‌ పర్సనాలిటీ.

దయాకర్‌ రావు లాంటి నాయకుడు కమెడియన్‌ ను పలకరించడమే ఎక్కువ?

`కడుపులో కత్తులు… నటనలో నక్కలు!

`రంగు మొఖాలు… బలుపు వేషాలు?

`తెలంగాణ అంటేనే చిన్న చూపు!

`తెలంగాణపై ఇంకా విషం చిమ్ముతూనే ఉంటారు.

`కడుపులో వున్న కసరు కక్కుతూనే వుంటారు.

`బ్రహ్మానందం బలుపు చూశాం!

`అలాంటి నాయకుడంటే కమేడియన్‌ కు అంత చులకనా?

`మర్యాద లేని మూర్కులను దయాకర్‌ రావు పలకరించడమే తప్పు.

`తుప్పాషి వెదవను పిలచి పలచన కావడం అవసరమా?

`ఆడొక జఫ్ఫా అని తెలిసి వాడితో దయాకర్‌ రావు కు ఫోటో కావాలా?

`పదిమంది ముందు బ్రహ్మాండం గా తన బుద్ధి చూపించుకున్నాడు.

`తన వెకిలి గుణం చూపించుకున్నాడు.

`ఒక వేళ ‘‘బీఆర్‌ఎస్‌’’ అధికారంలో ఉంటే అదే దయాకర్‌ రావు ఎక్కడుంటే అక్కడకు బ్రహ్మానందం వెళ్లి వంగి వంగి దండం పెట్టేవాడు.

`నీతి మాలిన బ్రహ్మానందం మీద ఇప్పటికే అనేక ఆరోపణలు వున్నాయి.

`తెలంగాణ కామెడియన్లను తొక్కేశాడంటారు.

`సినిమా వాళ్ళను నెత్తిన పెట్టుకున్నదే ‘‘కేసీఆర్‌’’.

`ఎవరిని ఎక్కడుంచాలో ‘‘రేవంత్‌ రెడ్డి’’ అక్కడ ఉంచుతున్నారు.

`అందుకే కాంగ్రెస్‌ నాయకులంటే సినిమా వాళ్ళు భయపడుతున్నారు.

`కేసీఆర్‌ ఇచ్చిన అలుసుతో దయాకర్‌ రావు లాంటి వారిని కామెడియన్‌ కూడా లెక్క చేయకుండా పోతున్నారు

 

సుండిగాడి బుద్ది చూపుల్లోనే తెలుస్తుందని ఓ సామెత. పాండిత్యం తెలిసినంత మాత్రాన పండితులు కాలేరని మరోసారి రుజువైంది. పద్యాలు నేర్చుకున్నంత మాత్రాన బుద్ది పెరగదని తేలిపోయింది. పెద్దవాళ్లు తినే ఆహరం పేదవాడి ఆకలి చూపులతో ఎప్పుడో ఎంగిలిపడిరదన్న మాటలు చెప్పిన్పుడు ఎంత సామాజిక సృహ వుందో అనుకుంటే పొరపాటు. ఎంత ఎదిగినా తమ కురస బుద్దిని చూపించుకునే వారు చాలా మంది మన సమాజంలో వుంటారు. కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెడితే ఎలా వుంటుందో ఎనుకటికి వెమన ఎప్పుడో ఇలాంటి వారి గురించి చెప్పారు. ఇంతకీ ఎవరనుకుంటున్నారా? పేరులో ఆనందం తగిలించుకొని అపర బ్రహ్మగా తనను తాను ఊహించుకునే పిచ్చి, తిక్క వేషాల పాతచింతకాయ పచ్చడి జోకర్‌ బ్రహ్మానందం. నమస్కారానికి ప్రతి నమస్కారం తెలియని సినీ సన్నాసులు చాలా మంది వుంటారు. అందులో అందె వేసిన చెయిలాంటి జోకర్‌ బ్రహ్మానందం అని మరోసారి చూపించారు. ఎంతో ఆప్యాయతగా తెలంగాణకు చెందిన సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి, పేదల పెన్నిది, అందరి చేత దయన్నా అని పిలిపించుకునే ఎర్రబెల్లి దయాకర్‌ రావును ఏహే..పో…అంటూ చీర్కరించుకున్నంత పనిచేసిన బ్రహ్మానందాన్ని తెలంగాణ సమాజం మొత్తం ఇప్పుడు చీ కొడుతుంది. ఎందుకంటే తెలంగాణలో వున్న పెద్ద నాయకుల్లో ఆయన ఒకరు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఆయనకు ఓ గౌరవం వుంది. తెలుగు ప్రజల్లో ప్రత్యేకమైన అభిమానం దయాకర్‌ రావుకు వుంది. అలాంటి వ్యక్తి ఎదురుపడి ఎంతో హుందాగా పలకరిస్తుంటే, చేతిని వదిలించుకుంటూ వెళ్లడం పరిహాసం కాదా? అహంబావంకాదా? అహం తలకెక్కడం కాదా? అలాంటి వెకిలి బ్రహ్మానందం నటించిన సినిమాలను తెలంగాణ సమాజం బహిష్కరిస్తే తెలుస్తుంది. అంత పెద్ద నాయకుడు పది మందిలో పలకరిస్తే, కెమెరాలు వున్నాయన్న ఇంగితం కూడా బ్రహ్మానందంకు లేకుండాపోయింది. సినిమాల్లో చెప్పినట్లు దాన్నే బలుపంటారు. నడిమంత్రపు సిరి అని కూడా అంటారు. పది మందిలో సినీ పెద్దలు అనేక సార్లు బ్రహ్మానందంను ఎంత నీచంగా మాట్లాడారో తెలియందికాదు? సినీ వజ్రోత్సవాల సమయంలో బ్రహ్మానందం ఓ సందర్భంలో కోతిలాగా పళ్లు ఇకిలించి తన షూటింగ్‌ చూస్తుంటే పక్కకు వెళ్లమని తిట్టానని చిరంజీవి లాంటి వారు అన్నప్పుడు గొప్పగా అనిపించింది. ఎందుకంటే ఆత్మాభిమానం అనేది లేని వాడికి అలాగే వుంటుంది. తెలంగాణకు చెందిన వారు అలాంటి మాటలు ఎవరైనా అంటే అక్కడే స్పందించేవారు. అదే విషయాన్ని ఆ తర్వాత పదే పదే చిరంజీవి అనేక సార్లు అనేక సభల్లోనూ చెప్పుకొచ్చారు. అయినా సిగ్గనిపించని తనం బ్రహ్మానందానిది. అలా అనిపించుకోవడం బ్రహ్మానందంకు సరదాగా వుంటే ఎవరికీ అవసరం లేదు. కాని తెలంగాణకు చెందిన నాయకుడి విషయంలో తన నక్క గుణం చూపించిన బ్రహ్మానందాన్ని తెలంగాన సమాజం క్షమించదు. కాళ్లు మొక్కి పైకొచ్చే వాడికి ఆత్మగౌవం ఏముంటుంది? అని కూడా సినీ పరిశ్రమలో బ్రహానందం గురించి పరి పరి విధాలుగా చెప్పుకుంటారు. ఓ ఇంటర్వూలో తన తోటి నటులైన కొంత మంది మీడియా సాక్షిగా చెప్పిన మాటలు అనేకం వున్నాయి. తనికెళ్ల భరణి ఓ సందర్భంలో బ్రహ్మానందం అతి తెలివిని గురించి ఓ పద్యం రాశారిని కూడా అంటుంటారు. అది తెలంగాణకు చెందిన మాజీ మంత్రి, సీనియర్‌ నటుడు బాబూ మోహన్‌ పలు సందర్భాలలో బ్రహ్మానందం గురించి ప్రస్తావించారు. ఓ పెద్ద చానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో బాబూ మోహన్‌ గురించి చెబుతూ అది కనిపించని కత్తి అని అన్నారు. ఎప్పుడు గుచ్చుకుంటుందో కూడా తెలియకుండా వుంటుంది. అంటూ బ్రహ్మానందం గురించి చెప్పారంటే వ్యక్తిత్వం ఎంత చెడ్డదో అర్దం చేసుకోవుచ్చు. అందుకే తనికెళ్ల భరణి ఎక్కడ చెక్కాలో..ఎక్కడ నొక్కాలో బ్రహ్మానందంకు బాగా తెలుసని కవిత రాశాడట. ఇలా చెప్పుకుంటూ పోతే బ్రహ్మానందం వెకిలి మనసత్త్వం ఎంత బుద్దిహీనమైందో అర్ధం చేసుకోవచ్చు. పైగా సభలలో బ్రహ్మానందం తన అతి తెలివిని ప్రదర్శిస్తుంటారు. తెలుగు సినీమా కొన్నేళ్లుగా అనేక సినిమాల్లో హరోలకు అమ్మగా నటించిన అన్నపూర్ణమ్మ అంటే సగటు తెలుగు ప్రేక్షకుడికి కూడా ఎంతో కొంత గౌరవం వుంటుంది. అలాంటి అన్నపూర్ణమ్మ అమ్మగా చేసిన సినిమాల్లో కూడా బ్రహ్మానందం అమ్మా అంటూ సంబోదించే పాత్రలు చేశారు. కాని ఓ సభలో మాత్రం ఆమె మీద వేసిన జోక్‌కు అన్నపూర్ణమ్మ నొచ్చుకున్నారు. కానీ ఏం చేయలేరు. తెలంగాణకు చెందిన నటుడు, మిమిక్రీ కళాకారుడు శివారెడ్డి సనీ జీవితాన్ని ఎదగకుండా చేసిందే బ్రహ్మానందం అని అందరికీ తెలిసిందే. ఓ చానల్‌లోనే కాదు, అనేక యూటూబ్‌ చానల్స్‌లో కూడా ఈ విషయాన్ని పేరు చెప్పకుండా శివారెడ్డి తేల్చేశారు. అంటే తెలంగాణకు చెందిన కళకారులంటే బ్రహ్మానందంకు ఎంత చిన్న చూపో తేలిపోయింది. అంతే కాకుండా తాగుబోతు రమేశ్‌ అనే కరీంనగర్‌కు చెందిన నటుడు గురించి ఓ సందర్భంలో దర్శకుడు కృష్ణ వంశీ చెబితే..ఆహా..అంటూ దీర్ఘం తీసి తర్వాత ఎదగకుండా చేశారని చెప్పిన సందర్బాలున్నాయి. అంతేందుకు బాబూ మోహన్‌ వుంటే తాము సినిమాలో నటించమని కూడా బ్రహ్మానందం కొంత మంది దర్శకులకు చెప్పినట్లు స్వయంగా బాబూమోహనే చెప్పారు. ఇలా ఆంద్రాకు చెందిన కొంత మంది సినిమా నటులకు బలుప పెరగడానికి కారణం కేసిఆర్‌. అవును. ఈ విషయాన్ని చెప్పకతే తప్పవుతుంది. ఆంద్రా వాళ్ల కాలికి ముళ్లు దిగితే తన పంటితో తీస్తానని చెప్పి, వారికి ప్రాదాన్యత కల్పించడం వల్లనే పరిస్దితి ఇలా వుంది. పదేళ్ల తెలంగాణలో కేసిఆర్‌ ప్రభుత్వం వున్నప్పటికీ పిల్మ్‌ డెవలప్‌ మెంటు కార్పోరేషన్‌ కార్యాలయలో తెలంగాణకు చెందిన నటులు, దర్శకుల ఫోటోలు కూడా ఇప్పటికీ పెట్టలేదు. ఆ విషయాన్ని ఆ మధ్య తెలంగాణ ఉద్యమ కారుడు పాశం యాదగిరి వెళ్లికార్యాలయంలో రచ్చ రచ్చ చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా పిల్మ్‌ డెవలప్‌ మెంట్‌ కార్పోరేషన్‌లో ఆంద్రా వాళ్ల ఫోటోలు ఎందుకున్నాయి? ఆ కార్యాలయంలో ఆంద్రాకు చెందిన వాళ్లే ఎందుకు పెత్తనం చేస్తున్నారు? ప్రపంచం తెలుగు మహాసభలు ఏర్పాటు చేసి, ఆంద్రాకు చెందిన బ్రహ్మానందం లాంటి చిల్లర నటులను వేదిక మీద కూర్చుండబెట్టారు. తెలంగాణకు అంతకన్నా అవమానం ఏమైనా వుంటుందా? అందుకే అలాంటి చిల్లర నటులకు తెలంగాణ అంటే చిన్న చూపు. కేసిఆర్‌ కూడా పదే పదే ఆంద్రాకు చెందిన సినీ పెద్దలుగా చెలామణి అయ్యే గద్దలకు గౌరవం ఇస్తూ వచ్చారు. రామానాయుడు చనిపోతే అధికార అంత్యక్రియలు. నాగేశ్వరరావు చనిపోతే అధికారిక అంత్య క్రియలు. నటుడు కృష్ణ చనిపోతే, కృష్ణం రాజు చనిపోతే అదికారిక అంత్య క్రియలు. ఆఖరుకు కళా తపస్వి అని ముసుగేసుకొని సినిమాలు తీసిన సరసతపస్వి విశ్వనాద్‌ చనిపోతే కేసిఆర్‌ వెళ్లి నివాళులు అర్పించి వచ్చారు. దాంతో సినిమా వాళ్లకు తెలంగాణ చెందిన వాళ్లంటే ఇంకా చిన్న చూపు పెరిగింది. ఇప్పటికీ తమ ప్రాధాన్యతే పెరిగిందని అనుకుంటున్నారు. 2014 ఎన్నికల్లో కేసిఆర్‌ను తిట్టిన పవన్‌ కళ్యాన్‌ను పిలిపించుకొని కూర్చుండబెట్టుకుంటే ఎందుకు గౌరవిస్తారు? ఆఖరుకు ఆగష్టు 15 నాడు గవర్నర్‌ ఇచ్చే ఎట్‌ హోం కార్యాక్రమానికి పవన్‌ కాళ్యాన్‌ను ఆహ్వానించి అప్పటి గవర్నర్‌ ఆరడుగుల బుల్లెట్టు అని పొడుగుతుంటే కేసిఆర్‌ ముసి ముసి నవ్వులు నవ్విన సందర్భం వుంది. సినిమా వాళ్లు అడిగిన గొంతెమ్మ కోరికలు తీర్చుతూ వచ్చాడు. కాని అసలైన తెలంగాణ ఆత్మాభిమానాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి చూపిస్తున్నారు. తెలంగాణ గడ్డ ఆత్మాభిమానాన్ని చాటుతున్నారు. తెలంగాణలో సినిమా వాళ్లు పిచ్చి వేషాలు వేస్తే తోలు తీసినంత పని చేస్తున్నారు. అలా కేసిఆర్‌ లేకనే ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు లాంటి వారికి అవమానం జరిగింది. అదే దయకర్‌రావు మంత్రిగా వుంటే వచ్చి, వంగి వంగి దండాలు పెట్టకపోయేవాడా బ్రహ్మానందం. అయినా అలాంటి చిల్లరగాడితో ఫోటో కోరుకోవడం కూడాతప్పే. బ్రహ్మానందం నటించిన ఓ సినిమాలో బ్రహ్మానందం పాత్రనునుద్ధేశించి మరో పాత్రదారి కుక్కను సావిట్లో వుంచాలి. చెప్పును ఆరు బైటే వదిలేయాలని అన్నారు. నెత్తిన పెట్టుకోకూడదని జయప్రకాశ్‌రెడ్డి అంటారు. దయాకర్‌ రావు ఆ పని చేయాల్సిందిపోయి నెత్తిన పెట్టుకోవాలనుకున్నాడు. చెప్పు మీద కుచ్చు ఎగిరిపడినట్లు బ్రహ్మానందం కిరికి సప్పుడు చేయడంతో అసలు రంగు బైట పడిరది. తెలంగాణ నాయకులు ఇప్పటికైనా సరే ఆంద్రాకు చెందిన నటులతో వచ్చేది లేదు పోయేదిలేదు. వాళ్లను నెత్తిన పెట్టుకుంటే ఇదే జరుగుతుంది. మర్యాద తెలియని వాళ్లను పలకరించి చుకనైపోవడం ఎందుకు? చెప్పును నెత్తిన పెట్టుకోవాలనుకోవం ఎందుకు?

చంద్రబాబు నోటివెంట ఆణిముత్యాలు!

`సోషల్‌ మీడియాలో విపరీతంగా చకర్లు!

`తెలంగాణ కు కరంట్‌ తెచ్చాను 

`తెలంగాణ కు కరంట్‌ ఇచ్చాను 

`ట్రాన్సఫార్మార్లు నేనే ఇచ్చాను

`స్కూల్స్‌ నేనే కట్టించాను 

`మెడికల్‌ కాలేజీలు కట్టించాను

`ఇంజనీరింగ్‌ కాలేజీలు కట్టించాను

`ఐటీ నేనే తెచ్చాను

`సైబారాబాద్‌ నిర్మాణం చేశాను

`ముస్లింలను కోటేశ్వరులను చేశాను

`హైదరాబాద్‌ బిర్యానీ ప్రమోట్‌ చేశాను

`రత్నాలా వ్యాపారం పెట్టించాను

`గుళ్ళు కట్టించాను 

`యాదగిరి గుట్ట కట్టించాను 

`భద్రాచలం నేనే కట్టించాను 

`బాసర నేనే నిర్మాణం చేశాను 

`కీసర నేనే కట్టించాను 

`జోగులాంబ గుడి నేను కట్టించాను 

`సమ్మక్క సారక్క గుడి కట్టించాను.

`తెలంగాణ నా వల్లనే వచ్చింది.

`నేను లెటర్‌ ఇవ్వడం వల్లనే తెలంగాణా సాకరమైనది.

`అవును.. అవును అని అంటున్న రాధాకృష్ణ

హైదరాబాద్‌, నేటిధాత్రి:  

గుడి కట్టించింది మా నాన్న. బడి కట్టించింది మా నాన్న. దర్మసత్రం కట్టించింది మా నాన్న. దర్మాసుపత్రి కట్టించింది మా నాన్న. అని గతంలో జమిందాలు కుటుంబాలకు చెందిన వారసలు చెప్పుకునేవారు. ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబం జమిందారులది కాదు. కటిక పేద రైతు కుటుంబం. ఆయనకు వారసత్వంగా వచ్చింది రెండు ఎకరాలు. అలాంటి నాయకుడు మా తాతలు, ముత్తాతలు అవీ ఇవీ కట్టించారని చెప్పలేరు. అందుకే తెలంగాణలో నిర్మాణాలన్నీ నేనే కట్టానని చెప్పుకుంటున్నారు. ఆంద్రప్రదేశ్‌లో ఏది చెప్పుకున్నా జనం నమ్మరు. ఉత్తరాంద్రలోని విజయనగర రాజు వంశీయుడైన అశోకగజపతి రాజు లాంటివారు ఆ ప్రాంతాన్ని తామే అభివృద్ది చేశామని చెప్పుకుంటే చరిత్ర కూడా హర్షిస్తుంది. కాని చంద్రబాబు నాయుడు తెలంగాణను ప్రపంచ పటంలోనేనే పెట్టానంటాడు. ఆయన మాటలు వించే చరిత్ర కూడా సిగ్గుతో తలదించుకుంటుంది. తెలంగాణ గురించి చంద్రబాబు ఏది చెబితే అది ఏపి ప్రజలు నమ్మేస్తారని ఓ నమ్మకం. అందుకే ఆయన నోటి నుంచి వెలువడే ఆణిముత్యాలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఓ వీడియో రూపంలో వైరల్‌ అవుతున్నాయి. ఎందుకంటే అబద్దాలను కూడా చాలా సాదా సీదాగా, ఎలాంటి జంకు బొంకు లేకండా చెప్పడం ఏపి సిఎం. చంద్రబాబు స్పెషాలిటి. ఆయన చెప్పే మాటలు విని జనం ఏమకునుకుంటున్నారు? అనేది ఆయనకు అవసరం లేదు. అందుకే గాలి దిశ ఎలా వుంటుంది? ఆ గాలిలో ఎన్ని రకాల విషపూరిత సూక్షజీవులు వున్నాయి. ఆ గాలి ఎంత దూరం వెళ్తోంది. ఏఏ పంటల మీద దాని ప్రభావం చూపుతోందని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నానని చెబుతుంటే జనం విస్తుపోతున్నారు. వింతగా వింటున్నారు. తాము వింటున్నది నిజమేనా? అని ఆశ్చర్యపోతున్నారు. గాలి దిశలు ఎలా కనుగొనటమో? ఆ గాలి ఎంత దూరం ప్రయాణం చేస్తుందని అంచనా వేయడమేమిటో? ఆ గాలిలో వుండే వైరస్‌లు ఏ పంటలకు నష్టం చేస్తున్నాయని కనుగొనడం ఏమిటో? అంతా మిద్య. అయినా ఓ బాపతు మీడియా మాత్రం పత్రికల్లో పెద్ద పెద్ద అక్షరాలతో ముద్రిస్తుంది. టెలివిజన్‌ న్యూస్‌ చానల్స్‌ అహో అద్భుతమని పొగుడుతుంటాయి. వాటిపై డిబేట్లు పెట్టి మరీ చర్చిస్తుంటాయి. ఇక సోషల్‌మీడియా సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ మధ్య సముద్రం మీద తుఫానులు, వాయి గుండాల మీద కూడా కొన్ని విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా ఎండ తీవ్రత ఎలా తగ్గించాలన్నదానిపై కూడా అధికారులు దృష్టిపెట్టాలని కూడా ఆదేశాలు జారీచేసినట్లు వార్తలు వచ్చాయి. సరే ఇవన్నీ ఏపి ప్రజలకు వినసొంపుగానేవుండొచ్చు.అది చెప్పే వారి ఇష్టం. వినేవారికి సంతోషం. కాని తెలంగాణపై ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్‌ మీడియాను కుదిపేస్తున్నాయి. తెలంగాణకు కరంటునేనే తెచ్చాను అంటున్నారు. అందుకు ఆ ఇంటర్వూ చేస్తున్న ఏబిఎన్‌ రాధాకృష్ణ అవును…అవును అంటూ తలూపుతున్నారు. నిజమే అంటున్నారు. తెలంగాణకు కరంటు నిజాం కాలంలోనే వుంది. తెలంగాణ అనేది స్వాతంత్య్రానికి పూర్వం ఒక రాజ్యం. అంటే ప్రత్యేక దేశం. తెలంగాణకు ప్రత్యేకమైన కరెన్సీ వుండేది. తెలంగాణ రైల్వే ప్రత్యేకంగా వుండేది. తెలంగాణ టెలిఫోన్‌ శాఖ వుండేది. తెలంగాణలో ప్రత్యేక కరెన్సీ వుండేది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ నడిబొడ్డున హుస్సేన్‌ సాగర్‌కు ఆనుకొని విద్యుత్‌ కేంద్రం వుండేది. నగరానికి అంతటికి సరఫరా చేసేది. అలాంటి తెలంగాణకు తానే కరంటుతెచ్చాను. తెలంగాణ మొత్తానికి కరంటు ఇచ్చాను. రైతులకు ట్రాన్స్‌ ఫార్మర్లు నేనే ఇచ్చాను. అంటున్నారు. అంటే ట్రాన్స్‌ ఫార్మర్లు చంద్రబాబు ఇవ్వడమేమిటో? అర్ధం కాని ముచ్చట. తెలంగాణ రైతులు విద్యుత్‌ చార్జీలు తగ్గించమని కోరితే రూపాయి కూడా తగ్గించని నాయకుడు చంద్రబాబు నాయుడు. అసలు చంద్రబాబు నాయుడు సిఎం. అయ్యింది 1995లో అప్పటికే తెలంగాణ సర్వతోముఖాభివృద్దిలో వుంది. తెలంగాణ ప్రాంతం ఎంతో చైతన్యవంతమైన ప్రాంతం. ఉద్యమాలకు పుట్టినిల్లు. నైజాం పాలనను పారద్రోలిన ప్రాంతం. ఇలాగే చెప్పుకుంటూ పోతే ఇంకొన్ని రోజులకు కాళేశ్వరం నేనే కట్టానని కూడా అంటారేమో? ఎందుకంటే తెలంగాణ నా వల్లనే వచ్చిందనే మాటలు మాట్లాడడానికి కూడా ఏమాత్రం చంద్రబాబు వెనుకాడడు. తెలంగాణకు విద్యా వ్యవస్థను తెచ్చిందేనేను అన్నంత దోరణిలో మాట్లాడుతున్నారు. అసలు తెలంగాణలో 1918లోనే ప్రపంచ విఖ్యాతి గాంచిన ఉస్మానియా యూనివర్సిటీ నిర్మాణం జరిగింది. అంబెద్కర్‌ లాంటి వారు కూడా ఉస్మానియా నుంచి లా పట్టా పొందారు. మాజీ ప్రధాని నర్సింహరావుతో సహా కొన్ని వేల మంది మేధావులను తయారు చేసింది ఉస్మానియా యూనివర్సిటీ. తానే ఇంజనీరింగ్‌ కాలేజీలు తెచ్చానంటాడు. ఐటికి నేనే ఆధ్యుడినంటారు. అసలు హైదారాబాద్‌కు ఐటి రావడానికి ప్రధాన కారణం మాజీ ముఖ్యమంత్రి నేదురు మల్లిజనార్ధనరెడ్డి. అప్పటికే కర్నాటకలో ముఖ్యమంత్రి ఎస్‌ఎం. కృష్ణ ఐటి ఇండస్ట్రీని తెచ్చారు. ఆ సమయంలోనే నేదురు మల్లి జనార్దన్‌రెడ్డి హైటెక్‌ సిటీ నిర్మాణానికి శంకుస్దాపన చేశారు. తెలంగాణకు వైద్య విద్యను తెచ్చానంటారు. అసలు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిన మెడికల్‌ కాలేజీలే కాని, చంద్రబాబు ఒక్క మెడికల్‌ కాలేజీ తేలేదు. తెలంగాణలో స్కూళ్లన్నీనేనే నిర్మించానంటాడు. ఇంకా విచిత్రమైన విషయమేమిటంటే యాదగిరి గుట్ట నేనే కట్టానని చెప్పుకున్నాడు. నవ్విపోదురుగాక నాకేంటి అన్నట్లు వుంది ఈ మాట. యాదగిరి గుట్టను కేసిఆర్‌ పునర్నిర్మానం చేశాడు. కాని చంద్రబాబు ఏకంగా తొలి గుడి నేనే కట్టానని చెప్పుకుంటున్నారు. ఈ మాటలు యాదర్శి మహార్షి వింటే ఏమౌతారో? మనదేశ స్వతంత్ర భారతావనిలో ఇప్పటి వరకు ప్రభుత్వ దనంతో ఏ పాలకుడు ఏ గుడిని నిర్మాణం చేయలేదు. అది తెలంగాణ ఉద్యమ కారుడు, తెలంగాన సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసిఆర్‌ వల్లనే సాధ్యమైంది. ఒక గుడి నిర్మాణం అంటే చంద్రబాబు చెప్పిన మాటలంత తేలిక కాదు. యాదగిరి గుట్టను పునర్నిర్మాణం చేసి చరిత్రలో నిలిచిన నాయకుడు కేసిఆర్‌. కాని ఏనాడు కేసిఆర్‌ ఇలా గొప్పలు చెప్పుకోరు. ఇక సమ్మక్క సారక్క జాతరకు నా వల్లనే పేరుచ్చిందన్నారు. అసలు ఎప్పటి సమ్మక్క సారక్క. ఎప్పటి చంద్రబాబు నాయుడు. 13వ శతాబ్ధం నుంచి కొన్ని వందల సంవత్సరాలుగా సమ్మక్క, సారక్కల జాతరలు జరుగుతున్నాయి. అసలు ఇలాంటి మాటలు చెబితే జనం ఏమనుకుంటారని కూడా అనుకోకుండా చెప్పుకోవడం చంద్రబాబుకే చెల్లింది. కీసర గుట్టపై రామలింగేశ్వర స్వామి దేవాలయం, విష్లుకుండిన రాజుల కాలంలో నిర్మాణంజరిగిన పెద్ద పుణ్యక్షేత్రం. అలాంటి కీసరను కూడా నేనే నిర్మించానని చంద్రబాబు చెప్పడం విచిత్రంగా వుంది. ఇక దేశంలోని అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటైన ఎంతో మహిమాన్వితమైన జోగులాంబ క్షేత్రాన్ని తానే నిర్మించానని చెబుతుండడం, అందుకు ఏబిఎన్‌ రాధాకృష్ణ అవును, అవును అనడం దౌర్భాగ్యం. అసలు ఆ శక్తి పీఠం ఎప్పుడు ఏర్పడిరదనడానికి స్పష్టమైన చారిక్రత ఆధారాలు లేవు. కాని పురాణాల ప్రకారం కొన్ని వేల సంవత్సరాల క్రితం శక్తి పీఠం ఏర్పడిరది. దానిని కర్నాకట ప్రాంతాన్ని పాచించిన తూర్పు చాళుక్యులు, బాదామీ చాళుక్యులు గుడి నిర్మాణం చేసినట్లు శిలా శాసనాల తెలుస్తోంది. అది కూడ సుమారు 6శతాబ్ధ కాలంలో నిర్మాణం జరిగింది. అంటే అది ఎప్పుడు మొదలైందో కూడా తెలియదు. అలాంటి నిర్మాణాన్ని తాను కట్టించానని చంద్రబాబు చెప్పడం విడ్డూరం. ఇక బాసర అనేది దేశంలోనే వున్న ఏకైక పురాతమైన దేవాలయం. ఎందో మంది రుషులు సరస్వతి అమ్మవారి ఆశీస్సులకోసం గోదావరి తీరాన కొన్ని వందల సంవత్సరాలు తపస్సులు చేసి గుడి నిర్మాణం చేపట్టారు. ఇక భద్రాచలం దేవాలయం కూడా నేను నిర్మించిందే అంటే కంచర్ల గోపన్న ఆత్మ క్షోబిస్తుంది. పోలవరం నిర్మాణంతో భద్రాద్రి రాయమ్య మునిగిపోతాడని తెలిసినా ఆ దాని నిర్మాణం చేస్తున్నాడు. అలాంటి చంద్రబాబు తానే భద్రాద్రినిర్మాణం చేసినట్లు చెప్పుకోవడం మరీ విచిత్రం. ఇక తెలంగాణలో అత్యంత ఫేమస్‌ అయిన ఆహారం. బిర్యాని. అసలు బిర్యాని అనే పదం ఎక్కడిదో..ఎక్కడి నుంచి వచ్చిందో చరిత్ర తెలియని చంద్రబాబు దానిని ప్రమోట్‌ చేశానని అందుకే అంత ఫేమస్‌ అయ్యిందని చెబుతున్నారు. దేశంలోనే అత్యంత అరుదైన వంటకం తెలంగాణ బిర్యాని. ఆ బిర్యాని అనేది మొఘలల కాలంలో వారి హైదరాబాద్‌ పాలకులుగా నియమింపబడిన కుతుబ్‌షాషీలు పరిచయం చేసిన వంట అది. అది మన దేశానికి చెందినది కూడా కాదు. ఇరాన్‌ నుంచి వచ్చిన కుతుబ్‌షాహీలు కొంత కాలం మొగలుల సంస్దానంలో సైనిక నాయకులుగా పనిచేశారు. వారి పనితీరును మెచ్చుకొని దక్షిణాదిన గోల్కొండ రాజ్యానికి ఔరంజేబు వారిని పాలకులుగా పంపించారు. అప్పటి నుంచి తెలంగాణ, హైదరాబాద్‌ ప్రజలు బిర్యాని తయారుచేసుకోవడం, తినడం అలవాటు చేసుకున్నారు. గోల్కొండ నవాబుల ప్రధానమైన వ్యాపారం వజ్రాలు. ఈ సంగతి చాల మందికి తెలియదు. రాజులేమిటీ? వారికి వ్యాపారాలేమిటి? అనే ప్రశ్న కూడా ఉత్పన్నమౌతుంది. కాని నిజాం నవాబులు వజ్రాల వ్యాపారం చేసేవారు. కోహినూర్‌ డైమండ్‌ అందులో భాగమే. ఆ రోజుల్లోనే లండన్‌ నుంచి వ్యాపారులు వచ్చిన హైదరాబాద్‌ నుంచి వజ్రాలు కొనుగోలు చేసేవారు. తర్వాత కాలంలో కొత్త నగరం నిర్మాణమైన తర్వాత చార్మినార్‌ పరిసర ప్రాంతాలలో వాటి వ్యాపారం విరివిగా జరిగిందే. వజ్రాల వ్యాపారంతోపాటు అనేక రకాల వ్యాపారాల సముదాయంగా మారిపోయింది. వాటిని కూడా నేనే ప్రారంబించానని చంద్రబాబు చెప్పుకునే ఓ వీడియో గత రెండు రోజులుగా సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇది చూస్తూ, వింటూ తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. అబద్దాలకు కూడా హద్దూ బద్దు లేకుండా చంద్రబాబు చెబుతుంటే ఆ వీడియోను తెగ వైరల్‌ చేస్తున్నారు.

మిలర్ల మధ్య సమన్వయం..సమస్యలు పరిష్కారం!

`మిల్లర్లకు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హామీ.

`నిజాయితీగా వ్యాపారం చేసుకోండి.

`బియ్యం తప్పు దారి పట్టకుండా వ్యాపారం చేసుకోవాలి.

`మిలర్లకు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి సూచన.

`ఈ విషయాన్ని నేటిధాత్రి కి స్వయంగా వివరించిన మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి.

`సివిల్‌ సప్లై శాఖ మంత్రి ‘‘ఉత్తంకుమార్‌ రెడ్డి’’ తో ‘‘నేటిధాత్రి’’ ఎడిటర్‌ ‘‘కట్ట రాఘవేందర్‌ రావు’’ ఎక్స్‌ క్లూజివ్‌ ఇంటర్వ్యూ.

మంత్రి ‘‘ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి’’ కి ధన్యవాదాలు తెలిపిన ‘‘తెలంగాణ రైస్‌ మిల్లర్లు’’

`మంత్రి గారు పిలిచారు మాట్లాడారు అది చాలు మిలర్ల భావన.

`మంత్రి గారు సానుకూలంగా మా సమస్యలు విన్నారు సంతోషంగా వుంది.

`ముఖ్యంగా రా రైస్‌ మిలర్ల సమస్యలు విన్నవారు లేరు.

`పెద్ద మనసు చేసుకొని మొదటిసారి మంత్రి గారు విన్నారు.

`మాతో సమావేశం నిర్వహించారు

`పన్నెండేళ్లుగా రైస్‌ మిలర్ల గోడు విన్నవాళ్లు లేరు

`గత ప్రభుత్వం మమ్మల్ని కనీసం పట్టించుకోలేదు.

`అప్పటి మంత్రులను ఎన్నిసార్లు కోరినా అవకాశం ఇవ్వలేదు.

`మొదటిసారి మా సమస్యలు మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విన్నారు.

`మంత్రి గారికి ధన్యవాదములు తెలిపిన తెలంగాణ రైస్‌ మిల్లర్లు.

`కొంత మంది మిల్లర్ల వల్ల వ్యవస్థకు చెడ్డ పేరు వస్తోంది.

`మంత్రి ముందు ఆవేదన వ్యక్తం చేసిన మిల్లర్లు.

`తెలంగాణ రైస్‌ మిల్లర్ల తరుపున మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ప్రతినిధులు

 

తెలంగాణలోని రైస్‌ మిల్లర్ల మధ్య సమన్వయం..సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైంది. సుమారు పన్నెండు సంవత్సరాల తర్వాత ఒక అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ కల సాకారమైంది. అది కూడా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి చొరవ వల్ల సాధ్యమైంది. మిల్లర్ల సమావేశం తర్వాత మంత్రి నేటి దాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేర్రదరావుతో ఈ సమావేశ వివరాలను పంచుకున్నారు. ప్రత్యేకంగా ఈ బేటీ వల్ల మిల్లర్లకు ఇచ్చిన ఆదేశాలు, చేసిన సూచనలను మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఎడిటర్‌ రాఘవేంద్రరావుకు వివరించారు. మంత్రి ఉత్తమ్‌తో సమావేశం మూలంగా మిల్లకు ఇంత కాలంగా లేన ఒక భరోసా కల్పించినట్లైంది. ఎంత కాలంగా వాళ్లు ఎదురుచూస్తున్నట్లు వారి సమస్యలు తెలుసుకునే అవకాశం ఏర్పడిరది.ఉభయ వర్గాల మధ్య వున్న అపోహలు కొన్ని తొలగిపోయాయి. ఇటీవల మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డితో పన్నెండేళ్ల తర్వాత తొలిసారి తెలంగాణలోని మిల్లర్ల అసోసియేషన్‌ నాయకుల మధ్య సమావేశం జరిగింది. అది కూడా ఆహ్లదకరమైన సందర్భంలో చోటు చేసుకున్నది. ఎందుకంటే ఇంత కాలం తెలంగాణలోని రెండు రకాల మిల్లర్లు ప్రభుత్వంతో చర్చల కోసం ఎంతో ఎదురుచూస్తున్నారు. అయితే అప్పుడప్పుడు బాయిల్డ్‌ రైస్‌ మిల్లుల యూనియన్‌ నాయకులతోనే ప్రభుత్వం సమావేశమౌతూవుండేది. దాంతో రా రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌లో ఓ వెలితి వుండేది. వారి సమస్యలు చెప్పుకునే వీలు లేకుండా వుండేది. ఎందుకంటే రా రైస్‌ మిల్లర్ల సమస్యలు వేరు. బాయిల్డ్‌ రైస్‌ మిల్లర్ల సమస్యలు వేరు. ప్రభుత్వాలు ఎంత సేపు బాయిల్డ్‌ మిల్లర్ల అసోసియేషన్‌ నాయకులతోనే సంప్రదింపులు జరుపుతుండేవారు. వారు తమకున్న సమస్యలు అటు కమీషన్‌ర్‌కు, ప్రభుత్వ వర్గాలకు తెలియజేస్తూ వుండేవారు. కాని అక్కడ రా రైస్‌ మిల్లర్ల సమస్యలు ప్రస్తావనకు వచ్చేవి కాదు. తొలిసారి పన్నెండేళ్ల తర్వాత ఆ చొరవ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తీసుకున్నారు. దాంతో రెండు రకాల యూనియన్‌సభ్యులు మంత్రితో సమావేశమయ్యారు. వారికున్నసమస్యలు మంత్రికి వివరించారు. వారి సమస్యలు సానుకూలంగా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విన్నారు. ప్రభుత్వం మిల్లర్లకు పూర్తి సహాకారం అందిస్తోంది. కాని కొంత మంది మిల్లర్లు ప్రభుత్వాన్ని పక్కదారి పట్టిస్తున్నారన్న విషయాన్ని వారి దృష్టికి తీసుకొచ్చారు. నీతిగా, న్యాయంగా, నిజాయితీగా వ్యాపారం చేసుకోవాలని మంత్రి మిల్లర్లకు సూచించారు. ఒక రకంగా ఆదేశించారు. సమస్యలు తెచ్చుకోవద్దు. సమస్యలు సృష్టించొద్దు. ప్రభుత్వాన్ని మోసం చేయొద్దన్న విషయాలను మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మిల్లర్లకు సూటిగా స్పష్టంగా చెప్పారు. తప్పులు చేస్తే ఉపేక్షించే ప్రసక్తి లేదని కూడా మంత్రి మిల్లర్లను హెచ్చరించారు. మిల్లర్లకుఎలాంటి సమస్యలున్నా వినడానికి, తీర్చడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్దంగా వుంటుందని కూడా మిల్లర్లకు మంత్రి మాట ఇచ్చారు. అయితే ఇది తొలి సమావేశం కావడంతో పూర్తి స్దాయి చర్చలు జరగలేదు. మిల్లర్లు వారి పూర్తి సమస్యలు చెప్పలేదు. మళ్లీ ఒకసారి సమావేశం ఏర్పాటుకు మంత్రి హమీ ఇచ్చారు. అందుకు అవసరమైన విదివిధానాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. దాంతో మిల్లర్లలో సంతోషం నిండిరది. రెండు రకాలైన మిల్లర్లు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే తెలంగాణ రాకముందు మిల్లులు తక్కువ. అందులోనూ రా రైస్‌ మిల్లులు చాలా తక్కువ. తెలంగాణలో ఉమ్మడిరాష్ట్రంలో బాయిల్డ్‌ రైస్‌మిల్లులే ఎక్కువగా వుండేవి. దాంతో ఆది నుంచి వాటి ఆదిపత్యమే కొనసాగుతూ వచ్చింది. ఎప్పుడైతే తెలంగాణలో పంటలు పుష్కలంగా పండడం మొదలైందో అప్పటి నుంచి తెలంగాణలో వందల్లో వున్న రా రైస్‌ మిల్లులు వేల సంఖ్యకు చేరాయి. పైగా ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పేదలందిరికీ రేషన్‌ కార్డు దారులకు సన్న బియ్యం అందిస్తున్నారు. ప్రభుత్వం కూడా రైతులు సన్న బియ్యం పండిరచేందుకు పెద్దఎత్తున ప్రోత్సహిస్తోంది. ప్రతి సీజన్‌లోనూ రైతులు పండిరచే వడ్లకు మద్దతు ధరను చెల్లిస్తూనే గత రెండు సంవత్సరాలుగా ప్రజా ప్రభుత్వం రైతులకు బోనస్‌ కూడా చెల్లిస్తోంది. దాంతో రైతులంతా సన్న బియ్యం పండిరచేందుకు ముందుకొచ్చారు. రికార్డు స్దాయిలో వడ్లు పండిస్తున్నారు. వాటిని తెలంగాణలోని రా రైస్‌ మిల్లుల ద్వారా ఆడిరచి పేదలందరికీ ప్రభుత్వం సన్న బియ్యం సరఫరా చేస్తోంది. ఇలాంటి పరిస్దితులో మిల్లర్లు కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. వారికి సరిపడా వడ్లు కేటాంపులు వంటి అనేక సమస్యలున్నాయి. వాటిని ప్రభుత్వం ముందు వుంచేందుకు గత ప్రభుత్వంలో ఎంతో ప్రయత్నం చేశారు. కాని ఆ ప్రభుత్వం అప్పుడు వాళ్లను పట్టించుకోలేదు. ప్రస్తుత ప్రజా ప్రభుత్వం రా రైస్‌ మిల్లర్ల సమస్యలు తీర్చేందుకు సిద్దంగా వుంది. ముందుగా వారితో ప్రభుత్వం సమావేశం కావడమే రా రైస్‌ మిల్లర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పైగా బాయిల్డ్‌ రైస్‌ మిల్లర్లు కూడా మంత్రితో సమావేశం జరిగినందుకు వాళ్లుకూడా ఎంతో ఆనందంగా వున్నారు. గతంలో బాయిల్డ్‌ రైస్‌ మిల్లర్లు తమ సమస్యలను చెప్పుకోవడానికి ఏ మంత్రి అవకాశమివ్వలేదు. కేవలం కమీషనర్‌కు తమ గోడును వెల్లబోసుకోవడం తప్ప మంత్రుల దర్శనం జరిగింది లేదు. వారితో సమావేశమైంది లేదు. వారి సమస్యలు నేరుగా మంత్రి దృష్టికి తెచ్చే పరిస్దితి ఎదురైంది లేదు. కాని ప్రజా ప్రభుత్వంలో నేరుగా మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డితో సమావేశం జరిగింది. అందుకు బాయిల్డ్‌ రైస్‌ మిల్లర్లు కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డికి బాయిల్డ్‌ రైస్‌ మిల్లర్లు, రా రైస్‌ మిల్లర్లు కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ ప్రధానంగా రెండు మిల్లర్ల మధ్య ఆధిపత్య పోరు కొన్నేళ్లుగా సాగుతోంది. అందులో బాయిల్డ్‌ మిల్లర్ల యూనియన్‌ది పై చేయిగా వుంటోంది. గత ప్రభుత్వం కూడా వారికే ప్రాదాన్యతిస్తూ వెళ్లింది. కాని రా రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌ను గత ప్రభుత్వం ఎప్పుడూ పరిగణలోకి తీసుకోలేదు. బాయిల్డ్‌ రైస్‌ మిల్లర్లు చెప్పే సమస్యలు తప్ప తమ సమస్యలు కనీసం కమీషనర్‌ కూడా చెప్పుకునే అవకాశం లేకుండాపోయింది. బాయిల్డ్‌ రైస్‌ మిల్లర్లు చెప్పే సమస్యలు రెండు రకాల మిల్లర్ల సమస్యలుగా ప్రభుత్వం భావిస్తూ వచ్చింది. కాని ఈ రెండు రకాల మిల్లర్లకువుండే సమస్యలు వేరు వేరన్నది ప్రజా ప్రభుత్వం గుర్తించింది. మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సమావేశంలో రెండు రకాల మిల్లర్లకు అవకాశం కల్పించారు. దాంతో ఎవరి సమస్యలు వారికి? ఎవరి కష్టాలు వారివి? అనేది తేలిపోయినట్లైంది. ఇకపై ఏక కాలంలో రెండు రకాల మిల్లింగ్‌ వ్యవస్ధలతో సమావేశం ఏర్పాటు చేయాల్సిన అసవరం లేదని గుర్తించినట్లైంది. ఏ వర్గం సాదకబాధకాలు ఆ వర్గానికి చెందిన ప్రతినిధులు మాత్రమే ప్రభుత్వానికి విన్నవించుకునే వెసులుబాటు కల్పించినట్లైంది. అందుకు ప్రతి మిల్లర్‌ ప్రభుత్వానికి రుణపడి వుంటామంటూ మిల్లర్ల అసోయేషన్ల ప్రతినిధులు నేటిదాత్రి ఎడిటర్‌ కట్టారాఘవేంద్ర రావుతో చెప్పారు.

వరంగల్‌ ‘‘జెసి’’ ఇలా.. హనుమకొండ ‘‘జేసీ’’ అలా? 

వరంగల్‌, హన్మకొండ మిలర్ల ముచ్చట్లు?

వరంగల్‌ ‘‘జెసి’’కి కనిపించని ‘‘మిల్లుల అవినీతి అక్రమాల’’ పై మీ ‘‘నేటిధాత్రి’’ల్లో వరుస కథనాలు.

`వరంగల్‌ ‘‘జేసీ’’కి మిలర్ల మీద ఎందుకంత అపారప్రేమ?

`మిల్లర్లు ‘‘జీబి’’లు ఎంత ఇచ్చినా పరవాలేదా?’’

`హన్మకొండ ‘‘జేసీ’’ మాత్రం ఎంత ‘‘జీబి’’లు ఉంటే అంతే వడ్లు కేటాయిస్తున్నాడు?

`హన్మకొండ మిలర్లకు ఎందుకు మింగుడు పడడం లేదు!

`హన్మకొండ ‘‘జేసీ’’ మాత్రం లెక్కలు పక్కాగా వుండాలంటున్నాడు.

`వరంగల్‌ ‘‘జేసీ’’ అవేవి ఎందుకు పట్టించుకోవడం లేదు?

‘‘రా రైస్‌’’ మిల్లర్లు 10 పది లక్షలు ఇచ్చినా ఎందుకు ‘‘జెసి’’ సరే అంటున్నారు?

‘బాయిల్డ్‌ రైస్‌’’ మిల్లర్లు 20 లక్షలు ఇస్తే చాలని ‘‘జెసి’’ ఎందుకు అంటున్నారు?

`హన్మకొండ ‘‘జేసీ’’ జీబి ఎంత ఇస్తే అంతే వడ్లు ఎందుకిస్తానంటున్నాడు?

`నాలుగు రోజులు గడిస్తే వద్దన్నా వరంగల్‌ ‘‘జేసీ’’ వడ్లు కేటాయిస్తారు?

`ఇది రెండు జిల్లాల మిల్లర్లు చెప్పుకుంటున్న మాటలు?

`ఇప్పటికే వరంగల్‌ మిలర్ల బకాయిలు కొండలా పేరుకుపోయాయ్‌?

`మిల్లర్ల బకాయిలు వరంగల్‌ ‘‘జేసీ’’ వసూలు చేయడం లేదు?

`మిలర్ల మీద వరంగల్‌ ‘‘జేసీ’’ కి అంత ఉదారత ఎందుకు?

`హన్మకొండ ‘‘జేసీ’’ వసూలు చేసినట్లు, వరంగల్‌ ‘‘జేసీ’’ ఎందుకు వసూలు చేయడం లేదు?

`బకాయిలు వసూలు చేయడానికి వచ్చిన ఇబ్బందులేమిటి?

`వరంగల్‌ ‘‘జేసీ’’ కేటాయిస్తున్న వడ్లకు, మిల్లర్లు తిరిగి ఇస్తున్న బియ్యానికి పొంతన ఎందుకు లేదు?

`మిలర్ల ‘‘కరంటు బిల్లులు’’ చెక్‌ చేస్తున్నారా?

`’’కరంటు బిల్లులు’’ ఎందుకు తక్కువ వస్తున్నాయి?

`మిలర్లకు కేటాస్తున్న వడ్లు ఎటు పోతున్నాయి?

`కమీషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర గారు ఒక్క సారి లుక్కేయండి?

`వరంగల్‌ మిలర్ల దోపిడీ చూడండి?

`కరెంటు కాలకుండా వడ్లు ఎలా ఆడిరచారు?

`మూతపడిన మిల్లులకు వడ్లు ఎలా ఇస్తున్నారు?

`ఆ మిల్లర్లు బియ్యం తిరిగి ఎలా చెల్లిస్తున్నారు?

`విద్యుత్‌ శాఖను మోసం చేస్తున్న మిల్లర్లు.

`ప్రభుత్వాన్ని ఎలా మోసం చేస్తున్నారో ఆరా తీయండి?

హైదరాబాద్‌, నేటిధాత్రి:                        తెలంగాణ జిల్లాల్లో ఎక్కడా కనిపించని, వినిపించని కొన్ని విషయాలు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోనే వెలుగులోకి వస్తుంటాయి. చర్చలు జరుగుతుంటాయి. ముఖ్యంగా హన్మకొండ, వరంగల్‌ జిల్లాలో ఈ మధ్య ఒక ఆసక్తికరమైన సంబాషణలు రైస్‌ మిల్లర్ల మధ్య వినిపిస్తున్నాయి. వరంగల్‌ జిల్లకు చెందిన జాయింట్‌ కలెక్టర్‌ మిల్లర్ల విషయంలో కాస్త ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారంటున్నారు. అదే పక్కనే వున్న హన్మకొండ జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కాస్త మిల్లర్ల విషయంలో కాస్త కఠినంగా వ్యవహరిస్తున్నారంటున్నారు. కాని ఉదారత ఎందుకు? కఠినత్వం ఎందుకు? అనేది చాలా విచిత్రంగా వుంది. చట్టపరంగా, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలే అందుకు లోబడి మాత్రమే హన్మకొండ జేసి పనిచేస్తున్నారు. అంటే మిల్లర్లకు అనుకూలంగా పనిచేయడం లేదు. మిల్లర్లు కోరే గొంతెమ్మ కోరికలు తీర్చడం లేదు. వారికి అనుకూలంగా చట్టానికి వ్యతిరేకంగా ఆయన వ్యహరించడం లేదు. పక్కా లెక్క ప్రకారం నడుచుకుంటున్నారు. ఇది హన్మకొండ జిల్లాలోని మిల్లర్లకు ఇబ్బందిగా మారింది. అదే పక్కనే వున్న వరంగల్‌ జిల్లాకు చెందిన జేసి మాత్రం మిల్లర్లకు అనుకూలంగా వుంటున్నారు. అనేది ఒక చర్చ. ఇందులో వాస్తవాలు ఏమిటన్నది అటు మిల్లర్లు, ఇటు అధికారులే చెప్పాలి. కాని మిల్లర్ల మధ్య జరుగుతున్న చర్చ మాత్రం వాస్తవం? ఎందుకంటే వరంగల్‌ జిల్లాలో వున్న మిల్లులే తక్కువ. అందులోనూ మూతపడిన మిల్లులు కూడా వున్నాయి. అసలు మిల్లులేని వాళ్లు కూడా కొందరున్నారు. వాళ్లందరికీ ఎంత కోరితే, అంత కావాలంటే అంత వడ్లను జేసి అనుమతులు మంజూరు చేస్తున్నారు. కాని హన్మకొండ జిల్లాకు చెందిన జేసి మాత్రం లెక్క ప్రకారం ఎంత బ్యాంకు గ్యారెంటీలు ఇస్తే అంత వరకు మాత్రమే వడ్లు కేటాయిస్తున్నారు. ఇది మిల్లర్లకు నచ్చడం లేదు. మిల్లర్లు చట్ట ప్రకారం నడుచుకోవాంటున్నారు. బ్యాంకు గ్యారెంటీలకు తగ్గట్టు మాత్రమే వడ్లను కేటాయిస్తున్నారు. ఇక్కడ ఎలాంటి పైరవీలకు తావు లేదు. ఏ మిల్లర్‌ అదనంగా వడ్లు కోరినా ఇవ్వడం లేదు. పూర్తిగా పారదర్శంగా అన్నీ వుండేలా హన్మకొండ జేసి చూసుకుంటున్నారు. కాగితాల మీద పక్కా లేక్కలుండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇచ్చిన బ్యాంకు గ్యారెంటీలకు, ఇచ్చిన వడ్లకు, మళ్లీ మిల్లులు ఇచ్చే బియ్యంలో ఎలాంటి తేడా రాకుండా చూసుకుంటున్నారు. అదే హన్మకొండ మిల్లర్లకు నచ్చడం లేదు. ఇబ్బందిగా మారింది. పక్కనే వున్న వరంగల్‌ జిల్లా జేసి మాత్రం రా రైస్‌ మిల్లులు కేవలం రూ.10లక్షల బ్యాంకు గ్యారెంటీలు ఇస్తే చాలు ఎన్ని వడ్లు కావాలంటే అన్ని ఇస్తున్నారు. బాయిల్డ్‌ రైస్‌ మిల్లర్లు రూ.20లక్షలు బ్యాంకు గ్యారెంటీలు ఇస్తే చాలు. ఎన్నివడ్లైనా ఇస్తున్నారు. దాంతో రెండు జిల్లాలకు చెందిన మిల్లర్లు ఒక చోట చేరినప్పుడు చెప్పుకుంటున్న, చేసుకుంటున్న సంబాషణలు. అంటే వరంగల్‌ జిల్లాలోని రైస్‌ మిల్లర్లు ఇప్పటికే ప్రభుత్వానికి కోట్లలో బాకీలున్నారు. వారికి ఎంత సమయం ఇచ్చినా ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించడం లేదు. అందులోనూ చాలా వరకు మిల్లులు మూసి వున్నాయి. అవి పని చేయడం లేదు. కొంత మందికి మిల్లులే లేవు? అని కూడా తెలుస్తోంది. ఇది ఎంత నిజమో? అధికారులే తేల్చాలి. వారికి కూడా వడ్లు కేటాయిస్తున్నారు. అలా కేటాయించిన వడ్లను మిల్లులేని వాళ్లు ఎక్కడ బియ్యంగా మార్చుతున్నారు? ఎలా తిరిగి ప్రభుత్వానికి ఆ బియ్యం ఎలా అందిస్తున్నారన్నది పెద్ద ప్రశ్నగా మారింది? ఒక వేళ ఆ వడ్లను వారి మిల్లుల్లోనే ఆడిస్తే ,బియ్యంగా మార్చితే అందుకు తగిన ఆధారాలు ఏమీ చూపించే పరిస్దితుల్లో లేరు. కనీసం మిల్లులు నడుస్తున్నాయని చెప్పడానికి అసలు రుజువైన కరంటు బిల్లులు చూపించాల్సిన అవసరం వుంది. అంతే కాదు ప్రభుత్వానికి బియ్యంతోపాటు, కరంటు బిల్లులుకూడా అందించాలి. కాని ఆ బిల్లులు ప్రభుత్వానికి అందించడం లేదు. అసలు విజిలెన్స్‌ అధికారులు సీజ్‌ చేసిన మిల్లులు ఎలా తెరుస్తున్నారు? ఎలా వారికి అదికారులు వడ్లు కేటాయిస్తున్నారు? వాళ్లు మిల్లులు ఎలా ఓపెన్‌చేస్తున్నారు. ఇదంతా పెద్ద మాఫియాగా మారిపోయింది. వ్యవస్ధనే సవాలు చేసే స్దాయికి ఎదిగిపోయింది. ఈ విషయాలు వరంగల్‌ జిల్లా జేసికి తెలిసి చేస్తున్నారా? జేసికి తెలియకుండా అదికారులు సాగిస్తున్నారా? జేసి వరకు ఈ విషయాలు చేరకుండా మిల్లర్లు జాగ్రత్తపడుతూ మళ్లీ, మళ్లీ మోసం చేస్తున్నారా? అన్నది తేలాల్సివుంది. అన్నీ తెలిసే వరంగల్‌ జేసి మిల్లులకు వడ్లు కేటాయిస్తున్నారా? అన్నది కూడా వెలుగులోకి రావాల్సిన అవసరంవుంది.. ఎందుకంటే రెండు జిల్లాలకు చెందిన మిల్లర్లు కలిసినప్పుడు మీ జేసి చాల మంచి వారు. మీరు అడిగినంత వడ్లు కేటాయిస్తున్నారు? అంటూ వరంగల్‌ మిల్లర్లతో హన్మకొండ మిల్లర్లు ఎందుకు అంటున్నారు? మిల్లర్ల అవకతవకలు పట్టించుకోకండానే వరంగల్‌ జేసి ఎలా వడ్లు కేటాయిస్తున్నారు? అనేది తెలియాల్సి వుంది. ఇక హన్మకొండ మిల్లర్ల ఎత్తుగడలు మరో విధంగా వున్నాయి. వడ్ల కేటాయింపులు అన్నీ పక్కాగా జరగాలని చూస్తున్న హన్మకొండ జేసికే చుక్కలు చూపించాలని మిల్లర్లు యోచిస్తున్నారట? ఇప్పుడు జేసి వడ్ల కేటాయింపును పకడ్భందీగా అమలు చేస్తున్నారు? నాలుగు రోజులు పోతే జిల్లాకు పెద్దఎత్తున వడ్లు పోటెత్తుతాయి. వరంగల్‌ లో మిల్లులకు ఆ సామర్ధ్యంలేదు. హన్మకొండ జిల్లా నుంచే కాకుండా పొరుగున వున్న ఖమ్మం జిల్లా నుంచి కూడా పెద్దఎత్తున వడ్లు వస్తాయి? అప్పుడు జేసి ఏం చేస్తారని ప్రశ్నిస్తున్నారట? అప్పటి వరకు వడ్లు తీసుకోకుండా కాలయాపన చేస్తే అప్పుడు జేసియే తమను బ్రతిమిలాడే పరిసి ్ధతి వస్తుందని చర్చించుకుంటున్నారట. ఎందుకంటే ఖమ్మం జిల్లాలో పెద్దగా రైస్‌ మిల్లులు లేవు. అక్కడ వరి ఎక్కువగా పండుతోంది. ఆ ధాన్యమంతా హన్మకొండకు రావాల్సిందే. అప్పుడు జేసి వడ్లు తీసుకొమ్మని మిల్లర్ల మీదనే ఒత్తిడి చేసే పరిస్ధితి వస్తుందనుకుంటున్నారట? అంటే మిల్లర్లు తమ బకాయిలు చెల్లించాల్సి వుండి కూడా వాటిని చెల్లించడం లేదు. పైగా ప్రభుత్వం ఆదేశాలను పాటించడం లేదు. వడ్లు ఎంత కావాలంటే అంత మేరకు బ్యాంకు గ్యారెంటీలు ఇవ్వడానికి కూడా సిద్దంగా లేరు. ఇప్పటికే పేరుకుపోయిన బకాయిలు అక్కడే వున్నాయి. వాటిని చెల్లించేందుకు సిద్దంగా లేరు. కాని వడ్లు మాత్రం ఇస్తే తీసుకుంటాం? అనే పరిస్దితిలో వున్నారంటే ప్రభుత్వాన్ని ఎలా మోసం చేస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. అయితే పక్కనే వున్న వరంగల్‌ జేసి ఎందుకు ఇలా చేస్తున్నారు? లెక్కలు ఎందుకు పక్కాగా అమలు చేయడం లేదు? అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అటు మిల్లర్లకు, ఇటు సివిల్‌ సప్లై అదికారులకు మధ్య ఒప్పందాలు బాగానే వున్నట్లు చెప్పుకుంటున్నారు. అందుకే మిల్లర్లు అడిగినంత వడ్లు కేటాయిస్తున్నారు. లక్షల్లో బ్యాంకు గ్యారెంటీలుఇచ్చిన మిల్లర్లకు కోట్లలో వడ్లు కేటాయిస్తున్నారని సమాచారం. అటు సివిల్‌ సప్లైశాఖను, ఇటు విద్యుత్‌ శాఖను ఏక కాలంలో మిల్లర్లు మోసం చేస్తున్నారు. మిల్లులు నడవాలంటే కరంటు ఖర్చు కావాలి. కాని కరంటు వాడుతున్న లెక్కలు లేవు. కాని ఆ మిల్లులకు వడ్లు వెళ్తున్నాయి? వాటి నుంచి బియ్యం వస్తున్నాయి? అంటే ఏదో జరుగుతోంది. నడవని మిల్లులకు వడ్లు కేటాయించడమేమిటి? ఆ మిల్లులనుంచి బియ్యం వచ్చినట్లు అదికారులు లెక్కలు చూపడమేమిటి? ఇందులో పెద్ద రహస్యమేమీ లేదు. అటు వడ్లు, ఇటు బియ్యం అందరూ కలసి మాయం చేస్తున్నారు. లేని బియ్యం ప్రభుత్వానికి లెక్కలు చూపిస్తున్నారు. ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు గండి కొడుతున్నారు. అంటే కోట్లాది రూపాయలు అటు మిల్లర్లు ఇటు అధికారుల తింటున్నారన్నది అర్దమౌతోంది. ఇప్పటికైనా కమీషనర్‌ స్టీఫెన్‌ రవీంధ్ర రంగంలోకి దిగితే అసలు బండారమంతా బైట పడుతుంది. జేసి నిర్ణయాల నుంచి, అదికారుల ఆదేశాలు, మిల్లర్ల నాటకాలు అన్నీ బైటకు వస్తాయంటున్నారు. కంచె చేసు మేసినట్లు అధికారుల వ్యవహరించడం వల్ల మిల్లర్లు చెలరేగిపోతున్నారు. ప్రభుత్వాన్ని నిండా ముంచేస్తున్నారు. అటు సివిల్‌ సప్లయ్‌ శాఖనే కాకుండా, విద్యుత్‌ శాఖకు మోసం చేస్తున్నారు. ఉన్నతాదికారుల రంగంలోకి దిగితే అన్నీ బైటకొస్తాయి? జరుగుతున్న అవినీతి వ్యహారమంతా వెలుగులోకి వస్తుంది.

కోట్లలో తూకం..తలాబ్‌ కట్ట లో ప్రభుత్వ భూమి మాయం?

`రిజిస్ట్రేషన్‌ శాఖ అవినీతి అధికారుల మాయజాలం?

`పెద్దల అందదండలతో కోట్ల విలువైన భూమి సంతర్పణం?

`రంగారెడ్డి జిల్లాలో ఇలాంటి అక్రమాలు సర్వసాధారణం?

`పైనుంచి ఆశీస్సులు, కిందనుండి సహకారాలు?

`పదేళ్ల నుంచి ప్రయత్నం.. ఇంత కాలానికి సమాప్తం?

`సరూర్‌ నగర్‌ లో వందల కోట్ల ప్రభుత్వ భూమి మాయం?

`‘‘సరూర్‌ నగర్‌’’ లో ‘‘వందల కోట్ల’’విలువగల ప్రభుత్వ భూమి ‘‘అక్రమ రిజిస్ట్రేషన్‌’’?

`ఆ ‘‘అవినీతి ‘‘డిఆర్‌’’, ‘‘ఎస్‌ఆర్‌’’ లు ఎవరు?

`‘‘మంత్రిగారు’’ తక్షణమే ‘‘స్పెషల్‌ ఆడిట్‌’’ చేపించండి!

`ఆ అవినీతి ‘‘డిఆర్‌’’ పై చర్యలు తీసుకోండి.

`గతంలో కూడ ఆ ‘‘డిఆర్‌’’ పై అవినీతి ఆరోపణలు?

`‘‘సీఎం పేషీ’’లోని పెద్దలే ఆ ‘‘డిఆర్‌’’కు అండ దండలని విమర్శలు?

`గతంలో కూడా ‘‘600 కోట్ల’’ భూమి అక్రమ రిజిస్ట్రేషన్‌ పై కూడా ‘‘సీఎం పేషీ’’ పెద్దలే కాపాడారట?

`ఆ అక్రమ రిజిస్ట్రేషన్‌ లో కటకటాల పాలైన ఉద్యోగులు?

`10 సంవత్సరాలకు పైబడి పెండిరగ్లో ఉన్న ‘‘ప్రభుత్వ భూమి’’ ని ‘‘సబ్‌ రిజిస్టార్‌’’ తో బలవంతంగా రిజిస్ట్రేషన్‌ చేయించారా?

`ప్రభుత్వ భూమి’’ని రిజిస్ట్రేషన్‌ చేయించిన ఆ ‘‘డిఆర్‌’’ఎవరు?

`డాక్యుమెంట్‌’’ ని కనుమరుగు చేసిందెవరు?

`కులం’’ ముసుగులో శాఖను ‘‘మంత్రి’’ పేరు బ్రష్టు పట్టిస్తున్నదెవరు?

హైదరాబాద్‌, నేటిధాత్రి:                        ప్రభుత్వ భూములంటే అధికారులకు పప్పుబెల్లాలకంటే అద్వాహ్నమైపోయాయి. ఏ అధికారి ఏ భూమిని ఎవరికి అప్పగిస్తున్నారన్నదికూడా తెలియకుండాపోతోంది. టెక్నాలజీలోవచ్చిన మార్పులను అనువుగా మార్చుకుంటున్నారు. ప్రభుత్వం జీవోలు దాచిపెట్టినట్లే..అధికారులు రిజిస్ట్రేషన్‌ చేసిన భూముల వివరాలను కూడా మూడో కంటికి తెలియకుండా దాచేస్తున్నారు. ప్రభుత్వ భూములు కాపాడాల్సిన అధికారులే ఇలా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతున్నారు. ప్రభుత్వ భూములను ప్రైవేటు భూములుగా మార్చేస్తున్నారు. కోట్లాది రూపాయల విలువైన భూములను కోట్ల రూపాయల లంచాలు తీసుకొని అప్పగిస్తున్నారన్న వార్తలు అనేకం వున్నాయి. అయినా పట్టించుకుంటున్న వారు లేరు. చర్యలు తీసుకుంటున్నవారు లేదు. రిజిస్రేషన్‌శాఖ అధికారుల విచ్చలవిడి తనానికి ఇది ఒక పరాకాష్టగా మారింది. ముఖ్యంగా తెలంగాణ రాక ముందు భూముల ధరలు ఇంతలా వుండేవి కాదు. భూముల మీద పెద్దగా పెట్టుబడులు పెట్టాలన్న ఆలోచనల చాలా మంది చేయలేదు. నగరం ఇంతగా విస్తరించలేదు. ఒకప్పుడు రంగారెడ్డి జిల్లా పరిధిలోని భూములు కొనుగోలు చేయాలంటే కూడా ఎవరూ ముందుకు వచ్చేవారుకాదు. కాని ఇప్పుడు ప్రైవేటు, ప్రభుత్వ స్ధలాలు ఏదీ వదలడం లేదు. దొంగలు దొంగలు ఊర్లు పంచుకుంటున్నట్లు కొంత మంది అవినీతిపరులైన అదికారులు, రియల్‌ వ్యాపారులు కలసి ప్రభుత్వ భూములన్నింటికీ చెరపడుతున్నారు. సహజంగా ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ వున్నాయన్న సంగతి కేవలం అధికారులకు మాత్రమే తెలుసు. అలాంటి అదికారుల వల్ల రియల్‌ వ్యాపారులు ఆ భూముల వివరాలు తెలుసుకొని వాటిని ఆక్రమించుకుంటున్నారు. అధికారుల చేత రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. రాత్రికి రాత్రే అప్పార్టుమెంట్లు నిర్మాణాలు చేస్తున్నారు. వెంచర్లు చేసి అమ్మేసుకుంటున్నారు. కొనుక్కున్న వారు తర్వాత లబోదబో మంటున్నారు. ఒకప్పుడు చాలా మంది నగరం మధ్యలో వుండాలని అనుకునేవారు. ఇప్పుడు నగరానికి కొంత దూరంలో వుండాలని జనం భావిస్తున్నారు. పొల్యూషన్‌ ప్రీ ప్రాంతాలను ఎంచుకోవాలనుకుంటున్నారు. ఇది రియల్‌ వ్యాపారులకు వరమైపోయింది. అదికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పుడున్న పరిస్దితుల్లో రైతులు భూములు అమ్ముకోవడానికి సిద్దంగా లేరు. దాంతో వ్యాపారం చేయాలనుకుంటున్న రియల్‌ వ్యాపారులకు ప్రభుత్వ భూములే దిక్కు. వాటిని ప్రభుత్వం నుంచి కొనుగోలు చేయాలంటే చాలా డబ్బు కావాలి. అందులోనూ ప్రభుత్వం అమ్మాలనుకుంటున్న భూములనే కొనుగోలు చేయాలి. అయినా ఆ భూములు కొనుగోలు చేయాలంటే చిన్నా, చితకా వ్యాపారులకు సాద్యం కాదు. కాని తక్కువలో ఎక్కువ విలువ కలిగిన భూములను కొట్టేయాలంటే అదికారులకు ప్రసన్నం చేసుకుంటే చాలు. ఆ భూములు వారి పరమైపోతాయి. లంచాలకు బాగా అలవాటు పడిన రిజిస్ట్రేషన్‌ శాఖ అదికారులకు రంగారెడ్డి జిల్లా అంటే బంగారు బాతు గుడ్డుకన్నా ఎక్కువ. అందుకే రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో ఉద్యోగం అంటే చాలు ఏడు తరాలకు సరిపడ సంపాదించుకోవచ్చు. అనే మాటలు వినిపిస్తున్నాయి. అలా రంగారెడ్డి జిల్లా పరిధిలో వున్నరిజిస్ట్రేషన్‌ శాఖలో అదికారులు కొంత మంది వందల, వేల కోట్ల రూపాయల విలువగలిగిన భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తున్నారు. అలాంటిదే ఇప్పుడు చెప్పబోయే రియల్‌ కథ. సరూర్‌ నగర్‌ పరిధిలో వున్న తలాబ్‌ కట్ట ప్రాంతంలో పెద్దఎత్తున ప్రభుత్వ భూమి చేతులు మారినట్లు విస్వసనీయ సమాచారం. అది అలాంటి ఇలాంటి భూమి కాదు. కొన్ని వందల కోట్ల విలువ చేసే భూమిని అధికారులు రిజిస్ట్రేషన్‌ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విశేషమేమిటంటే ఆ భూమి ఏమిటో అన్నది తెలియకుండా, చాలా తెలివిగా టెక్నాలజీని అడ్డం పెట్టుకొని పని కానిచ్చారు? సహజంగా నగర పరిదిలో కోటి నుంచి ఐదారు కోట్ల విలువ కలిగిన ఎలాంటి భూములు రిజిస్ట్రేషన్‌ కావాలన్నా సరే పై అధికారులు అనుమతి, సమ్మతి తప్పనిసరి. అలాంటిది వందల కోట్ల రూపాయల విలువైన భూములు ఎలా రిజిస్ట్రేషన్‌ జరుగుతున్నాయన్నది పెద్ద ప్రశ్న. పై స్దాయి అదికారుల నుంచి ఎలాంటి సమ్మతి లేకుండా ఏ రిజిస్ట్రార్‌ ధైర్యం చేసి రిజిస్ట్రేషన్‌ చేయరు. కాని జరుగుతున్నాయి. పై నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి చేసి మరీ రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. కింది స్దాయి అదికారులను ఇరికిస్తున్నారు. కోట్ల రూపాయలు దండుకున్న పై అధికారులు మాత్రం సేఫ్‌గా వుంటున్నారు. కింది స్దాయి అధికారులను బెదిరించి మరీ రిజిస్ట్రేషన్లు జరిగేలా చేస్తున్న వాళ్లు, తేడా వస్తే కింది స్దాయి అదికారులను బలి చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఇలాంటి అక్రమాలు సర్వసాదారణం. ఉద్యోగుల తొలగింపు నిత్య కృత్యం అనేలా సాగుతున్నాయి. అయినా కింది స్దాయి అదికారులు నోరు తెరవలేరు. పై స్దాయి వాళ్లు మాకు సంబందం లేదని చేతులు దులుపుకుంటున్నారు. రంగారెడ్డి జిల్లాలో పాతకుపోయిన ఓ జిల్లా స్దాయి ఉన్నతాదికారి మూలంగా అనేక అక్రమాలు, అవకతవకలు గత కొన్నేళ్లుగా పెద్దఎత్తున జరిగినట్లు అనేక వార్తలున్నాయి. పత్రికల్లో పుంఖాను పుంఖాలుగా వార్తలు వచ్చాయి. అలాంటి వారిని కాపాడేందుకు అటు సిఎం. కార్యాలయం నుంచి మొదలు, సంబందిత మంత్రి కార్యాలయం, శాఖాపరంగా ఉన్నత స్దాయి అదికారులంతా ఒక చైన్‌గా పనిచేస్తున్నారని అనేక ఆరోపణలున్నాయి.అలాంటప్పుడు పట్టుకునేవారు ఎవరు? వివరాలు బైట పెట్టేవారు ఎవరు? ముఖ్యమంత్రి, మంత్రులు వాళ్ల రాజకీయాలు, ప్రజా పాలనలో బిజీగా వుంటారు. అధికారులు ఇలాంటి పనుల్లో బిజీబిజీగా వుంటున్నారు. ప్రభుత్వ పెద్దలకుతెలియకుండా ప్రభుత్వ భూములను అప్పనంగా ముంచేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని సరూర్‌ నగర్‌ మండల పరిదిలో వున్న తలాబ్‌ కట్ట ప్రాంతలో వున్న ప్రభుత్వ విలువైన భూమిని కొట్టేయడానికి గత పదేళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాని కుదరలేదు. ఆ మధ్య కుదిరింది. ఈ మధ్య అది వెలుగులోకి వచ్చింది. అందుకు తెగించిన జిల్లా రిజిస్ట్రార్‌ ఎవరు? ఆదేశాలు జారీ చేసిన ఆ డిఆర్‌ ఎవరన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. డిఆర్‌ చెప్పినట్లు తలూపి రిజిస్ట్రేషన్‌ చేసిన ఆ సబ్‌ రిజిస్ట్రార్‌ ఎవరన్నది కూడా తేలాల్సివుంది. ఏ డిఆర్‌, ఏ ఎస్‌ల టైమ్‌లో జరిగిందనేది వెల్లడి కావాలంటే వెంటనే స్పెషల్‌ ఆడిట్‌ నిర్వహిస్తే గాని తెలియదు. అందరి వేళ్లు ఓ డిర్‌ వైపు చూపిస్తున్నాయి? ఆ డి ఆర్‌ ఎవరు? ఆయన గతంలో కూడా అనేక భూముల రిజిస్రేషన్‌ వ్యవహారాలలో తలదూర్చి, కింది స్దాయి అదికారులు జైలుకు వెళ్లడానికి కారణమయ్యారంటూ కూడా శాఖలో చెప్పుకుంటున్నారు. ఎవరు ఆ డిఆర్‌? అనేది తేలాల్సిన అవసరం వుంది. పక్క జిల్లాలో డిఆర్‌గా పనిచేసిన ఆ డిఆర్‌ సుమారు 600కోట్ల రూపాయల విలువైన లిడ్‌ క్యాప్‌ భూములను ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్‌ చేయించారన్న ఆరోపణలున్నాయి. పత్రికల్లో కూడా అనేక వార్త కథనాలు వచ్చాయి. శంషాబాద్‌ దగ్గర కూడా అదే రిజిస్ట్రార్‌ ప్రభుత్వ భూమిని ఇతరులకు కట్టబెట్టినట్లు వార్తలున్నాయి. ఇలా ఎన్ని రకాల అవినీతి కార్యకలాపాలు సాగిస్తూ, వందల కోట్లు సంపాదిస్తున్న డిఆర్‌ను కాపాడుతున్నది కులమే అని కొందరు అంటున్నారు. కులం పేరు చెప్పుకొని పై స్దాయి అదికారులను ప్రసన్నం చేసుకోవడం, కింది స్దాయి అధికారుల చేత పని చేయించుకోవడం ఆ డిఆర్‌కు తెలిసినంతగా ఎవరికీ తెలియదని అంటున్నారు. కుల పరంగా సిఎం. కార్యాలయం నుంచి మొదలు, మంత్రి కార్యాలయం, కమీషన్‌ కార్యాలయం వరకు ఆ డిఆర్‌ను కాపాడుతున్న వారు ఎవరున్నది తేలితే మొత్తం విషయం బైటకు వస్తుంది. కింది నుంచి పై స్దాయి వరకు తమ కులానికి చెందిన బందువులు, కులబాందవులే వున్నారు. ఎవరూ నన్నేమీ చేయలేరని కూడా ఆ డిఆర్‌ అంటుంటారని ప్రచారం సాగుతోంది. ఇంతకీ ఆ డిఆర్‌ఎవరు? జరుగుతున్న వ్యవహరాలన్నీ తెలిసినా అధికారులు ఎందుకు బైట పెట్టడం లేదు? ఆ డిఆర్‌ను చూసి ఎందుకు ఇతర అధికారులు భయపడుతున్నారు? తాము బలౌతామని తెలిసినా ఆ డిఆర్‌ చెప్పిన పనులు ఎందుకు చేస్తున్నారు? ఇప్పటి వరకు ఎన్ని అక్రమాలు చేశారన్నది వెలుగులోకి రావాలంటే మంత్రి పొంగులేటిశ్రీనివాస్‌ రెడ్డి జోక్యం చేసుకొని స్పెషల్‌ ఆడిట్‌ చేస్తే ఆ డిఆర్‌ బాగోతాలన్నీ బైటకు వస్తాయంటున్నారు? మంత్రి పొంగులేటి స్పందిస్తే రిజిస్ట్రేషన్‌ శాఖలో జరుగుతున్న అక్రమాలన్నీ బైటకు రావడం ఖాయం.

ఆ రెండు కూడా కాంగ్రెస్‌ ఖాతాలోకే!?

 

సిఎం. రేవంత్‌ స్ట్రాంగ్‌ స్ట్రాటజీ!

`కరడుగట్టిన కాంగ్రెస్‌ కుటుంబాలను రంగంలోకి పంపుతారా?

`ఖైరతాబాద్‌ లో విజయారెడ్డిని దింపుతారా?

`స్టేషను ఘన్‌ పూర్‌ లో ఇందిరకు టికెట్‌ ఇస్తారా?

`దానం, కడియంలను మంత్రి వర్గంలోకి తీసుకుంటారా?

`కాంగ్రెస్‌ నుంచి విజయారెడ్డి, బిఆర్‌ఎస్‌ నుంచి మన్నె గోవర్ధన్‌ రెడ్డి!

`ఒకవేళ మన్నె గోవర్ధన్‌ రెడ్డికి ఇవ్వకపోతే బిఆర్‌ఎస్‌ కు వెంటనే రాం రాం!

`కాంగ్రెస్‌ నుంచి ఇందిర, బీఆర్‌ఎస్‌ నుంచి రాజయ్య!

`రాజయ్యకిస్తే దళితబంధు వసూళ్లు ముందేసి ప్రచారం చేస్తారా!

`ఖైరతాబాద్‌ బాధ్యతలు దానంకు, నవీన్‌ యాదవ్‌కు ,రోహిణ్‌ రెడ్డి కి అప్పగిస్తారు!

`స్టేషను ఘన్‌పూర్‌ కడియం, ఇతర ఎమ్మెల్యేలకు బాధ్యతలు!

`రోహిణ్‌ రెడ్డి నాయకత్వంలో, దానం ,నవీన్‌ సహకారంతో ఖైరతాబాద్‌ గెలిచే అవకాశం!

`కడియం చాణక్యంతో స్టేషను ఘన్‌పూర్‌ సొంతం చేసుకోవడంలో విజయం!

`ఇప్పటికైనా కాంగ్రెస్‌ అడుగులు బీఆర్‌ఎస్‌ అంచనా వేయకపోతే కష్టమే?

`ఆ రెండు స్థానాలు కూడా చే జేతులా చేతికి అప్పగించడమే!

`ఇప్పటి నుంచి లోతైన, పదునైన వ్యూహాలు లేకపోతే మొదటికే మోసమే!

`నాయకుల అభిప్రాయాలకు విలువివ్వకపోతే మరో సారి మునుగుడు ఖాయమే!

`సూచనలిచ్చే వాళ్లను కాదని, గొప్పులు చెప్పే వారి మాటలు వింటే మిగిలేవి ఓటములే?

హైదరాబాద్‌, నేటిధాత్రి:                         రాజకీయపార్టీలకు ఎన్నికలు ఎప్పుడూ తలనొప్పే. ఎప్పుడూ పరీక్షే. ఎన్నికలంటే చాలు రాజకీయ పార్టీలకు మోయలేనంత బారమే? కాని పార్టీలు సాగాలంటే , పదవులు పొందాలంటే , పాలన సాగించాలంటే రాజకీయాలు తప్పవు. అందుకు ఎన్నికలంటే ఎంత కష్టమైనా సరే సై అనకపోతే ఆ పార్టీలకు తిప్పలే. తెలంగాణలో ఇటీవలే ఓ ఉప ఎన్నిక ఘట్టం ముగిసింది. ఫలితం తేలింది. అది అనూహ్యమైంది. ఎవరూ ఊహించనిది. గెలుపు కూడా అంతే విచిత్రమైంది. ఉరికి ఉరికి బోల్తా పడిరది బిఆర్‌ఎస్‌. అసలు గెలుస్తామా లేదా? అనే సందిగ్ధంలో కొట్టు మిట్టాడిన కాంగ్రెస్‌ గెలిచింది. ప్రజా తీర్పు ఈ విధంగా వుంటుందని ఎవరూ ఊహించలేదు. బోల్తాపడతామని బిఆర్‌ఎస్‌ కల గనలేదు. కాని ఫలితం తారు మారైంది. బిఆర్‌ఎస్‌ కొత్త కష్టం తెచ్చిపెట్టింది. కాంగ్రెస్‌లో మాత్రం జోష్‌ నింపింది. ఇక ఎన్నికలు ఏవైనా సరే సై అనే పరిస్దితికి వచ్చేసింది. ఎందుకంటే బిఆర్‌ఎస్‌ చేసిన ప్రచారం వల్ల ఎక్కడో కంగ్రెస్‌కు కూడా కొన్ని అనుమానాలు తీవ్రంగా వుండేవి. ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా అవి పటాపంచెలైపోయినట్లే. రేవంత్‌ సర్కారుమీద బిఆర్‌ఎస్‌ ఊహించిన వ్యతిరేకత తేనట్లే. రాష్ట్రంలో తర్వలో మరి కొన్ని ఉప ఎన్నికలు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అవి రెండా..పదా అనేది త్వరలోనే తేలుతుంది. కాని సిఎం. రేవంత్‌ రెడ్డి మాత్రం ఒక్కసారిగా పది ఉప ఎన్నికలకు వెళ్లేందుకు సిద్దంగా లేరు. సుప్రింకోర్టు తీర్పు ఎలా వుంటుందో ఇప్పుడే ఊహించలేం. కాని ఉప ఎన్నికలు అనేవి తధ్యమని తెలుస్తోంది. సుప్రింకోర్టు తెలంగాణ స్పీకర్‌కు మరో నాలుగు వారాల గడువు మంజూరు చేశారు. ఆ పై తాము జోక్యం చేసుకుంటామని చెప్పారు. అయితే ఈ లోపు ఓ ఇద్దరు ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి, ఇతర ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరలేదు? అని స్పీకర్‌ కోర్టుకు సమాదానం ఇచ్చే అవకాశం లేకపోలేదు. కాంగ్రెస్‌లో చేరిన ఇద్దరి చేత ప్రభుత్వమే రాజీనామా చేయించింది. దాంతో వారి మీద చర్యలు తీసుకోవాల్సిన అసవరం లేదు. మిగతా ఎనమిది మంది తాము పార్టీ మారలేదని స్పష్టం చేస్తున్నారని చెప్పొచ్చు. ఏది ఏమైనా రెండు ఉప ఎన్నికలు మాత్రం ముందు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం చూస్తోంది. మిగతా ఎనమిది మంది విషయంలో ఒక వేళ కాలయాపన జరిగే అవకాశం వుంది. ఈలోగా కొత్త ఛీప్‌ జస్టిస్‌ వస్తే కేసు మళ్లీ మొదటికి రావొచ్చు? అనే సందేహాలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఏకంగా రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ తరుపున సికింద్రాబాద్‌ ఎంపిగా పోటీ చేశారు. ఓడిపోయారు. ఇప్పుడు సమస్యల్లో చిక్కుకున్నారు. ఇక మరో ఎమ్మెల్యే స్టేషన్‌ ఘన్‌పూర్‌ కడియం శ్రీహరి. ఆయన చేత కూడా కాంగ్రెస్‌ రాజీనామా చేయించే అవకాశాలులేకపోలేదు. దాంతో రెండు ఉప ఎన్నికలు మాత్రం పక్కా అనే సంకేతాలు వెలువడుతున్నాయి. ముందు రెండు ఉప ఎన్నికలకు వెళ్లి ప్రజా తీర్పును అంచనా వేసుకొని, మిగతా ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలా? వద్దా? అనేది కూడా తేల్చుకునే అవకాశం వుంది. ఈ ఇద్దరి చేత రాజీనామా చేయించినా వారికి టిక్కెట్లు ఇవ్వకుండా ఇతరులకు టికెట్లు ఇవ్వాలని అనుకుంటున్నారట. ఆ స్దానాలను గెలిపించే బాధ్యత ఇద్దరు ఎమ్మెల్యేలకు అప్పగించాలని సిఎం. రేవంత్‌ రెడ్డి ఆలోచిస్తున్నారట. ఆ రెండు సీట్లు కాంగ్రెస్‌ గెలిస్తే దానం నాగేందర్‌, కడియం శ్రీహరిలను మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశాలున్నాయి. ఈ ఇద్దరి చేత రాజీనామా చేయించి కొత్త వారిని రంగంలోకి దింపాలని సిఎం చూస్తున్నారు. అందుకు సిఎం. రేవంత్‌ లెక్కలు మరోలా వున్నాయి. ఖైరతాబాద్‌ నుంచి పిజేఆర్‌కూతరు విజయారెడ్డిని రంగంలోకి దింపుతారని తెలుస్తోంది. ఇటీవల జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల ప్రచారంలో ఆమె పాత్ర చాలా పనిచేసింది. పైగా ఆ నియోజకవర్గంలో విజయారెడ్డికి మంచి పట్టు వుంది. ఖైరతాబాద్‌ నియోజకవర్గం అనేది పిజేఆర్‌కంచు కోట. ఆ కంచుకోటలో గెలుపు సాదించాలంటే విజయారెడ్డికి టికెట్‌ ఇస్తే గెలుపు నల్లేరు మీద నడక అవుతుందని సిఎం. నమ్మకం. పైగా దానం నాగేందర్‌ దగ్గరుండి గెలిపించే బాద్యతలు తీసుకుంటారు. ఇక కడియం స్దానంలో ఇందిరకు టికెట్‌ ఇవ్వాలని అనుకుంటున్నారట. ఆమెకు టికెట్‌ ఇస్తే ఈసారి స్టేషన్‌ ఘన్‌పూర్‌లో కాంగ్రెస్‌ విజయం ఖాయం. ఇప్పటికే ఆమె మూడు సార్లు పోటీ చేసి ఓడిపోయిన సందర్భం వుంది. ఈసారి పోటీ చేస్తే ఖచ్చితంగా సానుభూతి వుంటుంది. ఈసారి గెలిపించాలని జనం కూడా అనుకుంటారు. ఆమె కూడా ఒక్క అవకాశం ఇవ్వండి అని అడిగేందుకు కూడా వీలౌతుంది. అంతే కాకుండా రాజకీయాల్లోనే కాదు, గెలుపోటముల మీద పక్కా లెక్కలు, అంచనాలు వేయగల సమర్ధుడు కడియం శ్రీహరి. జనం నాడిని పట్టుకోవడం ఆయన దిట్ట. గత పార్లమెంటు ఎన్నికల ముందు బిఆర్‌ఎస్‌ పార్టీ పరిస్దితి ఆయన అంచనా వేసినంతగా ఎవరూ వేయలేదు. పైగా బిఆర్‌ఎస్‌ టికెట్‌ తీసుకొని వెంటనే కాంగ్రెస్‌లో చేరి టికెట్‌ తెచ్చుకోవడం అనేది సామాన్యమైన ఎత్తుగడ కాదు. అలాంటి వ్యూహాలు పన్నడం అందరికీ సాద్యం కాదు. అలాంటి ఎత్తుగడల్లో కడియంను కొట్టే వారు లేరు. అందుకే గెలుస్తూ వస్తున్నారు. వరంగల్‌ జిల్లా రాజకీయాలు మూడుదశాబ్దాలుగా శాసిస్తున్నారు. ఈ ఒక్కసారి ఇందిరకు టికెట్‌ ఇప్పించి గెలిపిస్తే వచ్చే సారి కడియం శ్రీహరి కూతురుకే ఆ టికెట్‌ ఇచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు. ఆ ఎన్నికల సమయంలో మంత్రిగా కడియం వుంటారు. తన కూతురుకు టికెట్‌ ఇప్పించుకొని గెలిపించుకుంటారు. ఆయన ఎమ్మెల్సీగా వుంటారు. అలా కడియం కుటుంబమంతా రాజకీయాల్లో వున్నట్లుంటుంది. ఇక బిఆర్‌ఎస్‌ నుంచి రాజయ్యకు టికెట్‌ ఇచ్చినా కడియం రాజకీయం ముందు ఎందుకూ పనికి రాదని అనేకసార్లు రుజువైంది. గాలిలో గెలవడం తప్ప, కడియం మీద పక్కా ప్రణాళితో రాజయ్య గెలిచింది ఏనాడు లేదు. రాజయ్య చిలిపి రాజకీయాలను విసృతంగా ప్రచారం సాగిస్తారు. పైగా రాజయ్య మీద మరోపెద్ద అపవాదు కూడా వుంది. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం వున్నప్పుడు అమలు చేసిన దళిత బంధు విషయంలో సమారు 3వేల మంది వద్ద డబ్బులు తీసుకున్నాడనే ఆరోపణలున్నాయి. బాధితులే స్వయంగా చెప్పిన సందర్బాలున్నాయి. నేరుగా రాజయ్య తీసుకోకపోయినా ఆయన తమ్ముడి చేత వసూలు చేయించారని అంటుంటారు. సరిగ్గా ఎన్నికల ముందు ఈ విషయాన్ని మళ్లీ తెరమీదకు తెస్తారు. రాజయ్య రాజకీయానికి చరమగీతం పాడే ప్రయత్నం కడియం చేస్తారు. పైగా ఉమ్మడి వరంగల్‌లో బిఆర్‌ఎస్‌కు ఎమ్మెల్యేలే లేరు. వున్న వాళ్లంతా కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలే వున్నారు. వాళ్లంతా రంగంలోకి దిగుతారు. అంతే కాకుండా ఖమ్మం నుంచి కారును వెళ్లకుండా చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి ఎలాగూ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రిగా వున్నారు. ఆయన అక్కడే మకాం వేశారంటే ఇక బిఆర్‌ఎస్‌కు చుక్కలే అంటున్నారు. ఇలా స్టేషన్‌ ఘన్‌పూర్‌లో కాంగ్రెస్‌ పాగా వేస్తుందని అంచనాలున్నాయి. ఇక ఖైరతాబాద్‌లో బిఆర్‌ఎస్‌ నుంచి మెన్నె గోవర్ధన్‌ రెడ్డికి టికెట్‌ ఇస్తారని అనుకుంటున్నారు. గతంలో కూడా బిఆర్‌ఎస్‌ ప్రతీసారి మన్నె గోవర్ధన్‌రెడ్డికే టికెట్‌ అంటూ చెప్పడం ఆఖరు నిమిషంలో జెల్లకొట్టడం జరిగింది. ఇప్పుడు కూడా ఇస్తారా? ఇవ్వరా? అన్నది మీమాంసగానే వుంది. ఒక వేళ పొరపాటున బిఆర్‌ఎస్‌ పార్టీ మన్నె గోవర్ధన్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వకపోతే మాత్రం ఖైరతాబాద్‌లో ఆ పార్టీకి చోటు కూడా వుండదు. అంతటి నాయకుడు మరొకరు లేరు. ఒక వేళ ఇంకా ఎవరికైనా ఇవ్వాలని బిఆర్‌ఎస్‌ చూసినా మన్నె గోవర్ధన్‌ రెడ్డి ఈసారి ఎవరు చెప్పినా వినరు. బిఆర్‌ఎస్‌లో కొనసాగరు. కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీకి సహకరిస్తే ఖైరతాబాద్‌ కూడా కాంగ్రెస్‌ ఖాతాలోకి వెళ్తుంది. అటు విజయారెడ్డి, ఇటు దానం, మన్నె కలిస్తే ఖైరతాబాద్‌లో బిఆర్‌ఎస్‌కు డిపాజిట్‌ కూడా రాదు. మన్నె గోవర్ధన్‌రెడ్డికి టికెట్‌ ఇస్తే మాత్రమే బిఆర్‌ఎస్‌ అక్కడ మళ్లీ ఎంతో కొంత ప్రభావం చూపుతుందని అంటున్నారు. ఇప్పటికైనా సరే కాంగ్రెస్‌ పార్టీ అడుగులు, రేవంత్‌ వ్యూహాలు అర్ధం చేసుకోకుండా అతివిశ్వాసంతో బిఆర్‌ఎస్‌ వెళ్తే మాత్రం మరోసారి బొక్కా బోర్లా పడడం ఖాయం. ఇప్పటి నుంచే పదునైన వ్యూహాలు అమలు చేయాలి. క్షేత్ర స్ధాయిలో నాయకులు వుండాలి.

’’బీఆర్‌ఎస్‌’’ కలిసి రాదు..’’టీఆర్‌ఎస్‌’’కు తిరుగులేదు!

`పేరులో ఏముందనుకోకండి?

`ఇంకా మొండి తనం పనికి రాదు.

`పెళ్ళికి కూడా పేరు బలం చూస్తారు.

`’’టీఆర్‌ఎస్‌’’ లో విజయాలు జయకేతనం చూశాయి.

`‘‘బీఆర్‌ఎస్‌’’ లో పరాజయాలు పకపక నువ్వుతున్నాయి.

`పదే పదే అపజయాలు పరిహాసమాడుతున్నాయి.

`అంతా నాకే తెలుసు అనుకుంటే ఇలాగే వుంటుంది.

`’’టీఆర్‌ఎస్‌’’ లో తెలంగాణ ఆత్మ వుంది!

`’’టీఆర్‌ఎస్‌’’ లో తెలంగాణ ఆత్మగౌరవం వుంది.

`’’టీఆర్‌ఎస్‌’’ లో పోరాటం వుంది.

`తెలంగాణ కోసం తెగింపు వుంది.

`తెలంగాణ పోరాట పటిమ వుంది.

`తెలంగాణ సాధించిన ఘనత వుంది.

`’’టీఆర్‌ఎస్‌’’ లో తెలంగాణ ఆవిష్కారముంది.

`బంగారు తెలంగాణ చేసిన చరిత్ర వుంది.

`’’బీఆర్‌ఎస్‌’’ లో అదేమి కనిపించడం లేదు.

`వరుస ఓటములు తప్ప మిగిలిందేమీ లేదు.

`పార్టీలో లుకలుకలు తప్ప సాధించిందేమీ లేదు.

`పార్టీ నాయకులంతా ‘‘టీఆర్‌ఎస్‌’’ కోరుకుంటున్నారు.

`సాంకేతిక సమస్యల పేరు చెప్పుకుంటూ పోతే నిండా మునుగొచ్చు!

`తెలంగాణలో కూడా ఉనికి లేకుండా పోవచ్చు!

`మొదటికే మెసం రావచ్చు!

`కోరికోరి ఇంకా కొరివితో తల గోక్కోవద్దు.

 

హైదరాబాద్‌, నేటిధాత్రి:                                        

ఒక్క ఓటమి అనేక విజయాలకు పునాది కావొచ్చు. ఒక్క గెలుపు వరుస విజయాలకు బాట కావొచ్చు. ఆ పార్టీ రాజకీయాలకు మలుపుకావొచ్చు. రాజకీయాల్లో ఇదే నిజం కావొచ్చు. రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం అనేది పాత మాట. కేంద్రంలో బిజేపిని చూసిన తర్వాత ఆ మాట మార్చుకోవాల్సిందే. అందుకు బిజేపి రాజకీయాలు సాక్ష్యంగా తీసుకోవచ్చు. కేంద్రంలో వరుస ఓటమలను ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ పరిస్దితి రాష్ట్రాలలో ప్రాంతీయపార్టీలకు రావొద్దు. ముఖ్యంగా తెలంగాణలో బిఆర్‌ఎస్‌ పార్టీకి అసలే రావొద్దు. ఎందుకంటే బిఆర్‌ఎస్‌ అనేది ఇప్పుడు పేరు మార్చుకున్నప్పటికీ ఉద్యమ పార్టీ అనే ముద్ర దానిపై వుంది. కాని బలంగా లేదు. ఉద్యమ పార్టీ అనే ముద్రలు చేజేతులా ఆ పార్టీ అదినేత కేసిఆర్‌ చేరిపేసుకున్నట్లైంది. టిఆర్‌ఎస్‌ నుంచి పార్టీ పేరు బిఆర్‌ఎస్‌కు మార్చడంతోనే పతనం మొదలైంది. ఆనాడు పార్టీలో ఏ నాయకుడు పేరు మార్పు కోరలేదు. నిజం చెప్పాలంటే కనీసం సూచించలేదు. దక్షిణాది నుంచి జాతీయ పార్టీ వుండొద్దా? అనే ఆలోచనతో కేసిఆర్‌ చేసిన ప్రతిపాదన మాత్రమే. జాతీయ స్దాయిలో చక్రం తిప్పేందుకు వేసిన ఎత్తుగడ మాత్రమే. కాని జాతీయ స్దాయిలో కీలక భూమిక పోషించాలన్న ఆలోచనతో ఉత్తరాదిలోనే ప్రస్దానం మొదలు పెట్టిన బహుజన సమాజ్‌ పార్టీ సొంత రాష్ట్రంలోనే మనుగడ కోసం పోరాటం చేయాల్సి వస్తోంది. చీలికలు పీలికలైపోయింది. జాతీయ పార్టీల రాజకీయాలను తట్టుకోలేకపోతోంది. రాజకీయాల్లోకి ఉవ్వెత్తున వచ్చిన ఆప్‌ లాంటి పార్టీ కూడాడిల్లీలో ఓటమిని మూట గట్టుకున్నది. జాతీయ స్దాయిలో ఎదగాలనుకొని, సొంత రాష్ట్రం డిల్లీలో చతికిలపడిపోయింది. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేజ్రీవాల్‌ ఇమేజ్‌ యమునా నదిలో కలిసిపోయింది. నడుస్తున్న రాజకీయాలను చూస్తూ అడులేయడం నేర్చుకోకపోతే పరిస్దితి చే జారిపోతుంది. కమలం వికాసానికి దారులు తెరిచినట్లౌవుంది. తెలంగాణలో ఇప్పటికైనా బిఆర్‌ఎస్‌ తేరుకోకపోతే భవిష్యత్తు మరింత అందకారమౌతుంది. చెప్పుడు మాటలో, లేక అధినేత ఆలోచనలో గాని వాస్తవంలో వుండాలి. నేల విడిచి సాము చేసేలా వుండకూడదు. ముఖ్యంగా టిఆర్‌ఎస్‌ అనే పేరు నుంచి బిఆర్‌ఎస్‌అనే పేరు మార్పునాడే పతనానికి రెడ్‌ కార్పెట్‌ పరుచుకున్నట్లైంది. పదేళ్లపాటు కేసిఆర్‌పాలనలో తెలంగాణకు ఎంతో మేలు జరిగింది. కాని వాటిని ప్రచారం చేసుకోవడానికి ఆంద్రా మీడియానే నమ్ముకొని కేసిఆర్‌ నిండా మునిగారు. ఇప్పటికీ అదే మీడియాను నమ్ముకొని కేసిఆర్‌, కేటిఆర్‌, హరీష్‌రావులు రాజకీయం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ కారులు తలగలబెట్టిన ఆంధ్ర జ్యోతి పత్రికనే కేసిఆర్‌ నెత్తిన పెట్టుకుంటూ వచ్చారు. ఆ పత్రిక కార్యాలయం అగ్నికి ఆహుతి కాగానే కొంపలు ముగినిపోయినట్లు కేసిఆర్‌ వెళ్లి కార్యాలయం పరిశీలించారు. ఆ పత్రిక అధినేత రాధాకృష్ణకు ధైర్యం కల్పించారు. కాని ఆ పత్రిక బిఆర్‌ఎస్‌ మీద విషం చిప్పడం ఏనాడు ఆపలేదు. బిఆర్‌ఎస్‌ పతనం చూసే దాక నిద్రపోలేదు. అలాంటి వారిని నమ్ముకొని రాజకీయాలు చేయడమే కాదు, ప్రభుత్వ ధనాన్ని ప్రకటనల రూపంలో దార పోశారు. ఆంద్రా మీడియాను బతికించారు. ఆంద్రా మీడియాకు విశ్వాసంవుండదన్న సంగతి తెలిసినా ఇప్పటికీ ఆ మీడియాకే పల్లకి మోస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితిని భారత రాష్ట్ర సమితిగా మార్చాలన్న ఆలోచనలు చేసిన నాడు తెలంగాణ సమాజమంతా ఆ ప్రయత్నం వద్దని వారించింది. ఎంతో మంది మేధావులు కూడా వద్దని చెప్పారు. కాని ఆంద్రామీడియా మాత్రం అహో..ఓహో అని రెచ్చగొట్టారు. అప్పుడు ఆంద్రా మీడియా చాలా గొప్పగా కనిపించింది. లోన టిఆర్‌ఎస్‌ పార్టీ జాతీయ స్దాయికి ఎదగడం సుతారం ఆంద్రా మీడియాకు ఇష్టం వుండదు. తెలంగాణ రాష్ట్రం రావడమే ఇష్టం లేని ఆంద్రా మీడియా బిఆర్‌ఎస్‌గా మారితే ఎలా సపోర్టు చేస్తుందని అనుకున్నారో ఆ పార్టీ పెద్దలకే తెలియాలి. ఏ ఆంధ్రజ్యోతికి పెద్ద పీట వేసి వెనకేసుకొచ్చారో…అదే పత్రిక రేవంత్‌ రెడ్డి పిసిసి. అధ్యక్షుడైన నాటి నుంచి బిఆర్‌ఎస్‌ మీద విషం చిమ్ముతూనే వచ్చారు. రాహుల్‌ గాంధీ తెలంగాణకు వచ్చిన సందర్భంలో ఓ హోటల్‌లో జరిగిన సమావేశానికి ఆంద్రామీడియా అంతా వెళ్లారు. అప్పటి నుంచి కేసిఆర్‌ ఓడిపోయే దాకా అసత్యాలు రాస్తూనే వచ్చారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మునిగిపోయింది లేదు. టిఆర్‌ఎస్‌ పేరులో వున్న బలం బిఆర్‌ఎస్‌లో లేదు. భవిష్యత్తులో మళ్లీ పార్టీ గెలవాలన్నా, మళ్లీ కేసిఆర్‌ సిఎం. కావాలన్న పార్టీ పేరు మార్పు జరిగితే తప్ప తెలంగాణ ఆత్మ కలిసి రాదు. కేసిఆర్‌ తర్వాత కూడా పార్టీ నిలబడాలి కేటిఆర్‌ సిఎం. కావాలి అంటే కూడా టిఆర్‌ఎస్‌గా మార్పు చెందాలి. ఇంకా పార్టీ అధినేత కేసిఆర్‌కు మొండితనం పనికిరాదు. పార్టీలో ఈ చర్చ పెడితే నూటికి 99శాతం మంది కూడా మళ్లీ టిఆర్‌ఎస్‌ పేరు కావాలనే కోరుకుంటారు. పార్టీ తెలంగాణలోనైనా బతడం ముఖ్యమా? లేక మొత్తనికే మునగడం అవసరమా? అనేది కేసిఆర్‌ తేల్చుకోవాలి. పెళ్లికి కూడా పేరు బలం చూస్తారు. పుట్టిన నక్షత్రం ఆదారంగానే పేరు పెట్టాలంటారు. ఇది తెలియనంత అమాయకుడు కాదు కేసిఆర్‌. అయినా తప్పటడుగు పడిరది. దానిని దిద్దుకునే అవకాశం వుంది. కేసిఆర్‌ అంటే తెలంగాణ ఆత్మ. తెలంగాణ కష్టం చూసి రాష్ట్రం కోసం పోరాటం చేశారు. బిజేపి అఖంఢభారత్‌ నినాదం ఎలాంటిదో..కేసిఆర్‌ బిఆర్‌ఎస్‌ పేరు కూడా అంతే.! ఎందుకంటే నిత్యం ముస్లిం పేరు చెప్పి రాజకీయం చేసే బిజేపి అఖండ బారత్‌ నిర్మాణం అనేది ఒక మిద్య. అది సాద్యమయ్యేది కాదు. సాద్యమైతే హిందూ మతానికే ప్రమాదమని వారికి తెలుసు. పాకిస్తాన్‌లోవున్న 25కోట్లు, బంగాదేశ్‌లోవున్న 15 కోట్లు, మన దేశంలో వున్న 45 కోట్ల మంది ముస్లింలు కలిస్తే అధికారం హిందువుల చేతుల్లో నుంచి పోతుంది. ఈ సంగతి తెలిసినా అఖంఢ బారత్‌ అని బిజేపి నినదిస్తుంది. కాని ఆచరణలోవుండదు. కేసిఆర్‌ కూడా బిఆర్‌ఎస్‌ వల్ల కోలుకోమని తెలిసనా పేరు మార్చారు. ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. టిఆర్‌ఎస్‌ పార్టీ పెట్టినప్పుడు దేశ రాజకీయాల గురించి ఆలోచించలేదు. ఇప్పుడు ఆలోచిస్తే ఫలితం లేదు. ఎందుకంటే అఖండ భారత్‌లో హిందూ ఆత్మ వుండదని బిజేపి గ్రహించింది. అందుకే వరుసగా విజయాలు సాదిస్తోంది. మెజార్టీ హిందువుల ఓట్లతో అప్రతిహాతంగా గెలుస్తూ వస్తోంది. కేసిఆర్‌ చేయాల్సిన పని కూడా అదే. ఇప్పటికైనా సరే బిఆర్‌ఎస్‌ పేరును వెంటనే టిఆర్‌ఎస్‌గా మార్చుకోవాలి. అందుకు సాంకేతిక సమస్యలనే సాకు చెప్పుకుంటూ పోతే మరింత నష్టపోకతప్పదు. పార్టీకి బిఆర్‌ఎస్‌ పేరు సమస్యే కాదనుకుంటూ కాలయాపన చేసే పార్టీ కూడా మిగలకపోవచ్చు. ఒకవేళ పది మంది ఎమ్మెల్యేల ఉప ఎన్నికలు వస్తే ఆ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ గెలవపోతే ఏం జరుగుతుందో కేసిఆర్‌కు తెలుసు. ఇప్పుడు ఏ కేసిఆర్‌ను చూస్తూ జాతి పిత అని కొలుస్తున్నారో వాళ్లే తిట్టే రోజులు వస్తాయి. కాలమహిమ అంటే అదే. అంత దూరం తెచ్చుకోవద్దు. ఎందుకంటే బిఆర్‌ఎస్‌లో తెలంగాణ ఆత్మ లేదు. భూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. టిఆర్‌ఎస్‌ పేరుతో అనేక విజయాలు సొంతమయ్యాయి. అపజయాలు తొలుత పలకరించినా అవి మళ్లీ విజయాలుగా మారాయి. బిఆర్‌ఎస్‌ పేరు మార్చిన నుంచి వరుస పరాజయాలు పలకరిస్తున్నాయి. పార్టీని చూసి పకపక నవ్వుకుంటున్నాయి. పదే పదే పరాజయాలు బిఆర్‌ఎస్‌ను పరిహాసమాడుతున్నాయి. తెలంగాణలో ఎంతో మంది కేసిఆర్‌ శ్రేయోభిషులు ఇప్పటికీ సూచిస్తున్నారు. పేరు మార్చండని కోరుతున్నారు. అయినా మేం వినం అనుకుంటూ కూర్చుంటే చేసేదేమీ లేదు. బిఆర్‌ఎస్‌ వచ్చిన తర్వాత వరుస ఓటములు తప్ప విజయాలు లేవు. పార్టీలో లుకలుకలు తప్ప ఐక్యత కనిపించడం లేదు. ఆఖరుకు ఎమ్మెల్సీ కవిత కూడా బైటకు వెళ్లాల్సిన పరిస్దితి ఎదురైంది. పార్టీ కష్ట కాలంలోకి నెట్టి వేయబడిరది. ఇంకా కాలయాపన చేయొద్దు. నాయకుల అభిప్రాయాలు తీసుకోండి. జనం కూడా ఏమనుకుంటున్నారో మరోసారి అభిప్రాయ సేకరణ చేపట్టండి. ఆంద్రా మీడియా ముసుగును తొలగించుకోండి. ఆంద్రా మీడియా ఎప్పుడూ తెలంగాణకు శత్రువే. టిఆర్‌ఎస్‌ ఆంద్రామీడియా ఆట కట్టించింది. బిఆర్‌ఎస్‌ ఆంద్రామీడియ ఆటలను చూస్తూ వుండిపోతోంది. ఇంతకన్నా సాక్ష్యం మరొకటి అవసరం లేదు. మార్పుకు ఇంకా శషబిషలు అక్కర్లేదు.

పాలనపై పట్టు..ఎన్నికలలో హిట్టు!

`జూబ్లీ గెలుపుతో ‘‘రేవంత్‌’’ గ్రాఫ్‌ ఎవరెస్టు

`‘‘సీఎం. రేవంత్‌’’ ప్రచారం జూబ్లీ విజయం

`‘‘రేవంత్‌’’ పట్టుదల ముందు బిఆర్‌ఎస్‌ ఓడిపోయింది

`‘‘రేవంత్‌’’ పాలనే బాగుందనుకున్నారు

-‘‘బీఆర్‌ఎస్‌’’ కన్నా మెరుగే అని విశ్వసించినట్లున్నారు

-జూబ్లీ ఎన్నికల ముందున్న ఆలోచనలన్నీ పటా పంచెలు

REVANTH REDDY VICTORY IN JUBLIEE HILLS BY-ELECTION

-ఇక ‘‘సీఎం రేవంత్‌ రెడ్డి’’కి తిరుగులేదు

-పార్టీలోనూ ఎదురులేకుండా చూసుకున్నారు

-వరుస విజయాలతో దూసుకుపోతున్నారు

-సాధారణ ఎన్నికలు ఒంటి చేత్తో గెలిపించారు

-ఉప ఎన్నికలన్నీ గెలుస్తూ వస్తున్నారు

-పార్లమెంటు ఎన్నికలలోనూ మెరుగైన ఫలితాలు సాధించిపెట్టారు

-ఈ విజయాల పరంపర కొనసాగిస్తే ‘‘రేవంత్‌ రెడ్డి’’ కి ఎదురుండదు

అంచనాలకు అందని నాయకుడు ‘‘సిఎం. రేవంత్‌ రెడ్డి’’. రాజకీయంగా స్వయం కృషితో బాటలు వేసుకొని విజయాలు సొంతం చేసుకోవడం ‘‘రేవంత్‌ రెడ్డి’’ కి కొత్త కాదు. అలుపెరగని రాజకీయ ప్రయాణంలో జూబ్లీ హిల్స్‌ CONGRESS‌ కైవసం ఒక చరిత్ర. జూబ్లీ హిల్స్‌ ఎలక్షన్‌లో వార్‌ వన్‌ సైడ్‌ చేసి అఖండ మెజారిటీతో అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ ను గెలిపించారు. దటీజ్‌ ‘‘రేవంత్‌ రెడ్డి’’ అని నిరూపించారు. బిఆర్‌ఎస్‌ ఆశలను పటాపంచెలు చేసి కాంగ్రెస్‌ కు విజయాన్ని అందించారు. అటు పాలనలో దూసుకుపోతున్నారు. ఇటు పార్టీకి ఎన్నికల వరుస విజయాలు అందిస్తున్న ‘‘రేవంత్‌ రెడ్డి’’ వ్యూహాలను చేధించడం ఎవరి వల్ల కాదని మరోసారి నిరూపించారు. గెలుపంటే ఇదీ అని రాజకీయాలకే ఒక పాఠం నేర్పి, పార్టీకి మరింత బలాన్ని ‘‘రేవంత్‌ రెడ్డి (REVANTH REDDY) ’’ పెంచారు. అంటున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు ‘‘రోహిన్‌ రెడ్డి’’(ROHIN REDDY), నేటిధాత్రి ఎడిటర్‌ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ తో పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే…

రాజకీయాల్లో గెలుపోటములు సహజమే. కాని ప్రతి ఎన్నికను గెలిపించుకోవాల్సిన అవసరం వుంటుంది. అలా ప్రతి ఎన్నికను గెలిపించుకునే నాయకులు చిరిత్ర సృష్టిస్తారు. అందులో సిఎం. రేవంత్‌ రెడ్డి వుంటారు. ఇది అతిశయోక్తి అసలే కాదు. ఎందుకంటే సిఎం. రేవంత్‌ రెడ్డి ఒంటి చేత్తో అందించిన విజయాలు రాష్ట్రంలో అనేకం వున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌లో నమ్మకం కల్గించడంలో రేవంత్‌ రెడ్డి పోషించిన పాత్ర అంతా ఇంతా కాదు. తెలంగాణ ఇచ్చినా రాష్ట్రంలో అధికారం కోల్పోయిన పదేళ్లపాటు కాంగ్రెస్‌ ప్రతిపక్షంలో వుంది. అనేక అపజయాలు చవి చూడాల్సి వచ్చింది. అది ఏ ఒక్కరి లోపం కాదు. కాని గెలవలేదు. కారణాలు అనేకం వుండొచ్చు. అయితే ప్రజల్లో నమ్మకం నింపే నాయకుడు పార్టీలకు కావాలి. పాలకులుగా వుండాలి. ముందు ఏ నాయకుడైనా పార్టీకి ధైర్యం కావాలి. నాయకులకు భరోసా కల్పించే స్దితిలో వుండాలి. ప్రజలకు నమ్మకం కల్గించాలి. పార్టీ మీద ప్రజలకు విశ్వాసం నింపాలి. పదేళ్లపాటు ప్రతిపక్షంలో వున్నా గెలుపు తీరాలకు చేర్చే పూర్తి భాధ్యతను భుజాన వేసుకునే నాయకుడుగా కాంగ్రెస్‌ అధిష్టానానికి రేవంత్‌ రెడ్డి కల్పించారు. అది సామాన్యమైన విషయం కాదు. అందుకు ఎంతో శ్రమ పడాల్సి వుంటుంది. పార్టీ పెద్దలకు నమ్మకం కల్పించాల్సి వుంటుంది. ఏ రకమైన సవాలునైనా స్వీకరించే స్ధితిలో నాయకుడు వుండాలి. అన్ని సమస్యలను ఎదుర్కొనే శక్తివంతుడై వుండాలి. అవన్నీ సిఎం. రేవంత్‌ రెడ్డిలో వున్నాయి. అందుకే కాంగ్రెస్‌లో చేరిన అనతి కాలంలోనే ఆయన పార్టీకి పిసిసి. అధ్యక్షుడు కాగలిగారు. పార్టీని గాడిలో పెట్టగలిగారు. ఆనాడు ఆయన ఎదుర్కొన్న సవాళ్లు అన్నీ ఇన్నీ కావు. ప్రతి కుటుంబ పెద్దకు ఇంటి సమస్యలుంటాయి. వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొన్నప్పుడు కుటుంబమైనా, రాజకీయ పార్టీ అయినా దారిలో పడుతుంది. అందుకు ఆ పెద్దకు ఎంతో ఓపిక కావాలి. ఒక కుటుంబంలోనే నలుగురు నాలుగు రకాలై ఆలోచనలతో వుంటారు. రాజకీయ పార్టీలో కొన్న లక్షల మంది వుంటారు. అందర్నీ సంతృప్తి పర్చుకుంటూ ముందుకు సాగినప్పుడే పార్టీ నిలబడుతుంది. అని బలంగా నమ్మిన నాయకుడు సిఎం. రేవంత్‌ రెడ్డి. ఒక్క మాటలో చెప్పాలంటే సిఎం. రేవంత్‌ రెడ్డి ఎవరి అంచనాలకు అందని నాయకుడు. ఆయన వేసే అడుగులు ఎంత బలంగా వుంటాయో…ఆయన వ్యూహాలు ప్రత్యర్ధులకు అంతు చిక్క కుండా వుంటాయి. అందుకే తాజాగా గెలిచిన జూబ్లీ బైపోల్‌లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధి నవీన్‌ యాదవ్‌ గెలుపొందారు. సరిగ్గా ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే వరకు పరిస్దితి ఎలా వుందో అందిరికీ తెలుసు. కాకపోతే అవన్నీ బిఆర్‌ఎస్‌ ఊహలు మాత్రమే. ప్రభుత్వం మీద ఎంతో ప్రజల్లో వ్యతిరేకత వున్నట్లు సోషల్‌మీడియా ద్వారా విసృతంగా ప్రచారం చేశారు. నిండు కుండ తొనకదు అన్నట్లు రేవంత్‌ రెడ్డి ఎప్పుడూ స్పందించలేదు. బిఆర్‌ఎస్‌ పార్టీ ఎంత ప్రచారం చేసుకుంటుందో చేసుకోని అని చూశారు. బిఆర్‌ఎస్‌ అసత్య ప్రచారాన్ని ప్రజలు పట్టించుకోవడం లేదని సిఎం. రేవంత్‌ రెడ్డికి తెలుసు. బిఆర్‌ఎస్‌ చేస్తున్న అబద్దపు ప్రచారంలో అర్ధం లేదు. నిజం అంతకన్నా లేదని ప్రజలకు తెలుసు. సిఎం.రేవంత్‌ రెడ్డికి తెలుసు. అందుకే ఆయన గుంభనంగా వున్నారు. కాని బిఆర్‌ఎస్‌ ఎగిరెగిరి పడిరది. ఆఖరుకు ఏమైంది. సిఎం. రేవంత్‌ రెడ్డి రంగంలోకి దిగారు. వార్‌ వన్‌సైడ్‌ చేశారు. అదీ నాయకుడి గొప్పదనం. బిఆర్‌ఎస్‌ అనేది ఉద్యమ కాలంలో ఒక రకమైన సెంటిమెంటు, అధికారంలో వున్నప్పుడు అబద్దాలు విసృతంగా ప్రచారం చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు జనాలకు బిఆర్‌ఎస్‌ అంటే ఏమిటో పూర్తిగా తెలిసిపోయింది. ఆ పార్టీ అంతా పైన పటారం, లోన లొటారం అనేది తెలిసింది. అందుకే జూబ్లీలో ప్రజలు మరోసారి బిఆర్‌ఎస్‌ను బండకేసి కొట్టారు. అందుకు సిఎం. రేవంత్‌ రెడ్డి పాలనే నిదర్శనం. కాంగ్రెస్‌ ప్రభుత్వం బిఆర్‌ఎస్‌ కన్నా ఎంతో బాగుంది. రేవంత్‌ రెడ్డి పాలన ఎంతో మెరుగ్గా వుంది. అందుకే బిఆర్‌ఎస్‌కు వీలుకాని ఏ ఉప ఎన్నికలో వీలుకాని మెజార్టీతో కాంగ్రెస్‌ పార్టీ జూబ్లీహిల్స్‌ను గెల్చుకున్నది. సిఎం. రేవంత్‌ రెడ్డి స్వయం ప్రకాశవంతమైన నాయకుడు. స్వయంకృషితో ఎదిగిన నాయకుడు. ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో రాజకీయాలలోకి వచ్చిన నాయకుడు. పేద ప్రజలు కష్టాలు తెలుసు. కన్నీళ్లు తెలుసు. ఆశలు తెలుసు. వారి ఆలోచనలు కూడా రేవంత్‌ రెడ్డికి బాగా తెలుసు. అందుకే ప్రజలు కూడా మా నాయకుడు. పేదల నాయకుడు అని గుండెల్లో పెట్టుకున్నారు. సమయం వచ్చింది. జూబ్లీ ఉప పోరులో సిఎం. రేవంత్‌ రెడ్డిపై వున్న మమకారం మరోసారి చూపించారు. రేవంత్‌ రెడ్డి అలుపెరగని రాజకీయ ప్రయాణంలో జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక గెలుపు కాంగ్రెస్‌ పార్టీకి ఒక చరిత్ర. జూబ్లీ ఉప ఎన్నికను వార్‌ వన్‌ సైడ్‌ చేసి కాంగ్రెస్‌ అభ్యర్ది నవీన్‌ యాదవ్‌ అఖండ మెజార్టీతో గెవడంలో సిఎం. రేవంత్‌ రెడ్డి పోషించిన పాత్ర రాజకీయ పండితులే అంచనా వేయలేకపోయారు. ఎందుకంటే అభ్యర్ధి ఎంపిక నాడే గెలుపును కాంగ్రెస్‌ వైపు తిప్పిన నాయకుడు సిఎం. రేవంత్‌ రెడ్డి. అంత దూరదృష్టితో ఎన్నికలను ఎదుర్కొవడం ఒక్క రేవంత్‌ రెడ్డికే సాద్యమైంది. ఆరు నెలలుగా బిఆర్‌ఎస్‌ పెంచుకున్న ఆశలను వారం రోజుల్లో పటాపంచెలు చేసి, కాంగ్రెస్‌కు విజయాన్ని అందించిన నాయకుడు రేవంత్‌ రెడ్డి. అటు పాలనలో సిఎం. రేవంత్‌ రెడ్డి దూసుకుపోతున్నారు. ఇటు ఎదురయ్యే ఎన్నికలను గెలిపించుకుంటూ పార్టీకి వరుస విజయాలు అందిస్తున్నారు. రేవంత్‌ రెడ్డి రచించే వ్యూహాలు చేదించడం బిఆర్‌ఎస్‌ వల్ల కాదని మరోసారి నిరూపించారు. తన రాజకీయం ముందు బిఆర్‌ఎస్‌ రాజకీయాన్ని తుత్తునీయం చేశారు. గెలుపుంటే ఇదీ అని మరోసారి బిఆర్‌ఎస్‌ గుండెలు అదిరేలా కాంగ్రెస్‌కు విజయాన్ని అందించిన రాజకీయాలకే పాఠం నేర్పిన నాయకుడు రేవంత్‌ రెడ్డి. ఇక జూబ్లీ హిల్స్‌ ఉప ఎన్నిక విజయంతో రాష్ట్ర స్ధాయిలోనే కాదు, జాతీయ స్దాయిలో కూడా సిఎం. రేవంత్‌రెడ్డి గ్రాఫ్‌ ఒక్కసారిగా అమాంతం పెరిగింది. దేశ రాజకీయాలన్నీ ఒక్కసారిగా తెలంగాణ వైపు చూసేలా చేశాయి. రేవంత్‌ రెడ్డి నాయకత్వ పటిమ గురించి దేశమంతా మాట్లాడుకునేలా చేశాయి. ఒక్క మాటలో చెప్పాలంటే సిఎం. రేవంత్‌ రెడ్డి పట్టుదల ముందు బిఆర్‌ఎస్‌ వరుస ఓటములను మూటగట్టుకుంటోంది. జూబ్లీహిల్స్‌ ప్రజుల సిఎం. రేవంత్‌ రెడ్డి పాలనకు డిస్టింక్షన్‌ మార్కులేశారు. బిఆర్‌ఎస్‌ పదేళ్ల పాలన కన్నా సిఎం. రేవంత్‌రెడ్డి పాలన ఎంతో బెటర్‌ అని నిరూపించారు. సాదారణ ఎన్నికలను ఒంటి చేత్తో సిఎం. రేవంత్‌ రెడ్డి గెలిపించారు. తర్వాత వచ్చిన పార్లమెంటు ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు కాంగ్రెస్‌కు సాదించిపెట్టారు. 8 మంది పార్లమెంటు సీట్లను గెలిపించారు. బిఆర్‌ఎస్‌కు రాష్ట్ర రాజకీయాల్లో చోటు లేకుండా చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ సున్నా చుట్టేలా చేశారు. తర్వాత వచ్చిన వరుస ఉప ఎన్నికలు గెలిపిస్తూ వస్తున్నారు. మధ్యలో ఎమ్మెల్సీ ఎన్నికలను గెలిపించారు. ఇలా కాంగ్రెస్‌ పార్టీని తిరుగులేని శక్తిగా మారుస్తున్నారు. పార్టీకి కొండంత బలాన్ని అందిస్తున్నారు. వరుస గెలుపులను పార్టీకి అందిస్తూ పార్టీని మరింత పటిష్టం చేస్తున్నారు. రాష్ట్రానికి ఉత్తమైన పాలన అందిస్తున్నారు. ఏ ానాయకుడైనా తన పాలన చరిత్రలో నిలిచిపోవాలనే కోరుకుంటారు. అలాగే తనదైన పాలన సాగించేందుకు, తెలంగాణను గొప్పగా తీర్చిదిద్దేందుకు అనేక రకాలుగా కృషి చేస్తున్నారు

ఇక మీరు మారరు…మారకపోతే గెలవరు?

`ఇన్ని ఓటములెదురైనా బిఆర్‌ఎస్‌లో మార్పు రావడం లేదు

`నేటిధాత్రి పదే పదే హెచ్చరిస్తూనే వస్తోంది

`అనేక సార్లు గుర్తు చేస్తూనే వస్తోంది

`స్థానిక నాయకత్వాన్ని గుర్తించాలని సూచనలిస్తూనే వుంది

`ఇప్పటి వరకు క్షేత్ర స్థాయిలో నాయకత్వం లేదు

`60 లక్షల మంది కార్యకర్తలని గొప్పలు చెప్పుకుంటే సరిపోదు

`జూబ్లీ ఓటమితోనైనా మేలుకుంటేనే మేలు

`లేకుంటే బీఆర్‌ఎస్‌ అధోగతి పాలు

`భవిష్యత్తులో గెలుపులు చూడలేరు

`విజయాల దరికి కూడా చేరుకోలేరు

`పార్లమెంటు ఎన్నికలలో సున్నా చుట్టినా మార్పు రాలేదు

`ప్రచారార్భాటం తప్ప ప్రజల్లో బీఆర్‌ఎస్‌ నేతలు లేరు

`ఇప్పటికైనా నేల మీదకు దిగిరాకపోతే పార్టీ కోలుకోదు

`గులాబీ రేకులు రాలిపోక తప్పదు

`కేసీఆర్‌ బైటకు రాకపోతే పార్టీ నిలబడలేదు

`పార్టీలో ఆధిపత్యపోరు కొనసాగితే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు

`ఓడిన ప్రతిసారీ విశ్లేషించుకుంటామంటారు

`విశ్లేషించిన దాఖలాలు లేవు

`పదే పదే ఓటమి పాలుకాకుండా చూసుకుంటున్నది లేదు

`సిట్టింగ్‌ సీటును కూడా కాపాడుకోలేకపోయారు

`ఆరు నెలల నుంచి ప్రచారం చేస్తూనే వున్నారు

`మీడియాలో మాత్రమే కనిపిస్తున్నారు

`జనం మధ్యలోకి వెళ్లి ప్రచారం చేసిందేనాడు లేదు

`జిల్లాల నుండి నాయకులను తీసుకువచ్చి ప్రచారం చేయించారు

`జూబ్లీ హిల్స్‌లో వున్న నాయకులకు ప్రాధాన్యత ఇవ్వలేదు

`జూబ్లీ హిల్స్‌ నాయకులతో సంబంధాలు కొనసాగించింది లేదు

`బీఆర్‌ఎస్‌ స్వయంకృతాపరాధం ఎంత కాలం?

`ఇలా అయితే ఓడిపోవడమే ఎల్లకాలం!

హైదరాబాద్‌, నేటిధాత్రి:

అతివిశ్వాసం ఎక్కువైతే అసలుకే మోసం వస్తుందని, అధపాతాలమే దిక్కవుతుందని పెద్దలు ఊరికే అనలేదు. ఇప్పుడు బిఆర్‌ఎస్‌ను చూస్తే అర్ధమౌతోంది. ఎవరు నొచ్చుకున్నా, ఎవరు కాదనుకున్నా ఇదే నిజం. ప్రజలు చెబుతున్న నిజం. కార్యకర్తలు, నాయకులు చెప్పుకుంటున్న వాస్తవం. ఏ పార్టీ అయినా నిజంలో వున్నప్పుడే విజయం సిద్దిస్తుంది. నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు దూరంగా వుంటూ ఊహల్లో అగ్రనేతలుంటే ఫలితాలు జూబ్లీహిల్స్‌ లాగే వుంటాయి. బిఆర్‌ఎస్‌ నాయకులు అతి విశ్వాసమే జూబ్లీహిల్స్‌లో మరో సారి పార్టీ కొంప ముంచింది. బిఆర్‌ఎస్‌ పార్టీ మాగంటి గోపీనాద్‌ మరణం నాటి నుంచి ప్రచారంలోనే వుంది. కాని ప్రజల్లో లేదు. ఇది ఇప్పటికైనా కేసిఆర్‌, కేటిఆర్‌లు తెలుసుకోవాలి. పార్టీ శ్రేణుల అభిప్రాయాలు తెలుసుకోవాలి. సాదారణ ఎన్నికల్లో ఓడిపోయి నాటి నుంచి వరుసు ఓటమిలను చవిచూస్తున్నా బిఆర్‌ఎస్‌ అధినాయత్వం మేలుకోవడం లేదు. నేల మీదకు రావడం లేదు. ఎంత సేపు ప్రభుత్వ వైఫల్యాలే గెలిపిస్తాయనుకుంటే బిఆర్‌ఎస్‌కు మనుగడ వుండదు. ఇది గతంలో అనేక సార్లు రుజువైంది. కళ్లముందు అనేక గుణపాఠాలున్నా, ఇంకా బిఆర్‌ఎస్‌ పాఠాలు నేర్చుకోకపోతే విజయాలు కష్టం. ఓటములే ఎదురవడం ఖాయం. సాదారణ ఎన్నికల ముందు బిఆర్‌ఎస్‌ శ్రేయోభిలాషులు ఎంతో మంది చెప్పారు. కొంత మంది బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు చెప్పారు. వాళ్లకంటే ముందు నేటిదాత్రి పదే పదే చెబుతూనే వచ్చింది. ఒక రకంగా హెచ్చరిస్తూనే వచ్చింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న, అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేలను తప్పించకపోతే పార్టీ కోరికోరి ఓటమి తెచ్చుకున్నట్లౌవుందని చెప్పడం జరిగింది. సుమారు 30 మంది ఎమ్మెల్యేలను మార్చాలని వారి గురించి సమగ్రమైన వివరాలు కూడా నేటిదాత్రి అందించింది. కాని ఆ సూచనలు పూచికపుల్లగా భావించింది. ఓటమి కొని తెచ్చుకున్నది. ఇప్పుడు జూబ్లీహిల్స్‌ ఎన్నికల్లోనూ అదే తప్పు చేసింది. సానుభూతిని నమ్ముకొని నిండా మునిగింది. అన్ని సార్లు సానుభూతి పనిచేయదు. దుబ్బాకలో రామలింగారెడ్డి ఓటమిని చూసైనా కేసిఆర్‌ మారలేదు. ఆనాడు రామలింగారెడ్డి మరణం వల్ల సానుభూతి కన్నా, వరుస ఓటములు ఎదుర్కొన్న రఘునందన్‌ రావు వైపు ప్రజలు గెలిపించారు. జూబ్లీహిల్స్‌లో ఏం తొందరొచ్చిందని అందరికంటే ముందుగానే సునీతను ప్రకటించారు. అంత కొంపలు మునిగిపోయేంత తొందర ఎందుకు పడ్డారు. జూబ్లీహిల్స్‌లో గోపీనాధ్‌ చేసిన అరాచాలు లేవా? గోపీనాద్‌ చేసిన అక్రమాలు లేవా? ప్రజలు కూడా అదును చూసి, బిఆర్‌ఎస్‌కు మరోసారి పాఠం నేర్పారు. జూబ్లీహిల్స్‌ ప్రత్యర్ధి పార్టీ అభ్యర్ధిని పదే పదే రౌడీ రౌడీ అంటూ బిఆర్‌ఎస్‌ చేసిన ప్రచారం కూడా వికటించింది. ప్రభుత్వ వ్యతిరేకతను మాత్రమే పరిగణలోకి తీసుకొని బిఆర్‌ఎస్‌ ప్రచారం చేస్తూ వెళ్లింది. కాని గ్రౌండ్‌లో ప్రజల ఆలోచనలు ఎలా వున్నాయన్నది తెలుసుకోలేదు. గ్రౌండ్‌లో వుండే బిఆర్‌ఎస్‌ నాయకులను గుర్తించలేదు. వారి అభిప్రాయాలు తెలుసుకోలేదు. వారి సూచనలు తెలుసుకునే ప్రయత్నం అసలే చేయలేదు. ఎవరిని నమ్ముకున్నారు. ఆంద్రాకు చెందిన యూట్యూబ్‌ చానళ్లను నమ్ముకున్నారు. తెలంగాణకు చెంది, ఉద్యమ ప్రస్దానంలో వున్న వున్న బిఆర్‌ఎస్‌ అనుబంధ మీడియాను పక్కన పెట్టారు. క్షేత్ర స్దాయి పరిస్దితుల మీద పూర్తి పట్టున్న తెలంగాణ మీడియాను దూరం పెట్టుకున్నారు. పైపై ప్రచారాన్ని నమ్ముకొని నిండా మునిగారు. అటు మీడియా విషయంలోనూ తప్పటగులు వేసినట్లే, పోల్‌ మేనేజ్‌మెంటు అనుభవం వున్న నాయకులను రంగంలోకి దించలేదు. బిఆర్‌ఎస్‌లోవున్న ఎంతోమంది సీనియర్‌ నాయకులకు పక్కన పెట్టారు. అనేక ఎన్నికలు ఎదుర్కొని విజయం సాదించిన నాయకులకు దూరం పెట్టారు. పైగా జూబ్లీహిల్స్‌లో ప్రజలకు అందుబాటులోవుండి, ప్రజలకు నాడి తెలిసిన నాయకులకు బాద్యతలు అప్పగించలేదు. వారికి విలువే ఇవ్వలేదు. దాంతో బిఆర్‌ఎస్‌ ప్రజలకు దగ్గరకాలేకపోయింది. అయినా జూబ్లీ హిల్స్‌లో రైతు సమస్యలు ప్రస్తావిస్తే ఓట్లు రాలుతాయా? జూబ్లీహిల్స్‌లో ప్రజా సమస్యలను మీద స్పందిస్తే ఓట్లు రాలుతాయా? అన్నది గుర్తించలేకపోయారు. బాకీ కార్డు అని పట్టుకొని తిరిగారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హమీలను నమ్ముకొని ప్రచారం సాగించారు. ప్రభుత్వం ఇచ్చి, అమలు కాని హమీలను నమ్ముకున్నారు. ప్రజల్లో వాటిపై ఎక్కడా వ్యతిరేకత కనిపించడం లేదన్నది గుర్తించలేదు. పైగా అధికారంలో వున్న పార్టీ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వానికి అన్ని రకాల వనరులు వుంటాయి. ఈ మాత్రం బిఆర్‌ఎస్‌ గుర్తించలేదు. ఇంకా మూడేళ్లపాటు కాంగ్రెస్‌ అధికారంలో వుంటుంది. పైగా ఇప్పటికే రెండుసార్లు ఓడిపోయిన సానుభూతి కూడా నవీన్‌పై వుంటుందన్న ఆలోచన బిఆర్‌ఎస్‌ చేయలేదు. సునీత మీద వుండే సానుభూతి ఒక రకమైతే, నవీన్‌ మీద వున్న సానుభూతి మరో రకమైంది. కాంగ్రెస్‌ పార్టీ నవీన్‌ యాదవ్‌ ఎంపికతోనే సగం గెలిచినట్లైంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో నవీన్‌ యాదవ్‌ బలమైన నాయకుడు. మాస్‌ లీడర్‌గా గుర్తింపు సంపాదించుకున్నాడు. బస్తీలలో మంచి గుర్తింపు వున్న నాయకుడు. స్దానికుడు. ప్రజలకు సుపరిచితుడు. పైగా తెలంగాణకు చెందిన నాయకుడు. అన్నింటికీ మించి బిసి నాయకుడు. బిసీల వాదం పోలరైజ్‌ అవుతున్న సమయంలో అగ్ర కులానికి చెందిన సునీతను రంగంలోకి దింపడమే బిఆర్‌ఎస్‌ చేసిన మొదటి తప్పు. బిసి నాయకుడిని రౌడీ, రౌడీ అంటూ పదే పదే ప్రజలకు నచ్చని పదాన్ని వాడడం రెండో తప్పు. బస్తీలలో ప్రజలకు బిఆర్‌ఎస్‌ దగ్గర కాకపోవడం మూడో తప్పు. క్షేత్ర స్ధాయిలో వున్న నాయకులకు ప్రచార బాద్యతలు అప్పగించకపోవడం నాలుగో తప్పు. ఆంధ్రాకు చెందిన వాళ్ల ఓట్లను నమ్ముకొని ముందుకెళ్లడం ఐదోతప్పు. ఆంద్రాకు చెందిన మీడియాను ఇంకా బిఆర్‌ఎస్‌ భుజాల మీద మోసుకుంటూ వెళ్లడం ఆరో తప్పు. సిఎం. రేవంత్‌ రెడ్డి రంగంలోకి దిగినప్పుడైనా, బిఆర్‌ఎస్‌ మొత్తం ప్రచారంలో పాలు పంచుకోకపోడం ఏడో తప్పు. అన్నింటికీ మించి కేసిఆర్‌ జూబ్లీ వైపు కన్నెత్తి చూడకపోవడం ఎనమిదోతప్పు. ఎందుకంటే కేసిఆర్‌ నివాసం జూబ్లీహిల్స్‌లోనే వుంటుంది. కేసిఆర్‌ ప్రచారంలోకి రాకపోయినా గెలుస్తామని అనుకోవడం తొమ్మిదోతప్పు. కేసిఆర్‌ వచ్చి ఓడిపోతే ఆ కాస్త పరువు పోతుందని భయపడడం పదో తప్పు. ఎంత పెద్ద నాయకుడైనా సరే ఎన్నిక చిన్నదైనా, పెద్దదైనా ప్రజల్లోకి రావాలి. ప్రచారం సాగించాలి. గెలవడం కోసం ఎంత పెద్ద నాయకుడైనా ఒక మెట్టు దిగాలి. ప్రదాన మంత్రి మోడీ రాష్ట్రాల ఎన్నికలవేళ ఎలా వుంటారో తెలుసుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు అసెంబ్లీ ఎన్నికకు ప్రచారం రాకపోవడం అధిపత్యాన్నే చూపిస్తుంది. జనాల మీద ప్రేమ కనిపించదు. అధికారంలోవున్నంత కాలం కేసిఆర్‌జనంలోకి రాలేదని, రావడం లేదనేదే ప్రధాన విమర్శ. ముఖ్యమంత్రిగా వున్న రేవంత్‌ రెడ్డి ఈ ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. అభ్యర్ది ఎంపిక విషయంలోనూ తొందరపడలేదు. ఏడు రోజుల పాటు నిర్విరామంగా ప్రచారం సాగించారు. సుమారు 15 కార్నర్‌ మీటింగులు పెట్టారు. కష్టపడి పార్టీ అభ్యర్ధిని గెలిపించుకున్నారు. తన నాయకత్వాన్ని పదిలం చేసుకున్నారు. ఇదీ నాయకుడికి వుండాల్సిన ప్రధాన లక్షణం. అంతే కాని చట్ట సభకు ఎన్నికయ్యే ఎమ్మెల్యే ఎన్నికకంటే పెద్ద ఎన్నిక ఏముంటుంది? బిఆర్‌ఎస్‌ పార్టీ అగ్ర నాయకులు దృష్టిలో అసెంబ్లీ ఎన్నిక చాలా చిన్నదిగా కనిపిస్తోందా? ఓడిపోయినా, ఇంకా అధికారంలోనే వున్నామన్న భ్రమల్లోనే వున్నారా? పార్లమెంటు ఎన్నికల ముందు రైతులు ఆగమైపోతున్నారని కేసిఆర్‌ కాలుకు బలపంకట్టుకొని తిరిగినా జనం ఎందుకు కనికరించలేదు. ఒక్కసీటులోనైనా ఎందుకు గెలిపించలేదన్నదానిపై ఇప్పటికీ అధ్యయనం చేయలేదు. సాదారణ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్టీ నాయకులంతో చర్చింది లేదు. ఎందుకు ఓడిపోయామన్నదానిపై అంతర్మధనం లేదు. అలవి కాని హమీలిచ్చి కాంగ్రెస్‌ గెలిచిందని మాట్లాడుకుంటే సరిపోతుందా? రాజకీయ పార్టీ రాజకీయమే చేస్తుంది అని కేసిఆర్‌ చెప్పిన మాటే ఆయనే మర్చిపోయారా? గెలవడానికి రాజకీయ పార్టీ అనేక మార్గాలను ఎంచుకుంటుంది? ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుంటే 2104లో ఇచ్చిన హమీలన్నీ బిఆర్‌ఎస్‌ అమలు చేసిందా? ఇస్తామన్న ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిందా? దళితులకు మూడెకరాలు ఇవ్వడం సాధ్యం కాదని చేతులేత్తేయలేదా? కాంగ్రెస్‌ ఇప్పుడు అదే చేస్తోంది. ఇప్పటికైనా సరే కాంగ్రెస్‌ తప్పులను ఎత్తి చూపడం కాదు. బిఆర్‌ఎస్‌లో వున్న లోపాలను సరిదిద్దుకోవాలి. అంతర్గత కలహాలు పక్కన పెట్టుకోవాలి. పార్టీ నాయకులను గ్రూపులుగా విడదీయం మానుకోవాలి. పార్టీని క్షేత్ర స్దాయిలో పునాదులు నిర్మాణం చేసుకోవాలి. జేజేలు కొట్టేవారే కాదు, ఓట్లు వేసేవారిని సంపాదించుకోవాలి.

’’మిల్లర్లకు’’ పిల్లర్‌ ‘‘సందీప్‌’’!

`’’మంత్రివర్య’’ ఈ ‘‘దోపిడీ చూడండి’’..ఎపిసోడ్‌-5

`మిల్లర్‌ సందీప్‌..ఇద్దరు అవినీతి అధికారులు ఫినిష్‌!?

`అవినీతి ‘‘డీఎం,టెక్నికల్‌ అసిస్టెంట్‌’’లను పట్టించిన మొనగాడు!

`దగాకోరులను దర్జాగ పట్టించిన ‘‘మిస్టర్‌ మిల్లర్‌’’ భారతీయుడు!

`వేధించిన అధికారులకు కటకటాలు చూపించాడు.

`అధికారుల అవినీతిలో భాగం కాలేక సందీప్‌ చేసిన ధైర్యం.ఇతర మిల్లర్‌కు ఆదర్శం.

`ట్రక్‌ షీట్ల మోసాలు..డిటిలకు లక్షలు!

`మిల్లర్లను బెదిరించి ట్రక్‌ షీట్లు అంటగడుతున్న అధికారులు!

`ట్రక్‌ షీట్లు వద్దన్న పాపానికి మిల్లర్‌ సందీప్‌కు వేధింపులు!

`నిజాయితీ వ్యాపారస్తులను చెడగొడుతున్న అధికారులు.

`అధికారుల అడ్డగోలు సంపాదనకు బలౌతున్న మిల్లర్లు.

`‘డిటి’’ల అక్రమ సంపాదన కోసం బలౌతున్న మిల్లర్లు.

`ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక డిటిల కోసం ట్రక్‌ షీట్లు తీసుకుంటున్న మిల్లర్లు!

`రాష్ట్ర వ్యాప్తంగా అధికారుల లంచాలకు సాక్ష్యాలు!

`లంచం ఇవ్వను..ట్రక్‌ షీట్లు తీసుకోను అన్నందుకు సందీప్‌కు ముప్పు తిప్పలు.

`మూడు నెలలుగా సందీప్‌కు రకరకాల వేధింపులు!

`అర్థరాత్రి విజిలెన్స్‌ ఎంక్వౌరీ పేరుతో డిటిల తనఖీలు.

`మిల్లర్‌ సొంత బియ్యాన్ని పిడిఎస్‌ బియ్యంగా కేసులు.

`సందీప్‌కు చెందిన ప్రైవేటు బియ్యం పోలీసు స్టేషనుకు తరలింపు.

`‘‘డిటి’’లకు వంత పాడుతున్న ‘‘జేసి’’?

`కలెక్టర్‌ ఆదేశాలను కూడా లెక్క చేయని ‘‘జేసి’’?

??హైకోర్టు తీర్పును కూడా పట్టించుకోకుండా వేధింపులు???

`ఆఖరుకు ‘‘డీఎం’’నీ ఏసిబికి పట్టించిన సందీప్‌!

`నిజాయితీ మిల్లర్‌ను చెడగొడుతున్న అధికారులు!

`ఖజానాకు కాపలా వుండాల్సిన అధికారులు.సివిల్‌ సప్లయ్‌ని లూటీ చేస్తున్నారు?

`మిల్లర్లతో దందాలు చేయించి కోట్లు దండుకుంటున్నారు.

`గోడౌన్లలలో ఎలుకలను మించిన పందికొక్కులౌతున్నారు?

`సివిల్‌ సప్లయ్‌ బొక్కసానికి బొరియలు చేస్తున్నారు!

 

హైదరాబాద్‌, నేటిధాత్రి:                                            

ఒక వ్యక్తి చేసే ధైర్యం వ్యవస్దనే నిలబెడుతుంది. ఆ సమాజాన్ని కాపాడుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఎంత కాలం ఈ అవినీతి అక్రమాలు అనుకున్నప్పుడు ఒక్కరు ప్రశ్నించడం మొదలుపెడతారు. ఎంత కాలం దౌర్జన్యాలు అనుకున్నప్పుడు ఒక్కడు నిలబడతాడు. ఎదిరిస్తాడు. అన్యాయాన్ని నిలదీస్తాడు. అక్రమాలను ఎదుర్కొంటాడు. సరిగ్గా ఆసిఫాబాద్‌కు చెందిన మిల్లర్‌ సందీప్‌ అదే చేశారు. తనకు జరుగుతున్న అన్యాయాన్ని అనేక సార్లు గళమెత్తాడు. కాని ఎవరూ వినిపించుకోలేదు. పట్టించుకోలేదు. అందుకే నిలదీస్తే తప్ప ఎదిరించలేమనుకున్నాడు. అవినీతి పరులను పట్టిస్తే గాని సమజానికి మేలు జరగదనుకున్నాడు. ధైర్యం చేశాడు. ఎంతోమందికి ఆదర్శమయ్యాడు. ఇప్పటికీ తాను మరిన్ని సమస్యలు ఎదర్కొవాల్సి వస్తుందని తెలుసు. అయినా తన కోసం కాకుండా, తన వ్యవస్ధ కోసం, తోటి వారి కోసం తాను ఒక్క అడుగు వేస్తే ఎంతోమందికి మేలు జరుగుతందనుకున్నాడు. వ్యవస్దలో చీడపురుగులను ఏరి వేయాలనకున్నాడు. ఇప్పుడు తెలంగాణలోని మిల్లర్లందరికీ సందీప్‌ పిల్లర్‌గా మారిపోయాడు. ఇంత కాలం అదికారుల వేధింపులు మిల్లర్లు అనుభిస్తున్నారు. కాని ఎదిరించేందుకు ఎవరూ ధైర్యం చేయలేదు. అవినీతికి అలవాడు పడిన అదికారులకు లొంగిపోతున్నారు. తలెత్తుకు బతకాలంటే నిజాయితీగా వుండాలన్న ఆలోచన వున్న మిల్లర్‌ సందీప్‌ మాత్రం సివిల్‌ సప్లయ్‌ శాఖకు చెందిన జిల్లా డిటిల మాటలు వినలేదు. అవినీతికి పాల్పడడానికి ఇష్టపడలేదు. అలాంటి సొమ్ము నాకు వద్దనకున్నాడు. డిటిలకు లంచాలు ఇవ్వడానికి నిరాకరించారు. అవినీతి పరులైన ఇద్దరు సివిల్‌ సప్లయ్‌ చెందిన అదికారులను పట్టించాడు. ఏసిబి చేత రెడ్‌ హాండెడ్‌గా పట్టుకునేలా చేశాడు. దర్జాగా వాళ్లేదే మిల్లర్‌ సందీప్‌ వద్ద దాచుకున్న సొమ్ములాగా లక్షలు కావాలంటే ఇస్తే స్తోమత మిల్లర్‌ వద్ద లేదు. అవినీతి పరుడు సందీప్‌ అసలే కాదు. అలాంటి వ్యక్తిని వేదిస్తే ఎలా వుంటుందో కూడా ఆ అదికారులకు చూపించారు. అదికారుల అవినీతిలో బాగం కాలేక సందీప్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇతర మిల్లర్లకు ధైర్యం నింపారు. అయితే సివిల్‌ సప్లయ్‌శాఖలో ట్రక్‌ షీట్ల దందా అనేది అదికారులు సృష్టించుకున్న అవినీతి సమ్రాజ్యంలో ఒక భాగం. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలన్నట్లు లొసుగులను ఆసరా చేసుకొని అవినీతికి పాల్పడడం అలవాటు చేసుకున్నారు. మిల్లర్లకు వడ్లు కేటాంచి , ట్రక్‌ షీట్లు జారీ చేయాల్సి వుంటుంది. కాని తెలంగానలోని అన్ని జిల్లాల్లో డిటీలు మిల్లర్ల్‌కు వడ్లు కేటాయించకుండానే ట్రక్‌ షీట్లు జారీ చేస్తున్నట్లు సమాచారం. ఇది ఒక్క ఆసిఫాబాద్‌ జిల్లాకే పరిమితం కాదు. అన్ని జిల్లాలలోనూ ఇదే సాగుతోంది. ప్రభుత్వ సొమ్ముకు కన్నం పడుతూనే వుంది. మిల్లర్లు రైతులకు డబ్బులు చెల్లించేందుకు అవసరమైన సొమ్ము కోసం అదికారులు ట్రక్‌ షీట్లు జారీ చేస్తారు. దాంతో మిల్లర్లు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొని మళ్లీ వాటిని బ్యాంకులకు చెల్లిస్తుంటారు. అయితే ఎలాంటి వడ్లు లేకపోయినా, ట్రక్‌షీట్లు జారీ చేస్తాం. మేం అడినంత ఇవ్వాలని మిల్లర్లకు డిటీలు సూచిస్తారు. కొంత మంది మిల్లర్లు తమ అవసరాల కోసం అలా ట్రక్‌షీట్లు తీసుకుంటారు. బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకుంటారు. తర్వాత మళ్లీ మిల్లర్లు ఆ సొమ్మును బ్యాంకుకు చెల్లిస్తారు. కాని అందుకు సివిల్‌సప్లయ్‌ అధికారులకు లక్షల రూపాయలు మిల్లర్లు చెల్లిస్తుంటారు. ఇలా ట్రక్‌ షీట్లు ఇస్తామని, తమకు అడినంత ఇవ్వాలని ఆసిఫాబాద్‌కు చెందిన ఇద్దరు డిటీలు మిల్లర్‌ సందీప్‌కు సూచించారు. దానికి మిల్లర్‌ సందీప్‌ ససేమిరా? అన్నాడు. తనకు ట్రక్‌ షీట్లు అవసరం లేదన్నాడు. ఇప్పుడు బ్యాంకుల నుంచి డబ్బు తెచ్చుకోవాల్సిన అత్యవసర సమస్యలు లేవని చెప్పాడు. అయినా డిటీలు కొంత కాలంగా మిల్లర్‌ సందీప్‌ను వేదిస్తూ వస్తున్నారు. ఇలా ఎంత చెప్పినా సందీప్‌ వినిపించకోకపోవడంతో ఆయనపై కక్ష కట్టారు. మిల్లు మీద విజిలెన్స్‌ అధికారుల చేత దాడులు చేయిస్తామంటూ హెచ్చరిస్తూ వస్తున్నారు. ఒక్కసారి లంచం ఇవ్వడం మొదలు పెడితే అది జీవితాంతం ఉచ్చులా మారుతందనేది సందీప్‌ అభిప్రాయం. అందులోనూ వడ్లు లేకుండా ట్రక్‌ షీట్లు తీసుకోవడం నేరం. ఎప్పటికైనా ఇబ్బందికరం. అదికారులు తప్పించుకుంటారు. మిల్లర్లే ఇరుక్కుంటారు. ఒక్కసారి దొంగ ట్రక్‌ షీట్లు ఇచ్చి సహాయపడినట్లు నటించినా, దాన్ని అడ్డం పెట్టుకొని ఎల్లకాలం అదికారులు వేదిస్తారు. లంచాలు కావాలంటారు. లేకుంటే ట్రక్‌షీట్ల బాగోతం తెరమీదకు తెస్తారు. అందుకే అలాంటి అలాంటి పరిస్దితి తెచ్చుకోవద్దని సందీప్‌ గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు. అధికారులకు ఇగో హర్ట్‌ అయ్యింది. తాము చెప్పింది చేయడం లేదన్న ఆక్రోశం సందీప్‌ మీద పెరిగింది. ఎలాగైనా సందీప్‌ను వేదించాలని నిర్ణయం తీసుకున్నారు. అడుగడుగునా అడ్డుకోవాలని చూస్తున్నారు. ఇబ్బందులకు గురి చేస్తున్నారు. విజిలెన్స్‌ ఎంక్వౌరీ పేరుతో అర్ధరాత్రి ఇద్దరు డిటీలు మిల్లుకు వచ్చారు. నిజానికి విజిలెన్స్‌ ఎంక్వౌరీ జరిగితే ఆ అదికారులు రావాలి. కాని వాళ్వెరు లేకుండా ఇద్దరు డిటీలు అర్దరాత్రి మిల్లును తనిఖీ చేయడానికి వచ్చి తప్పుడు లెక్కలు రాశారు. లేని పోనివన్నీ తమ నివేదికలో రాశారు. అసలు సంబంధం లేని బియ్యాన్ని సీజ్‌ చేశారు. పిడిఎస్‌ బియ్యమని నమ్మించే ప్రయత్నం చేశారు. తన సొంత బియ్యాన్ని తరలించుకుపోయారు. అంటే అదికారులు తలుచుకుంటే మిల్లర్లను ఈ విధంగా కూడా ఇబ్బందుల పాలు చేయొచ్చని నిరూపించారు. ఇలా మిల్లర్లను తమ చేతుల్లో పెట్టుకొని ఆడిరచడం అలవాటు చేసుకున్నారు. వేదించడం నేర్చుకున్నారు. లంచం ఇవ్వను, ట్రక్‌ షీట్లు తీసుకోనే అన్నందుకు మూడు నెలలుగా వేదింపులకు గురి చేస్తూ వస్తున్నారు. డిటీలు తమను వేదిస్తున్నారంటూ సందీప్‌ ఏకంగా జేసికి పిర్యాధు చేశారు. కాని జేసి కూడా డిటీలకు సపోర్టు చేశారు. తర్వాత కలెక్టర్‌కు పిర్యాధు చేశాడు. ఆసిఫాబాద్‌ కలెక్టర్‌ జేసిని నివేదిక కోరారు. అయినా జేసి, కలెక్టర్‌ ఆదేశాలను కూడా లెక్క చేయడం లేదు. దాంతో సందీప్‌ కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు నుంచి తనుకు అనుకూలంగా వచ్చిన తీర్పు కాపీని చూపించాడు. హైకోర్టు తీర్పును కూడా అటు డిటీలు, ఇటు జేసి ఖాతరు చేయలేదు. పైగా వేదింపులు ఎక్కువ చేశారు. ఖజానాకు కాపలా వుండాల్సిన అధికారులు బొక్కసానికి బొక్క పెడుతున్నారు. ప్రభుత్వ సొమ్మును మింగుతున్నారు. నిజాయితీగా వున్న వ్యాపారులకు అధికారులే చెడగొడుతున్నారు. వ్యాపారులు తప్పు చేసేందుకు అవకాశమిస్తున్నారు. అవకాశ వాదులుగా వ్యాపారులను గుప్పిట్లో పెట్టుకొని వేదించుకు తింటున్నారు. మూడేళ్లుగా ట్రాన్స్‌ఫర్లు లేకుండా ఆసిఫాబాద్‌లోనే తిష్టవేసుకొని వున్నారు. మిల్లర్లకు నరకం చూపిస్తున్నారు. ఊ అంటే లంచం..ఆ అంటే లంచం అన్నట్లు దోచుకుతింటున్నారు. ఇక విసిగిపోయిన మిల్లర్‌ సందీప్‌ ఏసిబి అదికారులకు పిర్యాదు చేశారు. పిడిఎస్‌ బియ్యం గోడౌన్‌కు చేర్చాలంటే లారీకి రూ.25వేలు ఇవ్వాలని డిఎం. నర్సింహారావు డిమాండ్‌ చేశారు. అలా మూడు లారీలకు రూ. 75వేలు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేస్తూ వచ్చారు. దాంతో డిఎం.ను మిల్లర్‌ సందీప్‌ నగదు చెల్లించేలా వల వేసి ఏసిబి అధికారులు పట్టుకున్నారు. కటకటాలకు పంపించారు. అధికారులే దగ్గరుండి మిల్లర్ల చేత తప్పులు చేయిస్తున్నారు. సివిల్‌ సప్లయ్‌ని లూటీ చేస్తున్నారు. ప్రభుత్వాన్ని నిండా ముంచేస్తున్నారు. మిల్లర్ల చేత దందాలు చేయించి కోట్లు దండుకుంటున్నారు. ఇది ఒక్క ఆసిఫాబాద్‌లోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఇదే జరుగుతోంది. ఇక్కడ మరో ట్విస్టేమిటంటే ఈ వ్యవహారంలో ఎలాంటి సంబంధం లేని తహసిల్ధార్‌కు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నోటీసులు జారీ చేశారు. అంటే ఒక తప్పును కప్పిపుచ్చుకునేందుకు తప్పు మీద తప్పు అధికారులు ఎలా చేస్తారో ఈ వ్యవహారంతోఅర్ధం చేసుకోవచ్చు. ఈ అక్రమాలన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాల్సి వుంది. ముఖ్యంగా సివిల్‌సప్లయ్‌శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కమీషనర్‌కు తెలియాల్సిన అవసరం వుంది. ఇలా అధికారుల ఆగడాల మూలంగా మిల్లర్లు ఇబ్బందులు పాలౌతున్నారు. ట్రక్‌ షీట్లపేరుతో అధికారులు లక్షలు కూడబెట్టుకుంటున్నారు. ఇటు మిల్లర్లను వేదిస్తూ సంపాదిస్తున్నారు. అటు మిల్లర్ల చేత తప్పులు దగ్గరుండి చేయిస్తూ లక్షలు లంచాలు తీసుకుంటున్నారు. ఇది మారాలంటే అందరూ సందీప్‌ లాంటి వారు కాలేరు. అందువల్ల ప్రభుత్వమే దృష్టి సారించాలి. జరుగుతున్న అవినీతిని అరికట్టాలి. అవినీతి సాగిస్తున్న అధికారులను ఇంటికి పంపించాలి. అప్పుడే సివిల్‌ సప్లైశాఖ బాగు పడుతుంది.

అన్ని వైపులా వేదింపులే…మిల్లర్లకు మిగిలేది నరకమే?

`మిల్లర్ల పాలిట శాపంగా మారుతున్న అధికారులు!

`సరిగ్గా వడ్లు వచ్చే సమయానికి సమస్యలు సృష్టిస్తారు?

`అదును చూసి కేసులు రాస్తామని బెదిరిస్తారు!

`చిన్న చిన్న మిల్లర్ల మీద తమ ప్రతాపం చూపిస్తారు.

`మిల్లర్లను వేదించుకు తింటారు.

`తాజాగా జరిగిన కొన్ని సంఘటనలే సాక్ష్యాలు!

`ఆసిఫాబాద్‌ లో రెడ్‌ హాండెడ్‌గా ఏసిబికి చిక్కిన ఉదంతాలు.

`మిల్లర్లను వేధించడమే పనిగా పెట్టుకున్న అధికారులు.

`ఒకప్పుడు సివిల్‌ సప్లయ్‌ శాఖ అంటే ఒట్టిపోయిన ఆవు వంటిది.

`ఇప్పుడు అధికారులకు కావాల్సినంత పాడిగా మారిపోయింది.

`అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది.

`ఏళ్ల తరబడి ట్రాన్స్‌ఫర్లు కూడా లేకుండా పోయింది.

`రెవెన్యూ శాఖ నుంచి సివిల్‌ సప్లై శాఖకు డిప్యూటేషన్‌ పై వచ్చిన అవినీతి అధికారులకు సివిల్‌ సప్లై శాఖ వరంగా మారింది

`ఆసిఫాబాద్‌ లో అధికారుల ఒత్తిళ్లు భరించలేక ఓ మిల్లర్ల ఏసిబిని ఆశ్రయించారు?

`అయినా అధికారులు మారుతారన్న గ్యారెంటీ లేదు.

`ఇతర అధికారులు ఆ మిల్లర్‌కు సహకరిస్తారన్న నమ్మకం లేదు.

`ఆ మిల్లర్‌ వ్యాపారం సజావుగా సాగుతుందనే విశ్వాసం వుండదు.

`మరో జిల్లాలో బంగారం అమ్మి మరీ అధికారులకు లంచం ఇచ్చిన సందర్భం వుంది?

`అన్ని జిల్లాలలో ఇవే పరిస్థితులు దాపురించాయి.

`మిల్లర్లకు కష్టాలు మిగిల్చుతున్నాయి.

`కొందరి మిల్లర్ల జీవితాలు దినదిన గండంగా మారుతున్నాయి.

`మింగలేక, కక్కలేక మిల్లర్లు మధనపడుతున్నారు!

`ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలు ఎగ్గొట్టి వందల కోట్లతో కొత్త మిల్లులు నిర్మిస్తున్న రాష్ట్ర నాయకుల జోలికి ఈ అవినీతి అధికారులు వెళ్లారు?

`వందల కోట్ల బకాయిలున్న వారి జోలికి అధికారులు పోరు!

`చిన్న చిన్న మిల్లర్లను అధికారులు బతకనివ్వరు.

`ఇక వరుసగా సివిల్‌ సప్లై లోని అధికారుల అవినీతి బాగోతాలు మీ

‘‘నేటిధాత్రి’’లో

విసిగించడం, వేదించడం, లంచాలు తీసుకోవడం అధికారులకు రివాజు. సర్ధుకుపోవడం, అడిగింత ముట్టజేప్పడం ప్రజలకు అలవాటుగా మారింది. ఇక కొన్ని శాఖల్లో ఎన్ని లంచాలు తీసుకున్నా అదికారుల దాహంతీరదు. అధికారులు ఎప్పుడంటే అప్పుడు లంచాలు ఇవ్వక కొంత మంది వ్యాపారులకు తప్పదు. ఇదేం చట్ట బద్దం కాదు. అయినా వ్యాపారులకు తప్పదు. తప్పు చేయకుండా వ్యాపారులు లంచాలు ఎందుకిస్తారు? అనే ప్రశ్న కూడా సమాజంలో వుంది. కాని కొన్నిసార్లు ఎంత నిజాయితీగా వ్యాపారం సాగించినా అధికారుల జేబులు నింపకుండా వుండలేని పరిస్ధితులు మన సమాజంలోనే వున్నాయి. అవే అధికారులకు వరంగా మారుతోంది. అలా తెలంగాణలో అవినీతి ఊడల మర్రిలా మారిపోయింది.. మర్రి చెట్టుకున్న ఊడలెన్ని నరికేసినా, మళ్లీ ఊడలు ఎలా పుట్టుకొస్తాయో…అవినీతి అదికారులు కూడా అలాగే పెరిగిపోతున్నారు. ఎంత మందిని పట్టుకున్నా అవినీతి ఒక్క శాతం కూడా తగ్గడంలేదు. ఇది ప్రజల దౌర్భాగ్యం. అలాంటి శాఖలో సివిల్‌ సప్లయ్‌ చేరిపోయింది. లంచాలను విపరీతంగా దండుకుంటోంది. ఒకప్పుడు సివిల్‌ సప్లయ్‌ శాఖలో పనిచేయాలంటే అధికారులకు నచ్చేదికాదు. పైసా లాభం వుండదని అనుకునే వారు. జీతం తప్ప చాల నీళ్లకు కూడా రూపాయి రాదని దిగులు పడుతుండేవారు. కాని ఇప్పుడు సివిల్‌ సప్లయ్‌ శాఖలో చిన్న కొలువు వస్తే చాలు. జీతం ఇవ్వకున్నా పరవాలేదు? అన్నట్లుగా మారిపోయింది. సివిల్‌ సప్లయ్‌శాఖలో పనిచేసే కింది స్దాయి అధికారి దగ్గర నుంచి పై స్దాయిదాకా పైసలే పైసలు. లంచాలే లంచాలు. అవి వేలల్లో కాదు. లక్షల్లో దండుకుంటున్నారు. అదికారులు కోట్లు కూడబెట్టుకుంటున్నారు. మిల్లులు నడిపే వ్యాపారుల కన్నా, ఆ శాఖలో పనిచేసే అదికారులే ఎక్కువ సంపాదిస్తున్నారని కూడా అందరూ అనుకుంటున్నారు. ఒకప్పుడు తెలంగాణ వ్యవసాయ రంగంలో ఒట్టిపోయిన ఆవులా వుండేది. ఆ శాఖ నిర్వహణే కష్టమనేలా వుండేది. ఇప్పుడు పాడి ఆవులా మారింది. తెలంగాణ వచ్చిన తర్వాత గణనీయంగా సాగు ఉత్పత్తి పెరిగింది. పదేళ్ల కాలంలో దేశానికే అన్నం పెట్టే స్దాయికి తెలంగాణ ఎదిగింది. ఇంకేముంది. అదికారుల చూపంతా సివిల్‌ సప్లయ్‌ శాఖపై పడిరది. ఆ శాఖలో అదికారుల కొరత రెవిన్యూ శాఖ అధికారులకు వరంగా మారింది. రెవిన్యూ శాఖ నుంచి పెద్ద సంఖ్యలో అదికారులు సివిల్‌ సప్లయ్‌ శాఖకు వలస వెళ్లారు. ఒకప్పుడు రెవిన్యూశాఖలో చన్ని చిన్న సర్టిఫికెట్లకు కూడా లంచం తీసుకునే అలవాటు వుండేది. ఇప్పుడు కళ్ల ముందు వేల కోట్ల రూపాయల వ్యాపారం కనిపిస్తోంది. లక్షల టన్నుల వడ్లు సాగుతౌతున్నాయి. ఒక్క సారి వచ్చే పంట దిగుబడి కోటి అవరై లక్షలుగా నమోదౌతోంది. పెద్దఎత్తున మిల్లుల ఏర్పాటైంది. ప్రభుత్వమే నేరుగా వడ్లు కొనుగోలు చేసి, మిల్లర్లకు అప్పగించడం అనేది అదికారులకు పంట పండిస్తోంది. దాంతో రైతు నుంచి వడ్లు సేకరించే దగ్గర నుంచి అధికారులకు లంచాలు అందుతున్నాయి. మిల్లులనుంచి ఆఖరుకు సివిల్‌ సప్లయ్‌ శాఖ గోడౌన్లకు బియ్యం చేర్చడానికికూడా అదికారులు అడిగినంత ముట్టజెప్పాల్సి వస్తోంది. తాగాజా ఆఫిషాబాద్‌ జిల్లాలో జరిగిన సంఘటన అందకు సాక్ష్యంగా నిలుస్తోంది.. ఆసిఫాబాద్‌ జిల్లాలో ఓ రైస్‌ మిల్లర్‌ పిడిఎస్‌ బియ్యాన్ని ప్రభుత్వ గోడౌన్‌కు చేరవేస్తున్న సందర్భంలో జిల్లాకు చెందిన సివిల్‌సప్లయ్‌ డిఎం. నర్సింగరావు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. లారీకి ఇరవై వేల చొప్పును మూడు లారీలకు కలిపి, రూ.75వేలు లంచం తీసుకుంటుంటే ఏసిబి అధికారులు పట్టుకున్నారు. ఇంత వరకు బాగానే వుంది. ఇకపై అధికారులు తమ తీరు మార్చుకుంటారా? అంటే మారరు. అలా మారేదే వుంటే ఇంత మంది అవినీతి అదికారులు పట్టుబడుతున్నా ఎవరూ భయపడడం లేదు? లంచాలు తీసుకోవడం ఆపడం లేదు. పట్టుబడేవారు పట్టుబడుతూనే వున్నారు. లంచాలు తీసుకునే వారు తీసుకుంటూనే వున్నారు. అదే ఆసిఫాబాద్‌ జిల్లా మిల్లర్‌కు రేపటి నుంచి అధికారులు సహకరిస్తారా? అనే ప్రశ్నకు ఎవరు సమాదానం చెప్పాలి. తోటి అధికారిని పట్టించినందుకు మిగతా అధికారులు ఎప్పుడూ నిఘా వేసి వుంచుతారు? పైగా వడ్ల కేటాయింపుల్లో ఇబ్బందులు సృష్టిస్తుంటారు. ఆ మిల్లర్‌కు భవిష్యత్తులో మూడు చెరువుల నీళ్లు తాగిస్తారు? మిల్లర్లు తెగించకపోతే ఒక సమస్య. తెగిస్తే మరో సమస్యగా మారింది? ఇలాంటి లంచాల వాతావరణంలో ఏ రైస్‌ మిల్లర్‌ సంతోషంగా లేడన్నది తేలిపోతోంది. రైస్‌ మిల్లర్లు ఎలాంటి మోసం చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అదికారులు, లంచాలు తీసుకుంటూ ప్రభుత్వాన్ని నిండా ముంచుతున్నారు. అంతే కాకుండా మిల్లర్లు కూడా అధికారుల వేధింపులను తట్టుకోలేకపోతున్నారు. దాంతోవాళ్లు కూడా విసిగిపోయి, ఏసిబిని ఆశ్రయించాల్సి వస్తుందంటే పరిస్దితులు ఎంత దుర్భరంగా మారుతున్నాయో అర్దం చేసుకోవచ్చు. ఇలా మిల్లర్లు అన్ని వైపులా వేదింపులే ఎదుర్కొంటున్నారు. అధికారుల జేబులు నింపుకుంటూ వ్యాపారాలు సాగిస్తున్నారు. సరిగ్గా వడ్లు వచ్చే సమయానికి మిల్లుల మీద దాడులు మొదలు పెడతారు. మిల్లర్లను బెదిరిస్తుంటారు. ఏదో ఒక చిన్న సాకు చూపించి పెద్ద పెద్ద కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తుంటారు. లక్షలకు లక్షలు వసూలు చేస్తుంటారు. దాంతో మిల్లర్లు బతకలేకపోతున్నారు. మిల్లర్లు మొత్తం ప్రభుత్వం నుంచే వడ్లు సేకరిస్తే వారికి పెద్దగా ఒరిగేదేమీ వుండదు. కొంత మంది రైతులు నేరుగా మిల్లర్లకే అమ్ముతుంటారు. అలా కొనుగోలు చేసిన వడ్లను బియ్యంగా మార్చి మిల్లర్లు అమ్ముకుంటేనే వారికి లాభాలు వస్తాయి. మొత్తం ప్రభుత్వ వడ్లనే బియ్యంగా మార్చితే మిల్లర్లు పెద్దగా లాభాల పొందే అవకాశం లేదు. ఇదే అధికారులకు వరంగా మారుతోంది. మిల్లర్లను నిండా ముంచేస్తోంది. మిల్లర్లు తమ ఆదాయం కన్నా, ఎక్కవ లంచాలే చెల్లించాల్సిన పరిస్దితులు కూడా ఎదురౌతున్నాయని మిల్లర్లు వాపోతున్నారు. అటు సరిగ్గా వడ్లు కొనుగోలు చేసే సమయంలోనే మిల్లర్లకు ఖర్చు వుంటుంది. ఆ సమయంలో అటు రైతుల కోసం అప్పులు చేసి చెల్లింస్తుంటారు. అటు అప్పులు చేసి మిల్లర్లు వ్యాపారం చేస్తుంటే అధికారులు దోడిపీ మొదలు పెడతారు. దాంతో మిల్లర్లు వ్యాపారం వదుకునేందుకు కూడా కొందరు సిద్దపడుతున్నారు. ఇటీవల ఓ జిల్లాలో అధికారుల వేధింపులకు ఓ మిల్లర్‌ ఇంట్లో వున్న బంగారం అమ్మి మరీ అధికారులకు లంచాలు ఇవ్వాల్సిన పరిస్దితి ఎదురైందని తెలుస్తోంది. లేకుంటే మిల్లు సీజ్‌చేస్తాం? కేసులు నమోదు చేస్తాం? మొత్తం వ్యాపారం మూసేస్తాం? అంటూ బెదిరిస్తారు. లేని కేసులు నమోదు చేస్తారు? వేధిస్తారు. వాటికన్నా బంగారం అమ్ముకొని డబ్బులు ఇవ్వాల్సిన పరిస్దితులు ఎదరౌతున్నాయని మిల్లర్లు దుఖపడుతున్నారు. మరో జిల్లాలో అసలు లేని లెక్కలు ముందు వేసి లంచాలు అడిగిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం మంజూరు చేయని వడ్లను కోట్లలో చూపించి, మిల్లర్‌ను అదికారులు బెదిరిస్తున్నారు. వర్షం పడే సమయానికి, మబ్బులు పడుతున్న సమయం చూసి మిల్లుల తనిఖీలకు అధికారులు వెళ్తున్నారు. వర్షానికి తడవకుండా వున్న వడ్ల వస్తాలపై కప్పిని టార్పాలిన్‌ను తొలగించి వర్షంలోనే లెక్కలు చూస్తామంటారు. దాంతో మిల్లర్లు ఆందోళన వ్వక్తం చేస్తున్నారు. ఒక్కసారి ఎండిన వడ్లు మళ్లీ తడిస్తే ఎంత కష్టమో, నష్టమో మిల్లర్లకు తెలుసు. వాటిని మళ్లీ ఆరబెట్టినా ఫలితం వుండదు. ఎండ కాసిన రోజు వచ్చి లెక్కలు చూసుకోండి? ఒక్క బస్తా తక్కువున్నా కేసులు నమోదు చేయండి? అని మిల్లర్లు చెబుతున్నా మాకే ఎదురు చెబుతావా?అంటూ కూడా బెదిరిస్తున్నారట. లేకుంటే అడిగినంత ఇవ్వమంటున్నారట? ఇలా వుంది అదికారుల తీరు. అంతే కాదు గంటలో అడిగినంత లంచం సమకూర్చకపోతే కేసులు నమోదు చేస్తామంటున్నారట. అయితే బడా బడా మిల్లర్ల జోలికి సివిల్‌ సప్లయ్‌ శాఖ అధికారులు పోరు. ఎందుకంటే వాళ్ల నుంచి ఎప్పటికప్పుడు అందాల్సినంత అందుతూనే వుంటుంది. వందల కోట్లు బకాయిలువున్న మిల్లర్లు ఎన్నితప్పులు చేసినా పట్టించుకోరు. కాని చిన్న చిన్న మిల్లర్లు ఎలాంటి తప్పు చేయకున్నా వేదిస్తుంటారు. ఇలా వేదిస్తున్న అదికారుల లెక్కలన్నీ నేటిధాత్రి చేతిలో వున్నాయి. వారి వివరాలు, వారి బాగోతాలు వరుసగా మీ నేటిధాత్రిలో కథనాలు వస్తాయి!

బీఆర్‌ఎస్‌ దే జూబ్లీ…పక్కా 50 వేల మెజారిటీ!

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డితో నేటిధాత్రి స్పెషల్‌ ఇంటర్వూ..

-బైపోల్‌లో బీఆర్‌ఎస్‌ నిశ్శబ్ద విప్లవం.

-కాంగ్రెస్‌ కు ప్రజల దిమ్మతిరిగే సమాధానం.

-ఓటర్లను బెదిరించే కాంగ్రెస్‌ కాల గర్భంలో కలవడం తధ్యం.

-బీఆర్‌ఎస్‌ బలం ముందు కాంగ్రెస్‌ జుజుబీ.

-కాంగ్రెస్‌, మజ్లిస్‌ అనైతిక పొత్తుకు చెంపపెట్టు.

-కాంగ్రెస్‌ భయపెట్టాలని చూసినా, ప్రలోభ పెట్టినా నమ్మడానికి జనం సిద్ధంగా లేరు.

-సునీత గెలుపు ఎప్పుడో ఖాయమైంది.

-బీఆర్‌ఎస్‌ ప్రభంజనం చూసి కాంగ్రెస్‌ వణుకుతోంది.

-ప్రచారంలో కాంగ్రెస్‌ నాయుకుల ముఖం మాడిపోయింది.

-జూబ్లీలో బీఆర్‌ఎస్‌ నిశ్శబ్ద విప్లవం.

-కాంగ్రెస్‌కు ఘోరీ కట్టడం ఖాయం.

-కాంగ్రెస్‌ చేసిన మోసాలకు చరమగీతం.

-అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం.

-ఓటర్లను బెదిరించి సిఎం. రేవంత్‌ పెద్ద తప్పు చేశారు.

-ఓటర్లను బెదిరించి గెలుస్తామనుకోవడం కాంగ్రెస్‌ మూర?త్వం.

-తెలంగాణలో కాంగ్రెస్‌ ను ఇక జన్మలో ఎవరూ నమ్మరు.

-బీఆర్‌ఎస్‌కు జనం ఆదరణ చూసి కాంగ్రెసోళ్ల గుండెలు అదురుతున్నాయి.

-కాంగ్రెస్‌ పార్టీ జూబ్లీలో చేతులెత్తేసినట్లే లెక్క.

-సీఎం. రేవంత్‌ మీడియా సమావేశంతో తేటతెల్లమైంది.

-ఓడిపోతున్నామని సీఎం. రేవంత్‌ కు అర్థమైపోయింది.

-ప్రస్టేషన్‌లో రేవంత్‌ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదు.

-సీఎం. వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు.

-రెండేళ్లలలో కాంగ్రెస్‌ సర్కార్‌ చేసిన ఒక్క పని లేదు.

-రెండేళ్లలో చేసిన పనులేమీ లేక చెప్పుకునే దిక్కు లేదు.

-కారు ముందు కాంగ్రెస్‌ కహానీలు ఖతం.

-కాంగ్రెస్‌ పతనం జూబ్లీ నుంచే ప్రారంభం.

-కాంగ్రెస్‌ కు తప్పదు గుణపాఠం.

హైదరాబాద్‌, నేటిధాత్రి:  

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ చెప్పే అబద్దాలు నమ్మడానికి, రాష్ట్ర ప్రభుత్వం చేసే అన్యాయాలు, మోసాలు, అక్రమాలను ప్రజలు సహించడానికి సిద్దంగా లేరు. ఎన్నికల ముందు ఒకటా, రెండా 420 అబద్దాలు చెప్పారు. హమీలు ఇచ్చారు. గెలిచిన తర్వాత తెప్ప తగిలేసినంత పని చేశారు. అలాంటి కాంగ్రెస్‌ పార్టీని తెలంగాణలో ఇక నమ్మే పరిస్దితి అసలే లేదు. రేపు జరగబోయే జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో అసలే నమ్మేందుకు సిద్దంగా లేరు. కాంగ్రెస్‌కు తగిన బుద్ది చెప్పడానికి ప్రజలు సిద్దంగా వున్నారు. కాంగ్రెస్‌ను చిత్తుచిత్తుగా ఓడిరచేందుకు ప్రజలు సమాయత్తమయ్యారు. జూబ్లీహిల్స్‌లో ప్రజలు ప్రశాంత విప్లవాన్ని చూపిస్తారు. ఓటు ద్వారా బిఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించి నిశ్శబ్ద విప్లవాన్ని తెస్తారు. కాంగ్రెస్‌ను గొయ్యి తీసి పది అడుగుల లోపల పాతి పెడతారు. మళ్లీ ముప్పై ఏళ్లపాటు తెలంగాణలో ఇక కాంగ్రెస్‌ ఓటు అడగకుండా భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు తీర్పిచ్చేందుకు సిద్దంగా వున్నారు. అంతకు ముందు జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను తక్కు తక్కుకింత ఓడిరచనున్నారు. భవిష్యత్తు అంతా బిఆర్‌ఎస్‌ పార్టీదే అని నిరూపించబోతున్నారంటున్న ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు, ఎమ్మెల్సీ పోచం పల్లి శ్రీనివాస్‌రెడ్డి ,నేటిధాత్రి ప్రత్యేక ఇంటర్వూ….

నేటిధాత్రి: నమస్తే!

పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి: నమస్తే.

ప్ర: జూబ్లీహిల్స్‌ బై పోల్‌ ప్రచారం ఇక ఒక్క రోజులో ముగియనుంది. బిఆర్‌ఎస్‌కు గెలుపు అవకాశాలు ఎలావున్నాయి? 

జ: ప్రజలు బిఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీతను బంపర్‌ మెజార్టీతో గెలిపించేందుకు సిద్దమయ్యారు. అసలు ప్రచార సమయంలోనే కాంగ్రెస్‌, బిజేపిలకు ప్రజల మూడ్‌ తెలిసిపోయింది. వారికి ఓటమి ఖాయమని తేలిపోయింది. అందుకే సిఎం. రేవంత్‌ రెడ్డి ప్రస్టేషన్‌కు గురయ్యారు. ఏడు రోజుల పాటు జూబ్లీహిల్స్‌లో ప్రచారం సాగించారు. అయినా జనం నమ్మడానికి సిద్దంగా లేరు. కాంగ్రెస్‌ అభ్యర్ధి గెలుపు అంత సులువు కాదని తెలుసుకున్నారు. బిఆర్‌ఎస్‌ మీద అవాకులు చెవాకులు పేలుతున్నారు. అంటేనే కాంగ్రెస్‌పార్టీ పరిస్ధితి ఏమిటో సిఎం. మాటల్లోనే అర్ధం చేసుకోవచ్చు. కాంగ్రెస్‌ పార్టీ గెలిచే అవకాశాలు ఒక్క శాతం కూడా లేవని తెలిసింది. బిఆర్‌ఎస్‌ గెలుపును ఆపడం కష్టమని అర్దమైపోయింది. ఇంకేముంది కాంగ్రెస్‌ నాయకులు గాయి, గాయి చేస్తున్నారు.

ప్ర: జూబ్లీహిల్స్‌ ప్రజలు గెలిపించకపోతే పథకాలు అగిపోతాయని సిఎం. అంటున్నాడు. ప్రజలు భయపడి ఓట్లు వేయరంటారా?

జ: ఇది ప్రజాస్వామ్యం. ప్రజలే నాయకులు, పాలకులు. వారిని బెదిరించి ఓట్లు సంపాదించడమనేది ఎవరి తరం కాదు. అందులోనూ సిఎం. రేవంత్‌ ప్రజలను బెదిరించడం వల్ల కాంగ్రెస్‌కు ఎలాగైనా బుద్ది చెప్పాలని ప్రజలు మరింత గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. బిఆర్‌ఎస్‌ అభ్యర్ధికి మరింత మెజార్టీ వచ్చేలా చేశారు. ఏ పార్టీకైనా సరే గెలవాలన్న ఆలోచన మంచిదే. ఉద్దేశ్యం మంచిదే. ఎలాగైనా గెవాలి అనుకోవడం తప్పు. ప్రజల మన్ననలను పొందకుండా గెలవడం అసాధ్యం. అందులోనూ పాలకులు పథకాలు ఆపేస్తామంటే ప్రజలు తిరుగుబాటు చేస్తారు. అయినా రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌కు ముఖ్యమంత్రా? లేక తెలంగాణ మొత్తానికి ముఖ్యమంత్రా? ఒక్క ఉప ఎన్నిక కోసం ఇన్ని విన్యాసాలు చేయడం అవసరమా? 

ప్ర: బిఆర్‌ఎస్‌ అభ్యర్ధి సునీతపై మంత్రులు చేసిన వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏమిటి?

జ: రాజకీయ నాయకులకు ఓపిక, సహనం వుండాలి. మాట్లాడే మాటలు హద్దుల్లో వుండాలి. ముఖ్యంగా పాలకులు ఎంతో ఒద్దికగా మాట్లాడాలి. మాట్లాడే ప్రతి మాట ఆచి తూచి మాట్లాడాలి. తన భర్తను కోల్పోయి పుట్టెడు దుఖంలో వున్న మాగంటి సునీత కన్నీళ్లను కూడా అపహాస్యం చేశారు. ఇది తెలంగాణ సమాజమే గమనించింది. ముఖ్యంగా జూబ్లీహిల్స్‌ ప్రజలు చూస్తూనే వున్నారు. కాంగ్రెస్‌పార్టీ నాయకులు సహజ గుణం తెలిసిపోయింది. ఒక మహిళను అంతలా అవమాంచే రీతిలో మాట్లాడిన నాయకులను ప్రజలు ఇప్పటికే చీ అన్నారు. కాంగ్రెస్‌ నాయకుల వ్యవహార శైలి గురించి ప్రజలకు తెలియంది కాదు. కాని ఇంత దిగజారి రాజకీయాలు చేస్తారని మాత్రం ఎప్పుడూ ఊహించలేదు. అందుకే ఖచ్చితంగా జూబ్లీహిల్స్‌ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం. 

ప్ర: కాంగ్రెస్‌కు మజ్లిస్‌ పార్టీ సపోర్టు చేయడం ఎలా అర్ధం చేసుకోవచ్చు?

జ: అది అనైతికపొత్తు. అంతకు మించి ఆ పొత్తు గురించి మాట్లాడడం వేస్టు. తెలంగాణలో కాంగ్రెస్‌కు మద్దతిస్తున్న మజ్లిస్‌ పార్టీ, బిఆర్‌ఎస్‌లో కాంగ్రెస్‌మీద దుమ్మెత్తిపోస్తోంది. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే చిప్ప కూడా చేతికి రాదని బిహార్‌లో ఎంపి. అసదుద్దీన్‌ ఓవైసీ ప్రచారం సాగిస్తున్నారు. ఇక్కడ మాత్రం సపోర్టు చేస్తున్నారు. ఇలాంటి అనైతిక పొత్తులు ఎక్కడైనా వుంటాయా? కాంగ్రెస్‌పార్టీ ప్రాంతీయపార్టీ కాదు. జాతీయ పార్టీ. జాతీయ పార్టీకి ఎక్కడైనా సరే ఒకే విధానం వుండాలి. ఇలా రెండు మూతుల రాజకీయాలు చేయడం కాంగ్రెస్‌కే చెల్లింది. అయినా కాంగ్రెస్‌పార్టీ ఎన్ని అనైతిక పొత్తులతో వచ్చినా బిఆర్‌ఎస్‌ గెలుపును ఎవరూ ఆపలేరు. ఆపడం కూడా వారికి సాద్యంకాదు. 

ప్ర: కాంగ్రెస్‌ పార్టీ ప్రధానంగా ముస్లిం ఓట్ల మీద ఆశల పెట్టుకున్నది. ముస్లిం ఓట్లు ఎటు పడే అవకాశం వుంది?

జ: ముస్లింల ఓట్లన్నీ బిఆర్‌ఎస్‌కే పడతాయి. ముస్లింలు కాంగ్రెస్‌ను నమ్మడానికి సిద్దంగా లేరు. ముఖ్యంగా రేవంత్‌ను, జూబ్లీహిల్స్‌ అభ్యర్ధినవీన్‌ యాదవ్‌ను నమ్మడం లేదు. తెలంగాణ ముస్లిం మైనార్టీ ప్రజలకు బిఆర్‌ఎస్‌ చేసిన సేవ ఎవరూ చేయలేదు. ముస్లింలకు రిజర్వేషన్‌ అమలు చేశాం. ముస్లింకు పండుగల తోఫాలు అందించాం. ముస్లింకు షాదీ ముభారక్‌ అందించాం. అనేక ఉపయోగకరమైన కార్యక్రమాలు చేపట్టాం. ముస్లింలు అంటే మజ్లిస్‌ ఓటు బ్యాంకు కాదు. ముస్లింలు జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు ఓటు వేయరు. ముస్లింలు కూడా మళ్లీ సారే రావాలి. కారే గెలవాలి. తెలంగాణలో మళ్లీ బిఆర్‌ఎస్‌ పాలన రావాలి. కేసిఆర్‌ ముఖ్యమంత్రి కావాలిన బలంగా కోరుకుంటున్నారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను చిత్తు చిత్తు గా ఓడిరచి, బిఆర్‌ఎస్‌ను గెలిపించాలని చూస్తున్నారు. అలాంటి ముస్లిం మైనార్టీలు కాంగ్రెస్‌కు ఓటు వేయరు. ఆ పార్టీకి తగిన బుద్ది చెబుతారు?

 ప్ర: నాలుగు కట్టడాలు చూపించి ఎంత కాలం ప్రజలను మోసం చేస్తారని సిఎం. అంటున్నాడు?

జ: మాట్లాడడానికి సిఎంకు కొంచెమైనా సిగ్గుండాలి. సెక్రెటరియేట్‌ ఎందుకు అనే వాళ్లు ఎవరైనా వుంటారా? సెక్రెటరియేట్‌ నిర్మిస్తే ఉద్యోగాలు వస్తాయా? అని ప్రశ్నించే సిఎం. ఎక్కడైనా వుంటాడా? నేనున్నాని సిఎం.రేవంత్‌ రెడ్డి నిరూపించారు. అంత గొప్ప నాయకుడిని సిఎం.ను చేసి కాంగ్రెస్‌పార్టీ తలపట్టుకుంటున్నది. కమాండ్‌కంట్రోల్‌ బోర్డు ఎందుకు? అని ప్రశ్నించడంలో అర్దముందా? కాళేశ్వరం మీద రేవంత్‌రెడ్డి చెప్పే అబద్దాలను ఎవరూ నమ్మేందుకు సిద్దంగాలేరు. జూబ్లీహిల్స్‌ బైపోల్‌లో కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెడతారు. అప్పుడు సిఎంకు దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది.

నేటిధాత్రి: ధన్యవాదాలు.

పోచంపల్లి: నమస్కారం.

ఎన్నికల పుట్టగొడుగులు..పార్టీలకు గొడుగులు?

`లెక్కల మీద లెక్కలు…సర్వేల తిప్పలు!

`సర్వే లెక్కలు..ఎక్కాల పుస్తకం అంకెలు?

`లక్షల మందిలో పదుల సంఖ్యల అభిప్రాయాలు

`జనం ముందుకొచ్చినవి ఎన్నో!

`ఊహల్లో రాసుకున్న ఆలోచనలెన్నో!

`స్వతంత్ర సర్వే సంస్థలు ఏవీ వుండవు

`ఏదో ఒక పార్టీ అండ లేకుండా అవి నడవవు

`ఎంచుకున్న పార్టీకి అనుకూలంగా సర్వే చెప్పకుండా వుండలేరు

`సాధారణ సమయాల్లో జనం మాటలు వేరు!

`ఎన్నికల వేళ ప్రజల ఆలోచనలు వేరు

`అధికారంలో వున్నంత కాలం సిఎం. లు సొంత సర్వేలు చేయిస్తుంటారు

`ఎమ్మెల్యేల పని తీరు మీద మార్కులిస్తుంటారు

`తీరా ఎన్నికల సమయంలో సిట్టింగులకే టిక్కెట్లు ఇస్తారు

`జనం ముందుకు వచ్చి చేసిన వాళ్లు ఎవరూ లేరు

`అంతా ఆఫీసుల్లో కూర్చొని అల్లుకునే కథలు

`ఇప్పటికి వరకు ప్రజాభిప్రాయాన్ని వరుసగా స్పష్టంగా చెప్పిన సంస్థ ఒకటి లేదు

`సర్వేలే నిజమై వుంటే కొన్ని రాజకీయ పార్టీలు పోటీయే చేయవు

హైదరాబాద్‌, నేటిధాత్రి:                        సన్నాసికి సిగ్గుండదు..దరిద్రునికి బుద్ది వుండదు. కాని రాజకీయాల్లో ఎవరికీ సిగ్గుండదు. బుద్ది అసలే వుండదు. దూరాలోచన అసలే వుండదు. అందుకే పుట్టగొడుల్లా పుట్టుకొచ్చే సర్వేలను నమ్మి మోసం పోతుంటారు. సహజంగా సార్వత్రిక ఎన్నికల సమయంలో సుమారు ఐదేళ్లపాటు జనం మూడ్‌ను ప్రతి నిమిషం తెలుసుకుంటూ వుండడం జరుగుతుంది. ఐదేళ్ల కాలంలో జనం ఏమనుకుంటున్నారు? సరిగ్గా ఎన్నికల సమయంలో ఏం నిర్ణయం తీసుకుంటారో కూడా అర్దం చేసుకోవచ్చు. కాని ఒక్క ఉప ఎన్నికలో కూడా పుట్టగొడుగుల్లా సర్వే సంస్దలు పుట్టుకురావడం విచిత్రం. విడ్డూరం. అంటే రాజకీయ పార్టీలకు, నాయకులు తమ నాయకత్వాల మీద నమ్మకం లేక సర్వేలు చేయించుకుంటారా? సర్వేలు ప్రత్యేకంగా చేయించుకంటే తప్ప జనం నాడీ తెలుసుకోలేరా? అధికారంలో వున్నప్పుడు ప్రజా సమస్యలు తెలుసుకోరు? అది ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడా ఏమీ వుండదు. అందరూ ఆ తాను ముక్కలే. ప్రతిపక్షంలో వున్నప్పుడు అదికారం కోసం అనేక అవస్ధలు పడుతుంటారు. జనం మద్యలో వుంటారు. జనానికి అందుబాటులో వుంటారు. జనం కోసమే రాజకీయం చేస్తున్నామని చెప్పుకుంటారు. ఒక్కసారి అదికారంలోకి వచ్చాక జనం ఏమనుకుంటు న్నారు? అనేది వినడానికి కూడా సమయం కేటాయించుకోరు. తాము చెప్పిందే నిజం. తమ మాటే శాసనం. తమ వాక్కేవేదం అనుకునేలా వ్యవహరిస్తుంటారు. ఇక్కడే రాజకీయ పార్టీలు, నాయకులు తప్పులో కాలేస్తుంటారు. ప్రతిపక్షంలో వున్నప్పుడు ఎలా వుంటారో? అధికార పక్షంలో వున్నప్పుడు ఒకేలా వుంటే, అసలు సమస్యలే ఉత్పన్నం కావు. అయితే నాయకులు జేజేలకు మాత్రమే లొంగిపోతారు. పొంగిపోతారు. ఎప్పుడూ జేజేలు కొట్టించుకోవాలనే చూస్తారు. ప్రతిపక్షంలో వున్నప్పుడు బాగా కొట్లాడుతున్నారు అనే మాటలే కోరుకుంటారు. ప్రభుత్వం మీద ప్రజా సమస్యల మీద బాగా పోరటం చేస్తున్నాడనే పొగడ్తలే కోరుకుంటారు. అందుకు ఓ భజన బృందాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటారు. అదికారంలోకి వచ్చిన తర్వాత మరిన్ని జేజేలు కోరుకుంటారు. అడుగు తీసి, అడుగేస్తే జిందాబాద్‌లు కొట్టాలని ఆశిస్తారు. అందుకు మరింత భజన బృందాన్ని నిలబెట్టుకుంటారు. అలా జేజేలు కొట్టించుకుంటే తప్ప వారికి నిమ్మలం వుండదు. పూట గడవదు. అలాంటి వారికి సర్వేలు తోడౌతుంటాయి. నిజాలు ఎప్పుడూ సర్వేలు చెప్పవు. దేశంలో ప్రజా పాలన మొదలైనప్పటి నుంచి సర్వేలు జరుగుతూనే వున్నాయి. అప్పటి నుంచి ఈసారి ఏ పార్టీ అదికారంలోకి వస్తుంది? ఎన్ని సీట్లు వస్తాయన్నది ఖచ్చితంగా చెప్పిన సర్వే సంస్ధలు ఏవీ లేవు. కాని సర్వేల మీద పార్టీలు, నాయకులు ఆధారపడి పోవడం అలవాటు చేసుకున్నారు. ఆ సర్వేలు కూడా పార్టీలకు, నాయకులకు అనుకూలంగా వచ్చేలా రిపోర్టులు తయారు చేయించుకోడం మొదలు పెట్టారు.ఇంత వరకు బాగానే వుంది. కాని ఉప ఎన్నికల కోసం సర్వేల హడావుడి ఏమిటో ఎవరికీ అర్దం కాకుండాపోతోంది. నిజం చెప్పాలంటే ఈ సర్వే సంస్ధలన్నీ ఒక రకంగా బోగస్‌. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మాజీ ఎంపి. లగడపాటి రాజగోపాల్‌ను ఆంద్రా ఆక్టోపస్‌ అని పిలిచేవారు. ఆయన సర్వేలను ఎప్పటికప్పుడు చేయిస్తూ వుండేవారు. అయితే రాష్ట్రాల, కేంద్రం సార్వత్రిక ఎన్నికల సర్వేలు చేయిస్తూ వుండేవారు. కొంత వరకు అటూ, ఇటూ కాస్త తేడాతో సర్వే వివరాలు వెల్లడిస్తూవుండేవారు. మొదట్లో కాస్త లెక్కలను బాగానే అంచనా వేసినట్లు కనిపించేవారు. జాతీయ స్ధాయిలో మీడియా సంస్థలు కూడా ఒక దశలో లగడపాటి రాజగోపాల్‌ సర్వేకోసం ఎదురుచూసేలా కూడా చేశాయి. కాని ఆయన వేసిన అంచాలన్నీ , చేసిన లెక్కలన్నీ, ఎక్కాల పుస్తకంలో అంకెలే అని తేలిపోయింది. తనను తాను అధికంగా ఊహించుకోవడం మొదలు పెట్టారు. బోల్తా పడ్డారు. ఇక సర్వేలు చేయడం ఆపేశారు. అందులో కూడా సవాలు చేసి మరీ ఓడిపోయారు. 2018లో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చాయి. నిజానికి ముందస్తు ఎన్నికలు వస్తాయని ముందు నుంచే కొన్ని సంకేతాలు అప్పటికే కేసిఆర్‌ ఇస్తూ వుండేవారు. ఆఖరుకు అదే చేశారు. ఆ సమయంలో లగడపాటి రాజగోపాల్‌ సర్వే చేయిస్తున్నట్టు గొప్పగా చెప్పుకున్నారు. ఆఖరుకు గజ్వెల్‌లో కూడా కేసిఆర్‌ ఓడపోతున్నారు. తెలంగాణలో బిఆర్‌ఎస్‌ ఓడిపోతుంది? అని తన జోస్యం చెప్పేశారు. అయితే తన జోస్యం నిజం కాకపోతే ఇకపై సర్వేలు చేయడం ఆపేస్తానని శపథం చేశాడు. కాని బిఆర్‌ఎస్‌ రెండోసారి బంపర్‌ మెజార్టీతో 88 సీట్లు గెల్చుకున్నది. లగడపాటి సర్వే తుస్సుమన్నది. నిజంగానే సర్వే సంస్దలు నిర్వహించే వాటికి సైంటిఫిక్‌ అనాలిసిస్‌ వుంటుందని అనుకోవడం భ్రమ. సరిగ్గా ఎన్నికల సమయంలో జరిగే ఏ సర్వేకు ప్రాతిపదిక వుండదు. అంతే కాకుండా అభ్యర్ధుల ఎంపిక తర్వాత వచ్చే సర్వే వివరాలు అసలే నిజంకాదు. సార్వత్రిక ఎన్నికల సమయంలో జనం ఎంతో కొంత నిజం బహరింగానే చెబుతారు. దాంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం అంచనా వేయడానికి ఎంతో కొంత వీలౌతుంది.కాని ఉప ఎన్నికల సమయంలో సర్వేలు అనేవి కత్తి మీద సాము. అందుకే చేయరు. కాని ఏవేవో ప్రకటిస్తుంటారు. కొత్త కొత్త సంస్ధలు పుట్టగొడుల్లా వస్తుంటాయి. తమ తమ సర్వే వివరాలు అంటూ వెల్లడిస్తుం టాయి. కాని ఆ సర్వేలన్నీ ఏదొ ఒక పార్టీకి అనుకూలంగానే సాగిస్తుంటారు. నిజంగానే ఒక సర్వే సంస్ధ కష్టపడి సర్వేలు ఎంతో ఖర్చుతో కూడుకున్న పని.సర్వే నిర్వాహకులుగాని, సర్వే సంస్దలుగాని, అందులో పనిచేసే వాళ్లు కూడా ఊడిగం చేయరు. ఊరికే పనిచేయరు. అందుకు ఎంతో కొంత ఖర్చవుతుంది.అది కూడా లక్షలు, కోట్లలో అవుతుంది. ఆ ఖర్చును ఊరికే ఎవరూ భరించుకోరు. సహజంగా రాజకీయ పార్టీలకు సూచనలు, సలహాలతోనే ఏటా కొన్ని వందల కోట్లు సంపాదిస్తున్నానని ప్రశాంత్‌ కిషోర్‌ లాంటి వాళ్లు చెబుతుంటారు. అలా తొలుత ఒకటో రెండు చోట్ల వారి అంచనాలు నిజమైతే చాలు. ఇక రాజకీయపార్టీలు ఆ సంస్ధల వెంట పరుగెడుతుంటారు. అదే ప్రశాంత్‌ కిషోర్‌ తన రాజకీయపార్టీని మాత్రం గెలిపించుకోల ేకపోతున్నాడు. రాష్ట్రాలల రాజకీయ పార్టీలకు వ్యూహాలను అందించే ప్రశాంత్‌ కిషోర్‌కు తన పార్టీకి మాత్రం వ్యూహ రచన చేసుకోలేకపోతున్నాడు. అంటే రాజకీయాల్లో సర్వేల విన్యాసం, ఊహల బారతం అంతా ఉట్టిదే. అదంతా సంపాదనలకోసమే… అయినా రాజకీయ పార్టీలు నమ్ముతూనే వుంటాయి. తమ బలహీనతను బైట పెట్టుకుంటూనే వుంటాయి. నిజంగానే సర్వేలు చెప్పిన మాటలే నిజమైతే ఓడిపోతారనుకునే నాయకులు, ఆ పార్టీలు ఎన్నికల బరిలోకే దిగరు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల విషయానికే వద్దాం..రాజకీయ పార్టీలు వెళ్లి ఓట్లు అడిగితేనే సరే సరే అంటారు. ప్రచారానికి వచ్చిన అన్ని పార్టీలకు అదే సమాదానం చెబుతారు. మా ఓటు మీకే అంటారు. కాని మీకు ఓటు వేయమని ఎవరూ ముఖం మీద చెప్పరు. అలా చెప్పేవారు సహజంగా ఏదో ఒక పార్టీకి చెందిన వాళ్లైనా వుంటారు. లేకుంటే ఏదైనా రాజకీయ పార్టీకి అభిమానులైనా అయి వుంటారు. అంతే కాని తటస్ధులు ఎవరూ ప్రచారానికి వచ్చిన వారి ముఖం మీద ఓటు వేయమని చెప్పరు. అలాగే ఉప ఎన్నికల సమయంలో జరిపే సర్వేల విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఎవరూ స్పష్టమైన సమాధానం చెప్పరు. సర్వేలకు వెళ్లేవారు ఊహించుకోవడం, అంచనా వేసుకోవడం మాత్రమే వుంటుంది. అయితే ఏదైనా పార్టీకి సర్వే చేస్తున్నారో ఆ సంస్ధలు మాత్రం ఆ పార్టీలకు వ్యతిరేకంగా ప్రజల ఆలోచనలు వుంటే వాటిని బైట పెట్టరు. మీ పార్టీ ఓడిపోతుందని ఎట్టిపరిస్ధితుల్లోనూ చెప్పరు. ప్రజలు తమ పార్టీ వైపే వున్నారంటూ లెక్కలు చెబుతారు. సర్వేలు చేసినందుకు అయిన ఖర్చులు వసూలు చేసుకుంటారు. ఏ సర్వే సంస్ధ అయినా సర్వే చేసి ఓడిపోతుందని చెబితే ఒక్క రూపాయి కూడా ఏ పార్టీ ఇవ్వదు. ఈ మాత్రం జనానికి తెలియదా? పార్టీలకు అంచనా వేసుకోలేవా? అయినా సర్వేల వెంట వేలం వెర్రిలా పడుతుంటారు. సర్వేలు చేయించుకుంటారు. ఈ మధ్య మరో దరిద్రం మొదలైంది.సర్వేల మూలంగా బెట్టింగ్‌లు నడుస్తున్నాయంటూ కూడా వార్తలు వస్తున్నాయి. రాజకీయ పార్టీల గెలుపోటములేమో గాని, సర్వే సంస్దల వల్ల బెట్టింగుల జోరు మాత్రం పెరుగుతోంది. అదో వ్యాపారమైపోయంది.

జనం గుండెల్లో ‘‘సారు’’..జూబ్లీ హిల్స్‌లో..’’కారుకే ఓటు’’.

`రాజ్యసభ సభ్యుడు ‘‘వద్దిరాజు రవిచంద్ర’’ చెబుతున్న..’’జూబ్లీహిల్స్‌ జనం మాట’’

`ఎవరి నోట విన్నా కారు కారునే గెలిపించుకుంటం

`ఓటుతోనే రౌడీ రాజకీయాల తిక్కకుదిరిస్తాం

`ఆరు గ్యారెంటీలలో ఒక్కటి కూడా అమలు చేయని దౌర్భాగ్యం

`రైతకు భరోసాకు ఆదిలోనే శఠగోపం

`రుణమాఫీ పచ్చి అబద్దానికి నిదర్శనం

`హైడ్రా పేరుతో హైదరాబాద్‌ సర్వనాశనం

`పేదల జీవితాలపై పగబట్టిన కాంగ్రెస్‌ పాపపు కాలం

`భస్మాసుర హస్తం… తెలంగాణకు శాపం!

`పచ్చగా వున్న తెలంగాణకు పట్టిన కాంగ్రెస్‌ దరిద్రం

`తొండి ప్రభుత్వం…తోడేళ్ల రాజకీయం

`ఒక్క చాన్స్‌ అంటే గెలిపించి వలవల ఏడుస్తున్న జనం

`కాంగ్రెస్‌ను నమ్మి నిండా మునిగిన ప్రజానీకం

`జూబ్లీ హిల్స్‌ దెబ్బకు హస్తానికి తద్దినం

`తెలంగాణలో కాంగ్రెస్‌ కనుమరుగు ఖాయం

`కాంగ్రెస్‌ మీద రైతుల్లో పెల్లుబికిన ఆగ్రహం

`మహిళల్లో కాంగ్రెస్‌ మీద పట్టలేనంత ఆవేశం

`కాంగ్రెస్‌ చెప్పిన వాగ్థానాలన్నీ అబద్ధం..

`అధికారంలోకి రావడానికి కాంగ్రెస్‌ నయ వంచన కుటిలత్వం

`కుర్చిల కొట్లాటల్లోనే కరుగుతున్న పుణ్యకాలం

`వాటాల పంపకాలలో మునిగితేలుతున్న మంత్రి వర్గం

`ఇంత మోసం చేసిన కాంగ్రెస్‌కు పాతాళమే శరణ్యం

`విద్యార్థులలో పెరుగుతున్న చైతన్యం

`నిరుద్యోగులలో పెరిగిన అసహనం

`రెండు లక్షల ఉద్యోగాల పేరు చెప్పి కాంగ్రెస్‌ చేసిన మోసం

`ప్రశ్నించే వారిపై కాంగ్రెస్‌ చూపిస్తున్న అధికార పైత్యం

`నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్‌ పైశాచికత్వం

`జూబ్లీ హిల్స్‌తో కాంగ్రెస్‌ పతనం

జూబ్లీహిల్స్‌ ప్రచారం జోరుగా సాగుతోంది. పాలక, ప్రతిపక్షాలు హోరాహోరీగా తలపడుతున్నాయి. పోలింగ్‌కు సమయం దగ్గర పడుతోంది. ప్రజలు ఏమనుకుంటున్నారు? బిఆర్‌ఎస్‌ ప్రచారం ఎలా వుంది? సునీత గెలుపు నల్లెరు మీద నడకే అని బిఆర్‌ఎస్‌ శ్రేణులే అంటున్నాయి.సారే రావాలి. కారే గెలవాలి. మళ్లీ తెలంగాణ బంగారు తెలంగాణ కావాలంటే బిఆర్‌ఎస్‌ అధికారంలోకి రావాలి. అందుకు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నాంది పలకాలని ప్రజలు కోరుకుంటున్నారని బిఆర్‌ఎస్‌ శ్రేణులు చెబుతున్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక మీద బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వద్ది రాజు రవిచంద్ర ప్రచార విశేషాలపై నేటి ధాత్రి ప్రత్యేక ఇంటర్వూ…

నేటిధాత్రి: నమస్తే రవిచంద్రగారు.

రవిచంద్ర: నమస్తే.

ప్రశ్న..ఎడిటర్‌ కట్ట రాఘవేంద్రరావు :

జూబ్లీహిల్స్‌ ప్రచారం ఎలా సాగుతోంది?

జవాబు.. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర : చాలా బాగా సాగుతోంది.
ప్రశ్న..ఎడిటర్‌ కట్ట రాఘవేంద్రరావు : జనం ఏమనుకుంటున్నారు..మీరేం అర్ధం చేసుకున్నారు?

జవాబు..రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర : జనానికి పూర్తి స్పష్టత వుంది. ఎవరు గెలవాలి. ఎవరు ఓడాలి. ఎవరికి ఓటు వేయాలి. ఎవరిని ఓడిరచాలి అనే విషయంలో జూబ్లీహిల్స్‌ ప్రజలు స్ధిరనిర్ణయంతో వున్నారు. అది మేం ప్రచారానికి వెళ్లినప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. మా పార్టీ ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. జనం కూడా అంతే విదంగా బిఆర్‌ఎస్‌ ప్రచారానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారు. మాకు బస్తీలలో సాదర స్వాగతం పలుకుతున్నారు. అంతే కాదు మీరు ప్రచారానికి రాకున్నా గెలుస్తారంటూ ప్రజలే చెబుతుంటే ఎంతో సంతోషం అనిపిస్తోంది. అంటే జనం గుండెల్లో బిఆర్‌ఎస్‌ ఎంత బలంగా వుందో అర్ధం చేసుకోవచ్చు. కేసిఆర్‌ను ప్రజలు ఎంత మిస్‌ చేసుకుంటున్నారో కూడా ఈ సందర్భంగా తెలుస్తోంది. కేసిఆర్‌ పదేళ్ల పాలనలో ప్రజలు ఎంత సంతోషంగా వున్నారో, ఇప్పుడు ఎలా వున్నారో వారికి అర్ధమౌతోంది. కేసిఆర్‌ పాలనలో సమస్యలు లేవు. ఎలాంటి ఇబ్బందులు లేవు. రౌడీలు లేరు. ప్రజలను వేదించిన వారు లేరు. అప్పుడంతా సైలెంట్‌గా వున్నారు. భయంతో రౌడీలు దాక్కున్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌ రాగానే మళ్లీ రౌడీలు రాజ్యమేలుతున్నారు. కొన్ని బస్తీలలో ప్రజలు మాతో అనేక విషయాలు చెబుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీనాయకులు, కార్యకర్తలు అరాచకాలు చేస్తున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా నవీన్‌ యాదవ్‌ అనుచరులు తమ ఇష్టాను సారం వ్యవహరిస్తారని చెబుతున్నారు. వారిని కట్టడి చేయాలన్నా, తమ బస్తీలు మళ్లీ ప్రశాంతంగా వుండాలన్నా కేసిఆర్‌ సారు రావాలి. బిఆర్‌ఎస్‌ అధికారంలోకి రావాలి. మా ప్రాంతం చల్లగా వుండాలని కోరుకుంటున్నారు. రాత్రి వేళల్లో నవీన్‌ అనుచరులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు బస్తీలలో వుండే బైకులు కూడా ఎత్తుకెళ్తున్నట్లు కూడా కొంత మంది మహిళలు చెబుతున్నారు. రాత్రి సమయాల్లో గల్లీలలో తిరుగుతున్న వారిని చూస్తుంటే భయమేస్తుందని అంటున్నారు. సాయంత్రం సమాయాల్లో బైటకు రావాలంటే మహిళలు బెంబేలెత్తిపోతున్నారని అంటున్నారు. అంటే పరిస్ధితులు ఎలా వున్నాయో అర్దం చేసుకోవచ్చు. ప్రజలకు మళ్లీ ప్రశాంతమైన వాతావరణం రావాలంటే కేసిఆర్‌ వస్తేనే సాద్యమౌతుందని మహిళలు చెబుతున్నారు. అంటే మార్పు మార్పు అని కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను ఎంత మోసం చేసిందో అర్దం చేసుకోవచ్చు. అదికారంలోకి వచ్చి ప్రజలను ఎంత వేదిస్తుందో తెలుసుకోవచ్చు. అందుకే బస్తీలలో కాంగ్రెస్‌ నాయకులు ప్రచారానికి వెళ్లినప్పుడు ఇండ్ల నుంచి జనం బైటకు కూడా రావడం లేదు. ఇండ్ల బైట వున్న వాళ్లుకాంగ్రెస్‌ నాయకులను చూసి ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుంటున్నారు. దాంతో ప్రస్టేషన్‌కు గురౌతున్న కాంగ్రెస్‌ నాయకులు బిఆర్‌ఎస్‌ నాయకులతో గొడవలు పడుతున్నారు. ప్రజలు బిఆర్‌ఎస్‌ నాయకులతో మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నారు. ఇక్కడే అర్ధం చేసుకోవచ్చు. ప్రజలు ఎవరి పక్షనా వున్నారో తేలిపోతోంది.

ప్రశ్న..ఎడిటర్‌ కట్ట రాఘవేంద్రరావు : కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలు అమలు చేసినట్లు చెబుతున్నారు? మీరేమో కాదంటున్నారు?
జవాబు..రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర : అబద్దాలు చెప్పడమే తెలిస్తే నోట్లో నుంచి వచ్చే మాటలన్నీ అబద్దాలే వుంటాయి. అసలు క్షేత్ర స్దాయి కాంగ్రెస్‌ కార్యకర్తలే ఆరు గ్యారెంటీలు ఏమిటో తెలియని దుస్తితి ఆ పార్టీది. ఆరు గ్యారెంటీలు అని చేతులు దులుపుకుందామనుకుంటున్నారు. కాని అందులో 13 గ్యారెంటీలున్నాయి. అవి ఇప్పుడు చెప్పడం లేదు. ఎన్నికల సమయంలో ఆరు అంటే పదమూడు అని చెప్పుకున్నారు. ఇప్పుడు అసలు ఆరు చెప్పుకోవడానికే కాంగ్రెస్‌ నాయకులు భయపడుతున్నారు. కలలో కూడా గుర్తుకొచ్చి వణుకుతున్నారు. జూబ్లీహిల్స్‌ ప్రజలు కాంగ్రెస్‌ నాయకుల మొహం మీదనే అడుతున్నారు. మీకెందు ఓటెయ్యాలని కాంగ్రెస్‌ నాయకులను నిలదీస్తున్నారు. ఆరు గ్యారెంటీలలో ఒక్కటైనా అమలు చేశారా? అని ప్రశ్నిస్తున్నారు. దాంతో కాంగ్రెస్‌ నాయకులు తెల్ల మొహం వేసుకుంటున్నారు. సమాధానం చెప్పలేక పారిపోతున్నారు. అసలు కాంగ్రెస్‌ నాయకులు ప్రచారం పేరుతో మా ముందుకు రావొద్దని అంటున్నారు. ఏమైనా అంటే ఉచిత బస్సు ఇస్తున్నామనే ముచ్చట తప్ప మరొకటి చెప్పుకోవడానికి లేదు. దాని వల్ల ఆటో డ్రైవర్ల జీవితాలు ఆగమౌతున్నాయి. ఒకప్పుడు రెండు మూడు ఆటోలకు ఓనర్లు ఇప్పుడు వాటిని అమ్ముకుంటూ, కిరాయి ఆటోలు నడుపుకుంటున్నారు. పూట గడవక ఆందోళన చెందుతున్నారు. ఇక మిగతా గ్యారెంటీల అమలు ఎక్కడుందో తెలియదు. ఇస్తారన్న నమ్మకం ప్రజలకు లేదు. ఇప్పుడు కాంగ్రెస్‌ను పొరపాటున ఆదరిస్తే ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ నరకం చూపించడం ఖాయం. ఆరు గ్యారెంటీలు అటకెక్కిస్తారు. ఆరు గ్యారెంటీలలో పించన్లు 4 వేలు ఇస్తామన్నారు. కాని ఇప్పటి వరకు వాటిని పెంచింది లేదు. కనీసం గతంలో కేసిఆర్‌ ఇచ్చిన రూ.2వేలు కూడా ఇప్పుడు కాంగ్రెస్‌ సకాలంలో ఇవ్వడం లేదు. దాంతో ప్రజలు ఆగ్రహంతోవున్నారు. అనవసరంగా నమ్మి మోసపోయామని అంటున్నారు. ఇవ్వలేనప్పుడు ఎందుకు చెప్పారంటూ కాంగ్రెస్‌ నాయకులను నిలదీస్తున్నారు. ప్రతి మహిళకు రూ.2500 ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఆ పధకం అమలు గురించి ఆలోచనే లేదు. ఇస్తారన్న గ్యారెంటీ అసలే లేదు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకంలో లక్ష రూపాయలతోపాటు, తులం బంగారం ఇస్తామన్నారు. అది కూడా పెళ్లికి ముందే ఇస్తే పుస్తెలు చేయించుకోవచ్చన్నారు. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ తులం బంగారం ఇవ్వడం సాధ్యం కాదని చెప్పేశారు. ఇవ్వలేమన్నారు. మరో కాంగ్రెస్‌ నాయకుడు వి. హనునమంత రావు కూడా ఇదే విషయాన్ని తెల్చి చెప్పారు. అయినా జనం కాంగ్రెస్‌ను నమ్ముతారా? ప్రతి విద్యార్ధినికి ఒక ఎలక్రిక్‌ స్కూటీని ఇస్తామన్నారు. ఇవ్వగలరా? ఇవ్వలేరు. ఇవ్వాలన్న చిత్తశుద్దికూడా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి లేదు.
ప్రశ్న..ఎడిటర్‌ కట్ట రాఘవేంద్రరావు : బిఆర్‌ఎస్‌కు ఓటేస్తే పథకాలు ఆగిపోతాయని సిఎం. రేవంత్‌ అంటున్నారు?
జవాబు..రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర : బిఆర్‌ఎస్‌కు ఓటేస్తే పథకాలు ఆగిపోతాయని కాదు. ఆపేస్తామని సిఎం. రేవంత్‌ రెడ్డి ప్రజలను బెదిరించారు. ఒక ముఖ్యమంత్రి ప్రజలను అలా బెదిరించడం ఎక్కడైనా చూశామా? అంటే జనమంటే కాంగ్రెస్‌ పార్టీకి, ప్రభుత్వానికి ఎంత చిన్న చూపో అర్ధం చేసుకోవచ్చు. కాంగ్రెస్‌ పార్టీకి ఓటేయ్యకపోతే సన్న బియ్యం ఆపేస్తామని నేరుగానే బెదిరిస్తున్నారు. కాంగ్రెస్‌ను గెలిపించకపోతే ఉచిత కరంటు ఆగిపోతుందన్నారు. రేషన్‌ కార్డులు కట్‌ చేస్తామంటున్నారు. నిజంగా కాంగ్రెస్‌కు ఓటేస్తేనే ఇవన్నీ ఆగిపోతాయని చెప్పాలి. ఆరు గ్యారెంటీలు ఎలాగూ అమలు చేయడంలేదు. అందులో సన్న బియ్యం ఇవ్వడం ప్రభుత్వానికి సాద్యంకావడం లేదు. సన్న బియ్యం కూడా మూడునాళ్ల ముచ్చటలాగే కనిపిస్తోంది. 200 యూనిట్ల ఉచిత కరంటు ఎక్కడా రావడం లేదు. కాని ప్రభుత్వం దొంగ ప్రచారం చేసుకుంటోంది. రేషన్‌కార్డులు రిటన్‌ తీసుకుంటామని బెదిరిస్తేజనం భయపడతారనుకోవడం రేవంత్‌ రెడ్డి భ్రమ. ప్రజలు పెట్టిన భిక్షతోనే సిఎం. అయిన రేవంత్‌ రెడ్డి ప్రజలను బెదిరిస్తే ఊరుకుంటారా? మహా మహా నాయకులనే ప్రజలు ఓడిరచారు. రేవంత్‌రెడ్డి ఎంత? రేవంత్‌ రెడ్డి ఎక్కడికెళ్లినా జనం రావడం లేదు. రోడ్‌షోలు పెట్టినా జనం హజరు కావడం లేదు. చిత్రపురిలో సభ పెడితే కార్మికులు రాలేదు. ఇలా సిఎం. రేవంత్‌రెడ్డి ప్రచారానికి జనం రాకపోవడంతో ఆయనకు మరింత ప్రస్టేషన్‌ పెరిగిపోతోంది. అదే సమయంలో బిఆర్‌ఎస్‌ రోడ్‌షోలకు జనం ఇసకేస్తే రాలనంత వస్తున్నారు. పైగా జోరు వానలో కూడా జనం రోడ్‌షోలో పాలు పంచుకుంటున్నారు. వర్షంలో కూడా డ్యాన్సులు చేస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత కాంగ్రెస్‌ నాయకులకు, ముఖ్యంగా సిఎం. రేవంత్‌రెడ్డికి కంటి మీదకి కునకు రావడం లేదు. రేవంత్‌ రెడ్డి మాట్లాడుతుంటే జనం వినడం లేదు.

ప్రశ్న..ఎడిటర్‌ కట్ట రాఘవేంద్రరావు : నన్ను చూసి ఈ ఒక్కసారి గెలిపించండి! అని రేవంత్‌ రెడ్డి అంటున్నారు?
జవాబు..రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర : ఇది వరకు నమ్మే తెలంగాణ ప్రజలు నిండా మునిపోయారు. రేవంత్‌ రెడ్డి మాటలు నమ్మి మోస పోయారు. ఆరు గ్యారెంటీలంటూ అబద్దాలు చెబితే నమ్మారు. ఇంకా నమ్మమంటే ఎలా నమ్ముతారు? ఎందుకు నమ్ముతారు? ఇది ప్రజాస్వామ్యం. పైగా ఈ రెండేళ్ల కాలంలో ఆయన ఒక్క నిజమైనా మాట్లాడారా? జనానికి పనికొచ్చే పని ఒక్కటైనా చేశారా? మచ్చుకు కూడా చెప్పుకోవడానికి ఒక్కటైనా వుందా? ఏ రంగమైనా ముందట పడిరదా? అన్ని ఫెయిల్యూర్లే. రుణమాఫీ చేస్తామన్నారు. చేశామని గొప్పలు చెప్పుకున్నారు. కాని రైతులేమంటున్నారో కాంగ్రెస్‌ నాయకులకు తెలియదా? కాంగ్రెస్‌ నాయకులకే రుణమాఫీ జరగలేదని చెప్పుకుంటున్నారు. రైతు భరోసా రూ.15వేలు ఇస్తామన్నారు. కనీసం గతంలో కేసిఆర్‌ ఇచ్చిందికూడా ఇవ్వడం లేదు. అది కూడా అందరికీ అందడం లేదు. ఇప్పటికే రెండు విడుతల బాకీ వున్నారు. మేమైనా దివానాగాళ్లమా? రైతు బంధు ఎందుకు ఆపేస్తామని సభల్లో రేవంత్‌ రెడ్డి అన్నారు. కేసిఆర్‌ ఇస్తున్న పది వేలకు బదులు రూ.15 వేలు ఎకరానికి ఇస్తామన్నారు. పాపం రైతన్నలు నమ్మారు. రేవంత్‌రెడ్డి ముందు నుంచి మోసం చేస్తానని చెబుతూనే వున్నారు. కాని ప్రజలు అమాయకులు నమ్మారు. కాని ఇంకా మోసం చేస్తామంటే, మోస పోవడానికి ప్రజలు సిద్దంగా లేరు. కౌలు రైతులకు కూడా ఏటా రూ.12000 ఇస్తామన్నారు. ఇలా ఎన్ని ఎన్ని అబద్దాలు ఆడారో తెలియంది కాదు. అందుకే ఆరు గ్యారెంటీలే కాదు, కాంగ్రెస్‌ ఇచ్చిన మొత్తం హమీలు 420. అంటేనే ఇక్కడే తేలిపోయింది. ఆ హమీలు అమలు కావన్నది అప్పుడే కాంగ్రెస్‌ చెప్పింది. కాని రాహుల్‌ గాందీ, ప్రియాంక గాందీ, సోనియా గాందీలను రప్పించి అబద్దాలు చెప్పించారు. జనాన్ని నమ్మించారు. ఒక్కసారి ఒక్క అవకాశం ప్లీజ్‌ ప్లీజ్‌ అంటూ రేవంత్‌ రెడ్డి బ్రతిమిలాడాడు. ఇప్పుడు ఓటెయ్యకపోతే పథకాలు అపేస్తామని బెదిరిస్తున్నాడు. అందుకే జూబ్లీహిల్స్‌ ప్రజలు కాంగ్రెస్‌ను తక్కు తుక్కుగా ఓడిరచేందుకు సిద్దపడుతున్నారు. పిక్సైయ్‌ వున్నారు.
ప్రశ్న..ఎడిటర్‌ కట్ట రాఘవేంద్రరావు : నన్ను చూసి ఓటెయ్యమని రేవంత్‌ అంటున్నాడు! నన్ను చూసి ఓటెయ్యమని నవీన్‌ అంటున్నాడు? జనం ఎవరిని చూసి ఓటేస్తారని అనుకుంటున్నారు?
జవాబు..రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర : ఈ ఇద్దరినీ చూసి కాంగ్రెస్‌కు ప్రజలు ఒక్క ఓటు కూడా వేయరు. రేవంత్‌రెడ్డిని నమ్మి ఇప్పటికే మోసపోయారు. అయినా ప్రజలు మోసపోయేందుకు సిద్దంగా లేరు. ఇక కాంగ్రెస్‌ అభ్యర్ది నవీన్‌ యాదవ్‌ గురించి బస్తీలలో ప్రజలే మాట్లాడుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఒప్పించుకోవాలి. మెప్పించుకోవాలి. గెలిస్తే ఏం చేస్తామనే విషయాలు చెప్పాలి. అంతే కాని బిఆర్‌ఎస్‌ నాయకుల మీద దాడులు చేస్తే ప్రజలు ఓట్లేస్తారా? బిఆర్‌ఎస్‌ నాయకులు ఇళ్లలో నుంచి బైటకు రారు. బైటకు వెళ్తే ఇంటికి రారు అని బెదిరిస్తుంటే జనం ఒప్పుకుంటారా? ఓట్లేస్తారా? రాజకీయ ప్రత్యర్ధుల మీద ఇలాంటి రౌడీ భాషలు మాట్లాడుతుంటే ఈసి స్పందించాలి. రేవంత్‌ రెడ్డిని చూసి ఎందుకు ఓటేయ్యాలి? అనేది జనానికి స్పష్టత వుంది. ఓటు కాంగ్రెస్‌కే వేసే ప్రసక్తి లేదని నిర్ణయం తీసకొని వున్నారు. పోలింగ్‌ రోజున బిఆర్‌ఎస్‌కు, కారు గుర్తుకు ఓటేయ్యాలని సిద్దంగా వున్నారు. అందుకే రేవంత్‌ రెడ్డి ప్రస్టేషన్‌లోకి వెళ్లిపోతున్నాడు. జూబ్లీహిల్స్‌ ఓడిపోతే తన పదవి కాస్త ఊడిపోతుందని భయం పట్టుకున్నది. అందుకే అడ్డదారులు తొక్కైనా సరే గెలవాలిన కుటిల ప్రయత్నాలు చేస్తున్నాడు. కాని కుదరడం లేదు. జనం ఆదరించడం లేదు. ఖర్మ పాలోస్‌ అన్నట్లు ఏ నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని బిఆర్‌ఎస్‌ మీద కాంగ్రెస్‌ పార్టీ అసత్య ప్రచారం చేసిందో అదే నిరుద్యోగులు ఇప్పుడు కాంగ్రెస్‌కు చుక్కలు చూపిస్తున్నారు. సిఎం. రేవంత్‌రెడ్డికి ఊపిరి ఆడకుండా చేస్తున్నారు. పెద్దఎత్తున నిరుద్యోగ జేఏసి కూడా కాంగ్రెస్‌కు ఓటు వేయొద్దని ప్రచారం సాగిస్తోంది. గత ఎన్నికల్లో నిరుద్యోగులకు మాయ మాటలు చెప్పి రెండు లక్షల ఉద్యోగాలిస్తామని నమ్మించి వారిని తప్పు దోవ పట్టించారు. ఇప్పుడు నిజం తేలింది. కాంగ్రెస్‌ నిరుద్యోగులను మోసం చేసింది. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెట్టిన పరీక్షల ఫలితాలను ప్రకటించి, ఆ ఉద్యోగాలను తామే ఇచ్చినట్లు ప్రకటించుకోవడాన్ని నిరుద్యోగులే సహించలేకపోతున్నారు. పైగా నోటిఫికేషన్లు వేయకుండా, ఆ నెపం నిరుద్యోగుల మీదే నెట్టేస్తూ సిఎం. రేవంత్‌ రెడ్డి అసత్య ప్రచారం సాగిస్తున్నారు. వరస నోటిఫికేషన్లు నిరుద్యోగులే వద్దంటున్నారంటూ సాక్ష్యాత్తు సిఎం. రేవంత్‌ ఇంత పచ్చి అబద్దాలు ఆడడాన్ని తెలంగాణ యువత జీర్ణించుకోలేకపోతోంది. అంతే కాకుండా గ్రూప్‌ వన్‌లో ఏం జరిగిందో చూస్తూనే వున్నారు. గ్రూప్‌ 2లో ఎలాంటి అవతకవకలు జరిగాయో నిరుద్యోగులే చెబుతున్నారు. ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి.
ప్రశ్న..ఎడిటర్‌ కట్ట రాఘవేంద్రరావు : అభివృద్ది అంటే ఏమిటో చూపిస్తానని రేవంత్‌ రెడ్డి అంటున్నారు?
జవాబు..రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర : అసలు అభివృద్ది అంటే అర్ధం కూడా తెలియని పాలకుడు రేవంత్‌రెడ్డి. రెండేళ్ల కాలంలో తెలంగాణలో చేసిన ఒక్క మంచి పని చూపించండి. ఒక్కటంటే ఒక్కటే..అలాంటి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభివృద్ది అంటే ఏమిటో చేసి చూపిస్తానంటే ఎవరు నమ్ముతారు. అయినా అదికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ఏం చెబుతున్నారో చూడడం లేదా? మాకు చేతిలో చిల్లి గవ్వలేదంటున్నారు. సిఎం. ఇవ్వడం లేదంటున్నారు. మరో వైపు సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలంగాణకు వస్తున్న ఆదాయం 18500 కోట్లు అంటున్నారు. అంతకు మించి ఒక్క రూపాయి రావడం లేదని స్వయంగా ఆయన చెబుతున్నారు. నన్ను కోసినా ఒక్క రూపాయి లేదనంటున్నాడు. బ్యాంకులకు వెళ్తే చులకనగా చూస్తున్నారని అంటున్నాడు. డిల్లీకిపోతే అప్పాయింటు మెంటు కూడా ఇవ్వడం లేదంటున్నాడు. ఎక్కడ చెప్పులు ఎత్తుకుపోతారో అన్నట్లు చూస్తున్నారని సిఎం. రేవంత్‌రెడ్డే అంటున్నాడు. అలాంటి సిఎం. రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌లో అభివృద్ది అంటే ఏమిటో చూపిస్తామంటున్నారు. అంటే జనం అంత వెర్రిబాగులోల్లా? అయినా రేవంత్‌ రెడ్డి తెలంగాణ మొత్తానికి సిఎం అనుకుంటున్నాడా? లేక జూబ్లీహిల్స్‌కు సిఎం. అనుకుంటున్నాడో ఆయనకే క్లారిటీ లేదు. తన సొంత జిల్లా పాలమూరు ఎమ్మెల్యేలే బహిరంగంగా విమర్శిస్తున్నారు. పెళ్లిళ్లకు, చావులకు వెళ్లాలంటే కూడా భయపడుతున్నామని ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్‌రెడ్డి అంటున్నారు. లక్ష రూపాయల పనులు కూడా సాంక్షన్‌ చేయాలంటే ధైర్యం చేయలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిధులు ఇవ్వకపోవడంతో జనం ముందుకు వెళ్లాలేక ముఖం చాటేస్తున్నామని చెబుతున్నాడు. పల్లెల్లో పారిశుద్యం కరువైందని స్వయంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అంటుంటే, జూబ్లీహిల్స్‌ అభివృద్ది చేస్తామనడం హాస్వాస్పదం కాదా? ఇంతకన్నా అబద్దం మరొకటి వుంటుందా? కంటోన్‌మెంట్‌ ఉప ఎన్నికల్లో ఇలాగే అబద్దాలు చెప్పి గెలిచారు. కంటోన్‌ మెంట్‌లో వేల కోట్లు ఖర్చు చేస్తున్నామంటున్నారు. అదే నిజమైతే ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్‌ రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నారు. ఆయన నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇవ్వడంలేదు? నోరు తెరిస్తే అబద్దాలు తప్ప ఒక్క నిజం రేవంత్‌ రెడ్డి నుంచి రాదు. ఇది జనానికి ఎప్పుడో తెలిసిపోయింది. ఇంకా బుకాయిస్తామంటే ఎవరూ నమ్మరు. ప్రజలు చాల చైతన్యవంతులు.
ప్రశ్న..ఎడిటర్‌ కట్ట రాఘవేంద్రరావు : సునీత విషయంలో మంత్రుల వ్యాఖ్యలు ఎలా అర్ధం చేసుకోవచ్చు?
జవాబు..రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర : అసలు వాళ్లు మనుషులేనా? కనీసం మానవత్వం వారికి వుందా? ఒక మహిళగురించి ఇలాగే మాట్లాడతారా? జూబ్లీహిల్స్‌ బిఆర్‌ఎస్‌ అభ్యర్ధి సునీత భర్తను పోగొట్టుకొని వుంది. ఆరు నెలల సమయం కూడా కాలేదు. జనం ముందుకు వచ్చినప్పుడు, ప్రజలు గుర్తు చేస్తున్నప్పుడు సహజంగా ఏ మహిళనైన కన్నీళ్లు ఆపుకోలేదు. దాన్ని కూడా రాజకీయం చేయడం కాంగ్రెస్‌ పార్టీకే చెల్లింది. ఇలాంటి దుష్ట రాజకీయాలు మంత్రులు చేస్తుంటే ప్రజల చీ కొడుతున్నారు. సానుభూతి కోసం సునీత కన్నీళ్లు పెట్టుకుంటుందంటూ దిగజారుడు రాజకీయాలు కాంగ్రెస్‌ చేయడం దుర్మార్గం. అందుకే ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి బుద్ది చెప్పడానికి సిద్దంగా వున్నారు. కాంగ్రెస్‌ రాజకీయానికి చరమగీతం పాడేందుకు రెడీగా వున్నారు.
ప్రశ్న..ఎడిటర్‌ కట్ట రాఘవేంద్రరావు : రోడ్డు షోలకు జనం ఎగబడుతున్నారు?
జవాబు..రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర : బిఆర్‌ఎస్‌ పార్టీకి జనం నీరాజనం పలుకుతున్నారు. బ్రహ్మరథం పడుతున్నారు. బిఆర్‌ఎస్‌ ప్రచారంలో స్వయంగా ప్రజలే పాలు పంచుకుంటున్నారు. ఇంతకన్నా ఒక పార్టీకి గొప్ప సమయం ఏముంటుంది. అంతగా బిఆర్‌ఎస్‌ ప్రజల్లో వుంది. కేసిఆర్‌ కోసం తపిస్తున్నారు. మళ్లీ కేసిఆర్‌ పాలన రావాలనుకుంటున్నారు. అది మళ్లీ జూబ్లీహిల్స్‌ నుంచే నాంది కావాలని చూస్తున్నారు. అందుకు ఈ ఉప ఎన్నికలను వేదిక చేసుకుంటున్నారు. సునీత గెలుపు నల్లేరు మీద నడకే.. మెజార్టీ కోసమే మా ప్రచారం. ఇక కేటిఆర్‌ రోడ్‌ షోలకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. నిజం చెప్పాలంటే జూబ్లీహిల్స్‌లో వున్న ఏడు డివిజన్ల ప్రజలు స్వచ్చందంగా రోడ్‌షోలకు తరలి వస్తున్నారు. కేటిఆర్‌ చెప్పే మాటలు వినడానికి వస్తున్నారు. కేటిఆర్‌ను చూడాలని జనం ఎగడతున్నారు. అసలు రోడ్‌ షోలకు వస్తున్న ప్రజలను చూసి కాంగ్రెస్‌ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. వేలాది మంది జనంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. జనమే కేసిఆర్‌ పాటలు పెడుతున్నారు. కేరింతలు కొడుతున్నారు. డ్యాన్సులు చేస్తున్నారు. కేసిఆర్‌, కేసిఆర్‌ అంటూ నినాదాలు చేస్తున్నారు. చిన్న పిల్లలు సైతం బిల్డింగుల మీద నుంచి చూస్తూ, కేటిఆర్‌కు సెల్యూట్‌ చేస్తున్నారు. నమస్తే అంటుంటే పిల్లల్లో కూడా కేసిఆర్‌, కేటిఆర్‌ అంటే ఎంత అభిమానముందో తెలుస్తోంది. నిజంగా అంత మంది జనాలు వస్తున్నారంటే కేసిఆర్‌ పాలన లేని లోటు వారికి స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటి వరకు రోడ్‌ షోలకు వస్తున్న ఆదరణ అంతా ఇంతా కాదు. 2015లో ముస్సిపల్‌ ఎన్నికల సమయంలో కేటిఆర్‌ను చూసేందుకు జనం ఎలా ఎగబడ్డారో అంతకు మించి ఇప్పుడు వస్తున్నారు. బోరబండలో వచ్చిన జనాన్ని చూస్తే మతిపోతుంది. అలాగే అన్ని డివిజన్లలో కూడా రోడ్‌ షోలు ఎంతోవిజయవంతమౌతున్నాయి.
ప్రశ్న..ఎడిటర్‌ కట్ట రాఘవేంద్రరావు : జనం కేసిఆర్‌ను ఎంతగా గుర్తించుకున్నారు?
జవాబు..రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర : జూబ్లీహిల్స్‌లో వుంటే ప్రజానీకానికి పల్లె గురించి తెలియంది కాదు. పట్నం జీవితం తెలియంది కాదు. ఆ నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ గురించి మొత్తం తెలుసు. ఎందుకంటే జూబ్లీహిల్స్‌లోని ఏడు డివిజన్లలో తెలంగాణ పల్లెలనుంచి వచ్చినా ఇప్పటికీ ఆ మూలాలున్న వాళ్లు ఎక్కువ. వారికి పల్లెలతోఇప్పటికీ అనుబంధం వుంది. చాలా మందికి పల్లెల్లో భూములన్నాయి. ఇండ్లున్నాయి. అందువల్ల మేం ప్రచారానికి వెళ్లినప్పుడు ఒకప్పటి తెలంగాణ ఎలా వుండేది? కేసిఆర్‌ తెచ్చిన తెలంగాణ ఎలావుంది అనేది పూసగుచ్చినట్లు చెబుతున్నారు. పల్లెల్లో తెలంగాణ రాకముందు పడిన కష్టాలు ఏమిటో వారికి పూర్తిగా తెలుసు. పల్లెల్లో బతకలేక పట్నం వచ్చి ఇక్కడ చిన్నా చితకా వ్యాపారాలు, పనులు చేసుకుంటూ ఇక్కడే స్ధిరపడిన వారున్నారు. అయినా వారికి పల్లెల్లోనే బంధువులు, అయిన వారున్నారు. ఇక్కడి పరిస్దితులు, అక్కడి పరిస్దితులు అందరికీ తెలుసు. అందుకే కేసిఆర్‌ తెలంగాణ తేకముందు, తెచ్చిన తర్వాత అన్ని విషయాలు వాళ్లే మాకు చెబుతున్నారు. ప్రచారానికి ఉదయం వెళ్లి ఒక గల్లీ మధ్నాహ్నం వరకు ప్రచారం అక్కడ ముగిద్దామనుకుంటే నాలుగు ఇండ్లు దాటి వెళ్లలేకపోతున్నాం. అంటే ఆ ప్రజలు మమ్మల్ని చూసిన తర్వాత కేసిఆర్‌ను చూసినట్లు భావిస్తున్నారు. మాతో మాట్లాడుతుంటే కేసిఆర్‌తో మాట్లాడుతున్నట్లే అనుకుంటున్నారు. అంతలా కేసిఆర్‌ను జూబ్లిహిల్స్‌ ప్రజలు అభిమానిస్తున్నారు. ఒకప్పుడున్న కష్టాలకు ఇప్పుడు కేసిఆర్‌ వచ్చిన తర్వాత లేవని గుర్తు చేస్తున్నారు. కేసిఆర్‌ తెచ్చిన పథకాలను మాకే గుర్తు చేస్తున్నారు. వాటి వల్ల వారి జీవితాల్లో వచ్చిన మార్పులను గురించి చెబుతున్నారు. రైతు బంధు దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని రకాల సౌకర్యాలు చెబుతున్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్‌లో వుండే పేదల బస్తీలకు ఒకప్పుడు వారం రోజులకు కూడా సరైన మంచినీటి సరఫరా వుండేదికాదు. ఎండా కాలం జూబ్లిహిల్స్‌ ప్రజలు మంచినీటి కోసం పడే కష్టం అంతా ఇంతా కాదు. బోర బండ మీదకు రోడ్లు వేయడంతోపాటు, మంచినీటి సౌకర్యం కల్పించిన తీరు అద్భుతం. అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. రోజుకూ 20వేల లీటర్ల మంచినీరు అందుతోంది. అంతకుముందు వారం రోజులకు నీళ్లు వచ్చినా, తాగేందుకు మాత్రమే సరిపోయేవి. ముఖ్యంగా పించన్లు పొందుతున్న పెద్దలు మాత్రం కేసిఆర్‌ను దేవుడిలాగా కొలస్తున్నారు. ఇక వైద్యసేవల విషయంలో ఒకప్పుడు ఎలా వుండేది? ఇప్పుడు ఎలా వుందనేది గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు చేసిన సహాయం అంతా ఇంత కాదు. ఒకప్పుడు మహిళ పురుడు పోసుకునే వరకు పడే ఇబ్బందులు అయ్యే ఖర్చులు తల్చుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి నెల ప్రభుత్వమే ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లోనే మందులు ఇస్తున్నారు. ప్రసవ సమయంలో ప్రభుత్వ వాహనం వస్తుంది. గర్బిణీ మహిళను తీసుకెళ్తుంది. ప్రసవం తర్వాత మళ్లీ ఇంటి దగ్గర దింపుతుంది. పైగా కేసిఆర్‌ ప్రసవమైన తర్వాత రూ.13వేలు ఇచ్చారు. కేసిఆర్‌ కిట్‌ ఇచ్చారు. కాని ఇప్పుడు అవి ఇవ్వడం లేదు. దాంతో ప్రజలు మళ్లీ ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తుందంటున్నారు. ఇలా ప్రతి సమస్యను చెప్పుకుంటూ కాంగ్రెస్‌ను తూర్పారపడుతున్నారు.
ప్రశ్న..ఎడిటర్‌ కట్ట రాఘవేంద్రరావు : ఎంత మెజార్టీతో గెలుస్తున్నారు?
జవాబు..రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర : ఊహించనంత మెజార్టీ సొంతం చేసుకుంటాం. జూబ్లీహిల్స్‌ నుంచి మళ్లీ విజయయాత్ర కొనసాగిస్తాం. తెలంగాణలో బిఆర్‌ఎస్‌ జెండా ఎగరేస్తాం. కేసిఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చూస్తాం.
నేటిధాత్రి: ఆల్‌ది బెస్ట్‌.
రవిచంద్ర: ధంక్యూ..

సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌ ‘‘కేటీఆర్‌’’!

`జూబ్లీ హిల్స్‌ ఎన్నికల ప్రచారంలో కేటీఆరే కీలకం

`కాంగ్రెస్‌, బిజేపిలకు దక్కని క్రేజ్‌ కేటీఆర్‌ సొంతం

ktr jubliee hills election

`అన్ని రకాల ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్న కేటీఆర్‌

`అటు మీడియా సమావేశాలు.ఇటు పార్టీలో చేరికలు

`హైదరాబాదులో ప్రభుత్వ బాదితులతో సమావేశాలు

`సమయం చూసి హైడ్రాను ఉతుకుడు ఉతుకుతున్నాడు

`విస్మరించిన ప్రభుత్వ హామీలను గుర్తు చేస్తున్నాడు

`బాకీ కార్డులిచ్చి జనాన్ని చైతన్య పరుస్తున్నాడు

`అండగా వుంటామని వారికి భరోసా కల్పిస్తున్నాడు

`ఎక్కడికక్కడ సభలు, సమావేశాలు

`అన్ని డిజిజన్లలో పెద్ద ఎత్తున రోడ్‌ షోలు

`గతం కన్నా వినూత్నమైన రీతిలో ప్రచారాలు

`సీఎం. ‘‘రేవంత్‌ రెడ్డి’’కి కూడా కనిపించని క్రేజ్‌ ‘‘కేటీఆర్‌’’ సొంతం చేసుకున్నాడు

`కాంగ్రెస్‌ సభలకు రెట్టింపు జనాలు కేటిఆర్‌ సభలకు హజరౌతున్నారు

`‘‘కేటీఆర్‌’’ రోడ్‌షోలకు ప్రభంజనంలా తరలివస్తున్న జనం

`2015 జిహెచ్‌ఎంసి ఎన్నికలకు మించి సక్సెస్‌ అవుతున్న రోడ్‌షోలు

`పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ప్రచారంలో దూసుకుపోతున్నాడు

`ఒంటి చేత్తో పార్టీ స్టీరింగ్‌ పట్డుకొని కారు జోరు పెంచుతున్నాడు

`సారే రావాలని జనం కోరుకునేలా ప్రసంగాలు కొనసాగిస్తున్నాడు

`క్షణం తీరిక లేకుండా ‘‘జూబ్లీ హిల్స్‌’’ ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నాడు

`ప్రభుత్వం మీద పదునైన విమర్శనాస్త్రాలు సందిస్తున్నాడు

`అధికార పార్టీ కాంగ్రెస్‌ను గుక్క తిప్పుకోకుండా చేస్తున్నాడు

`ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ చేతులెత్తేసేలా ఇరుకున పెడుతున్నాడు

`‘‘కేటీఆర్‌’’ సభలు, రోడ్‌ షోలు జనంతో కళకళలాడుతున్నాయి

`‘‘కేటీఆర్‌’’ జిందాబాద్‌ నినాదాలతో సభలు మారుమ్రోగిపోతున్నాయి

`పిల్లలు సైతం ‘‘దేక్‌లేంగే’’ అని పాటలు పాడుతున్నారు

`’’కేటీఆర్‌’’ అంకుల్‌ నమస్తే అంటూ స్వాగతిస్తున్నారు

హైదరాబాద్‌, నేటిధాత్రి:
తులం బంగారం ఇయ్యరు. వృద్దులకు ఇస్తామని చెప్పిన నాలుగు వేల పించన్లు ఇయ్యరు. మహిళలకు ఇస్తామన్న రెండు వేల ఐదు వందలు ఇయ్యరు. విద్యార్దినులకు ఇస్తామన్న స్కూటీల జాడ లేదు. రైతులకు ఇచ్చే రైతు బంధుకు రాం..రాం..అంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంటు కేటిఆర్‌ పంచ్‌ డైలాగులు కొడుతుంటే జూబ్లీహిల్స్‌ జనం కేరింతలు కొడుతున్నారు. కేటిఆర్‌ చెబుతున్నప్పుడు వంత పాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్నారు. అలవి కాని హమీలన్నీ ఇచ్చి ఇప్పుడు మాట మారుస్తున్న కాంగ్రెస్‌ పార్టీని జూబ్లీహిల్స్‌ ప్రజలు చిత్తు చిత్తుగా ఓడిరచాలంటూ చేస్తున్న వ్యాఖ్యలకు ప్రజలు చప్పట్లు కొడుతున్నారు. కారు గుర్తుకే మన ఓటు అంటూ కేటిఆర్‌ అంటుంటే రోడ్‌షోలకు హజరైన జనం మన ఓటు అంటూ దిక్కులు పిక్కటిల్లేలా అంటున్నారు. ఇదీ కేటిఆర్‌ క్రేజ్‌ అంటూ బి ఆర్‌ఎస్‌ శ్రేణులు సంబరపడుతున్నాయి. చాలా కాలం తర్వాత ప్రజలు బిఆర్‌ఎస్‌ పార్టీ ప్రచారంలో, స్ట్రీట్‌ కార్నర్‌ సభల్లో, కేటిఆర్‌ రోడ్‌షోలకు విపరీతంగా హజరౌతున్నారు. స్వచ్చంధంగా వచ్చి కేటిఆర్‌ చెప్పే మాటలు వింటున్నారు. కేటిఆర్‌ వేస్తున్న పంచ్‌ డైలాగులకు జనం ఊడిపోతున్నారు. ఇంతటి క్రేజ్‌ ఈ మధ్య మరే నాయకుడికి లేదు. సహజంగా బిఆర్‌ఎస్‌ అధినేత కేసిఆర్‌ను చూసేందుకు జనం ఇలా ఎగబడుతుంటారు. సభలకు హజరౌతుంటారు. ఆయన మాటలు వినడానికి లైవ్‌ కార్యక్రమాలు చూస్తుంటారు. ఇప్పుడు సరిగ్గా ఆ క్రెడిట్‌ను కేటిఆర్‌ సొంతం చేసుకున్నారు. జూబ్లీహిల్స్‌ ఎన్నికల ప్రచారంలో బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంటు కేటిఆర్‌ సెంటఆర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. కేటిఆర్‌ సభలకు విచ్చినంత జనం ఇతర పార్టీలకు రావడం లేదు. కాంగ్రెస్‌ పార్టీ తరుపున అసలైన స్టార్‌ క్యాంపెయిన్‌ అయిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి సైతం ఇంత మంది రావడం లేదు. ఆయన సభలు చాలా సప్పగా సాగుతున్నాయి. గత వారం రోజుల నుంచి సిఎం. రేవంత్‌ రెడ్డి ఎంతో కష్టపడుతున్నారు. ప్రచారంలో విసృతంగా పాల్గొంటున్నాడు. అటు మంత్రులు, ఇటు కాంగ్రెస్‌ అభ్యర్ధిని వెంట పెట్టుకొని సిఎం. రేవంత్‌ రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు. దానికి తోడు రహమత్‌ నగర్‌లో సిఎం. రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో ఆగ్రహాన్ని తెప్పించాయి. జూబ్లీహిల్స్‌ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ గెలిస్తే ఇటీవల ఇచ్చిన 25వేల రేషన్‌కార్డులు కట్‌ అవుతాయని హెచ్చరించారు. ఉచిత కరంట్‌ బంద్‌ అవుతుందన్నారు. సన్న బియ్యం ఆపేస్తామన్నారు. సబ్సిడీ సిలిండర్‌ ఇవ్వమన్నారు. ఇదిలా వుంటే తాజాగా కొత్తగా నియామకమైన మరో మంత్రి అజహరుద్దీన్‌ కాంగ్రెస్‌ను గెలిపించకపోతే జూబ్లీహిల్స్‌ రాను అంటూ వ్యాఖ్యానించారు. ఇది కేటిఆర్‌కు ఆయుధాలుగా మారాయి. మామూలుగానే కేటిఆర్‌ లాంటి వాగ్ధాటి వున్న నాయకులకు చిన్న అవకాశం దొరికినా రచ్చ రచ్చ చేస్తారు. అలాంటిది సాక్ష్యాత్తు సిఎం. రేవంత్‌రెడ్డి బియ్యం ఆపేస్తాం. రేషన్‌ కార్డులు కట్‌ చేస్తామంటూ ప్రజలను బెదిరించేలా వ్యాఖ్యలు చేస్తే ఊరుకుంటారా? వీటిపై కేటిఆర్‌ ప్రభుత్వాన్ని తూర్పారపడుతున్నారు. దుమ్ము దుమారం రేపుతున్నారు. ప్రజలను చైతన్యం చేస్తున్నారు. ప్రజలను బెదిరిస్తే ఓట్లు పడతాయని రేవంత్‌ అనుకుంటున్నారు. అలాంటి నియంతకు తగిన బుద్దిచెప్పాలంటూ కేటిఆర్‌ ప్రజలకు సూచిస్తుంటే జనం చప్పట్లు కొడుతున్నారు. సహజంగా రోడ్‌ షోలలో కార్నర్‌ మీటింగ్‌లు పది నిమిషాలు, పావు గంట సాగితేనే ఎక్కువ. కాని కేటిఆర్‌ కార్నర్‌ సభలు గంటకు పైగా సాగుతున్నాయి. జోరు వానలో కేటిఆర్‌ మాట్లాడుతుంటే జనం కదలడం లేదు. పైగా వానలో కూడా డ్యాన్సులు చేస్తూ కేటిఆర్‌కే ఉత్సాహాన్ని నింపుతున్నారు. దాంతో కాంగ్రెస్‌, బిజేపి నాయకులకు దక్కని క్రేజ్‌ కేటిఆర్‌కు సొంతమౌతోంది. ఇక బిజేపి నుంచి స్టార్‌ క్యాంపెయినర్లు ఎంత మంది వున్నా, రోడ్‌షోలకు, సభలకు, ప్రచారానికి పెద్దగా స్పందన లేదు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో ఆది నుంచి అన్ని రకాల బాధ్యతలు కేటిఆర్‌ నిర్వహిస్తూ వస్తున్నారు. అన్ని రకాల ప్రచార బాద్యతలు ఆయన భుజాన వేసుకున్నారు. మాగంటి గోపీనాధ్‌ చనిపోయిన నుంచి జూబ్లీహిల్స్‌లో అనేక రకాల పార్టీ సభలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఎన్నికల సమయంలో పార్టీ నాయకులకు అప్పగించే బాధ్యతలు అప్పగించినా, అందిరికన్నా ఎక్కువ కష్టపడుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ మీద కౌంటర్ల కోసం ఎప్పటికప్పుడు మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని, కాంగ్రెస్‌ పార్టీని తూర్పారపడుతున్నారు. పైగా ఓట్‌ చోరి అంశంలో జూబ్లీహిల్స్‌లో దొంగ ఓట్ల నమోదుపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎన్నికల కమీషన్‌ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ఉప ఎన్నికల వేళ పార్టీలోకి పెద్దఎత్తున చేరికలు జరుగుతున్నాయి. అటు కాంగ్రెస్‌, ఇటు ఎంఐఎం, బిజేపిలనుంచి బిఆర్‌ఎస్‌లోకి డివిజన్ల వారిగా చేరికలు జరుగుతూనే వున్నాయి. వాటన్నింటికీ హజరౌతూ, వారితో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ గెలుపుకోసం కృషి చేస్తున్నారు. పార్టీలోకి చేరుతున్న వారికి స్వయంగా కేటిఆర్‌ కండువాలు కప్పి ఆహ్వానిస్తున్నారు. వారిలో ఉత్సాహం నింపుతున్నారు. ఇక ఇటీవల ప్రభుత్వం వల్ల నష్టపోయిన హైడ్రా బాదితులు, మూసీ బాధితులను స్వయంగా కలుస్తున్నారు. వారు తెలంగాణ భవన్‌కు వస్తామంటే రమ్మంటున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఆ కుటుంబాలు పడిన భాధనలు, వేధనలు వింటున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా హైడ్రా బాదితులతో ఇటీవల ఏర్పాటు చేసిన సమావేశం చూసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వణికిపోయిందనే చెప్పాలి. అందుకే వెంటనే స్పందించిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంటు జగ్గారెడ్డి హైడ్రా వల్ల తమ పార్టీకి నష్టం జరుగుతోందని అన్నారు. అంటేనే హైడ్రా పేదల జీవితాలను ఎలా తలకిందులు చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. తెలంగాణ భవన్‌కు వచ్చిన చిన్న పిల్లలు తమ అనుభవాలను చెబుతూ కన్నీటి పర్యంతమౌతుంటే కేటిఆర్‌ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రజలను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇలా అన్ని వర్గాల ప్రజలనుంచి కేటిఆర్‌ ప్రశంసలు అందుకుంటున్నారు. ఇక ఎన్నికల ముందు కాంగ్రెస్‌పార్టీ ఇచ్చిన హమీలు, ప్రజలకు ప్రభుత్వం వున్న బాకీలను గుర్తు చేస్తూ ప్రచారం సాగిస్తున్నారు. బాకీ కార్డులను ప్రజలకు అందజేస్తూ, ప్రచారానికి వస్తున్న కాంగ్రెస్‌ నాయకులను నిలదీయాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం వల్ల నష్టపోయిన వారికి హైడ్రా బాధితులకు తప్పకుండా పార్టీ అండగా వుంటుందని భరోసా కల్పిస్తున్నారు. పొరపాటున జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను నమ్మితే, ఇక్కడికి కూడా బుల్డోజర్‌ వస్తుందని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇలా ఎక్కడిక్కడ సభలు, సమావేశాలు నిర్వహిస్తూ క్షణం తీరుకలేకుండా ప్రచారంలో పాల్గొంటున్నారు. బిఆర్‌ఎస్‌ అభ్యర్ది సునీతను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. గతం కన్నా వినూత్నమైన రీతిలో కేటిఆర్‌ ప్రచారం సాగిస్తున్నారు. ఎల్‌ఈడీ స్క్రీన్‌లలో ప్రభుత్వం ఇచ్చిన హమీలు, చేసిన మోసాలు చూపిస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారు. దాంతో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం చేసిన మోసాలను గుర్తు చేస్తూ ప్రజలను చైతన్యం చేస్తున్నారు. సిఎం. రేవంత్‌రెడ్డి సభలకు, రోడ్‌షోలకు వస్తున్న జనాలకంటే రెట్టింపు జనాలు కేటిఆర్‌ సభలకు ప్రజలు హజరౌతున్నారు. కేటిఆర్‌ రోడ్‌షోలకు జనం ప్రభంజనంలా వస్తున్నారు. 2015 జిహెచ్‌ఎంసి ఎన్నికల సమయంలో కేటిఆర్‌ రోడ్‌షోలకు జనం తండోపతండాలుగా వచ్చే వారు. కేటిఆర్‌ ఎక్కడికెళ్లినా జనం పెద్దఎత్తున సమూహమయ్యేవారు. ఇక రోడ్‌షోలలో కేటిఆర్‌ వెహికిల్‌ కదిలేది కాదు. అంత జనం వచ్చే వారు. ఇప్పుడు సరిగ్గా జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారంలోనూ కేటిఆర్‌ సభలకు ప్రజలు వస్తున్నారు. కేటిఆర్‌కు హైదరాబాద్‌ ప్రజల్లో ఎంత ఆదరణ వుందో, క్రేజ్‌ వుందో ఈ రోడ్‌షోల ద్వారా మరోసారి రుజవౌతోంది. తెలంగాణ ప్యూచర్‌ లీడర్‌ కేటిఆరే అనేది తేలిపోతోంది. అందుకే కేటిఆర్‌ను చూస్తూ జనం కేరింతలు కొడుతున్నారు. ఈలలు, చప్పట్లతో ఆయన మాటలకు ఫిదా అవుతున్నారు.

దెబ్బ మీద దెబ్బ!

`వరుస విపత్తులతో తెలంగాణ రైతు కుదేలు!

`ప్రకృతి కన్నెర్రతో రైతు పడుతున్న అష్ట కష్టాలు

`ఈ ఏడాది రైతుపై పగ పెంచుకొని గండాలు తెచ్చిన కాలం

`అతివృష్టితో తెలంగాణ వ్యవసాయం అతలాకుతలం

`ముందుగా మురిపించి ముఖం చాటేసిన వరణుడు

`తొలకరితో విత్తనాలు చల్లి రైతు నష్టపోయాడు

`ఆలస్యంగా కురిసిన అంతులేని వర్షాలు

`అటు విత్తనాలు, ఎరువుల కష్టాలు

`తీరా పంట చేతికొచ్చే సమయంలో ‘‘మోంథా’’ చెడగొట్టు వానలు

`పొలంలో వున్న వరి ఒరిగిపోయి, వంగిపోయి, రాలిపోయింది

`చేతికందకుండా నీళ్ళలో మురిగి చెడిపోయింది

`కోత కోసి ఆరబెట్టిన వడ్లు కల్లాలలో కొట్టుకుపోయాయి

`పుట్లకొద్దీ వడ్లు కళ్ల ముందు మాయమైపోయాయి

`లక్షల రూపాయల రైతు పెట్టుబడి నీళ్లపాలైంది

`రైతు ఆరు నెలల కష్టం కన్నీటి పాలైంది

`ఈ రబీ పంటలు దుఖాన్ని మిగిల్చాయి!

`తెల్ల బంగారమంతా నల్లని బొగ్గైపోయింది

`వానకు తడిసి రాలి నేలపాలై కొట్టుకుపోయింది

`ఏ పంట చేతికందక రైతుకు అప్పులు మెడకు చుట్టుకున్నాయి

`ప్రభుత్వం ఆదుకుంటే తప్ప బతకలేని పరిస్థితులు దాపురించాయి

హైదరాబాద్‌, నేటిధాత్రి:                         రైతంటే పాలకులకే కాదు, ప్రకృతికి కూడా చిన్న చూపే వుంది. ప్రతిసారి అయితే అతి వృష్టి లేకుంటే అనావృష్టితో రైతు జీవితంతో కాలం ఆటలాడుకుంటోంది. రైతుకు అడుగడుగునా ప్రకృతి పరీక్ష పెడుతోందో..పగ పెంచుకుంటుందో అర్దం కావడం లేదు. దశాబ్దాలపాటు కనికరం చూపించని పాలకులు, కరువును తెచ్చి రైతుల జీవితాలను ఆగం చేసిన వరణుడు వణికిస్తున్నారు. ఏనాడు రైతును కడుపులో పెట్టుకున్న పాలకులు లేరు. ఏనాడు రైతుకు సహకరించిన కాలం లేదు. అయినా రైతు తన భూమిని నమ్ముకొని బతుకుతూనే వున్నాడు. దేశానికి అన్నం పెడుతూనే వున్నారు. తన పొట్ట నిండపోయినా, చేసిన అప్పుల కోసమైనా రైతులు పంటలు పండిరచాల్సి వస్తోంది. అప్పుల మీద అప్పులు చేసుకోవాల్సి వస్తోంది. భూమిని నమ్ముకున్నందుకు రైతు బాగు పడిరది లేదు. కడుపు నిండా తిన్నది లేదు. కంటి నిండా నిద్ర పోయింది లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత రైతుకు ఊరట లభించింది. కొంత మెరుగైన జీవితం మొదలైంది. ఒకనాడు నీళ్లు లేక పంటలు పండక, కరువు రక్కసి కాటేస్తుంటే బతకలేక వలసలుపోయిన తెలంగాణ కటిక దరిద్రం అనుభవించింది. ఆనాడు పాలకులు కనీసం పట్టించుకోలేదు. తెలంగాణ మేలు కోరలేదు. రాజుల కాలంలో రైతును పీడిరచుకుతిన్నారు. ప్రజా పాలకులు రైతులను నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారు. ఈ రెండిరటికీ పెద్ద తేడా లేదు. కాని రైతు మాత్రం గోస అనుభవిస్తున్నాడు. చుక్క నీరు చూడని తెలంగాణ పచ్చగా మారడం కాలానికి కూడా కన్ను కుట్టినట్లుంది. పంట చేలు పచ్చ కనిపిస్తుంటే కన్ను కుట్టినట్లుంది. అందుకే ఈ సారి రైతును కాలం అరిగోస పెడుతోంది. రైతుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ ఆరు నెలలు రైతు అనుభవించిన కష్టం అంతా ఇంతా కాదు. ఎప్పుడూ లేని విధంగా మే నెలలో వరణుడు ఊరించాడు. రైతు సంతోషించాడు. ఒక నెల ముందుగానే కాలమౌతోందని సంబరపడ్డాడు. ఆ ఆనందం మిగలకుండా వరణుడు మళ్లీ ముఖం చాటేశాడు. రైతు మీద కన్నెర్ర చేశాడు. మేలో నీళ్లను కురిపించి, జూన్‌లో సూర్యునితో చేతులు కలిపి, నిప్పులు కురిపించాడు. జూన్‌లో కరువు రుచి చూపించాడు. తెలంగాణ వ్యాప్తంగా భూ గర్భ జలాలు అడగంటేలా చేశాడు. రైతుల ఆశల మీద నిప్పులు కురిపించాడు. రైతుకు ఆత్రమెక్కువ. నీళ్లను చూసి ఆగలేడు. నీళ్లు కనిపిస్తే సాగు చేయకుండా వుండలేడు. నేల తల్లికి మొక్కకుండా వుండలేడు. అందుకే మేలో కురిసిన వానలకే దుక్కి దున్ని విత్తనాలు చల్లాడు. ఒక నెల మందుగానే పంట చేతికొస్తుందని సంబరపడ్డాడు. వేలాది రూపాయలు ఖర్చు చేసి భూమి చదును చేయించుకున్నాడు. ఈసారి తెల్ల బంగారం పండిరచాలని కలలు గన్నాడు. ముఖ్యంగా పత్తి పంట ఉత్తర తెలంగాణలో ఎక్కువ. అందులోనూ ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పత్తి పంట విరివిగా పండే అవకాశం వుంది. ముందుగా మురిపించిన వానను చూసి పత్తిని సాగు చేశాడు. కాని రైతు ఆత్రం కాలానికి అర్ధం కాలేదు. రైతు కష్టం చూసి చలించలేదు. జూన్‌లో ఎండలు కాసి, మొలకెత్తిన మొక్కలను మాడిపోయేలా చేసింది. వేసిన విత్తనాలు పురుగుల పాలు చేసింది. అయినా రైతు కన్నీళ్లను దాచుకొని మళ్లీ కురిసిన వానలకు పత్తి వేశాడు. వరి రైతు ఆలస్యంగానే పంటలు వేశాడు. ఈ రెండు పంటలే కాకుండా మర్చి, ఇతర ధాన్యపు పంటలు కూడా రైతు సాగు చేశారు. వాటికి అవసరమైన ఎరువుల కోసం నెలల తరబడి ఎదురుచూశారు. కాని అందలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఏటా పడిన కష్టాలు ఈసారి మళ్లీ తెలంగాణ రైతులు పడ్డారు. మందు బస్తాలు దొరకలేదు. సమాయానికి అందలేదు. ఎకరానికి అవసరమైన యూరియాను సరఫరా చేయలేకపోయారు. కేంద్రం, రాష్ట్రం మీద, రాష్ట్రం కేంద్రం మీద నెపాలు నెట్టేసుకున్నాయి. రైతును ఆగం చేశాయి. ఓ వైపు వరి వేసి రెండు నెలలౌతున్నా, ఒక్క యూరియా బస్తా అందక పంట పెరడం లేదని బాధపడుతన్నా, ఇచ్చిన వాళ్లు లేరు. రాష్ట్రానికి అవసరమైన ఎరువులు ఎన్నో అనేది రాష్ట్ర ప్రభుత్వం చూసుకోలేదు. అధికారులు నివేదికలు తయారు చేయలేదు. కేంద్రానికి లెక్కలు పంపలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ముందే జాగ్రత్తపడలేదు. ఇది రెండు ప్రభుత్వాల పాపమే. అటు ప్రకృతి ఆవేశం, పాలకుల నిర్లక్ష్యం మూలంగా దిగుబడి సగానికి తగ్గే పరిస్ధితి ఎదురైంది. అయినా వచ్చిన పంటే చాలనుకున్న రైతుకు మోంధా తుఫాను రూపంలో సర్వం నాశనం చేసింది. చేతికొచ్చిన పత్తి పంట మూడు రోజుల రికార్డు స్ధాయి వానలకు రాలిపోయింది. నీళ్లలో కలిసిపోయింది. తెల్లబంగారం కాస్త నల్లని బొగ్గులా మారిపోయింది. చేళ్లలో నిండిన నీళ్లలో మురిగిపోయింది. ఇంతటి దుస్ధితి గతంలో ఎప్పుడూలేదు. కరువు వచ్చిన రోజుల్లో కూడా రైతు ఇంతగా కష్టం ఎదుర్కొలేదు. అప్పుడు పెట్టిన పెట్టుబడి అయినా చేతికొచ్చేది. ఇప్పుడు పెట్టుబడితోపాటు, కష్టం నీళ్లపాలైంది. నీళ్లలో కొట్టుకుపోయంది. తెల్ల బంగారాన్ని నమ్ముకుంటే మహిళల మీద వున్న బంగారాన్ని అమ్ముకొని అప్పులు తీర్చుకోవాల్సిన దుష్టకాలం దాపురించింది. ఇదిలా వుంటే వరి రైతుల కష్టం అంతా ఇంత కాదు. జూలై నెలలో కురిసిన వర్షాలను నమ్ముకొని కొంత మంది ఆలస్యంగా పంటలు వేసుకున్నారు. మేలో పడిన వర్షాలను నమ్ముకొని వరి నాట్లు వేసిన రైతులు ఇప్పటికే ఒకసారి నష్టాన్ని తెచ్చుకున్నారు. ఇప్పుడు మోంధా తుపానుతోపాటు, వరసగా కురిసిన వర్షాలకు మొత్తం పంట చేతికి రాకుండాపోయి కన్నీటి పర్యంతమౌతున్నాడు. ముందుగా వరి నాట్లు వేసిన రైతులు చాల మంది పంటలు కోశారు. కళ్లాలల్లో వడ్లను ఆరపెట్టుకున్నారు. కొంత మంది మార్కెట్లకు తరలించారు. కాని కాంటాలు పెట్టలేదు. తూకాలు వేయలేదు. ప్రభుత్వం ఇంకా కొనుగోలు చేయలేదు. ఒక్కసారిగా ఉరుము లేకుండా వచ్చిన పిడుగులాంటి తుఫానుతో ఆరబెట్టిన వడ్లు కొట్టుకుపోయింది. లక్షలకు లక్షలు చేసిన అప్పులు కనిపిస్తున్నాయి. చేతికొచ్చిన పంట కొట్టుకుపోతుంటే గుండెలు అవిసిపోతున్నాయి. పుట్లకు పట్లు కళ్లముందు కొట్టుకుపోతుంటే చూసి తట్టుకోలేకపోయారు. ఆరు నెలల కష్టం గంగపాలౌతుంటే చూస్తూ గుండెలు బాదుకున్నాడు. కోత కోసిన రైతు గుండె కోతలు మిగులుతున్నాయి. ఇక పంట కోయని రైతు కష్టం అంతకన్నా ఎక్కువైపోయింది. మోంధా తుఫానుకు వరి వంగిపోయింది. పొలంలో నిండిని నీళ్లలో కూరుకుపోయింది. మూడు రోజలు పాటు నీళ్లలో మునిగి మురిపిపోయింది. చేతికి రాకుండాపోయింది. రాలిపోయి కొట్టుకోపోయేది పోయింది. నీళ్లలో ముగినిపోయింది నల్లగా మారిపోయింది. కోతకు కూడా పనికి రాకుండాపోయింది. ఇంతటి కష్టం రైతుకు వస్తుందని ఎవరూ ఊహించలేదు. తుఫానులంటే సహజంగా ఆంద్రా ప్రాంతానికే పరిమితమనుకునే తెలంగాణకు తుఫాను కూడా రక్కసిలా మారుతుందని కలలో కూడా ఎవరూ అనుకోలేదు. రికార్డు స్ధాయి వానలు కురిసి కుదేలైపోవాల్సి వస్తుందిన కల గనలేదు. ఇటు ప్రజలు, అటు రైతులు అల్లాడిపోయారు. ఇలాంటి పరిస్ధితులు కాకున్నా, గతంలో కేసిఆర్‌ వున్నప్పుడు వచ్చిన అకాల వర్షాల సమయంలో రూ.560 కోట్లు విడుదల చేశారు. ఒక్క రోజులో రైతులను ఆర్ధికంగా ఆడుకున్నారు. ఎకరాకు రూ.10 వేలు బ్యాంకుల్లో వేసి రైతు కన్నీటిని కొంత వరకు తూడ్చారు. తర్వాత పంట ఎలా వున్నా కొనుగోలు చేశారు. కాని ఇప్పుడు కొట్టుకుపోయిన పంట ఎలాగా చేతికి రాదు. దానికి లెక్కలు లేవు. పొలాల్లోనే మురిగిపోయిన వరికి చేతికొచ్చేలా లేదు. రైతుకు ఓదార్పు దక్కేలా లేదు. రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటుందని ప్రభుత్వం మాత్రం ప్రకటించింది. తక్షణ సాయం కింద రూపాయి అందలేదు. రైతుకు ఓదార్పు ఇంకా దక్కలేదు. ఆదుకుంటారా… నాలుగు రోజులు గడిస్తే అందరూ మర్చిపోతారా? అన్నది చూడాలి. రైతుకు కష్టం వస్తే సాయం చేసే వాళ్లు లేరు. గతంలో తుఫానులు అంటే అందరూ స్పందించేవాళ్లు. ఆంధ్రా రైతులను ఆదుకునే వారు. సినీ వర్గాలు ముందుగా స్పందిస్తూ వచ్చేవి. మోంధా తుఫాను ఏపిపై కరుణ చూపించి, తెలంగాణను కనికరం లేకుండా నాశనం చేసింది. కాని సినీ పెద్దలకు ఈ విపత్తు కనిపించడం లేదు. సాయం చేస్తామన్న మాట ఎక్కడా ఇంత వరకు వినిపించలేదు. తెలంగాణ రైతంటే అంతే..ఎవరికీ పట్టని విగత జీవి అంతే!!

అధికారం రేవంత్‌ పుణ్యమే!

`ఎవరు ఔనన్నా కాదన్నా సత్యమిదే!

`మూడేళ్ళు రేవంత్‌ పడిన కష్టం అందరికీ తెలిసిందే!

`పిసిసి. ప్రెసిడెంట్‌ అయ్యాక పార్టీకి పెరిగిన బలమే.

`పార్టీ కార్యకర్తల్లో రేవంత్‌ నింపిన నమ్మకమే.

`నాయకులకు కూడా రేవంత్‌ వల్లనే జనం ఆదరణ.

`పదేళ్ల ప్రతిపక్షంలో రేవంత్‌ ఒక్కడు జరిపిన పోరాటమే.

`ఏ ఇతర నాయకుడు రోడ్డెక్కింది లేదులే.

`కేసీఆర్‌ మీద తిరగబాటు చేసింది రేవంత్‌ ఒక్కడే.

`అడుగడుగునా కేసీఆర్‌ ను ఎదుర్కొన్నది రేవంతే.

`కేసీఆర్‌ పాలనలో అవినీతిని వెలికితీసింది ఆయనే.

`కేసీఆర్‌ ను ఎదిరించడానికి అందరూ భయపడిన వాళ్లే.

`కోవర్టులుగా ఆరోపణలు ఎదుర్కొన్నది చాలా మందే.

`ఇప్పుడు బీరాలు పలుకుతున్న వాళ్లంతా కేసీఆర్‌ టైంలో సైలెంటే.

`కేసీఆర్‌ మీద కన్నా రేవంత్‌ మీదే ఎక్కువ యుద్ధం చేసినవాళ్లే.

`రేవంత్‌ పిసిసి కాకుండా అడ్డుకున్న వాళ్లే.

`రేవంత్‌ ను ఆనాడు నెగలకుండా చేసిన వాళ్లే.

`అధికారంలోకి తెచ్చినా రేవంత్‌ సీఎం కాకుండా శత విధాల ప్రయత్నించిన వాళ్లే.

`ఇప్పటికీ సిఎం సీటు కోసం ఆశ పెట్టుకున్న వాళ్లు చాలా మందే.

`కాంగ్రెస్‌ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేసి నిలిచింది రేవంతే.

`పార్టీని ఒంటి చేత్తో గెలిపించిన ఘనత రేవంత్‌ దే!

హైదరాబాద్‌, నేటిధాత్రి:                                                  

 అదికారంలో వున్నప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో అందరూ హీరోలే. అదికారంలోకి తీసుకురావడానికి కష్టపడంలో మాత్రం అందరూ దూరమే. పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం వారికంటే పెద్ద నాయకులు లేరని అందరూ అనుకుంటారు. పార్టీ అధికారంలోకి వస్తే మేమే ముఖ్యమంత్రులంటారు. కాని అందరం కలిసి అదికారంలోకి తీసుకొద్దాం. కష్టపడదాం అనే ఆలోచనలు చేసే నాయకులు పెద్దగా కనిపించరు. అది ఆ పార్టీకి అలవాటైందో..లేక అదే సంస్కృతిగా మారిందో గాని, పార్టీ కోసం కష్టపడే నాయకులు మాత్రం పెద్దగా కనిపించరు. కాని పార్టీ అధికారంలో వున్నప్పుడు నిత్యం వివాదాలు సృష్టిస్తుంటారు. పార్టీ ప్రతిపక్షంలో వున్నప్పుడు అలాగే విడివిడిగా వుంటారు. పార్టీ పదవులు కావాలనుకుంటారు. ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో పిసిసి. పదవి ఎవరిని వరిస్తుందో కూడా తెలిసే పరిస్దితి వుండేది కాదు. మాకు ఆ పదవి వద్దని చెప్పేవారు కూడా వుండేవారు కాదు. కాని తెలంగాణ వచ్చిన తర్వాత తొలి పిసిసి అద్యక్షుడైన పొన్నాల లక్ష్మయ్య ఆ పదవి నిర్వహించడం నా వల్ల కాదు. పార్టీని నడపడం నాకు చేతగాదని వదిలేశారు. తర్వాత మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని చేశారు. ఆయన కూడా 2018 ఎన్నికల దాకా పార్టీని నడిపాడు. తర్వాత ఆ పదవి నాకొద్దనుకున్నాడు. అప్పటికే రెండుసార్లు పార్టీ ఓడిపోయింది. ఇక పిపిసి అధ్యక్షుడు సమర్ధవంతమైన నాయకుడికి ఇవ్వాలని అదిష్టానం భావించింది. పిసిసి. పదవి ఇస్తే పార్టీని ఖచ్చితంగా అధికారంలోకి తీసుకొస్తానని సిఎం. రేవంత్‌ రెడ్డి భరోసా కల్పించారు. ఆ పని ఇతర నాయకులు ఎవరూ చేయలేదు. కాని పిపిసి అధ్యక్షుడు కావాలని మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఆశించారు. మరో నాయకుడు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా కోరుకున్నారు. వారిద్దరినీ కాదని అధిష్టానం రేవంత్‌ రెడ్డికి ఇచ్చారు. ఆ సమయంలో వి. హనుమంత రావు లాంటి నాయకుడు కూడా నేను అర్హుడిని కాదా? అంటూ ప్రశ్నించిన రోజులున్నాయి. ఇక రేవంత్‌రెడ్డి పిపిసి. అధ్యక్షుడైన తర్వాత కాళ్లలో కట్టెలు పెట్టినట్లు అటు వెంకటరెడ్డి, ఇటు జగ్గారెడ్డి, వి. హనుమంతరావు, మధుయాష్కీ గౌడ్‌ లాంటి వారు అనేక ప్రయత్నాలు చేశారు. పిసిసి. అధ్యక్షుడుగా రేవంత్‌ రెడ్డిని విఫల అద్యక్షుడుగా చేయాలని చూశారు. కాని అందరి ఊహలు పటా పంచెలు చేస్తూ రేవంత్‌ రెడ్డి దూసుకెళ్లారు. రేవంత్‌రెడ్డి పదవిని కొనుగోలు చేశారంటూ కూడా ఘాటైన వ్యాఖ్యలు వెంకటరెడ్డి చేసిన సందర్భం వుంది. పిసిసి. అద్యక్షుడుగా రేవంత్‌రెడ్డి జిల్లాల పర్యటన పెట్టుకున్నప్పుడు తనకు తెలియకుండా నల్లగొండకు ఎలా వస్తాడంటూ ప్రశ్నించారు. రేవంత్‌ రెడ్డి నల్లగొండకు రావాల్సిన అవసరం లేదు. ఆ జిల్లా నా సొంతం. అక్కడ ఏ రాజకీయమైనా తన కనుసన్నల్లో జరగాలన్నట్లు కూడా మాట్లాడిన సందర్భాలున్నాయి. రాజగోపాల్‌ రెడ్డి పిసిసి. అధ్యక్షుడుగా వున్న రేవంత్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు అన్నీ ఇన్నీ కావు. పైగా ఆయన పార్టీకి రాజీనామా చేసి బిజేపిలో చేరారు. మునుగోడు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ఆ సమయంలో మంత్రి వెంకటరెడ్డి ఆస్ట్రేలియాలో వున్నారు. ఎన్నికలు జరిగిన తర్వాత వచ్చారు. ఆస్ట్రేలియా నుంచి నాయకులకు ఫోన్‌లు చేసి ఏం మాట్లాడారో కూడా పార్టీ నాయకులు తెలుసు. ఇదే దారిలో జగ్గారెడ్డి కూడా రేవంత్‌ రెడ్డి మెదక్‌ ఎలా వస్తారంటూ నిలదీసిన సందర్భం వుంది. మెదక్‌ జిల్లాకు వచ్చే ముందు నాకు సమాచారం ఇవ్వరా? అంటూ ప్రశ్నించారు. పిపిసి. అధ్యక్షుడైతే కొమ్ములున్నాయా? అంటూ కూడా ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. అయినా అందరిన్నీ కలుపుకుపోయి, ఎంతో సహనంతో పదవిని రేవంత్‌ రెడ్డి నిర్వహించారు. నిజానికి ఆ సమయంలో రేవంత్‌ రెడ్డి ఇచ్చిన సమాధానాలు ఎంతో హుందాగా వుండేవి. తిట్టేవాళ్లుంతా నా వాళ్లే. వాళ్లంతా నాకు సోదరులే. అంటూ నవ్వుతూ రేవంత్‌ సమాధానమిచ్చేవారు. కొంత మంది నాయకులు ఎంత రెచ్చగొట్టాలని చూసినా ఏనాడు రేవంత్‌రెడ్డి తన అదుపు తప్పలేదు. అప్పటి బిఆర్‌ఎస్‌ నాయకులతోపాటు, సొంత పార్టీ నాయకులు రేవంత్‌ రెడ్డిని ఎంత డీమోరలైజ్‌ చేయాలని చూసినా ఏనాడు అదుపు తప్పలేదు. సొంత పార్టీ నేతలను ఏనాడు పల్లెత్తు మాట అనేలేదు. తన లక్ష్యం మాత్రమే చూసుకున్నాడు. పార్టీకి ఇచ్చిన హమీ మాత్రం గుర్తు చేసుకుంటూ ముందుకు సాగారు. పార్టీని ఎలా అధికారంలోకి తీసుకురావాలన్నదానిపైనే దృష్టిపెట్టారు. పిపిసి. అధ్యక్షుడైన నుంచి మొదలు, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దాకా ఆయన పడిన శ్రమ అంతా ఇంత కాదు. పార్టీని నడపడం అంటే పాన్‌ డబ్బా నడిపినంత సులువు కాదని ఓసారి కేసిఆర్‌ అన్నాడు. అలాగే పిపిసి. పదవులు నిర్వహించడం తమ వల్ల కాదని వదిలేసిన వారి ముందు పార్టీని అధికారంలోకి తీసుకురావడం అనేది సామాన్యమైన విషయం కాదు. రేవంత్‌రెడ్డి పిపిసి. అధ్యక్షుడు అయ్యే వరకు తెలంగాణలో కాంగ్రెస్‌ ఎంతో బలహీనంగా వుండేది. ఎప్పుడైతే రేవంత్‌ రెడ్డి తన పదునైన వ్యూహాలతో ముందుకు సాగారు. ఆ సమయంలో జరిగిన ఉప ఎన్నికల్లో గెలుస్తూ బిజేపి మంచి ఊపు మీద వున్నది. దానిని కాదని దాటుకుంటూ వెళ్లి, ప్రజల మన్ననలు పొంది, అధికారంలోకి తీసుకురావడానికి రేవంత్‌రెడ్డి చేసిన ప్రయత్నం ఎంతో గొప్పది. అందుకే ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా పార్టీని అధికారంలోకి తసుకొచ్చింది మాత్రం ముమ్మాటికీ సిఎం. రేవంత్‌ రెడ్డి మాత్రమే. ఇక్కడ సమిష్టి కృషి అనే పదం ఇప్పటికీ రేవంత్‌ రెడ్డి తన హుందాతనాన్ని నిలుపుకోవడానికి చెబుతుంటారు. అంత కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినా ఆయనను సిఎం. కాకుండా అడ్డుకోవడానికి శత విధాలుగా ప్రయత్నించిన నాయకులున్నారు. ఆఖరుకు అధిష్టానం ఆదేశాలతో మాత్రమే వాళ్లు చల్లబడ్డారు. పార్టీని ఎవరు అదికారంలోకి తీసుకొచ్చారో మాకు తెలుసు. అందులో ఎవరి కష్టం ఎంత వుందో తెలుసని తలంటిన తర్వాతే వారి వారి ప్రయత్నాలు విరమించుకున్నారు. రేవంత్‌ రెడ్డి సిఎం. కావడాన్ని అయిష్టంగానే అంగీకరించారు. అయినా ఎప్పుడు అవకాశం దొరుకుతుందా? రేవంత్‌రెడ్డి ఫెయిల్యూర్‌ సిఎం కావాలని కలలు కంటున్నవాళ్లు కూడా వున్నారు. ఈ విషయాలు అన్నీ తెలిసినా సిఎం. రేవంత్‌ రెడ్డి మౌనంగానే వుంటున్నారు. వారితో సఖ్యతతోనే వుంటున్నారు. తాను సిఎం. అనేది ఎక్కడా చూపించకుండా వారందరికీ ఎంతో మర్యాదను ఇస్తున్నారు. తనతో సమానంగా చూసుకుంటున్నారు. వారి వారి శాఖల్లో ఇప్పటి వరకు రేవంత్‌ రెడ్డి జోక్యం చేసుకున్న సందర్భాలు లేవు. మంత్రులకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. దాని వల్ల కూడా ఏం జరుగుతుందో సిఎం. రేవంత్‌రెడ్డికి తెలియంది కాదు. అయినా ఇప్పటి వరకు ఏ మంత్రిని కూడా మందలించింది లేదు. దాంతో సిఎం.రేవంత్‌ రెడ్డి తమను జోలికి రావడానికి భయపడుతున్నారన్న ఆలోచనలో కొంత మంది మంత్రులున్నట్లు కూడా పార్టీలో చెప్పుకుంటుంటారు. ప్రభుత్వాన్ని కొంత మంది మంత్రులు ఎలా అబాసుపాలు చేస్తున్నారో అందరూ చూస్తున్నదే. ఏ ఏ మంత్రి మీద ఎలాంటి ఆరోపణలు వస్తున్నాయో తెలియంది కాదు. సరైన సమయం కోసం సిఎం. రేవంత్‌ రెడ్డి ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వాన్ని నిర్వహించడం, కాపాడుకోవడం, మళ్లీ పార్టీని అదికారంలోకి తీసుకురావడం అనేది కష్టపడేవారికి మాత్రమే తెలుస్తుంది.. పార్టీని ఎంత కష్టపడి అదికారంలోకి తీసుకొచ్చాడో సిఎం. రేవంత్‌ రెడ్డికి మాత్రమే తెలుసు. ఇతర మంత్రులలో ఎంత మంది పార్టీని భుజాల మీద వేసుకొని ముందుకు సాగారో జనానికి కూడా తెలుసు. అందుకే ఇప్పటికీ సిఎం. రేవంత్‌ రెడ్డి ఎంతో ఓపికతో వుంటున్నారు. ఈ మధ్య వివాదాలు అనేకం తలెత్తినా, ఆయన మంత్రి వర్గ సమావేశంలో మంత్రులకు తలంటారే గాని, బైట ఏనాడు వారిపై నోరు విప్పలేదు. అదీ హుందాతనం అంటే..అదే స్ధానంలో ఇతర నాయకులెవ్వరున్నా ఈ పాటికి కంపు కంపు చేసేవారు. కాని రేవంత్‌ రెడ్డి ఎంతో హుందాగా, పదవి నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇప్పుడు పార్టీ హైకమాండ్‌ కూడా ఈ విషయాలన్నీ తెలుసుకొని ఆయనకు ఫ్రీ హాండ్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతుంది. అప్పుడు అసలైన ఆట, రాజకీయం, పాలన రేవంత్‌ చూపిస్తాడని తెలుస్తోంది.

హై కమాండ్‌..రేవంత్‌కు ఫ్రీ హాండ్‌!

`అందరినీ దారిలో పెట్టే బాధ్యత!

`అన్ని విధాలుగా పూర్తి అధికారం

`పని చేయని వారిని పక్కన పెట్టండి

`పార్టీ ప్రతిష్టకు భంగవాటిల్లితే ఉపేక్షించొద్దు

`ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే సహించొద్దు

`జూబ్లీ హిల్స్‌ ఎన్నికలలో గెలిచి తీరాలి

`ఏ విషయంలోనైనా అంతిమ నిర్ణయం సిఎం. రేవంత్‌కే

`రాష్ట్ర వ్యవహారాలలో రేవంత్‌ నిర్ణయం అందరూ ఆమోదించాల్సిందే

`మెతక వైఖరి అవసరం లేదని రేవంత్‌ కు సూచించిన హై కమాండ్‌

`అధిష్టానం పిలిస్తే తప్ప మంత్రులెవరూ డిల్లీకి రావొద్దు

`పార్టీ పరంగా ఎవరు హద్దు దాటినా వేటు వేయండి

`ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా పార్టీ నాయకులు మాట్లాడినా సహించకండి

హైదరాబాద్‌, నేటిధాత్రి:                        రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి హైకమాండ్‌ పూర్త స్ధాయి ఫ్రీ హాండ్‌ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఇకపై పాలన అంటే ఎలా వుంటుందో, రేవంత్‌ రెడ్డి పవర్‌ ఎలా వుంటుందో తెలిసే సమయం వచ్చిందని కూడా అనుకుంటున్నారు. ఇంత కాలం ఆయనకు పూర్తి స్దాయిలో వెసులుబాటు లేదన్నది కొంత వరకు సత్యం. కాని ఇటీవల ఆయనపై అనేక రకాల వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో హైకమాండ్‌ కూడా స్పందించినట్లు తెలుస్తోంది. వీటన్నింటికీ చెక్‌ పెట్టాలంటే పూర్తి స్దాయిలో సిఎం.రేవంత్‌ రెడ్డికి ఫ్రీ హాండ్‌ ఇస్తే తప్ప వివాదాలు సమసిపోవు అనే ఆలోచనకు వచ్చింది. అందుకే ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో కూడా సిఎం. రేవంత్‌ రెడ్డి ఇకపై తన మార్కు పాలనను చూపిస్తానని కూడా స్పష్టం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా ఓ దినపత్రికలో వచ్చిన వార్త ప్రకారం సిఎం. రేవంత్‌ రెడ్డి మంత్రుల్లో ఎవరు తనపై అసత్య ప్రచారాలు సాగేలా వ్యవహరిస్తున్నారన్న దానిపై చాల సేపు ప్రశ్నించినట్లు కూడా సమాచారం. ఎందుకంటే పార్టీ కోసం కష్టపడిరది రేవంత్‌ రెడ్డి. పార్టీని అదికారంలోకి తీసుకురావడంలో అందరికన్నా కీలకభూమిక పోషించింది రేవంత్‌ రెడ్డి. అధిష్టానం ఆషామాషీగా రేవంత్‌రెడ్డిని సిఎం. చేయలేదు. అదిష్టానానికి అన్నీ తెలుసు. రేవంత్‌ రెడ్డి రాజకీయ వ్యూహాలు తెలుసు. రేవంత్‌ రెడ్డి వేసిన ఎత్తుగడల్లో కేసిఆర్‌ ఎలా చిక్కుకున్నారో తెలుసు. అందుకే పార్టీ అధిష్టానం రేవంత్‌రెడ్డిని సిఎం. చేసింది. ఈ మాత్రం అవగాహన రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసు. కాని కాంగ్రెస్‌ పార్టీ నాయకులందరికీ తెలుసు. అయినా తాము ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్ష మేరకు కొ ంత మంది మంత్రులు పరోక్షంగా ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు కూడా సిఎం. దృష్టికి వచ్చింది. పైగా వ్యక్తిగతంగా సిఎం. రేవంత్‌రెడ్డిని ఇరుకున పెట్టే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయన్నది గుర్తించారు. అందుకే మంత్రి వర్గ సమావేశంలో మంత్రులందిరి పనితీరుపై సుధీర్ఘంగా చర్చ జరిగింది. పైగా ఆయా మంత్రుల తీరుపై కూడా అదిష్టానానికి సమగ్రమైన నివేధిక కూడా సిఎం. రేవంత్‌ రెడ్డి ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం వున్న క్యాబినేట్‌లో చాలా మంది మంత్రులు సిఎం.కు ఇబ్బందికరమైన పరిస్ధితులు తెచ్చిపెట్టాలనే చూస్తున్నారు అనేది వెల్లడౌతోంది. పైగా తమ ఇష్టాను సారం కూడా కొంత మంది మంత్రులు పనిచేస్తున్నారు. అందుకే ఇలాంటి ఇబ్బ ందికరమైన పరిస్ధితులు ఎదురౌతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం వల్లనే తాము పదువుల్లో వున్నామన్న విషయాన్ని చాలా మంది మంత్రులు మర్చిపోతున్నట్లున్నారు. తమ వల్లనే పార్టీ అధికారంలోకి వచ్చిందని కూడా కొంత మంది అనుకుంటున్నట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరి ప్రోద్భలం వల్లనే కొంత మంది ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వం మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటన్నింటికీ పుల్‌స్టాప్‌ పెట్టేందుకు సిఎం. రేవంత్‌ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకున్నా ఫరావా లేదన్నట్లు అధిష్టానం కూడా తేల్చిచెప్పినట్లు కూడా సమాచారం అందుతోంది. రాజకీయంగా సిఎం. రేవంత్‌రెడ్డి వ్యూహాలు ఇప్పుడున్న మంత్రులకు ఎవరికీ తెలియవు. అర్ధం కావు. అందుకే రేవంత్‌ రెడ్డి పిపిసి అధ్యక్షుడు అయిన నుంచి ఆయనను తప్పు పడుతూనే వున్నారు. రేవంత్‌ రెడ్డి వేసిన ఎత్తుగడలు ఎలా వున్నాయో ఒక్కసారి తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే. గత ఎన్నికల ముందు నుంచి కూడా సిఎం.రేవంత్‌రెడ్డి వేసిన ప్రతి స్కెచ్‌లోనూ కేసిఆర్‌ చిక్కుకుంటూ వచ్చారు. రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలకు సమాధానం కూడా కేసిఆర్‌ చెప్పలేకపోయాడు. ఇక్కడ ఒక్క విషయం సూటిగా చెప్పుకోవాలి. గత ఎన్నికలు ముందు రెండేళ్లుగా కేసిఆర్‌ అంటేనే జనం చీ కొట్టేలా చేయడంలో రేవంత్‌ రెడ్డి సక్సెస్‌ అయ్యారు. రైతులు కూడా కేసిఆర్‌కు వ్యతిరేంగా మారడంలో కీలక భూమిక పోషించారు. రైతుల ఓట్లు బిఆర్‌ఎస్‌కు పడకుండా నిరుద్యోగులను అస్త్రంగా చేసుకొని కేసిఆర్‌ను దెబ్బకొట్టిన ఘనత రేవంత్‌ రెడ్డిది. పల్లె సీమలను భాగ్య సీమలు చేశానని గొప్పలు చెప్పుకున్న కేసిఆర్‌కు ఆ పల్లెలే చుక్కలు చూపించేలా చేసిన ఘనత రేవంత్‌రెడ్డిది. ఇలా ఏ పల్లె జనాన్ని తనకు ఎదురులేదు. తిరుగులేదు. అనుకొని ప్రజలు కూడా కలవకుండా పాలన సాగించిన కేసిఆర్‌ను ఫామ్‌ హౌజ్‌కు పరిమితం చేసి, కోలుకోలేని దెబ్బలు కొడుతున్న నాయకుడు, పాలకుడు రేవంత్‌ రెడ్డి. ఒకప్పుడు కేసిఆర్‌ వ్యూహాం ముందు అప్పటి నాయకులు చతికిలపడేవారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి వ్యూహాన్ని పసిగట్టలేక కేసిఆర్‌ గింగిరాలు తిరుగుతున్నాడని చెప్పడంలో సందేహం లేదు. ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు కేసిఆర్‌ను స్ధానం లేకుండా చేశారు. నిజం చెప్పాలంటే కేసిఆర్‌ను రేవంత్‌ రెడ్డి హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నుంచి తన మార్కు రాజకీయ దెబ్బ చూపిస్తూ వస్తున్నారు. హుజూరాబాద్‌లో ఈటెల రాజేందర్‌ గెలిచేలా చేసి, కాంగ్రెస్‌కు వీక్‌ అభ్యర్ధిని నిలబెట్టి బిఆర్‌ఎస్‌ను ఓడిరచారు. అప్పుడు రేవంత్‌రెడ్డి అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. కాని రేవంత్‌ తన వ్యూహాంలో విజయం సాధించారు. ఎందుకంటే ఆ సమయంలో కాంగ్రెస్‌ అప్పటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిస్తే అంతిమంగా బిఆర్‌ఎస్‌ గెలుస్తుంది. అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేసి,ఈటెల రాజేందర్‌ గెలిచేలా చేసి, కేసిఆర్‌ను దెబ్బకొట్టారు. కేసిఆర్‌కు మొదటిసారి ఓటమి రుచి చూపించారు. తర్వాత దుబ్బాకలో ఇదే వ్యూహాన్ని అమలు చేశాడు. అక్కడా బిఆర్‌ఎస్‌ పతనాన్ని రచించారు. ఆ తర్వాత వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ ఓటమిని రేవంత్‌ రెడ్డి రచించారు. విజయం సాదించారు. సిఎం. అయ్యారు. అందుకు ముందుగా అమలు చేసిన స్కెచ్‌నే ఇప్పటికీ రేవంత్‌రెడ్డి అమలు చేస్తున్నారు. కాని కేసిఆర్‌ అదే ఉచ్చులో పదే పదే చిక్కుకుంటున్నారు. దమ్ముంటే సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే టికెట్‌ ఇచ్చి గెలిపించుకో అంటూ రేవంత్‌ రెడ్డి చేసిన సవాలును స్వీకరించి గత ఎన్నికల్లో ఓడిపోతారని తెలిసినా అదే ఎమ్మెల్యేలకు కేసిఆర్‌ టిక్కెట్లు ఇచ్చి ఓటమిని తానే కొని తెచ్చుకునేలా చేశారు. కొంత మంది ఎమ్మెల్యేలను మార్చకపోతే పార్టీ ఓడిపోతుందని ఎంతో మంది సీనియర్లు కేసిఆర్‌కు చెప్పినా వినలేదు. రేవంత్‌ రెడ్డి పన్నిన పద్మవ్యూహంలో చిక్కుకున్నారు. పార్టీని ఓటమికి కేసిఆరే కారకులయ్యారు. ఇప్పుడు కూడా అదే వ్యూహాన్ని అమలు చేసినా కేసిఆర్‌ పసిగట్టలేకపోతున్నారు. రేవంత్‌రెడ్డి మళ్లీ అదే దారిలో వెళ్తున్నాడని తెలిసినా కేసిఆర్‌ చేతులెత్తేసే రాజకీయమే చేస్తూ వస్తున్నారు. సరిగ్గా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఇదే ఫార్ములా రేవంత్‌రెడ్డి అనుసరించినా ఇప్పటికీ కేసిఆర్‌ పసిగట్టలేపోయారా? లేక తెలిసే వదిలేస్తున్నారా? ముఖ్యంగా జూబ్లీహిల్స్‌ ఎన్నికలలో కేసిఆర్‌ ప్రచారానికి రాకుండా కట్టడి చేయడంలో రేవంత్‌రెడ్డి వేస్తున్న ఎత్తుగడలే నిదర్శనమని చెప్పకతప్పదు. ఇప్పుడు కూడా జూబ్లీహిల్స్‌లో కేసిఆర్‌ ప్రచారానికి రావడానికి ఇష్టపడం లేదు. జూబ్లీహిల్స్‌ ఓడిపోయే సీటుకు ప్రచారం చేసి మరింత పరువు తీసుకోవడం కన్నా, ప్రచారానికి దూరంగా వుండడమే మేలనే పరిస్ధితికి కేసిఆర్‌ను నెట్టి వేయడంతో కూడా రేవంత్‌ రెడ్డి సక్సెస్‌ అయ్యారు. దానికి తోడు తాజాగా రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయంతో మైనార్టీ ఓట్లను గుండు గుత్తగా కాంగ్రెస్‌కు పడేలా చేసుకోవడం కోసం మరో ఎత్తుగడ వేస్తున్నారు. ఇండియన్‌ మాజీ క్రికెట్‌ కెప్టెన్‌, మాజీ ఎంపి, ప్రస్తుత ఎమ్మెల్సీ అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తున్నారు. ఇప్పటి వరకు మైనార్టీలకు మంత్రి వర్గంలో చోటు లేదు. అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడంతో మైనార్టీ ఓట్లను బిఆర్‌ఎస్‌ వైపు మళ్లకుండా చేసేఎత్తుగడ వేశారు. ఇప్పటికే ఎంఐఎంను ఒప్పించి అభ్యర్దిని నిలబెట్టకుండా చూసుకున్నారు. ఎంఐఎం సూచనల మేరకు నవీన్‌ యాదవ్‌కు టికెట్‌ ఇచ్చారు. ఇలా రేవంత్‌రెడ్డి వేస్తున్న ఎత్తుగడలు కేసిఆర్‌కు మింగుడు పడడం లేదు. వ్యక్తిగతంగానే నవీన్‌ యాదవ్‌కు వేలాది ఓట్లు వున్నాయి. ఆయన ఇండిపెండెంటుగా పోటీ చేస్తేనే 20వేల ఓట్లకు పైగా సాదించారు. ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి గత ఎన్నికల్లో రెండో స్ధానంలో నిలిచారు. ఇప్పుడు కాంగ్రెస్‌ అభ్యర్ధిగా ఎంఐఎంల సపోర్టుతో కలుపుకుంటే నవీన్‌యాదవ్‌కు భారీ మెజార్టీ ఖాయంగానే కనిపిస్తోంది.. మరో వైపు సినీ ఇండ్రస్ట్రీనీ ఆకట్టుకోవడం కోసం రేవంత్‌ రెడ్డి రంగంలోకిదిగారు. ఇలాంటి వ్యూహాలు ఏనాడు సీనియర్లైన నాయకులు ఎవరూ అమలు చేయలేదు. గుడ్డిగా కేసిఆర్‌ వేసిన ఎత్తుల్లో చిక్కుకున్నారు. కాని రేవంత్‌రెడ్డి వేసే ఎత్తులు అర్ధం కాక బిఆర్‌ఎస్‌ కూడా చతికిలపడిపోతోంది. అలాంటి సిఎం. రేవంత్‌రెడ్డిని పదవి నుంచి దించే కుట్రలకు ఎంత మంది తెరతీసినా వాటిని పటా పంచెలు చేయగల రాజకీయ యుక్తి, శక్తి రేవంత్‌రెడ్డికి వుంది. పార్టీ కోసం ఆయన పడిన శ్రమ, అదికారంలోకి తెచ్చేందుకు ఆయన పడిన కష్టం సున్నితంగా వదిలేసుకుంటారని ఎవరూ అనుకోవడం లేదు. ఇకపై సీనియర్‌ మంత్రులైనా, ఇతర నాయకులైనా సరే ఉపేక్షించేందుకు సిఎం. సిద్దంగా లేరు. ఏ మాత్రం మంత్రులు సరిగ్గా పని చేయకపోయినా తప్పించడం ఖాయంగానే కనిపిస్తోంది. పైగా ప్రభుత్వం వచ్చి రెండేళ్ల కావొస్తోంది. మంత్రి వర్గ కూర్పు, మార్పు కూడా తప్పదని తెలుస్తోంది. అదంతా పార్టీ అధిష్టానం పూర్తిగా సిఎం. రేవంత్‌ రెడ్డి చేతుల్లోనే పెట్టినట్లు కూడా తెలుస్తోంది. ఏది ఏమైనా ఇకపై సిఎం. రేవంత్‌ వ్యవహార శైలిని సరికొత్తగా చూడొచ్చని అనుకుంటున్నారు.

వివాహ వేడుకలో పాల్గొన్న మాజీ చైర్మన్…

వివాహ వేడుకలో పాల్గొన్న మాజీ చైర్మన్

◆:- తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పట్టణంలోని శుభం కన్వెన్షన్ హాల్లో హోతి బి గ్రామపంచాయతీ సెక్రెటరీ నరేష్ గారి సోదరుని వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులకు అక్షింతలు వేసి వివాహ శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ గారు వారితోపాటు ఈ కార్యక్రమంలో పర్వేస్ బిజీ సందీప్ అమన్ నవీద్ బాల్ రెడ్డి తదితరులు ఉన్నారు,

కట్టు దాటక ముందే కట్టడి చేయండి!?

`కప్పదాటు మంత్రులను పీకేయండి?

`కఠిన నిర్ణయాలు తప్పవు..ఉపేక్షిస్తూ పోతే ఆగవు.

`తెలంగాణలో కాంగ్రెస్‌ కు రక్ష రేవంత్‌ రెడ్డి మాత్రమే.

`మొండిగా లేకుంటే నాయకులు మొదటికే మోసం తెచ్చేలా వున్నారు?

`అధికారంలో వున్నా కొందరు కోవర్టు గుణం మానుకోవడం లేదు!

`తాబేదార్ల పని వదులుకోవడం లేదు.

రేవంత్‌ కష్టపడి తెచ్చిన ప్రభుత్వం మీద కుట్రలు చేస్తున్నారు.

`ప్రతిపక్షాలకు అస్త్రాలౌతున్నారు?

`అతి స్చేచ్ఛ ఎప్పటికీ హస్తవ్యస్తమే!

`కూర్చున్న కొమ్మనే నరుక్కుకుంటున్నారు.

`సీఎం. రేవంత్‌ రెడ్డి మంచి తనం అలుసుగా తీసుకుంటున్నారు.

`అందరిలో ఒకడిగా మెలుగుతుంటే మెతకవైఖరి అనుకుంటున్నారు?

`సీఎం. ను లెక్క చేయకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు?

`పదేళ్ల తర్వాత వచ్చిన అధికారాన్ని కొందరు మంత్రులే దుర్వినియోగం చేస్తున్నారు?

’’సీఎం కుర్చీ మీద కన్నేసి’’ ప్రభుత్వాన్నే అస్థిర పరచాలని చూస్తున్నారు!

సీఎం. రేవంత్‌ రెడ్డి’’ ఉదాసీనత మితి మీరిన స్చేచ్ఛకు కారణం

`మంత్రులకు పూర్తి స్చేచ్ఛ కూడా కొంప ముంచుతుంది

`సీనియర్లు అనే గౌరవాన్ని చాలా మంది మంత్రులు నిలుపుకోవడం లేదు.

`‘‘సీఎం’’. రేవంత్‌ ను ఫెయిల్యూర్‌ ‘‘సిఎం’’గా చిత్రీకరించే కుట్ర చేస్తున్నారా?

’’సీఎం’’. పై పదే పదే అధిష్టానం ముందు అబద్ధాలు ప్రచారం చేస్తూ వస్తున్నారా!

`గల్లీ లొల్లి..డిల్లీ పంచాయతి!

`కాంగ్రెస్‌ పార్టీ అంటేనే అంత!

`ఎప్పుడూ మారనిదే ఇదంతా!

`ప్రతి చిన్న విషయానికి సిఎం.ను డిల్లీకి పిలవడం పార్టీకే నష్టం!

`జిల్లా అధ్యక్షుల ఎంపిక కూడా హై కమాండ్‌ జోక్యం చేసుకోవాలా?

`ఇప్పటికే ఏఐసీసీ పరిశీలకులు వడపోసి పోయారు!

`ఇప్పుడు మళ్ళీ సీఎం, మంత్రులతో డిల్లీలో మంతనాలు!

`అధిష్టానం ‘‘సీఎం’’ను గౌరవిస్తే మంత్రులు భయంతో వుంటారు.

`అధిష్టానం మంత్రులకు ప్రాధాన్యతనిస్తే ‘‘మొదటికే మోసం’’ తెస్తారు

హైదరాబాద్‌, నేటిధాత్రి: 

పాలనలో సామరస్యముండాలి. పరిపాలనలో మొండి తనముండాలి. ప్రజల విషయంలో ఆలోచనా దృక్పధం వుండాలి. పాలనా బాగస్వాములు పట్ల ముఖ్యమైన పాలకుడు కఠినంగానే వుండాలి. ఇది సిఎంలకు వుండాల్సిన అతి ముఖ్య లక్షణం. మెతక తనం కూడా కొన్ని సార్లు చేత కాని తనమౌతుందని అనుకునే పరిస్ధితి వుంటుంది. అందుకే ఉమ్మడి రాష్ట్రంలోనైనా, తర్వాతనైనా సరే ముఖ్యమైన పాకులు కఠినంగా వుండాల్సిన అవసరం వుంది. నిజం చెప్పాలంటే ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు పరిపాలన చేసిన ముఖ్యమంత్రులలో ప్రస్తుత సిఎం. రేవంత్‌ రెడ్డి లాంటి మంచి తనం నిండిన పాలకులు లేరు. ప్రభుత్వం ఏర్పాటై రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఆయన ఏ ఇతర శాఖల్లోనూ వేలు పెట్టడం లేదు. ఏ మంత్రిపట్ల ఇప్పటి వరకు సీరియస్‌గా వ్యవహరించలేదు. శాఖల నిర్వహణలో మంత్రులు అలసత్వం వహిస్తున్నా పెద్దగా మందలించిన దాఖలాలు లేవు. ఇవన్నీ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఉదార స్వభావానికి నిదర్శనం. కాని అది సిఎం. రేవంత్‌ రెడ్డి చేతగాని తనంగా కొందరు మంత్రులు భావిస్తున్నట్లున్నారు. పైగా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కావాలన్న కోరిక వున్న వాళ్లు కూడా కొంత మంది వున్నారు. ఎప్పుడు తమకు అవకాశం వస్తుందా? అని ఎదురుచూస్తున్న వారు కూడా వున్నారు. ఈ విషయం సిఎం. రేవంత్‌రెడ్డికి తెలియంది కాదు. అయినా అలాంటి మంత్రుల విషయంలో కూడా రేవంత్‌ రెడ్డి ఎంతో ఉదాసీనతతో వ్యవహిస్తున్నారు. వారికి ఇవ్వాల్సిన ప్రాదాన్యత కంటే ఎక్కువ ఇస్తున్నారు. ఎక్కడా తాను ముఖ్యమంత్రి అనే దర్పం చూపించడం లేదు. ప్రతి విషయంలోనూ, సందర్భంలోనూ ఆయన మంత్రులను సమాన భాగస్వాములుగానే చూస్తున్నారు. వారికి మితిమీరిన మర్యాద కల్పిస్తున్నారు. ఇదంతా రేవంత్‌రెడ్డి గొప్పదనం. రాజకీయాల్లో అందరూ సమానమనుకునే మనస్తత్వం. ఇలాంటి ముఖ్యమంత్రులే సమస్యలు ఎదుర్కొంటారని అని చెప్పడానికి ఇది కూడా ఒక నిదర్శం. ఎందుకంటే గతంలో ఎప్పుడూ ఏ ముఖ్యమంత్రి ఇంతగా మంత్రులకు స్వేచ్ఛ నిచ్చిన సందర్భాలులేవు. ప్రాంతీయపార్టీలలో సహజంగా సిఎంలు ఒకింత నియంతలుగా వుంటారన్న భావన వుంది. నిజం కూడా. ఆయా మంత్రులైనా, నాయకులైనా సరే ప్రతి విషయాన్ని తమకు తెలియకుండా ఏ ఒక్క ఫైలు ముందుకు కదలొద్దు అని హుకూం జారీ చేసేవారు. గత ప్రభుత్వంలో కూడా అదే జరిగింది. కేసిఆర్‌ పాలనలో కూడా అదే అనుసరించారు. గతంలో చంద్రబాబు పాలన కూడా అలాగే సాగింది. ఎన్టీఆర్‌ కాలంలోనూ సిఎం.కు తెలియకుండా చీమ చిటుక్కుమనలేదు. కాంగ్రెస్‌లో కూడా అదే జరిగింది. ఈ విషయాలను సిఎం. రేవంత్‌ రెడ్డి తెలుసుకోవాల్సిన అవసరం వుంది. అయినా పాలన అంటే సమిష్టి బాద్యత అనే ఉదారస్వభావంతో సిఎం. రేవంత్‌ రెడ్డి వున్నారు. రేవంత్‌ అతి మంచితనం కూడా చెడుగా మారుతోంది. మంత్రులకు ఇచ్చిన అతి స్వేచ్చ దుర్వినియోగమౌతోంది. అంతిమంగా అది రేవంత్‌రెడ్డి మెడకు చుట్టుకుంటోంది. దాంతో సిఎం. రేవంత్‌ రెడ్డి ఉక్కిరి బిక్కిరి కావాల్సి వస్తుంది. ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పార్టీని మళ్లీ అదికారంలోకి తీసుకురావాలి. ప్రజా పాలన సాగించాలని సిఎం. రేవంత్‌ రెడ్డి అనుకుంటున్నారు. కాని చాల మంది మంత్రుల్లో ఈ అభిప్రాయం వున్నట్లు కనిపించడం లేదు. మళ్లీ అధికారంలోకి వస్తామో? లేదో? అనే అభద్రాతా భావంలోనే కొంత మంది మంత్రులున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే పదువుల్లో వున్నప్పుడు ఇల్లు చక్కదిద్దుకోవడం, అవకాశంవస్తే సిఎం. కావాలన్న ఆశతో చాలా మంది వున్నారు. వారి వల్ల ఏమీ కాదన్న సంగతి ప్రజలకు తెలుసు. వారి వల్ల ఈ మాత్రం పాలన కూడా నడవదని తెలుసు. అయినా వారికి సిఎం కావాలన్న కోరిక రోజు రోజుకూ పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సిఎం. రేవంత్‌రెడ్డి పదవిలో వుంటే తప్ప కాంగ్రెస్‌ను ఎవరూ కాపాడలేరు. సిఎం. రేవంత్‌కు ఏ మాత్రం ఇబ్బంది ఎదురైనా కాంగ్రెస్‌ను రక్షించే నాధుడే వుండరు. గత పదేళ్ల కాలంలో కనీసం పంచాయితీ ఎన్నికల్లో కూడా పార్టీని గెలిపించలేని నాయకులు, రాష్ట్రానికి అధికారం తెస్తారని అనుకోవడం లేదు. అసలు వారికి పార్టీ ఎలా అధికారంలోకి వచ్చిందో తెలుసు. సిఎం. రేవంత్‌రెడ్డి పిసిసి అధ్యక్షుడుగా ఎంత శ్రమించాడో తెలుసు. పార్టీని నడిపేందుకు ఎంత ప్రయాసపడ్డాడో అందరికీ తెలుసు. పార్టీకి ఒక్కొ ఇటుక ఏలా పేర్చాడో తెలుసు. ప్రజల మనసు ఎలా చూరగొన్నాడో తెలుసు. పార్టీని నడపడమే చేతగాని కాడి పడేసిన వాళ్లు కూడా ఇప్పుడు పాలిస్తాం..ముఖ్యమంత్రి అవుతామని అని కలులు గంటున్నారు. ఈ విషయాలు అదిష్టానానికి తెలియక కాదు. కాని సిఎం.రేవంత్‌రెడ్డిని స్ట్రాంగ్‌ చేస్తే వైఎస్‌. రాజశేఖరెడ్డిలాగా మారుతాడేమో? అనే భయం అధిష్టానంలో కూడా వుంది. వారి మదిలో లేకపోయినా, నేర్పించే నాయకులు పార్టీలో చాల మంది వున్నారు. సిఎం. కవాలన్న ఆశ వున్నవాళ్లంతా ఇదే చేస్తున్నారు. వైఎస్‌కు అధిష్టానం పూర్తి స్వేచ్చ ఇవ్వడం వల్లనే పార్టీకి తీరని నష్టం జరిగిందన్న అభిప్రాయం చాలా మందిలో వుంది. ఏపిలో పార్టీ నామ రూపాలు లేకుండాపోవడానికి కారణం అదే అని అధిష్టానానికి చెప్పిన వాళ్లున్నారు. అయితే వైఎస్‌ తర్వాత పనిచేసిన ముఖ్యమంత్రులు కూడా సిఎం. రేవంత్‌లాగా ఉదాసీనతంగా వ్యవహరించలేదు. సిఎం. అంటే సిఎంలాగానే వ్యవహరించారు. ప్రభుత్వమంటే అందరూ సమానమే అయినా, సిఎం. ఎక్కువ సమానం అన్నట్లుగానే పాలన సాగించారు. రోశయ్య లాంటి వారు కూడా మంత్రుల మీద అజమాయిషీ చేశారు. అందర్నీ కట్టడి చేశారు. అసలు ఏ అనుభవం లేని కిరణ్‌కుమార్‌ రెడ్డి కూడా సిఎం. కాగానే తనేంటో చూపించారు. ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయంలో తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోండి? అనేంత ధైర్యంగా పాలన సాగించారు. అలా సిఎం. స్ట్రాంగ్‌గా వుంటే ఏ మంత్రులు నోరు మెదపరు. ఇప్పుడు సిఎం. రేవంత్‌రెడ్డి కూడా అలా వుంటే తప్ప మంత్రులు భయపడరు. వున్న ఈ మాత్రం పదవి కూడా సిఎం. కనికరంతోనే వుందన్న భయం మంత్రుల్లో ఖచ్చితంగా వుండాలి. తమకు పదవి రేవంత్‌ రెడ్డి ఇవ్వలేదు. అధిష్టానం ఇచ్చింది అనే ఆలోచన వున్న కొందరు మంత్రులు సిఎం.ను లెక్క చేయడం లేదన్నది సర్వత్రా వినిపిస్తోంది. ఈ ఆలోచన మంత్రుల్లో మారాలి. సిఎం. దృక్పధంలో కూడా మార్పు రావాలి. తాను మిగతా వారికన్నా ఎక్కువ సమానం అనుకుంటే తప్ప పరిస్ధితులు చక్కబడవు. తెలంగాణలో గతంలో వున్నట్లు పది జిల్లాలు కాదు. ఇప్పుడు 33 జిల్లాలు. అంటే వాటి పరిధి చాలా చిన్నది. గతంలో రెవిన్యూ డివిజన్‌ అంత కూడా ఇప్పుడు జిల్లాలు లేవు. అలాంటి జిల్లాల అధ్యక్షుల ఎంపిక కూడా అధిష్టానం నుంచి జరగాలంటే, ఇక్కడ సిఎంకు ప్రాధాన్యత ఎలా వుంటుంది. ఉమ్మడి రాష్ట్రంలోనే సిఎంలు సూచించిన వారికి జిల్లా అధ్యక్ష కార్యదర్శుల పదవులు ఇచ్చిన సందర్బాలున్నాయి. అప్పుడంటే ఉమ్మడి జిల్లాలు కావడంతో పార్లీ పరంగా కొంత పలుకుబడి వుండేది. ఇప్పుడు పార్టీ పదవుల వల్ల వచ్చేది లేదు. ఆ నాయకులు ఒరిగేది లేదు. అయినా ఆ పదవులకు అంత ప్రాదాన్యత కల్పిస్తూ, సిఎంను పదే పదే డిల్లీకి పిలిచి సంప్రదింపులు జరపాల్సిన పనిలేదు. ఇక్కడే సిఎం. వారి ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తే సరిపోతుంది. మంత్రుల అభిప్రాయాలు, వారి ప్రాదాన్యతలు తీసుకొని ఎంపిక ప్రక్రియ పూర్తి చేయొచ్చు. ఇప్పటికే డిల్లీ నుంచి ప్రతినిధులు, పరిశీలలకు వచ్చారు. వడపోత పోశారు. కొంత మంది పేర్లు వాళ్లే ఫైనల్‌ చేశారు. ఇక ప్రకటనే తరువాయి. కాని దానిపై కూడా సిఎం.కు స్వేచ్చ నివ్వకుండా మళ్లీ అధిష్టానం వద్ద వడపోతలు చేయడం అంటే రాష్ట్ర నాయకత్వాన్ని అవమానించడమే అవుతుంది. సిఎం. రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని తక్కువ చేయడమే అవుతుంది. పదేళ్ల తర్వాత, తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్‌ను ఏ నాయకుడు అధికారంలోకి తీసుకురాలేకపోయారు. అందరూ సమిష్టిగా పనిచేయలేకపోయారు. కాని సిఎం. రేవంత్‌ రెడ్డి పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం పడిన శ్రమలో చాల మంది నాయకులు పది శాతం కూడా పడలేదు. అలాంటి నాయకులు కూడా మంత్రులయ్యారు. ఇప్పుడు పాలనకు ఇబ్బందికరంగా మారుతున్నారు. ఒక్ససారి సిఎం. రేవంత్‌రెడ్డి తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శిస్తే, ఇప్పుడున్న అసమ్మతి మంత్రులంతా ఎందుకు దారిలోకి రారో చూడండి. ప్రభుత్వంపై ప్రజల్లో మంచి సంకేతాలు ఎందుకు వెళ్లవో గమనించండి. ప్రభుత్వానికి తలనొప్పులుగా మారుతున్న మంత్రులను పీకి పారేయండి. అంతే!!! దేవుడంటే భక్తి ఒక్కటే వుంటే సరిపోదు. భయం కూడా వుండాలి. సిఎం. అంటే మంత్రులకు భక్తి లేకపోయినా ఫరవాలేదు. భయం మాత్రం ఖచ్చితంగా వుండాలి. అప్పుడే పాలన గాడిలో సక్కగా నడిచేది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version