ఇక మీరు మారరు…మారకపోతే గెలవరు?

`ఇన్ని ఓటములెదురైనా బిఆర్‌ఎస్‌లో మార్పు రావడం లేదు

`నేటిధాత్రి పదే పదే హెచ్చరిస్తూనే వస్తోంది

`అనేక సార్లు గుర్తు చేస్తూనే వస్తోంది

`స్థానిక నాయకత్వాన్ని గుర్తించాలని సూచనలిస్తూనే వుంది

`ఇప్పటి వరకు క్షేత్ర స్థాయిలో నాయకత్వం లేదు

`60 లక్షల మంది కార్యకర్తలని గొప్పలు చెప్పుకుంటే సరిపోదు

`జూబ్లీ ఓటమితోనైనా మేలుకుంటేనే మేలు

`లేకుంటే బీఆర్‌ఎస్‌ అధోగతి పాలు

`భవిష్యత్తులో గెలుపులు చూడలేరు

`విజయాల దరికి కూడా చేరుకోలేరు

`పార్లమెంటు ఎన్నికలలో సున్నా చుట్టినా మార్పు రాలేదు

`ప్రచారార్భాటం తప్ప ప్రజల్లో బీఆర్‌ఎస్‌ నేతలు లేరు

`ఇప్పటికైనా నేల మీదకు దిగిరాకపోతే పార్టీ కోలుకోదు

`గులాబీ రేకులు రాలిపోక తప్పదు

`కేసీఆర్‌ బైటకు రాకపోతే పార్టీ నిలబడలేదు

`పార్టీలో ఆధిపత్యపోరు కొనసాగితే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు

`ఓడిన ప్రతిసారీ విశ్లేషించుకుంటామంటారు

`విశ్లేషించిన దాఖలాలు లేవు

`పదే పదే ఓటమి పాలుకాకుండా చూసుకుంటున్నది లేదు

`సిట్టింగ్‌ సీటును కూడా కాపాడుకోలేకపోయారు

`ఆరు నెలల నుంచి ప్రచారం చేస్తూనే వున్నారు

`మీడియాలో మాత్రమే కనిపిస్తున్నారు

`జనం మధ్యలోకి వెళ్లి ప్రచారం చేసిందేనాడు లేదు

`జిల్లాల నుండి నాయకులను తీసుకువచ్చి ప్రచారం చేయించారు

`జూబ్లీ హిల్స్‌లో వున్న నాయకులకు ప్రాధాన్యత ఇవ్వలేదు

`జూబ్లీ హిల్స్‌ నాయకులతో సంబంధాలు కొనసాగించింది లేదు

`బీఆర్‌ఎస్‌ స్వయంకృతాపరాధం ఎంత కాలం?

`ఇలా అయితే ఓడిపోవడమే ఎల్లకాలం!

హైదరాబాద్‌, నేటిధాత్రి:

అతివిశ్వాసం ఎక్కువైతే అసలుకే మోసం వస్తుందని, అధపాతాలమే దిక్కవుతుందని పెద్దలు ఊరికే అనలేదు. ఇప్పుడు బిఆర్‌ఎస్‌ను చూస్తే అర్ధమౌతోంది. ఎవరు నొచ్చుకున్నా, ఎవరు కాదనుకున్నా ఇదే నిజం. ప్రజలు చెబుతున్న నిజం. కార్యకర్తలు, నాయకులు చెప్పుకుంటున్న వాస్తవం. ఏ పార్టీ అయినా నిజంలో వున్నప్పుడే విజయం సిద్దిస్తుంది. నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు దూరంగా వుంటూ ఊహల్లో అగ్రనేతలుంటే ఫలితాలు జూబ్లీహిల్స్‌ లాగే వుంటాయి. బిఆర్‌ఎస్‌ నాయకులు అతి విశ్వాసమే జూబ్లీహిల్స్‌లో మరో సారి పార్టీ కొంప ముంచింది. బిఆర్‌ఎస్‌ పార్టీ మాగంటి గోపీనాద్‌ మరణం నాటి నుంచి ప్రచారంలోనే వుంది. కాని ప్రజల్లో లేదు. ఇది ఇప్పటికైనా కేసిఆర్‌, కేటిఆర్‌లు తెలుసుకోవాలి. పార్టీ శ్రేణుల అభిప్రాయాలు తెలుసుకోవాలి. సాదారణ ఎన్నికల్లో ఓడిపోయి నాటి నుంచి వరుసు ఓటమిలను చవిచూస్తున్నా బిఆర్‌ఎస్‌ అధినాయత్వం మేలుకోవడం లేదు. నేల మీదకు రావడం లేదు. ఎంత సేపు ప్రభుత్వ వైఫల్యాలే గెలిపిస్తాయనుకుంటే బిఆర్‌ఎస్‌కు మనుగడ వుండదు. ఇది గతంలో అనేక సార్లు రుజువైంది. కళ్లముందు అనేక గుణపాఠాలున్నా, ఇంకా బిఆర్‌ఎస్‌ పాఠాలు నేర్చుకోకపోతే విజయాలు కష్టం. ఓటములే ఎదురవడం ఖాయం. సాదారణ ఎన్నికల ముందు బిఆర్‌ఎస్‌ శ్రేయోభిలాషులు ఎంతో మంది చెప్పారు. కొంత మంది బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు చెప్పారు. వాళ్లకంటే ముందు నేటిదాత్రి పదే పదే చెబుతూనే వచ్చింది. ఒక రకంగా హెచ్చరిస్తూనే వచ్చింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న, అవినీతికి పాల్పడిన ఎమ్మెల్యేలను తప్పించకపోతే పార్టీ కోరికోరి ఓటమి తెచ్చుకున్నట్లౌవుందని చెప్పడం జరిగింది. సుమారు 30 మంది ఎమ్మెల్యేలను మార్చాలని వారి గురించి సమగ్రమైన వివరాలు కూడా నేటిదాత్రి అందించింది. కాని ఆ సూచనలు పూచికపుల్లగా భావించింది. ఓటమి కొని తెచ్చుకున్నది. ఇప్పుడు జూబ్లీహిల్స్‌ ఎన్నికల్లోనూ అదే తప్పు చేసింది. సానుభూతిని నమ్ముకొని నిండా మునిగింది. అన్ని సార్లు సానుభూతి పనిచేయదు. దుబ్బాకలో రామలింగారెడ్డి ఓటమిని చూసైనా కేసిఆర్‌ మారలేదు. ఆనాడు రామలింగారెడ్డి మరణం వల్ల సానుభూతి కన్నా, వరుస ఓటములు ఎదుర్కొన్న రఘునందన్‌ రావు వైపు ప్రజలు గెలిపించారు. జూబ్లీహిల్స్‌లో ఏం తొందరొచ్చిందని అందరికంటే ముందుగానే సునీతను ప్రకటించారు. అంత కొంపలు మునిగిపోయేంత తొందర ఎందుకు పడ్డారు. జూబ్లీహిల్స్‌లో గోపీనాధ్‌ చేసిన అరాచాలు లేవా? గోపీనాద్‌ చేసిన అక్రమాలు లేవా? ప్రజలు కూడా అదును చూసి, బిఆర్‌ఎస్‌కు మరోసారి పాఠం నేర్పారు. జూబ్లీహిల్స్‌ ప్రత్యర్ధి పార్టీ అభ్యర్ధిని పదే పదే రౌడీ రౌడీ అంటూ బిఆర్‌ఎస్‌ చేసిన ప్రచారం కూడా వికటించింది. ప్రభుత్వ వ్యతిరేకతను మాత్రమే పరిగణలోకి తీసుకొని బిఆర్‌ఎస్‌ ప్రచారం చేస్తూ వెళ్లింది. కాని గ్రౌండ్‌లో ప్రజల ఆలోచనలు ఎలా వున్నాయన్నది తెలుసుకోలేదు. గ్రౌండ్‌లో వుండే బిఆర్‌ఎస్‌ నాయకులను గుర్తించలేదు. వారి అభిప్రాయాలు తెలుసుకోలేదు. వారి సూచనలు తెలుసుకునే ప్రయత్నం అసలే చేయలేదు. ఎవరిని నమ్ముకున్నారు. ఆంద్రాకు చెందిన యూట్యూబ్‌ చానళ్లను నమ్ముకున్నారు. తెలంగాణకు చెంది, ఉద్యమ ప్రస్దానంలో వున్న వున్న బిఆర్‌ఎస్‌ అనుబంధ మీడియాను పక్కన పెట్టారు. క్షేత్ర స్దాయి పరిస్దితుల మీద పూర్తి పట్టున్న తెలంగాణ మీడియాను దూరం పెట్టుకున్నారు. పైపై ప్రచారాన్ని నమ్ముకొని నిండా మునిగారు. అటు మీడియా విషయంలోనూ తప్పటగులు వేసినట్లే, పోల్‌ మేనేజ్‌మెంటు అనుభవం వున్న నాయకులను రంగంలోకి దించలేదు. బిఆర్‌ఎస్‌లోవున్న ఎంతోమంది సీనియర్‌ నాయకులకు పక్కన పెట్టారు. అనేక ఎన్నికలు ఎదుర్కొని విజయం సాదించిన నాయకులకు దూరం పెట్టారు. పైగా జూబ్లీహిల్స్‌లో ప్రజలకు అందుబాటులోవుండి, ప్రజలకు నాడి తెలిసిన నాయకులకు బాద్యతలు అప్పగించలేదు. వారికి విలువే ఇవ్వలేదు. దాంతో బిఆర్‌ఎస్‌ ప్రజలకు దగ్గరకాలేకపోయింది. అయినా జూబ్లీ హిల్స్‌లో రైతు సమస్యలు ప్రస్తావిస్తే ఓట్లు రాలుతాయా? జూబ్లీహిల్స్‌లో ప్రజా సమస్యలను మీద స్పందిస్తే ఓట్లు రాలుతాయా? అన్నది గుర్తించలేకపోయారు. బాకీ కార్డు అని పట్టుకొని తిరిగారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హమీలను నమ్ముకొని ప్రచారం సాగించారు. ప్రభుత్వం ఇచ్చి, అమలు కాని హమీలను నమ్ముకున్నారు. ప్రజల్లో వాటిపై ఎక్కడా వ్యతిరేకత కనిపించడం లేదన్నది గుర్తించలేదు. పైగా అధికారంలో వున్న పార్టీ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వానికి అన్ని రకాల వనరులు వుంటాయి. ఈ మాత్రం బిఆర్‌ఎస్‌ గుర్తించలేదు. ఇంకా మూడేళ్లపాటు కాంగ్రెస్‌ అధికారంలో వుంటుంది. పైగా ఇప్పటికే రెండుసార్లు ఓడిపోయిన సానుభూతి కూడా నవీన్‌పై వుంటుందన్న ఆలోచన బిఆర్‌ఎస్‌ చేయలేదు. సునీత మీద వుండే సానుభూతి ఒక రకమైతే, నవీన్‌ మీద వున్న సానుభూతి మరో రకమైంది. కాంగ్రెస్‌ పార్టీ నవీన్‌ యాదవ్‌ ఎంపికతోనే సగం గెలిచినట్లైంది. ఎందుకంటే ఆ ప్రాంతంలో నవీన్‌ యాదవ్‌ బలమైన నాయకుడు. మాస్‌ లీడర్‌గా గుర్తింపు సంపాదించుకున్నాడు. బస్తీలలో మంచి గుర్తింపు వున్న నాయకుడు. స్దానికుడు. ప్రజలకు సుపరిచితుడు. పైగా తెలంగాణకు చెందిన నాయకుడు. అన్నింటికీ మించి బిసి నాయకుడు. బిసీల వాదం పోలరైజ్‌ అవుతున్న సమయంలో అగ్ర కులానికి చెందిన సునీతను రంగంలోకి దింపడమే బిఆర్‌ఎస్‌ చేసిన మొదటి తప్పు. బిసి నాయకుడిని రౌడీ, రౌడీ అంటూ పదే పదే ప్రజలకు నచ్చని పదాన్ని వాడడం రెండో తప్పు. బస్తీలలో ప్రజలకు బిఆర్‌ఎస్‌ దగ్గర కాకపోవడం మూడో తప్పు. క్షేత్ర స్ధాయిలో వున్న నాయకులకు ప్రచార బాద్యతలు అప్పగించకపోవడం నాలుగో తప్పు. ఆంధ్రాకు చెందిన వాళ్ల ఓట్లను నమ్ముకొని ముందుకెళ్లడం ఐదోతప్పు. ఆంద్రాకు చెందిన మీడియాను ఇంకా బిఆర్‌ఎస్‌ భుజాల మీద మోసుకుంటూ వెళ్లడం ఆరో తప్పు. సిఎం. రేవంత్‌ రెడ్డి రంగంలోకి దిగినప్పుడైనా, బిఆర్‌ఎస్‌ మొత్తం ప్రచారంలో పాలు పంచుకోకపోడం ఏడో తప్పు. అన్నింటికీ మించి కేసిఆర్‌ జూబ్లీ వైపు కన్నెత్తి చూడకపోవడం ఎనమిదోతప్పు. ఎందుకంటే కేసిఆర్‌ నివాసం జూబ్లీహిల్స్‌లోనే వుంటుంది. కేసిఆర్‌ ప్రచారంలోకి రాకపోయినా గెలుస్తామని అనుకోవడం తొమ్మిదోతప్పు. కేసిఆర్‌ వచ్చి ఓడిపోతే ఆ కాస్త పరువు పోతుందని భయపడడం పదో తప్పు. ఎంత పెద్ద నాయకుడైనా సరే ఎన్నిక చిన్నదైనా, పెద్దదైనా ప్రజల్లోకి రావాలి. ప్రచారం సాగించాలి. గెలవడం కోసం ఎంత పెద్ద నాయకుడైనా ఒక మెట్టు దిగాలి. ప్రదాన మంత్రి మోడీ రాష్ట్రాల ఎన్నికలవేళ ఎలా వుంటారో తెలుసుకోవాలి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు అసెంబ్లీ ఎన్నికకు ప్రచారం రాకపోవడం అధిపత్యాన్నే చూపిస్తుంది. జనాల మీద ప్రేమ కనిపించదు. అధికారంలోవున్నంత కాలం కేసిఆర్‌జనంలోకి రాలేదని, రావడం లేదనేదే ప్రధాన విమర్శ. ముఖ్యమంత్రిగా వున్న రేవంత్‌ రెడ్డి ఈ ఎన్నికను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. అభ్యర్ది ఎంపిక విషయంలోనూ తొందరపడలేదు. ఏడు రోజుల పాటు నిర్విరామంగా ప్రచారం సాగించారు. సుమారు 15 కార్నర్‌ మీటింగులు పెట్టారు. కష్టపడి పార్టీ అభ్యర్ధిని గెలిపించుకున్నారు. తన నాయకత్వాన్ని పదిలం చేసుకున్నారు. ఇదీ నాయకుడికి వుండాల్సిన ప్రధాన లక్షణం. అంతే కాని చట్ట సభకు ఎన్నికయ్యే ఎమ్మెల్యే ఎన్నికకంటే పెద్ద ఎన్నిక ఏముంటుంది? బిఆర్‌ఎస్‌ పార్టీ అగ్ర నాయకులు దృష్టిలో అసెంబ్లీ ఎన్నిక చాలా చిన్నదిగా కనిపిస్తోందా? ఓడిపోయినా, ఇంకా అధికారంలోనే వున్నామన్న భ్రమల్లోనే వున్నారా? పార్లమెంటు ఎన్నికల ముందు రైతులు ఆగమైపోతున్నారని కేసిఆర్‌ కాలుకు బలపంకట్టుకొని తిరిగినా జనం ఎందుకు కనికరించలేదు. ఒక్కసీటులోనైనా ఎందుకు గెలిపించలేదన్నదానిపై ఇప్పటికీ అధ్యయనం చేయలేదు. సాదారణ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్టీ నాయకులంతో చర్చింది లేదు. ఎందుకు ఓడిపోయామన్నదానిపై అంతర్మధనం లేదు. అలవి కాని హమీలిచ్చి కాంగ్రెస్‌ గెలిచిందని మాట్లాడుకుంటే సరిపోతుందా? రాజకీయ పార్టీ రాజకీయమే చేస్తుంది అని కేసిఆర్‌ చెప్పిన మాటే ఆయనే మర్చిపోయారా? గెలవడానికి రాజకీయ పార్టీ అనేక మార్గాలను ఎంచుకుంటుంది? ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకుంటే 2104లో ఇచ్చిన హమీలన్నీ బిఆర్‌ఎస్‌ అమలు చేసిందా? ఇస్తామన్న ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిందా? దళితులకు మూడెకరాలు ఇవ్వడం సాధ్యం కాదని చేతులేత్తేయలేదా? కాంగ్రెస్‌ ఇప్పుడు అదే చేస్తోంది. ఇప్పటికైనా సరే కాంగ్రెస్‌ తప్పులను ఎత్తి చూపడం కాదు. బిఆర్‌ఎస్‌లో వున్న లోపాలను సరిదిద్దుకోవాలి. అంతర్గత కలహాలు పక్కన పెట్టుకోవాలి. పార్టీ నాయకులను గ్రూపులుగా విడదీయం మానుకోవాలి. పార్టీని క్షేత్ర స్దాయిలో పునాదులు నిర్మాణం చేసుకోవాలి. జేజేలు కొట్టేవారే కాదు, ఓట్లు వేసేవారిని సంపాదించుకోవాలి.

’’మిల్లర్లకు’’ పిల్లర్‌ ‘‘సందీప్‌’’!

`’’మంత్రివర్య’’ ఈ ‘‘దోపిడీ చూడండి’’..ఎపిసోడ్‌-5

`మిల్లర్‌ సందీప్‌..ఇద్దరు అవినీతి అధికారులు ఫినిష్‌!?

`అవినీతి ‘‘డీఎం,టెక్నికల్‌ అసిస్టెంట్‌’’లను పట్టించిన మొనగాడు!

`దగాకోరులను దర్జాగ పట్టించిన ‘‘మిస్టర్‌ మిల్లర్‌’’ భారతీయుడు!

`వేధించిన అధికారులకు కటకటాలు చూపించాడు.

`అధికారుల అవినీతిలో భాగం కాలేక సందీప్‌ చేసిన ధైర్యం.ఇతర మిల్లర్‌కు ఆదర్శం.

`ట్రక్‌ షీట్ల మోసాలు..డిటిలకు లక్షలు!

`మిల్లర్లను బెదిరించి ట్రక్‌ షీట్లు అంటగడుతున్న అధికారులు!

`ట్రక్‌ షీట్లు వద్దన్న పాపానికి మిల్లర్‌ సందీప్‌కు వేధింపులు!

`నిజాయితీ వ్యాపారస్తులను చెడగొడుతున్న అధికారులు.

`అధికారుల అడ్డగోలు సంపాదనకు బలౌతున్న మిల్లర్లు.

`‘డిటి’’ల అక్రమ సంపాదన కోసం బలౌతున్న మిల్లర్లు.

`ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక డిటిల కోసం ట్రక్‌ షీట్లు తీసుకుంటున్న మిల్లర్లు!

`రాష్ట్ర వ్యాప్తంగా అధికారుల లంచాలకు సాక్ష్యాలు!

`లంచం ఇవ్వను..ట్రక్‌ షీట్లు తీసుకోను అన్నందుకు సందీప్‌కు ముప్పు తిప్పలు.

`మూడు నెలలుగా సందీప్‌కు రకరకాల వేధింపులు!

`అర్థరాత్రి విజిలెన్స్‌ ఎంక్వౌరీ పేరుతో డిటిల తనఖీలు.

`మిల్లర్‌ సొంత బియ్యాన్ని పిడిఎస్‌ బియ్యంగా కేసులు.

`సందీప్‌కు చెందిన ప్రైవేటు బియ్యం పోలీసు స్టేషనుకు తరలింపు.

`‘‘డిటి’’లకు వంత పాడుతున్న ‘‘జేసి’’?

`కలెక్టర్‌ ఆదేశాలను కూడా లెక్క చేయని ‘‘జేసి’’?

??హైకోర్టు తీర్పును కూడా పట్టించుకోకుండా వేధింపులు???

`ఆఖరుకు ‘‘డీఎం’’నీ ఏసిబికి పట్టించిన సందీప్‌!

`నిజాయితీ మిల్లర్‌ను చెడగొడుతున్న అధికారులు!

`ఖజానాకు కాపలా వుండాల్సిన అధికారులు.సివిల్‌ సప్లయ్‌ని లూటీ చేస్తున్నారు?

`మిల్లర్లతో దందాలు చేయించి కోట్లు దండుకుంటున్నారు.

`గోడౌన్లలలో ఎలుకలను మించిన పందికొక్కులౌతున్నారు?

`సివిల్‌ సప్లయ్‌ బొక్కసానికి బొరియలు చేస్తున్నారు!

 

హైదరాబాద్‌, నేటిధాత్రి:                                            

ఒక వ్యక్తి చేసే ధైర్యం వ్యవస్దనే నిలబెడుతుంది. ఆ సమాజాన్ని కాపాడుతుందని చెప్పడంలో సందేహం లేదు. ఎంత కాలం ఈ అవినీతి అక్రమాలు అనుకున్నప్పుడు ఒక్కరు ప్రశ్నించడం మొదలుపెడతారు. ఎంత కాలం దౌర్జన్యాలు అనుకున్నప్పుడు ఒక్కడు నిలబడతాడు. ఎదిరిస్తాడు. అన్యాయాన్ని నిలదీస్తాడు. అక్రమాలను ఎదుర్కొంటాడు. సరిగ్గా ఆసిఫాబాద్‌కు చెందిన మిల్లర్‌ సందీప్‌ అదే చేశారు. తనకు జరుగుతున్న అన్యాయాన్ని అనేక సార్లు గళమెత్తాడు. కాని ఎవరూ వినిపించుకోలేదు. పట్టించుకోలేదు. అందుకే నిలదీస్తే తప్ప ఎదిరించలేమనుకున్నాడు. అవినీతి పరులను పట్టిస్తే గాని సమజానికి మేలు జరగదనుకున్నాడు. ధైర్యం చేశాడు. ఎంతోమందికి ఆదర్శమయ్యాడు. ఇప్పటికీ తాను మరిన్ని సమస్యలు ఎదర్కొవాల్సి వస్తుందని తెలుసు. అయినా తన కోసం కాకుండా, తన వ్యవస్ధ కోసం, తోటి వారి కోసం తాను ఒక్క అడుగు వేస్తే ఎంతోమందికి మేలు జరుగుతందనుకున్నాడు. వ్యవస్దలో చీడపురుగులను ఏరి వేయాలనకున్నాడు. ఇప్పుడు తెలంగాణలోని మిల్లర్లందరికీ సందీప్‌ పిల్లర్‌గా మారిపోయాడు. ఇంత కాలం అదికారుల వేధింపులు మిల్లర్లు అనుభిస్తున్నారు. కాని ఎదిరించేందుకు ఎవరూ ధైర్యం చేయలేదు. అవినీతికి అలవాడు పడిన అదికారులకు లొంగిపోతున్నారు. తలెత్తుకు బతకాలంటే నిజాయితీగా వుండాలన్న ఆలోచన వున్న మిల్లర్‌ సందీప్‌ మాత్రం సివిల్‌ సప్లయ్‌ శాఖకు చెందిన జిల్లా డిటిల మాటలు వినలేదు. అవినీతికి పాల్పడడానికి ఇష్టపడలేదు. అలాంటి సొమ్ము నాకు వద్దనకున్నాడు. డిటిలకు లంచాలు ఇవ్వడానికి నిరాకరించారు. అవినీతి పరులైన ఇద్దరు సివిల్‌ సప్లయ్‌ చెందిన అదికారులను పట్టించాడు. ఏసిబి చేత రెడ్‌ హాండెడ్‌గా పట్టుకునేలా చేశాడు. దర్జాగా వాళ్లేదే మిల్లర్‌ సందీప్‌ వద్ద దాచుకున్న సొమ్ములాగా లక్షలు కావాలంటే ఇస్తే స్తోమత మిల్లర్‌ వద్ద లేదు. అవినీతి పరుడు సందీప్‌ అసలే కాదు. అలాంటి వ్యక్తిని వేదిస్తే ఎలా వుంటుందో కూడా ఆ అదికారులకు చూపించారు. అదికారుల అవినీతిలో బాగం కాలేక సందీప్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇతర మిల్లర్లకు ధైర్యం నింపారు. అయితే సివిల్‌ సప్లయ్‌శాఖలో ట్రక్‌ షీట్ల దందా అనేది అదికారులు సృష్టించుకున్న అవినీతి సమ్రాజ్యంలో ఒక భాగం. శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలన్నట్లు లొసుగులను ఆసరా చేసుకొని అవినీతికి పాల్పడడం అలవాటు చేసుకున్నారు. మిల్లర్లకు వడ్లు కేటాంచి , ట్రక్‌ షీట్లు జారీ చేయాల్సి వుంటుంది. కాని తెలంగానలోని అన్ని జిల్లాల్లో డిటీలు మిల్లర్ల్‌కు వడ్లు కేటాయించకుండానే ట్రక్‌ షీట్లు జారీ చేస్తున్నట్లు సమాచారం. ఇది ఒక్క ఆసిఫాబాద్‌ జిల్లాకే పరిమితం కాదు. అన్ని జిల్లాలలోనూ ఇదే సాగుతోంది. ప్రభుత్వ సొమ్ముకు కన్నం పడుతూనే వుంది. మిల్లర్లు రైతులకు డబ్బులు చెల్లించేందుకు అవసరమైన సొమ్ము కోసం అదికారులు ట్రక్‌ షీట్లు జారీ చేస్తారు. దాంతో మిల్లర్లు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొని మళ్లీ వాటిని బ్యాంకులకు చెల్లిస్తుంటారు. అయితే ఎలాంటి వడ్లు లేకపోయినా, ట్రక్‌షీట్లు జారీ చేస్తాం. మేం అడినంత ఇవ్వాలని మిల్లర్లకు డిటీలు సూచిస్తారు. కొంత మంది మిల్లర్లు తమ అవసరాల కోసం అలా ట్రక్‌షీట్లు తీసుకుంటారు. బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకుంటారు. తర్వాత మళ్లీ మిల్లర్లు ఆ సొమ్మును బ్యాంకుకు చెల్లిస్తారు. కాని అందుకు సివిల్‌సప్లయ్‌ అధికారులకు లక్షల రూపాయలు మిల్లర్లు చెల్లిస్తుంటారు. ఇలా ట్రక్‌ షీట్లు ఇస్తామని, తమకు అడినంత ఇవ్వాలని ఆసిఫాబాద్‌కు చెందిన ఇద్దరు డిటీలు మిల్లర్‌ సందీప్‌కు సూచించారు. దానికి మిల్లర్‌ సందీప్‌ ససేమిరా? అన్నాడు. తనకు ట్రక్‌ షీట్లు అవసరం లేదన్నాడు. ఇప్పుడు బ్యాంకుల నుంచి డబ్బు తెచ్చుకోవాల్సిన అత్యవసర సమస్యలు లేవని చెప్పాడు. అయినా డిటీలు కొంత కాలంగా మిల్లర్‌ సందీప్‌ను వేదిస్తూ వస్తున్నారు. ఇలా ఎంత చెప్పినా సందీప్‌ వినిపించకోకపోవడంతో ఆయనపై కక్ష కట్టారు. మిల్లు మీద విజిలెన్స్‌ అధికారుల చేత దాడులు చేయిస్తామంటూ హెచ్చరిస్తూ వస్తున్నారు. ఒక్కసారి లంచం ఇవ్వడం మొదలు పెడితే అది జీవితాంతం ఉచ్చులా మారుతందనేది సందీప్‌ అభిప్రాయం. అందులోనూ వడ్లు లేకుండా ట్రక్‌ షీట్లు తీసుకోవడం నేరం. ఎప్పటికైనా ఇబ్బందికరం. అదికారులు తప్పించుకుంటారు. మిల్లర్లే ఇరుక్కుంటారు. ఒక్కసారి దొంగ ట్రక్‌ షీట్లు ఇచ్చి సహాయపడినట్లు నటించినా, దాన్ని అడ్డం పెట్టుకొని ఎల్లకాలం అదికారులు వేదిస్తారు. లంచాలు కావాలంటారు. లేకుంటే ట్రక్‌షీట్ల బాగోతం తెరమీదకు తెస్తారు. అందుకే అలాంటి అలాంటి పరిస్దితి తెచ్చుకోవద్దని సందీప్‌ గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు. అధికారులకు ఇగో హర్ట్‌ అయ్యింది. తాము చెప్పింది చేయడం లేదన్న ఆక్రోశం సందీప్‌ మీద పెరిగింది. ఎలాగైనా సందీప్‌ను వేదించాలని నిర్ణయం తీసుకున్నారు. అడుగడుగునా అడ్డుకోవాలని చూస్తున్నారు. ఇబ్బందులకు గురి చేస్తున్నారు. విజిలెన్స్‌ ఎంక్వౌరీ పేరుతో అర్ధరాత్రి ఇద్దరు డిటీలు మిల్లుకు వచ్చారు. నిజానికి విజిలెన్స్‌ ఎంక్వౌరీ జరిగితే ఆ అదికారులు రావాలి. కాని వాళ్వెరు లేకుండా ఇద్దరు డిటీలు అర్దరాత్రి మిల్లును తనిఖీ చేయడానికి వచ్చి తప్పుడు లెక్కలు రాశారు. లేని పోనివన్నీ తమ నివేదికలో రాశారు. అసలు సంబంధం లేని బియ్యాన్ని సీజ్‌ చేశారు. పిడిఎస్‌ బియ్యమని నమ్మించే ప్రయత్నం చేశారు. తన సొంత బియ్యాన్ని తరలించుకుపోయారు. అంటే అదికారులు తలుచుకుంటే మిల్లర్లను ఈ విధంగా కూడా ఇబ్బందుల పాలు చేయొచ్చని నిరూపించారు. ఇలా మిల్లర్లను తమ చేతుల్లో పెట్టుకొని ఆడిరచడం అలవాటు చేసుకున్నారు. వేదించడం నేర్చుకున్నారు. లంచం ఇవ్వను, ట్రక్‌ షీట్లు తీసుకోనే అన్నందుకు మూడు నెలలుగా వేదింపులకు గురి చేస్తూ వస్తున్నారు. డిటీలు తమను వేదిస్తున్నారంటూ సందీప్‌ ఏకంగా జేసికి పిర్యాధు చేశారు. కాని జేసి కూడా డిటీలకు సపోర్టు చేశారు. తర్వాత కలెక్టర్‌కు పిర్యాధు చేశాడు. ఆసిఫాబాద్‌ కలెక్టర్‌ జేసిని నివేదిక కోరారు. అయినా జేసి, కలెక్టర్‌ ఆదేశాలను కూడా లెక్క చేయడం లేదు. దాంతో సందీప్‌ కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు నుంచి తనుకు అనుకూలంగా వచ్చిన తీర్పు కాపీని చూపించాడు. హైకోర్టు తీర్పును కూడా అటు డిటీలు, ఇటు జేసి ఖాతరు చేయలేదు. పైగా వేదింపులు ఎక్కువ చేశారు. ఖజానాకు కాపలా వుండాల్సిన అధికారులు బొక్కసానికి బొక్క పెడుతున్నారు. ప్రభుత్వ సొమ్మును మింగుతున్నారు. నిజాయితీగా వున్న వ్యాపారులకు అధికారులే చెడగొడుతున్నారు. వ్యాపారులు తప్పు చేసేందుకు అవకాశమిస్తున్నారు. అవకాశ వాదులుగా వ్యాపారులను గుప్పిట్లో పెట్టుకొని వేదించుకు తింటున్నారు. మూడేళ్లుగా ట్రాన్స్‌ఫర్లు లేకుండా ఆసిఫాబాద్‌లోనే తిష్టవేసుకొని వున్నారు. మిల్లర్లకు నరకం చూపిస్తున్నారు. ఊ అంటే లంచం..ఆ అంటే లంచం అన్నట్లు దోచుకుతింటున్నారు. ఇక విసిగిపోయిన మిల్లర్‌ సందీప్‌ ఏసిబి అదికారులకు పిర్యాదు చేశారు. పిడిఎస్‌ బియ్యం గోడౌన్‌కు చేర్చాలంటే లారీకి రూ.25వేలు ఇవ్వాలని డిఎం. నర్సింహారావు డిమాండ్‌ చేశారు. అలా మూడు లారీలకు రూ. 75వేలు ఇవ్వాలంటూ డిమాండ్‌ చేస్తూ వచ్చారు. దాంతో డిఎం.ను మిల్లర్‌ సందీప్‌ నగదు చెల్లించేలా వల వేసి ఏసిబి అధికారులు పట్టుకున్నారు. కటకటాలకు పంపించారు. అధికారులే దగ్గరుండి మిల్లర్ల చేత తప్పులు చేయిస్తున్నారు. సివిల్‌ సప్లయ్‌ని లూటీ చేస్తున్నారు. ప్రభుత్వాన్ని నిండా ముంచేస్తున్నారు. మిల్లర్ల చేత దందాలు చేయించి కోట్లు దండుకుంటున్నారు. ఇది ఒక్క ఆసిఫాబాద్‌లోనే కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఇదే జరుగుతోంది. ఇక్కడ మరో ట్విస్టేమిటంటే ఈ వ్యవహారంలో ఎలాంటి సంబంధం లేని తహసిల్ధార్‌కు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ నోటీసులు జారీ చేశారు. అంటే ఒక తప్పును కప్పిపుచ్చుకునేందుకు తప్పు మీద తప్పు అధికారులు ఎలా చేస్తారో ఈ వ్యవహారంతోఅర్ధం చేసుకోవచ్చు. ఈ అక్రమాలన్నీ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాల్సి వుంది. ముఖ్యంగా సివిల్‌సప్లయ్‌శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కమీషనర్‌కు తెలియాల్సిన అవసరం వుంది. ఇలా అధికారుల ఆగడాల మూలంగా మిల్లర్లు ఇబ్బందులు పాలౌతున్నారు. ట్రక్‌ షీట్లపేరుతో అధికారులు లక్షలు కూడబెట్టుకుంటున్నారు. ఇటు మిల్లర్లను వేదిస్తూ సంపాదిస్తున్నారు. అటు మిల్లర్ల చేత తప్పులు దగ్గరుండి చేయిస్తూ లక్షలు లంచాలు తీసుకుంటున్నారు. ఇది మారాలంటే అందరూ సందీప్‌ లాంటి వారు కాలేరు. అందువల్ల ప్రభుత్వమే దృష్టి సారించాలి. జరుగుతున్న అవినీతిని అరికట్టాలి. అవినీతి సాగిస్తున్న అధికారులను ఇంటికి పంపించాలి. అప్పుడే సివిల్‌ సప్లైశాఖ బాగు పడుతుంది.

అన్ని వైపులా వేదింపులే…మిల్లర్లకు మిగిలేది నరకమే?

`మిల్లర్ల పాలిట శాపంగా మారుతున్న అధికారులు!

`సరిగ్గా వడ్లు వచ్చే సమయానికి సమస్యలు సృష్టిస్తారు?

`అదును చూసి కేసులు రాస్తామని బెదిరిస్తారు!

`చిన్న చిన్న మిల్లర్ల మీద తమ ప్రతాపం చూపిస్తారు.

`మిల్లర్లను వేదించుకు తింటారు.

`తాజాగా జరిగిన కొన్ని సంఘటనలే సాక్ష్యాలు!

`ఆసిఫాబాద్‌ లో రెడ్‌ హాండెడ్‌గా ఏసిబికి చిక్కిన ఉదంతాలు.

`మిల్లర్లను వేధించడమే పనిగా పెట్టుకున్న అధికారులు.

`ఒకప్పుడు సివిల్‌ సప్లయ్‌ శాఖ అంటే ఒట్టిపోయిన ఆవు వంటిది.

`ఇప్పుడు అధికారులకు కావాల్సినంత పాడిగా మారిపోయింది.

`అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది.

`ఏళ్ల తరబడి ట్రాన్స్‌ఫర్లు కూడా లేకుండా పోయింది.

`రెవెన్యూ శాఖ నుంచి సివిల్‌ సప్లై శాఖకు డిప్యూటేషన్‌ పై వచ్చిన అవినీతి అధికారులకు సివిల్‌ సప్లై శాఖ వరంగా మారింది

`ఆసిఫాబాద్‌ లో అధికారుల ఒత్తిళ్లు భరించలేక ఓ మిల్లర్ల ఏసిబిని ఆశ్రయించారు?

`అయినా అధికారులు మారుతారన్న గ్యారెంటీ లేదు.

`ఇతర అధికారులు ఆ మిల్లర్‌కు సహకరిస్తారన్న నమ్మకం లేదు.

`ఆ మిల్లర్‌ వ్యాపారం సజావుగా సాగుతుందనే విశ్వాసం వుండదు.

`మరో జిల్లాలో బంగారం అమ్మి మరీ అధికారులకు లంచం ఇచ్చిన సందర్భం వుంది?

`అన్ని జిల్లాలలో ఇవే పరిస్థితులు దాపురించాయి.

`మిల్లర్లకు కష్టాలు మిగిల్చుతున్నాయి.

`కొందరి మిల్లర్ల జీవితాలు దినదిన గండంగా మారుతున్నాయి.

`మింగలేక, కక్కలేక మిల్లర్లు మధనపడుతున్నారు!

`ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలు ఎగ్గొట్టి వందల కోట్లతో కొత్త మిల్లులు నిర్మిస్తున్న రాష్ట్ర నాయకుల జోలికి ఈ అవినీతి అధికారులు వెళ్లారు?

`వందల కోట్ల బకాయిలున్న వారి జోలికి అధికారులు పోరు!

`చిన్న చిన్న మిల్లర్లను అధికారులు బతకనివ్వరు.

`ఇక వరుసగా సివిల్‌ సప్లై లోని అధికారుల అవినీతి బాగోతాలు మీ

‘‘నేటిధాత్రి’’లో

విసిగించడం, వేదించడం, లంచాలు తీసుకోవడం అధికారులకు రివాజు. సర్ధుకుపోవడం, అడిగింత ముట్టజేప్పడం ప్రజలకు అలవాటుగా మారింది. ఇక కొన్ని శాఖల్లో ఎన్ని లంచాలు తీసుకున్నా అదికారుల దాహంతీరదు. అధికారులు ఎప్పుడంటే అప్పుడు లంచాలు ఇవ్వక కొంత మంది వ్యాపారులకు తప్పదు. ఇదేం చట్ట బద్దం కాదు. అయినా వ్యాపారులకు తప్పదు. తప్పు చేయకుండా వ్యాపారులు లంచాలు ఎందుకిస్తారు? అనే ప్రశ్న కూడా సమాజంలో వుంది. కాని కొన్నిసార్లు ఎంత నిజాయితీగా వ్యాపారం సాగించినా అధికారుల జేబులు నింపకుండా వుండలేని పరిస్ధితులు మన సమాజంలోనే వున్నాయి. అవే అధికారులకు వరంగా మారుతోంది. అలా తెలంగాణలో అవినీతి ఊడల మర్రిలా మారిపోయింది.. మర్రి చెట్టుకున్న ఊడలెన్ని నరికేసినా, మళ్లీ ఊడలు ఎలా పుట్టుకొస్తాయో…అవినీతి అదికారులు కూడా అలాగే పెరిగిపోతున్నారు. ఎంత మందిని పట్టుకున్నా అవినీతి ఒక్క శాతం కూడా తగ్గడంలేదు. ఇది ప్రజల దౌర్భాగ్యం. అలాంటి శాఖలో సివిల్‌ సప్లయ్‌ చేరిపోయింది. లంచాలను విపరీతంగా దండుకుంటోంది. ఒకప్పుడు సివిల్‌ సప్లయ్‌ శాఖలో పనిచేయాలంటే అధికారులకు నచ్చేదికాదు. పైసా లాభం వుండదని అనుకునే వారు. జీతం తప్ప చాల నీళ్లకు కూడా రూపాయి రాదని దిగులు పడుతుండేవారు. కాని ఇప్పుడు సివిల్‌ సప్లయ్‌ శాఖలో చిన్న కొలువు వస్తే చాలు. జీతం ఇవ్వకున్నా పరవాలేదు? అన్నట్లుగా మారిపోయింది. సివిల్‌ సప్లయ్‌శాఖలో పనిచేసే కింది స్దాయి అధికారి దగ్గర నుంచి పై స్దాయిదాకా పైసలే పైసలు. లంచాలే లంచాలు. అవి వేలల్లో కాదు. లక్షల్లో దండుకుంటున్నారు. అదికారులు కోట్లు కూడబెట్టుకుంటున్నారు. మిల్లులు నడిపే వ్యాపారుల కన్నా, ఆ శాఖలో పనిచేసే అదికారులే ఎక్కువ సంపాదిస్తున్నారని కూడా అందరూ అనుకుంటున్నారు. ఒకప్పుడు తెలంగాణ వ్యవసాయ రంగంలో ఒట్టిపోయిన ఆవులా వుండేది. ఆ శాఖ నిర్వహణే కష్టమనేలా వుండేది. ఇప్పుడు పాడి ఆవులా మారింది. తెలంగాణ వచ్చిన తర్వాత గణనీయంగా సాగు ఉత్పత్తి పెరిగింది. పదేళ్ల కాలంలో దేశానికే అన్నం పెట్టే స్దాయికి తెలంగాణ ఎదిగింది. ఇంకేముంది. అదికారుల చూపంతా సివిల్‌ సప్లయ్‌ శాఖపై పడిరది. ఆ శాఖలో అదికారుల కొరత రెవిన్యూ శాఖ అధికారులకు వరంగా మారింది. రెవిన్యూ శాఖ నుంచి పెద్ద సంఖ్యలో అదికారులు సివిల్‌ సప్లయ్‌ శాఖకు వలస వెళ్లారు. ఒకప్పుడు రెవిన్యూశాఖలో చన్ని చిన్న సర్టిఫికెట్లకు కూడా లంచం తీసుకునే అలవాటు వుండేది. ఇప్పుడు కళ్ల ముందు వేల కోట్ల రూపాయల వ్యాపారం కనిపిస్తోంది. లక్షల టన్నుల వడ్లు సాగుతౌతున్నాయి. ఒక్క సారి వచ్చే పంట దిగుబడి కోటి అవరై లక్షలుగా నమోదౌతోంది. పెద్దఎత్తున మిల్లుల ఏర్పాటైంది. ప్రభుత్వమే నేరుగా వడ్లు కొనుగోలు చేసి, మిల్లర్లకు అప్పగించడం అనేది అదికారులకు పంట పండిస్తోంది. దాంతో రైతు నుంచి వడ్లు సేకరించే దగ్గర నుంచి అధికారులకు లంచాలు అందుతున్నాయి. మిల్లులనుంచి ఆఖరుకు సివిల్‌ సప్లయ్‌ శాఖ గోడౌన్లకు బియ్యం చేర్చడానికికూడా అదికారులు అడిగినంత ముట్టజెప్పాల్సి వస్తోంది. తాగాజా ఆఫిషాబాద్‌ జిల్లాలో జరిగిన సంఘటన అందకు సాక్ష్యంగా నిలుస్తోంది.. ఆసిఫాబాద్‌ జిల్లాలో ఓ రైస్‌ మిల్లర్‌ పిడిఎస్‌ బియ్యాన్ని ప్రభుత్వ గోడౌన్‌కు చేరవేస్తున్న సందర్భంలో జిల్లాకు చెందిన సివిల్‌సప్లయ్‌ డిఎం. నర్సింగరావు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. లారీకి ఇరవై వేల చొప్పును మూడు లారీలకు కలిపి, రూ.75వేలు లంచం తీసుకుంటుంటే ఏసిబి అధికారులు పట్టుకున్నారు. ఇంత వరకు బాగానే వుంది. ఇకపై అధికారులు తమ తీరు మార్చుకుంటారా? అంటే మారరు. అలా మారేదే వుంటే ఇంత మంది అవినీతి అదికారులు పట్టుబడుతున్నా ఎవరూ భయపడడం లేదు? లంచాలు తీసుకోవడం ఆపడం లేదు. పట్టుబడేవారు పట్టుబడుతూనే వున్నారు. లంచాలు తీసుకునే వారు తీసుకుంటూనే వున్నారు. అదే ఆసిఫాబాద్‌ జిల్లా మిల్లర్‌కు రేపటి నుంచి అధికారులు సహకరిస్తారా? అనే ప్రశ్నకు ఎవరు సమాదానం చెప్పాలి. తోటి అధికారిని పట్టించినందుకు మిగతా అధికారులు ఎప్పుడూ నిఘా వేసి వుంచుతారు? పైగా వడ్ల కేటాయింపుల్లో ఇబ్బందులు సృష్టిస్తుంటారు. ఆ మిల్లర్‌కు భవిష్యత్తులో మూడు చెరువుల నీళ్లు తాగిస్తారు? మిల్లర్లు తెగించకపోతే ఒక సమస్య. తెగిస్తే మరో సమస్యగా మారింది? ఇలాంటి లంచాల వాతావరణంలో ఏ రైస్‌ మిల్లర్‌ సంతోషంగా లేడన్నది తేలిపోతోంది. రైస్‌ మిల్లర్లు ఎలాంటి మోసం చేయకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అదికారులు, లంచాలు తీసుకుంటూ ప్రభుత్వాన్ని నిండా ముంచుతున్నారు. అంతే కాకుండా మిల్లర్లు కూడా అధికారుల వేధింపులను తట్టుకోలేకపోతున్నారు. దాంతోవాళ్లు కూడా విసిగిపోయి, ఏసిబిని ఆశ్రయించాల్సి వస్తుందంటే పరిస్దితులు ఎంత దుర్భరంగా మారుతున్నాయో అర్దం చేసుకోవచ్చు. ఇలా మిల్లర్లు అన్ని వైపులా వేదింపులే ఎదుర్కొంటున్నారు. అధికారుల జేబులు నింపుకుంటూ వ్యాపారాలు సాగిస్తున్నారు. సరిగ్గా వడ్లు వచ్చే సమయానికి మిల్లుల మీద దాడులు మొదలు పెడతారు. మిల్లర్లను బెదిరిస్తుంటారు. ఏదో ఒక చిన్న సాకు చూపించి పెద్ద పెద్ద కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తుంటారు. లక్షలకు లక్షలు వసూలు చేస్తుంటారు. దాంతో మిల్లర్లు బతకలేకపోతున్నారు. మిల్లర్లు మొత్తం ప్రభుత్వం నుంచే వడ్లు సేకరిస్తే వారికి పెద్దగా ఒరిగేదేమీ వుండదు. కొంత మంది రైతులు నేరుగా మిల్లర్లకే అమ్ముతుంటారు. అలా కొనుగోలు చేసిన వడ్లను బియ్యంగా మార్చి మిల్లర్లు అమ్ముకుంటేనే వారికి లాభాలు వస్తాయి. మొత్తం ప్రభుత్వ వడ్లనే బియ్యంగా మార్చితే మిల్లర్లు పెద్దగా లాభాల పొందే అవకాశం లేదు. ఇదే అధికారులకు వరంగా మారుతోంది. మిల్లర్లను నిండా ముంచేస్తోంది. మిల్లర్లు తమ ఆదాయం కన్నా, ఎక్కవ లంచాలే చెల్లించాల్సిన పరిస్దితులు కూడా ఎదురౌతున్నాయని మిల్లర్లు వాపోతున్నారు. అటు సరిగ్గా వడ్లు కొనుగోలు చేసే సమయంలోనే మిల్లర్లకు ఖర్చు వుంటుంది. ఆ సమయంలో అటు రైతుల కోసం అప్పులు చేసి చెల్లింస్తుంటారు. అటు అప్పులు చేసి మిల్లర్లు వ్యాపారం చేస్తుంటే అధికారులు దోడిపీ మొదలు పెడతారు. దాంతో మిల్లర్లు వ్యాపారం వదుకునేందుకు కూడా కొందరు సిద్దపడుతున్నారు. ఇటీవల ఓ జిల్లాలో అధికారుల వేధింపులకు ఓ మిల్లర్‌ ఇంట్లో వున్న బంగారం అమ్మి మరీ అధికారులకు లంచాలు ఇవ్వాల్సిన పరిస్దితి ఎదురైందని తెలుస్తోంది. లేకుంటే మిల్లు సీజ్‌చేస్తాం? కేసులు నమోదు చేస్తాం? మొత్తం వ్యాపారం మూసేస్తాం? అంటూ బెదిరిస్తారు. లేని కేసులు నమోదు చేస్తారు? వేధిస్తారు. వాటికన్నా బంగారం అమ్ముకొని డబ్బులు ఇవ్వాల్సిన పరిస్దితులు ఎదరౌతున్నాయని మిల్లర్లు దుఖపడుతున్నారు. మరో జిల్లాలో అసలు లేని లెక్కలు ముందు వేసి లంచాలు అడిగిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం మంజూరు చేయని వడ్లను కోట్లలో చూపించి, మిల్లర్‌ను అదికారులు బెదిరిస్తున్నారు. వర్షం పడే సమయానికి, మబ్బులు పడుతున్న సమయం చూసి మిల్లుల తనిఖీలకు అధికారులు వెళ్తున్నారు. వర్షానికి తడవకుండా వున్న వడ్ల వస్తాలపై కప్పిని టార్పాలిన్‌ను తొలగించి వర్షంలోనే లెక్కలు చూస్తామంటారు. దాంతో మిల్లర్లు ఆందోళన వ్వక్తం చేస్తున్నారు. ఒక్కసారి ఎండిన వడ్లు మళ్లీ తడిస్తే ఎంత కష్టమో, నష్టమో మిల్లర్లకు తెలుసు. వాటిని మళ్లీ ఆరబెట్టినా ఫలితం వుండదు. ఎండ కాసిన రోజు వచ్చి లెక్కలు చూసుకోండి? ఒక్క బస్తా తక్కువున్నా కేసులు నమోదు చేయండి? అని మిల్లర్లు చెబుతున్నా మాకే ఎదురు చెబుతావా?అంటూ కూడా బెదిరిస్తున్నారట. లేకుంటే అడిగినంత ఇవ్వమంటున్నారట? ఇలా వుంది అదికారుల తీరు. అంతే కాదు గంటలో అడిగినంత లంచం సమకూర్చకపోతే కేసులు నమోదు చేస్తామంటున్నారట. అయితే బడా బడా మిల్లర్ల జోలికి సివిల్‌ సప్లయ్‌ శాఖ అధికారులు పోరు. ఎందుకంటే వాళ్ల నుంచి ఎప్పటికప్పుడు అందాల్సినంత అందుతూనే వుంటుంది. వందల కోట్లు బకాయిలువున్న మిల్లర్లు ఎన్నితప్పులు చేసినా పట్టించుకోరు. కాని చిన్న చిన్న మిల్లర్లు ఎలాంటి తప్పు చేయకున్నా వేదిస్తుంటారు. ఇలా వేదిస్తున్న అదికారుల లెక్కలన్నీ నేటిధాత్రి చేతిలో వున్నాయి. వారి వివరాలు, వారి బాగోతాలు వరుసగా మీ నేటిధాత్రిలో కథనాలు వస్తాయి!

బీఆర్‌ఎస్‌ దే జూబ్లీ…పక్కా 50 వేల మెజారిటీ!

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డితో నేటిధాత్రి స్పెషల్‌ ఇంటర్వూ..

-బైపోల్‌లో బీఆర్‌ఎస్‌ నిశ్శబ్ద విప్లవం.

-కాంగ్రెస్‌ కు ప్రజల దిమ్మతిరిగే సమాధానం.

-ఓటర్లను బెదిరించే కాంగ్రెస్‌ కాల గర్భంలో కలవడం తధ్యం.

-బీఆర్‌ఎస్‌ బలం ముందు కాంగ్రెస్‌ జుజుబీ.

-కాంగ్రెస్‌, మజ్లిస్‌ అనైతిక పొత్తుకు చెంపపెట్టు.

-కాంగ్రెస్‌ భయపెట్టాలని చూసినా, ప్రలోభ పెట్టినా నమ్మడానికి జనం సిద్ధంగా లేరు.

-సునీత గెలుపు ఎప్పుడో ఖాయమైంది.

-బీఆర్‌ఎస్‌ ప్రభంజనం చూసి కాంగ్రెస్‌ వణుకుతోంది.

-ప్రచారంలో కాంగ్రెస్‌ నాయుకుల ముఖం మాడిపోయింది.

-జూబ్లీలో బీఆర్‌ఎస్‌ నిశ్శబ్ద విప్లవం.

-కాంగ్రెస్‌కు ఘోరీ కట్టడం ఖాయం.

-కాంగ్రెస్‌ చేసిన మోసాలకు చరమగీతం.

-అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం.

-ఓటర్లను బెదిరించి సిఎం. రేవంత్‌ పెద్ద తప్పు చేశారు.

-ఓటర్లను బెదిరించి గెలుస్తామనుకోవడం కాంగ్రెస్‌ మూర?త్వం.

-తెలంగాణలో కాంగ్రెస్‌ ను ఇక జన్మలో ఎవరూ నమ్మరు.

-బీఆర్‌ఎస్‌కు జనం ఆదరణ చూసి కాంగ్రెసోళ్ల గుండెలు అదురుతున్నాయి.

-కాంగ్రెస్‌ పార్టీ జూబ్లీలో చేతులెత్తేసినట్లే లెక్క.

-సీఎం. రేవంత్‌ మీడియా సమావేశంతో తేటతెల్లమైంది.

-ఓడిపోతున్నామని సీఎం. రేవంత్‌ కు అర్థమైపోయింది.

-ప్రస్టేషన్‌లో రేవంత్‌ ఏం మాట్లాడుతున్నారో ఆయనకే అర్థం కావడం లేదు.

-సీఎం. వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ పార్టీ నాయకులు తలలు పట్టుకుంటున్నారు.

-రెండేళ్లలలో కాంగ్రెస్‌ సర్కార్‌ చేసిన ఒక్క పని లేదు.

-రెండేళ్లలో చేసిన పనులేమీ లేక చెప్పుకునే దిక్కు లేదు.

-కారు ముందు కాంగ్రెస్‌ కహానీలు ఖతం.

-కాంగ్రెస్‌ పతనం జూబ్లీ నుంచే ప్రారంభం.

-కాంగ్రెస్‌ కు తప్పదు గుణపాఠం.

హైదరాబాద్‌, నేటిధాత్రి:  

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ చెప్పే అబద్దాలు నమ్మడానికి, రాష్ట్ర ప్రభుత్వం చేసే అన్యాయాలు, మోసాలు, అక్రమాలను ప్రజలు సహించడానికి సిద్దంగా లేరు. ఎన్నికల ముందు ఒకటా, రెండా 420 అబద్దాలు చెప్పారు. హమీలు ఇచ్చారు. గెలిచిన తర్వాత తెప్ప తగిలేసినంత పని చేశారు. అలాంటి కాంగ్రెస్‌ పార్టీని తెలంగాణలో ఇక నమ్మే పరిస్దితి అసలే లేదు. రేపు జరగబోయే జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో అసలే నమ్మేందుకు సిద్దంగా లేరు. కాంగ్రెస్‌కు తగిన బుద్ది చెప్పడానికి ప్రజలు సిద్దంగా వున్నారు. కాంగ్రెస్‌ను చిత్తుచిత్తుగా ఓడిరచేందుకు ప్రజలు సమాయత్తమయ్యారు. జూబ్లీహిల్స్‌లో ప్రజలు ప్రశాంత విప్లవాన్ని చూపిస్తారు. ఓటు ద్వారా బిఆర్‌ఎస్‌ పార్టీని గెలిపించి నిశ్శబ్ద విప్లవాన్ని తెస్తారు. కాంగ్రెస్‌ను గొయ్యి తీసి పది అడుగుల లోపల పాతి పెడతారు. మళ్లీ ముప్పై ఏళ్లపాటు తెలంగాణలో ఇక కాంగ్రెస్‌ ఓటు అడగకుండా భవిష్యత్తులో తెలంగాణ ప్రజలు తీర్పిచ్చేందుకు సిద్దంగా వున్నారు. అంతకు ముందు జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను తక్కు తక్కుకింత ఓడిరచనున్నారు. భవిష్యత్తు అంతా బిఆర్‌ఎస్‌ పార్టీదే అని నిరూపించబోతున్నారంటున్న ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు, ఎమ్మెల్సీ పోచం పల్లి శ్రీనివాస్‌రెడ్డి ,నేటిధాత్రి ప్రత్యేక ఇంటర్వూ….

నేటిధాత్రి: నమస్తే!

పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి: నమస్తే.

ప్ర: జూబ్లీహిల్స్‌ బై పోల్‌ ప్రచారం ఇక ఒక్క రోజులో ముగియనుంది. బిఆర్‌ఎస్‌కు గెలుపు అవకాశాలు ఎలావున్నాయి? 

జ: ప్రజలు బిఆర్‌ఎస్‌ అభ్యర్థి మాగంటి సునీతను బంపర్‌ మెజార్టీతో గెలిపించేందుకు సిద్దమయ్యారు. అసలు ప్రచార సమయంలోనే కాంగ్రెస్‌, బిజేపిలకు ప్రజల మూడ్‌ తెలిసిపోయింది. వారికి ఓటమి ఖాయమని తేలిపోయింది. అందుకే సిఎం. రేవంత్‌ రెడ్డి ప్రస్టేషన్‌కు గురయ్యారు. ఏడు రోజుల పాటు జూబ్లీహిల్స్‌లో ప్రచారం సాగించారు. అయినా జనం నమ్మడానికి సిద్దంగా లేరు. కాంగ్రెస్‌ అభ్యర్ధి గెలుపు అంత సులువు కాదని తెలుసుకున్నారు. బిఆర్‌ఎస్‌ మీద అవాకులు చెవాకులు పేలుతున్నారు. అంటేనే కాంగ్రెస్‌పార్టీ పరిస్ధితి ఏమిటో సిఎం. మాటల్లోనే అర్ధం చేసుకోవచ్చు. కాంగ్రెస్‌ పార్టీ గెలిచే అవకాశాలు ఒక్క శాతం కూడా లేవని తెలిసింది. బిఆర్‌ఎస్‌ గెలుపును ఆపడం కష్టమని అర్దమైపోయింది. ఇంకేముంది కాంగ్రెస్‌ నాయకులు గాయి, గాయి చేస్తున్నారు.

ప్ర: జూబ్లీహిల్స్‌ ప్రజలు గెలిపించకపోతే పథకాలు అగిపోతాయని సిఎం. అంటున్నాడు. ప్రజలు భయపడి ఓట్లు వేయరంటారా?

జ: ఇది ప్రజాస్వామ్యం. ప్రజలే నాయకులు, పాలకులు. వారిని బెదిరించి ఓట్లు సంపాదించడమనేది ఎవరి తరం కాదు. అందులోనూ సిఎం. రేవంత్‌ ప్రజలను బెదిరించడం వల్ల కాంగ్రెస్‌కు ఎలాగైనా బుద్ది చెప్పాలని ప్రజలు మరింత గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. బిఆర్‌ఎస్‌ అభ్యర్ధికి మరింత మెజార్టీ వచ్చేలా చేశారు. ఏ పార్టీకైనా సరే గెలవాలన్న ఆలోచన మంచిదే. ఉద్దేశ్యం మంచిదే. ఎలాగైనా గెవాలి అనుకోవడం తప్పు. ప్రజల మన్ననలను పొందకుండా గెలవడం అసాధ్యం. అందులోనూ పాలకులు పథకాలు ఆపేస్తామంటే ప్రజలు తిరుగుబాటు చేస్తారు. అయినా రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌కు ముఖ్యమంత్రా? లేక తెలంగాణ మొత్తానికి ముఖ్యమంత్రా? ఒక్క ఉప ఎన్నిక కోసం ఇన్ని విన్యాసాలు చేయడం అవసరమా? 

ప్ర: బిఆర్‌ఎస్‌ అభ్యర్ధి సునీతపై మంత్రులు చేసిన వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏమిటి?

జ: రాజకీయ నాయకులకు ఓపిక, సహనం వుండాలి. మాట్లాడే మాటలు హద్దుల్లో వుండాలి. ముఖ్యంగా పాలకులు ఎంతో ఒద్దికగా మాట్లాడాలి. మాట్లాడే ప్రతి మాట ఆచి తూచి మాట్లాడాలి. తన భర్తను కోల్పోయి పుట్టెడు దుఖంలో వున్న మాగంటి సునీత కన్నీళ్లను కూడా అపహాస్యం చేశారు. ఇది తెలంగాణ సమాజమే గమనించింది. ముఖ్యంగా జూబ్లీహిల్స్‌ ప్రజలు చూస్తూనే వున్నారు. కాంగ్రెస్‌పార్టీ నాయకులు సహజ గుణం తెలిసిపోయింది. ఒక మహిళను అంతలా అవమాంచే రీతిలో మాట్లాడిన నాయకులను ప్రజలు ఇప్పటికే చీ అన్నారు. కాంగ్రెస్‌ నాయకుల వ్యవహార శైలి గురించి ప్రజలకు తెలియంది కాదు. కాని ఇంత దిగజారి రాజకీయాలు చేస్తారని మాత్రం ఎప్పుడూ ఊహించలేదు. అందుకే ఖచ్చితంగా జూబ్లీహిల్స్‌ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టడం ఖాయం. 

ప్ర: కాంగ్రెస్‌కు మజ్లిస్‌ పార్టీ సపోర్టు చేయడం ఎలా అర్ధం చేసుకోవచ్చు?

జ: అది అనైతికపొత్తు. అంతకు మించి ఆ పొత్తు గురించి మాట్లాడడం వేస్టు. తెలంగాణలో కాంగ్రెస్‌కు మద్దతిస్తున్న మజ్లిస్‌ పార్టీ, బిఆర్‌ఎస్‌లో కాంగ్రెస్‌మీద దుమ్మెత్తిపోస్తోంది. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే చిప్ప కూడా చేతికి రాదని బిహార్‌లో ఎంపి. అసదుద్దీన్‌ ఓవైసీ ప్రచారం సాగిస్తున్నారు. ఇక్కడ మాత్రం సపోర్టు చేస్తున్నారు. ఇలాంటి అనైతిక పొత్తులు ఎక్కడైనా వుంటాయా? కాంగ్రెస్‌పార్టీ ప్రాంతీయపార్టీ కాదు. జాతీయ పార్టీ. జాతీయ పార్టీకి ఎక్కడైనా సరే ఒకే విధానం వుండాలి. ఇలా రెండు మూతుల రాజకీయాలు చేయడం కాంగ్రెస్‌కే చెల్లింది. అయినా కాంగ్రెస్‌పార్టీ ఎన్ని అనైతిక పొత్తులతో వచ్చినా బిఆర్‌ఎస్‌ గెలుపును ఎవరూ ఆపలేరు. ఆపడం కూడా వారికి సాద్యంకాదు. 

ప్ర: కాంగ్రెస్‌ పార్టీ ప్రధానంగా ముస్లిం ఓట్ల మీద ఆశల పెట్టుకున్నది. ముస్లిం ఓట్లు ఎటు పడే అవకాశం వుంది?

జ: ముస్లింల ఓట్లన్నీ బిఆర్‌ఎస్‌కే పడతాయి. ముస్లింలు కాంగ్రెస్‌ను నమ్మడానికి సిద్దంగా లేరు. ముఖ్యంగా రేవంత్‌ను, జూబ్లీహిల్స్‌ అభ్యర్ధినవీన్‌ యాదవ్‌ను నమ్మడం లేదు. తెలంగాణ ముస్లిం మైనార్టీ ప్రజలకు బిఆర్‌ఎస్‌ చేసిన సేవ ఎవరూ చేయలేదు. ముస్లింలకు రిజర్వేషన్‌ అమలు చేశాం. ముస్లింకు పండుగల తోఫాలు అందించాం. ముస్లింకు షాదీ ముభారక్‌ అందించాం. అనేక ఉపయోగకరమైన కార్యక్రమాలు చేపట్టాం. ముస్లింలు అంటే మజ్లిస్‌ ఓటు బ్యాంకు కాదు. ముస్లింలు జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు ఓటు వేయరు. ముస్లింలు కూడా మళ్లీ సారే రావాలి. కారే గెలవాలి. తెలంగాణలో మళ్లీ బిఆర్‌ఎస్‌ పాలన రావాలి. కేసిఆర్‌ ముఖ్యమంత్రి కావాలిన బలంగా కోరుకుంటున్నారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను చిత్తు చిత్తు గా ఓడిరచి, బిఆర్‌ఎస్‌ను గెలిపించాలని చూస్తున్నారు. అలాంటి ముస్లిం మైనార్టీలు కాంగ్రెస్‌కు ఓటు వేయరు. ఆ పార్టీకి తగిన బుద్ది చెబుతారు?

 ప్ర: నాలుగు కట్టడాలు చూపించి ఎంత కాలం ప్రజలను మోసం చేస్తారని సిఎం. అంటున్నాడు?

జ: మాట్లాడడానికి సిఎంకు కొంచెమైనా సిగ్గుండాలి. సెక్రెటరియేట్‌ ఎందుకు అనే వాళ్లు ఎవరైనా వుంటారా? సెక్రెటరియేట్‌ నిర్మిస్తే ఉద్యోగాలు వస్తాయా? అని ప్రశ్నించే సిఎం. ఎక్కడైనా వుంటాడా? నేనున్నాని సిఎం.రేవంత్‌ రెడ్డి నిరూపించారు. అంత గొప్ప నాయకుడిని సిఎం.ను చేసి కాంగ్రెస్‌పార్టీ తలపట్టుకుంటున్నది. కమాండ్‌కంట్రోల్‌ బోర్డు ఎందుకు? అని ప్రశ్నించడంలో అర్దముందా? కాళేశ్వరం మీద రేవంత్‌రెడ్డి చెప్పే అబద్దాలను ఎవరూ నమ్మేందుకు సిద్దంగాలేరు. జూబ్లీహిల్స్‌ బైపోల్‌లో కాంగ్రెస్‌కు కర్రు కాల్చి వాత పెడతారు. అప్పుడు సిఎంకు దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది.

నేటిధాత్రి: ధన్యవాదాలు.

పోచంపల్లి: నమస్కారం.

ఎన్నికల పుట్టగొడుగులు..పార్టీలకు గొడుగులు?

`లెక్కల మీద లెక్కలు…సర్వేల తిప్పలు!

`సర్వే లెక్కలు..ఎక్కాల పుస్తకం అంకెలు?

`లక్షల మందిలో పదుల సంఖ్యల అభిప్రాయాలు

`జనం ముందుకొచ్చినవి ఎన్నో!

`ఊహల్లో రాసుకున్న ఆలోచనలెన్నో!

`స్వతంత్ర సర్వే సంస్థలు ఏవీ వుండవు

`ఏదో ఒక పార్టీ అండ లేకుండా అవి నడవవు

`ఎంచుకున్న పార్టీకి అనుకూలంగా సర్వే చెప్పకుండా వుండలేరు

`సాధారణ సమయాల్లో జనం మాటలు వేరు!

`ఎన్నికల వేళ ప్రజల ఆలోచనలు వేరు

`అధికారంలో వున్నంత కాలం సిఎం. లు సొంత సర్వేలు చేయిస్తుంటారు

`ఎమ్మెల్యేల పని తీరు మీద మార్కులిస్తుంటారు

`తీరా ఎన్నికల సమయంలో సిట్టింగులకే టిక్కెట్లు ఇస్తారు

`జనం ముందుకు వచ్చి చేసిన వాళ్లు ఎవరూ లేరు

`అంతా ఆఫీసుల్లో కూర్చొని అల్లుకునే కథలు

`ఇప్పటికి వరకు ప్రజాభిప్రాయాన్ని వరుసగా స్పష్టంగా చెప్పిన సంస్థ ఒకటి లేదు

`సర్వేలే నిజమై వుంటే కొన్ని రాజకీయ పార్టీలు పోటీయే చేయవు

హైదరాబాద్‌, నేటిధాత్రి:                        సన్నాసికి సిగ్గుండదు..దరిద్రునికి బుద్ది వుండదు. కాని రాజకీయాల్లో ఎవరికీ సిగ్గుండదు. బుద్ది అసలే వుండదు. దూరాలోచన అసలే వుండదు. అందుకే పుట్టగొడుల్లా పుట్టుకొచ్చే సర్వేలను నమ్మి మోసం పోతుంటారు. సహజంగా సార్వత్రిక ఎన్నికల సమయంలో సుమారు ఐదేళ్లపాటు జనం మూడ్‌ను ప్రతి నిమిషం తెలుసుకుంటూ వుండడం జరుగుతుంది. ఐదేళ్ల కాలంలో జనం ఏమనుకుంటున్నారు? సరిగ్గా ఎన్నికల సమయంలో ఏం నిర్ణయం తీసుకుంటారో కూడా అర్దం చేసుకోవచ్చు. కాని ఒక్క ఉప ఎన్నికలో కూడా పుట్టగొడుగుల్లా సర్వే సంస్దలు పుట్టుకురావడం విచిత్రం. విడ్డూరం. అంటే రాజకీయ పార్టీలకు, నాయకులు తమ నాయకత్వాల మీద నమ్మకం లేక సర్వేలు చేయించుకుంటారా? సర్వేలు ప్రత్యేకంగా చేయించుకంటే తప్ప జనం నాడీ తెలుసుకోలేరా? అధికారంలో వున్నప్పుడు ప్రజా సమస్యలు తెలుసుకోరు? అది ఆ పార్టీ, ఈ పార్టీ అని తేడా ఏమీ వుండదు. అందరూ ఆ తాను ముక్కలే. ప్రతిపక్షంలో వున్నప్పుడు అదికారం కోసం అనేక అవస్ధలు పడుతుంటారు. జనం మద్యలో వుంటారు. జనానికి అందుబాటులో వుంటారు. జనం కోసమే రాజకీయం చేస్తున్నామని చెప్పుకుంటారు. ఒక్కసారి అదికారంలోకి వచ్చాక జనం ఏమనుకుంటు న్నారు? అనేది వినడానికి కూడా సమయం కేటాయించుకోరు. తాము చెప్పిందే నిజం. తమ మాటే శాసనం. తమ వాక్కేవేదం అనుకునేలా వ్యవహరిస్తుంటారు. ఇక్కడే రాజకీయ పార్టీలు, నాయకులు తప్పులో కాలేస్తుంటారు. ప్రతిపక్షంలో వున్నప్పుడు ఎలా వుంటారో? అధికార పక్షంలో వున్నప్పుడు ఒకేలా వుంటే, అసలు సమస్యలే ఉత్పన్నం కావు. అయితే నాయకులు జేజేలకు మాత్రమే లొంగిపోతారు. పొంగిపోతారు. ఎప్పుడూ జేజేలు కొట్టించుకోవాలనే చూస్తారు. ప్రతిపక్షంలో వున్నప్పుడు బాగా కొట్లాడుతున్నారు అనే మాటలే కోరుకుంటారు. ప్రభుత్వం మీద ప్రజా సమస్యల మీద బాగా పోరటం చేస్తున్నాడనే పొగడ్తలే కోరుకుంటారు. అందుకు ఓ భజన బృందాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటారు. అదికారంలోకి వచ్చిన తర్వాత మరిన్ని జేజేలు కోరుకుంటారు. అడుగు తీసి, అడుగేస్తే జిందాబాద్‌లు కొట్టాలని ఆశిస్తారు. అందుకు మరింత భజన బృందాన్ని నిలబెట్టుకుంటారు. అలా జేజేలు కొట్టించుకుంటే తప్ప వారికి నిమ్మలం వుండదు. పూట గడవదు. అలాంటి వారికి సర్వేలు తోడౌతుంటాయి. నిజాలు ఎప్పుడూ సర్వేలు చెప్పవు. దేశంలో ప్రజా పాలన మొదలైనప్పటి నుంచి సర్వేలు జరుగుతూనే వున్నాయి. అప్పటి నుంచి ఈసారి ఏ పార్టీ అదికారంలోకి వస్తుంది? ఎన్ని సీట్లు వస్తాయన్నది ఖచ్చితంగా చెప్పిన సర్వే సంస్ధలు ఏవీ లేవు. కాని సర్వేల మీద పార్టీలు, నాయకులు ఆధారపడి పోవడం అలవాటు చేసుకున్నారు. ఆ సర్వేలు కూడా పార్టీలకు, నాయకులకు అనుకూలంగా వచ్చేలా రిపోర్టులు తయారు చేయించుకోడం మొదలు పెట్టారు.ఇంత వరకు బాగానే వుంది. కాని ఉప ఎన్నికల కోసం సర్వేల హడావుడి ఏమిటో ఎవరికీ అర్దం కాకుండాపోతోంది. నిజం చెప్పాలంటే ఈ సర్వే సంస్ధలన్నీ ఒక రకంగా బోగస్‌. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో మాజీ ఎంపి. లగడపాటి రాజగోపాల్‌ను ఆంద్రా ఆక్టోపస్‌ అని పిలిచేవారు. ఆయన సర్వేలను ఎప్పటికప్పుడు చేయిస్తూ వుండేవారు. అయితే రాష్ట్రాల, కేంద్రం సార్వత్రిక ఎన్నికల సర్వేలు చేయిస్తూ వుండేవారు. కొంత వరకు అటూ, ఇటూ కాస్త తేడాతో సర్వే వివరాలు వెల్లడిస్తూవుండేవారు. మొదట్లో కాస్త లెక్కలను బాగానే అంచనా వేసినట్లు కనిపించేవారు. జాతీయ స్ధాయిలో మీడియా సంస్థలు కూడా ఒక దశలో లగడపాటి రాజగోపాల్‌ సర్వేకోసం ఎదురుచూసేలా కూడా చేశాయి. కాని ఆయన వేసిన అంచాలన్నీ , చేసిన లెక్కలన్నీ, ఎక్కాల పుస్తకంలో అంకెలే అని తేలిపోయింది. తనను తాను అధికంగా ఊహించుకోవడం మొదలు పెట్టారు. బోల్తా పడ్డారు. ఇక సర్వేలు చేయడం ఆపేశారు. అందులో కూడా సవాలు చేసి మరీ ఓడిపోయారు. 2018లో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వచ్చాయి. నిజానికి ముందస్తు ఎన్నికలు వస్తాయని ముందు నుంచే కొన్ని సంకేతాలు అప్పటికే కేసిఆర్‌ ఇస్తూ వుండేవారు. ఆఖరుకు అదే చేశారు. ఆ సమయంలో లగడపాటి రాజగోపాల్‌ సర్వే చేయిస్తున్నట్టు గొప్పగా చెప్పుకున్నారు. ఆఖరుకు గజ్వెల్‌లో కూడా కేసిఆర్‌ ఓడపోతున్నారు. తెలంగాణలో బిఆర్‌ఎస్‌ ఓడిపోతుంది? అని తన జోస్యం చెప్పేశారు. అయితే తన జోస్యం నిజం కాకపోతే ఇకపై సర్వేలు చేయడం ఆపేస్తానని శపథం చేశాడు. కాని బిఆర్‌ఎస్‌ రెండోసారి బంపర్‌ మెజార్టీతో 88 సీట్లు గెల్చుకున్నది. లగడపాటి సర్వే తుస్సుమన్నది. నిజంగానే సర్వే సంస్దలు నిర్వహించే వాటికి సైంటిఫిక్‌ అనాలిసిస్‌ వుంటుందని అనుకోవడం భ్రమ. సరిగ్గా ఎన్నికల సమయంలో జరిగే ఏ సర్వేకు ప్రాతిపదిక వుండదు. అంతే కాకుండా అభ్యర్ధుల ఎంపిక తర్వాత వచ్చే సర్వే వివరాలు అసలే నిజంకాదు. సార్వత్రిక ఎన్నికల సమయంలో జనం ఎంతో కొంత నిజం బహరింగానే చెబుతారు. దాంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం అంచనా వేయడానికి ఎంతో కొంత వీలౌతుంది.కాని ఉప ఎన్నికల సమయంలో సర్వేలు అనేవి కత్తి మీద సాము. అందుకే చేయరు. కాని ఏవేవో ప్రకటిస్తుంటారు. కొత్త కొత్త సంస్ధలు పుట్టగొడుల్లా వస్తుంటాయి. తమ తమ సర్వే వివరాలు అంటూ వెల్లడిస్తుం టాయి. కాని ఆ సర్వేలన్నీ ఏదొ ఒక పార్టీకి అనుకూలంగానే సాగిస్తుంటారు. నిజంగానే ఒక సర్వే సంస్ధ కష్టపడి సర్వేలు ఎంతో ఖర్చుతో కూడుకున్న పని.సర్వే నిర్వాహకులుగాని, సర్వే సంస్దలుగాని, అందులో పనిచేసే వాళ్లు కూడా ఊడిగం చేయరు. ఊరికే పనిచేయరు. అందుకు ఎంతో కొంత ఖర్చవుతుంది.అది కూడా లక్షలు, కోట్లలో అవుతుంది. ఆ ఖర్చును ఊరికే ఎవరూ భరించుకోరు. సహజంగా రాజకీయ పార్టీలకు సూచనలు, సలహాలతోనే ఏటా కొన్ని వందల కోట్లు సంపాదిస్తున్నానని ప్రశాంత్‌ కిషోర్‌ లాంటి వాళ్లు చెబుతుంటారు. అలా తొలుత ఒకటో రెండు చోట్ల వారి అంచనాలు నిజమైతే చాలు. ఇక రాజకీయపార్టీలు ఆ సంస్ధల వెంట పరుగెడుతుంటారు. అదే ప్రశాంత్‌ కిషోర్‌ తన రాజకీయపార్టీని మాత్రం గెలిపించుకోల ేకపోతున్నాడు. రాష్ట్రాలల రాజకీయ పార్టీలకు వ్యూహాలను అందించే ప్రశాంత్‌ కిషోర్‌కు తన పార్టీకి మాత్రం వ్యూహ రచన చేసుకోలేకపోతున్నాడు. అంటే రాజకీయాల్లో సర్వేల విన్యాసం, ఊహల బారతం అంతా ఉట్టిదే. అదంతా సంపాదనలకోసమే… అయినా రాజకీయ పార్టీలు నమ్ముతూనే వుంటాయి. తమ బలహీనతను బైట పెట్టుకుంటూనే వుంటాయి. నిజంగానే సర్వేలు చెప్పిన మాటలే నిజమైతే ఓడిపోతారనుకునే నాయకులు, ఆ పార్టీలు ఎన్నికల బరిలోకే దిగరు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల విషయానికే వద్దాం..రాజకీయ పార్టీలు వెళ్లి ఓట్లు అడిగితేనే సరే సరే అంటారు. ప్రచారానికి వచ్చిన అన్ని పార్టీలకు అదే సమాదానం చెబుతారు. మా ఓటు మీకే అంటారు. కాని మీకు ఓటు వేయమని ఎవరూ ముఖం మీద చెప్పరు. అలా చెప్పేవారు సహజంగా ఏదో ఒక పార్టీకి చెందిన వాళ్లైనా వుంటారు. లేకుంటే ఏదైనా రాజకీయ పార్టీకి అభిమానులైనా అయి వుంటారు. అంతే కాని తటస్ధులు ఎవరూ ప్రచారానికి వచ్చిన వారి ముఖం మీద ఓటు వేయమని చెప్పరు. అలాగే ఉప ఎన్నికల సమయంలో జరిపే సర్వేల విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఎవరూ స్పష్టమైన సమాధానం చెప్పరు. సర్వేలకు వెళ్లేవారు ఊహించుకోవడం, అంచనా వేసుకోవడం మాత్రమే వుంటుంది. అయితే ఏదైనా పార్టీకి సర్వే చేస్తున్నారో ఆ సంస్ధలు మాత్రం ఆ పార్టీలకు వ్యతిరేకంగా ప్రజల ఆలోచనలు వుంటే వాటిని బైట పెట్టరు. మీ పార్టీ ఓడిపోతుందని ఎట్టిపరిస్ధితుల్లోనూ చెప్పరు. ప్రజలు తమ పార్టీ వైపే వున్నారంటూ లెక్కలు చెబుతారు. సర్వేలు చేసినందుకు అయిన ఖర్చులు వసూలు చేసుకుంటారు. ఏ సర్వే సంస్ధ అయినా సర్వే చేసి ఓడిపోతుందని చెబితే ఒక్క రూపాయి కూడా ఏ పార్టీ ఇవ్వదు. ఈ మాత్రం జనానికి తెలియదా? పార్టీలకు అంచనా వేసుకోలేవా? అయినా సర్వేల వెంట వేలం వెర్రిలా పడుతుంటారు. సర్వేలు చేయించుకుంటారు. ఈ మధ్య మరో దరిద్రం మొదలైంది.సర్వేల మూలంగా బెట్టింగ్‌లు నడుస్తున్నాయంటూ కూడా వార్తలు వస్తున్నాయి. రాజకీయ పార్టీల గెలుపోటములేమో గాని, సర్వే సంస్దల వల్ల బెట్టింగుల జోరు మాత్రం పెరుగుతోంది. అదో వ్యాపారమైపోయంది.

జనం గుండెల్లో ‘‘సారు’’..జూబ్లీ హిల్స్‌లో..’’కారుకే ఓటు’’.

`రాజ్యసభ సభ్యుడు ‘‘వద్దిరాజు రవిచంద్ర’’ చెబుతున్న..’’జూబ్లీహిల్స్‌ జనం మాట’’

`ఎవరి నోట విన్నా కారు కారునే గెలిపించుకుంటం

`ఓటుతోనే రౌడీ రాజకీయాల తిక్కకుదిరిస్తాం

`ఆరు గ్యారెంటీలలో ఒక్కటి కూడా అమలు చేయని దౌర్భాగ్యం

`రైతకు భరోసాకు ఆదిలోనే శఠగోపం

`రుణమాఫీ పచ్చి అబద్దానికి నిదర్శనం

`హైడ్రా పేరుతో హైదరాబాద్‌ సర్వనాశనం

`పేదల జీవితాలపై పగబట్టిన కాంగ్రెస్‌ పాపపు కాలం

`భస్మాసుర హస్తం… తెలంగాణకు శాపం!

`పచ్చగా వున్న తెలంగాణకు పట్టిన కాంగ్రెస్‌ దరిద్రం

`తొండి ప్రభుత్వం…తోడేళ్ల రాజకీయం

`ఒక్క చాన్స్‌ అంటే గెలిపించి వలవల ఏడుస్తున్న జనం

`కాంగ్రెస్‌ను నమ్మి నిండా మునిగిన ప్రజానీకం

`జూబ్లీ హిల్స్‌ దెబ్బకు హస్తానికి తద్దినం

`తెలంగాణలో కాంగ్రెస్‌ కనుమరుగు ఖాయం

`కాంగ్రెస్‌ మీద రైతుల్లో పెల్లుబికిన ఆగ్రహం

`మహిళల్లో కాంగ్రెస్‌ మీద పట్టలేనంత ఆవేశం

`కాంగ్రెస్‌ చెప్పిన వాగ్థానాలన్నీ అబద్ధం..

`అధికారంలోకి రావడానికి కాంగ్రెస్‌ నయ వంచన కుటిలత్వం

`కుర్చిల కొట్లాటల్లోనే కరుగుతున్న పుణ్యకాలం

`వాటాల పంపకాలలో మునిగితేలుతున్న మంత్రి వర్గం

`ఇంత మోసం చేసిన కాంగ్రెస్‌కు పాతాళమే శరణ్యం

`విద్యార్థులలో పెరుగుతున్న చైతన్యం

`నిరుద్యోగులలో పెరిగిన అసహనం

`రెండు లక్షల ఉద్యోగాల పేరు చెప్పి కాంగ్రెస్‌ చేసిన మోసం

`ప్రశ్నించే వారిపై కాంగ్రెస్‌ చూపిస్తున్న అధికార పైత్యం

`నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్‌ పైశాచికత్వం

`జూబ్లీ హిల్స్‌తో కాంగ్రెస్‌ పతనం

జూబ్లీహిల్స్‌ ప్రచారం జోరుగా సాగుతోంది. పాలక, ప్రతిపక్షాలు హోరాహోరీగా తలపడుతున్నాయి. పోలింగ్‌కు సమయం దగ్గర పడుతోంది. ప్రజలు ఏమనుకుంటున్నారు? బిఆర్‌ఎస్‌ ప్రచారం ఎలా వుంది? సునీత గెలుపు నల్లెరు మీద నడకే అని బిఆర్‌ఎస్‌ శ్రేణులే అంటున్నాయి.సారే రావాలి. కారే గెలవాలి. మళ్లీ తెలంగాణ బంగారు తెలంగాణ కావాలంటే బిఆర్‌ఎస్‌ అధికారంలోకి రావాలి. అందుకు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నాంది పలకాలని ప్రజలు కోరుకుంటున్నారని బిఆర్‌ఎస్‌ శ్రేణులు చెబుతున్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక మీద బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వద్ది రాజు రవిచంద్ర ప్రచార విశేషాలపై నేటి ధాత్రి ప్రత్యేక ఇంటర్వూ…

నేటిధాత్రి: నమస్తే రవిచంద్రగారు.

రవిచంద్ర: నమస్తే.

ప్రశ్న..ఎడిటర్‌ కట్ట రాఘవేంద్రరావు :

జూబ్లీహిల్స్‌ ప్రచారం ఎలా సాగుతోంది?

జవాబు.. రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర : చాలా బాగా సాగుతోంది.
ప్రశ్న..ఎడిటర్‌ కట్ట రాఘవేంద్రరావు : జనం ఏమనుకుంటున్నారు..మీరేం అర్ధం చేసుకున్నారు?

జవాబు..రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర : జనానికి పూర్తి స్పష్టత వుంది. ఎవరు గెలవాలి. ఎవరు ఓడాలి. ఎవరికి ఓటు వేయాలి. ఎవరిని ఓడిరచాలి అనే విషయంలో జూబ్లీహిల్స్‌ ప్రజలు స్ధిరనిర్ణయంతో వున్నారు. అది మేం ప్రచారానికి వెళ్లినప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. మా పార్టీ ప్రచారం మాత్రం జోరుగా సాగుతోంది. జనం కూడా అంతే విదంగా బిఆర్‌ఎస్‌ ప్రచారానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారు. మాకు బస్తీలలో సాదర స్వాగతం పలుకుతున్నారు. అంతే కాదు మీరు ప్రచారానికి రాకున్నా గెలుస్తారంటూ ప్రజలే చెబుతుంటే ఎంతో సంతోషం అనిపిస్తోంది. అంటే జనం గుండెల్లో బిఆర్‌ఎస్‌ ఎంత బలంగా వుందో అర్ధం చేసుకోవచ్చు. కేసిఆర్‌ను ప్రజలు ఎంత మిస్‌ చేసుకుంటున్నారో కూడా ఈ సందర్భంగా తెలుస్తోంది. కేసిఆర్‌ పదేళ్ల పాలనలో ప్రజలు ఎంత సంతోషంగా వున్నారో, ఇప్పుడు ఎలా వున్నారో వారికి అర్ధమౌతోంది. కేసిఆర్‌ పాలనలో సమస్యలు లేవు. ఎలాంటి ఇబ్బందులు లేవు. రౌడీలు లేరు. ప్రజలను వేదించిన వారు లేరు. అప్పుడంతా సైలెంట్‌గా వున్నారు. భయంతో రౌడీలు దాక్కున్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌ రాగానే మళ్లీ రౌడీలు రాజ్యమేలుతున్నారు. కొన్ని బస్తీలలో ప్రజలు మాతో అనేక విషయాలు చెబుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీనాయకులు, కార్యకర్తలు అరాచకాలు చేస్తున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా నవీన్‌ యాదవ్‌ అనుచరులు తమ ఇష్టాను సారం వ్యవహరిస్తారని చెబుతున్నారు. వారిని కట్టడి చేయాలన్నా, తమ బస్తీలు మళ్లీ ప్రశాంతంగా వుండాలన్నా కేసిఆర్‌ సారు రావాలి. బిఆర్‌ఎస్‌ అధికారంలోకి రావాలి. మా ప్రాంతం చల్లగా వుండాలని కోరుకుంటున్నారు. రాత్రి వేళల్లో నవీన్‌ అనుచరులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు బస్తీలలో వుండే బైకులు కూడా ఎత్తుకెళ్తున్నట్లు కూడా కొంత మంది మహిళలు చెబుతున్నారు. రాత్రి సమయాల్లో గల్లీలలో తిరుగుతున్న వారిని చూస్తుంటే భయమేస్తుందని అంటున్నారు. సాయంత్రం సమాయాల్లో బైటకు రావాలంటే మహిళలు బెంబేలెత్తిపోతున్నారని అంటున్నారు. అంటే పరిస్ధితులు ఎలా వున్నాయో అర్దం చేసుకోవచ్చు. ప్రజలకు మళ్లీ ప్రశాంతమైన వాతావరణం రావాలంటే కేసిఆర్‌ వస్తేనే సాద్యమౌతుందని మహిళలు చెబుతున్నారు. అంటే మార్పు మార్పు అని కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను ఎంత మోసం చేసిందో అర్దం చేసుకోవచ్చు. అదికారంలోకి వచ్చి ప్రజలను ఎంత వేదిస్తుందో తెలుసుకోవచ్చు. అందుకే బస్తీలలో కాంగ్రెస్‌ నాయకులు ప్రచారానికి వెళ్లినప్పుడు ఇండ్ల నుంచి జనం బైటకు కూడా రావడం లేదు. ఇండ్ల బైట వున్న వాళ్లుకాంగ్రెస్‌ నాయకులను చూసి ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకుంటున్నారు. దాంతో ప్రస్టేషన్‌కు గురౌతున్న కాంగ్రెస్‌ నాయకులు బిఆర్‌ఎస్‌ నాయకులతో గొడవలు పడుతున్నారు. ప్రజలు బిఆర్‌ఎస్‌ నాయకులతో మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నారు. ఇక్కడే అర్ధం చేసుకోవచ్చు. ప్రజలు ఎవరి పక్షనా వున్నారో తేలిపోతోంది.

ప్రశ్న..ఎడిటర్‌ కట్ట రాఘవేంద్రరావు : కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలు అమలు చేసినట్లు చెబుతున్నారు? మీరేమో కాదంటున్నారు?
జవాబు..రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర : అబద్దాలు చెప్పడమే తెలిస్తే నోట్లో నుంచి వచ్చే మాటలన్నీ అబద్దాలే వుంటాయి. అసలు క్షేత్ర స్దాయి కాంగ్రెస్‌ కార్యకర్తలే ఆరు గ్యారెంటీలు ఏమిటో తెలియని దుస్తితి ఆ పార్టీది. ఆరు గ్యారెంటీలు అని చేతులు దులుపుకుందామనుకుంటున్నారు. కాని అందులో 13 గ్యారెంటీలున్నాయి. అవి ఇప్పుడు చెప్పడం లేదు. ఎన్నికల సమయంలో ఆరు అంటే పదమూడు అని చెప్పుకున్నారు. ఇప్పుడు అసలు ఆరు చెప్పుకోవడానికే కాంగ్రెస్‌ నాయకులు భయపడుతున్నారు. కలలో కూడా గుర్తుకొచ్చి వణుకుతున్నారు. జూబ్లీహిల్స్‌ ప్రజలు కాంగ్రెస్‌ నాయకుల మొహం మీదనే అడుతున్నారు. మీకెందు ఓటెయ్యాలని కాంగ్రెస్‌ నాయకులను నిలదీస్తున్నారు. ఆరు గ్యారెంటీలలో ఒక్కటైనా అమలు చేశారా? అని ప్రశ్నిస్తున్నారు. దాంతో కాంగ్రెస్‌ నాయకులు తెల్ల మొహం వేసుకుంటున్నారు. సమాధానం చెప్పలేక పారిపోతున్నారు. అసలు కాంగ్రెస్‌ నాయకులు ప్రచారం పేరుతో మా ముందుకు రావొద్దని అంటున్నారు. ఏమైనా అంటే ఉచిత బస్సు ఇస్తున్నామనే ముచ్చట తప్ప మరొకటి చెప్పుకోవడానికి లేదు. దాని వల్ల ఆటో డ్రైవర్ల జీవితాలు ఆగమౌతున్నాయి. ఒకప్పుడు రెండు మూడు ఆటోలకు ఓనర్లు ఇప్పుడు వాటిని అమ్ముకుంటూ, కిరాయి ఆటోలు నడుపుకుంటున్నారు. పూట గడవక ఆందోళన చెందుతున్నారు. ఇక మిగతా గ్యారెంటీల అమలు ఎక్కడుందో తెలియదు. ఇస్తారన్న నమ్మకం ప్రజలకు లేదు. ఇప్పుడు కాంగ్రెస్‌ను పొరపాటున ఆదరిస్తే ప్రజలకు కాంగ్రెస్‌ పార్టీ నరకం చూపించడం ఖాయం. ఆరు గ్యారెంటీలు అటకెక్కిస్తారు. ఆరు గ్యారెంటీలలో పించన్లు 4 వేలు ఇస్తామన్నారు. కాని ఇప్పటి వరకు వాటిని పెంచింది లేదు. కనీసం గతంలో కేసిఆర్‌ ఇచ్చిన రూ.2వేలు కూడా ఇప్పుడు కాంగ్రెస్‌ సకాలంలో ఇవ్వడం లేదు. దాంతో ప్రజలు ఆగ్రహంతోవున్నారు. అనవసరంగా నమ్మి మోసపోయామని అంటున్నారు. ఇవ్వలేనప్పుడు ఎందుకు చెప్పారంటూ కాంగ్రెస్‌ నాయకులను నిలదీస్తున్నారు. ప్రతి మహిళకు రూ.2500 ఇస్తామన్నారు. ఇప్పటి వరకు ఆ పధకం అమలు గురించి ఆలోచనే లేదు. ఇస్తారన్న గ్యారెంటీ అసలే లేదు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకంలో లక్ష రూపాయలతోపాటు, తులం బంగారం ఇస్తామన్నారు. అది కూడా పెళ్లికి ముందే ఇస్తే పుస్తెలు చేయించుకోవచ్చన్నారు. తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్‌ తులం బంగారం ఇవ్వడం సాధ్యం కాదని చెప్పేశారు. ఇవ్వలేమన్నారు. మరో కాంగ్రెస్‌ నాయకుడు వి. హనునమంత రావు కూడా ఇదే విషయాన్ని తెల్చి చెప్పారు. అయినా జనం కాంగ్రెస్‌ను నమ్ముతారా? ప్రతి విద్యార్ధినికి ఒక ఎలక్రిక్‌ స్కూటీని ఇస్తామన్నారు. ఇవ్వగలరా? ఇవ్వలేరు. ఇవ్వాలన్న చిత్తశుద్దికూడా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి లేదు.
ప్రశ్న..ఎడిటర్‌ కట్ట రాఘవేంద్రరావు : బిఆర్‌ఎస్‌కు ఓటేస్తే పథకాలు ఆగిపోతాయని సిఎం. రేవంత్‌ అంటున్నారు?
జవాబు..రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర : బిఆర్‌ఎస్‌కు ఓటేస్తే పథకాలు ఆగిపోతాయని కాదు. ఆపేస్తామని సిఎం. రేవంత్‌ రెడ్డి ప్రజలను బెదిరించారు. ఒక ముఖ్యమంత్రి ప్రజలను అలా బెదిరించడం ఎక్కడైనా చూశామా? అంటే జనమంటే కాంగ్రెస్‌ పార్టీకి, ప్రభుత్వానికి ఎంత చిన్న చూపో అర్ధం చేసుకోవచ్చు. కాంగ్రెస్‌ పార్టీకి ఓటేయ్యకపోతే సన్న బియ్యం ఆపేస్తామని నేరుగానే బెదిరిస్తున్నారు. కాంగ్రెస్‌ను గెలిపించకపోతే ఉచిత కరంటు ఆగిపోతుందన్నారు. రేషన్‌ కార్డులు కట్‌ చేస్తామంటున్నారు. నిజంగా కాంగ్రెస్‌కు ఓటేస్తేనే ఇవన్నీ ఆగిపోతాయని చెప్పాలి. ఆరు గ్యారెంటీలు ఎలాగూ అమలు చేయడంలేదు. అందులో సన్న బియ్యం ఇవ్వడం ప్రభుత్వానికి సాద్యంకావడం లేదు. సన్న బియ్యం కూడా మూడునాళ్ల ముచ్చటలాగే కనిపిస్తోంది. 200 యూనిట్ల ఉచిత కరంటు ఎక్కడా రావడం లేదు. కాని ప్రభుత్వం దొంగ ప్రచారం చేసుకుంటోంది. రేషన్‌కార్డులు రిటన్‌ తీసుకుంటామని బెదిరిస్తేజనం భయపడతారనుకోవడం రేవంత్‌ రెడ్డి భ్రమ. ప్రజలు పెట్టిన భిక్షతోనే సిఎం. అయిన రేవంత్‌ రెడ్డి ప్రజలను బెదిరిస్తే ఊరుకుంటారా? మహా మహా నాయకులనే ప్రజలు ఓడిరచారు. రేవంత్‌రెడ్డి ఎంత? రేవంత్‌ రెడ్డి ఎక్కడికెళ్లినా జనం రావడం లేదు. రోడ్‌షోలు పెట్టినా జనం హజరు కావడం లేదు. చిత్రపురిలో సభ పెడితే కార్మికులు రాలేదు. ఇలా సిఎం. రేవంత్‌రెడ్డి ప్రచారానికి జనం రాకపోవడంతో ఆయనకు మరింత ప్రస్టేషన్‌ పెరిగిపోతోంది. అదే సమయంలో బిఆర్‌ఎస్‌ రోడ్‌షోలకు జనం ఇసకేస్తే రాలనంత వస్తున్నారు. పైగా జోరు వానలో కూడా జనం రోడ్‌షోలో పాలు పంచుకుంటున్నారు. వర్షంలో కూడా డ్యాన్సులు చేస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత కాంగ్రెస్‌ నాయకులకు, ముఖ్యంగా సిఎం. రేవంత్‌రెడ్డికి కంటి మీదకి కునకు రావడం లేదు. రేవంత్‌ రెడ్డి మాట్లాడుతుంటే జనం వినడం లేదు.

ప్రశ్న..ఎడిటర్‌ కట్ట రాఘవేంద్రరావు : నన్ను చూసి ఈ ఒక్కసారి గెలిపించండి! అని రేవంత్‌ రెడ్డి అంటున్నారు?
జవాబు..రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర : ఇది వరకు నమ్మే తెలంగాణ ప్రజలు నిండా మునిపోయారు. రేవంత్‌ రెడ్డి మాటలు నమ్మి మోస పోయారు. ఆరు గ్యారెంటీలంటూ అబద్దాలు చెబితే నమ్మారు. ఇంకా నమ్మమంటే ఎలా నమ్ముతారు? ఎందుకు నమ్ముతారు? ఇది ప్రజాస్వామ్యం. పైగా ఈ రెండేళ్ల కాలంలో ఆయన ఒక్క నిజమైనా మాట్లాడారా? జనానికి పనికొచ్చే పని ఒక్కటైనా చేశారా? మచ్చుకు కూడా చెప్పుకోవడానికి ఒక్కటైనా వుందా? ఏ రంగమైనా ముందట పడిరదా? అన్ని ఫెయిల్యూర్లే. రుణమాఫీ చేస్తామన్నారు. చేశామని గొప్పలు చెప్పుకున్నారు. కాని రైతులేమంటున్నారో కాంగ్రెస్‌ నాయకులకు తెలియదా? కాంగ్రెస్‌ నాయకులకే రుణమాఫీ జరగలేదని చెప్పుకుంటున్నారు. రైతు భరోసా రూ.15వేలు ఇస్తామన్నారు. కనీసం గతంలో కేసిఆర్‌ ఇచ్చిందికూడా ఇవ్వడం లేదు. అది కూడా అందరికీ అందడం లేదు. ఇప్పటికే రెండు విడుతల బాకీ వున్నారు. మేమైనా దివానాగాళ్లమా? రైతు బంధు ఎందుకు ఆపేస్తామని సభల్లో రేవంత్‌ రెడ్డి అన్నారు. కేసిఆర్‌ ఇస్తున్న పది వేలకు బదులు రూ.15 వేలు ఎకరానికి ఇస్తామన్నారు. పాపం రైతన్నలు నమ్మారు. రేవంత్‌రెడ్డి ముందు నుంచి మోసం చేస్తానని చెబుతూనే వున్నారు. కాని ప్రజలు అమాయకులు నమ్మారు. కాని ఇంకా మోసం చేస్తామంటే, మోస పోవడానికి ప్రజలు సిద్దంగా లేరు. కౌలు రైతులకు కూడా ఏటా రూ.12000 ఇస్తామన్నారు. ఇలా ఎన్ని ఎన్ని అబద్దాలు ఆడారో తెలియంది కాదు. అందుకే ఆరు గ్యారెంటీలే కాదు, కాంగ్రెస్‌ ఇచ్చిన మొత్తం హమీలు 420. అంటేనే ఇక్కడే తేలిపోయింది. ఆ హమీలు అమలు కావన్నది అప్పుడే కాంగ్రెస్‌ చెప్పింది. కాని రాహుల్‌ గాందీ, ప్రియాంక గాందీ, సోనియా గాందీలను రప్పించి అబద్దాలు చెప్పించారు. జనాన్ని నమ్మించారు. ఒక్కసారి ఒక్క అవకాశం ప్లీజ్‌ ప్లీజ్‌ అంటూ రేవంత్‌ రెడ్డి బ్రతిమిలాడాడు. ఇప్పుడు ఓటెయ్యకపోతే పథకాలు అపేస్తామని బెదిరిస్తున్నాడు. అందుకే జూబ్లీహిల్స్‌ ప్రజలు కాంగ్రెస్‌ను తక్కు తుక్కుగా ఓడిరచేందుకు సిద్దపడుతున్నారు. పిక్సైయ్‌ వున్నారు.
ప్రశ్న..ఎడిటర్‌ కట్ట రాఘవేంద్రరావు : నన్ను చూసి ఓటెయ్యమని రేవంత్‌ అంటున్నాడు! నన్ను చూసి ఓటెయ్యమని నవీన్‌ అంటున్నాడు? జనం ఎవరిని చూసి ఓటేస్తారని అనుకుంటున్నారు?
జవాబు..రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర : ఈ ఇద్దరినీ చూసి కాంగ్రెస్‌కు ప్రజలు ఒక్క ఓటు కూడా వేయరు. రేవంత్‌రెడ్డిని నమ్మి ఇప్పటికే మోసపోయారు. అయినా ప్రజలు మోసపోయేందుకు సిద్దంగా లేరు. ఇక కాంగ్రెస్‌ అభ్యర్ది నవీన్‌ యాదవ్‌ గురించి బస్తీలలో ప్రజలే మాట్లాడుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఒప్పించుకోవాలి. మెప్పించుకోవాలి. గెలిస్తే ఏం చేస్తామనే విషయాలు చెప్పాలి. అంతే కాని బిఆర్‌ఎస్‌ నాయకుల మీద దాడులు చేస్తే ప్రజలు ఓట్లేస్తారా? బిఆర్‌ఎస్‌ నాయకులు ఇళ్లలో నుంచి బైటకు రారు. బైటకు వెళ్తే ఇంటికి రారు అని బెదిరిస్తుంటే జనం ఒప్పుకుంటారా? ఓట్లేస్తారా? రాజకీయ ప్రత్యర్ధుల మీద ఇలాంటి రౌడీ భాషలు మాట్లాడుతుంటే ఈసి స్పందించాలి. రేవంత్‌ రెడ్డిని చూసి ఎందుకు ఓటేయ్యాలి? అనేది జనానికి స్పష్టత వుంది. ఓటు కాంగ్రెస్‌కే వేసే ప్రసక్తి లేదని నిర్ణయం తీసకొని వున్నారు. పోలింగ్‌ రోజున బిఆర్‌ఎస్‌కు, కారు గుర్తుకు ఓటేయ్యాలని సిద్దంగా వున్నారు. అందుకే రేవంత్‌ రెడ్డి ప్రస్టేషన్‌లోకి వెళ్లిపోతున్నాడు. జూబ్లీహిల్స్‌ ఓడిపోతే తన పదవి కాస్త ఊడిపోతుందని భయం పట్టుకున్నది. అందుకే అడ్డదారులు తొక్కైనా సరే గెలవాలిన కుటిల ప్రయత్నాలు చేస్తున్నాడు. కాని కుదరడం లేదు. జనం ఆదరించడం లేదు. ఖర్మ పాలోస్‌ అన్నట్లు ఏ నిరుద్యోగులను అడ్డం పెట్టుకొని బిఆర్‌ఎస్‌ మీద కాంగ్రెస్‌ పార్టీ అసత్య ప్రచారం చేసిందో అదే నిరుద్యోగులు ఇప్పుడు కాంగ్రెస్‌కు చుక్కలు చూపిస్తున్నారు. సిఎం. రేవంత్‌రెడ్డికి ఊపిరి ఆడకుండా చేస్తున్నారు. పెద్దఎత్తున నిరుద్యోగ జేఏసి కూడా కాంగ్రెస్‌కు ఓటు వేయొద్దని ప్రచారం సాగిస్తోంది. గత ఎన్నికల్లో నిరుద్యోగులకు మాయ మాటలు చెప్పి రెండు లక్షల ఉద్యోగాలిస్తామని నమ్మించి వారిని తప్పు దోవ పట్టించారు. ఇప్పుడు నిజం తేలింది. కాంగ్రెస్‌ నిరుద్యోగులను మోసం చేసింది. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం పెట్టిన పరీక్షల ఫలితాలను ప్రకటించి, ఆ ఉద్యోగాలను తామే ఇచ్చినట్లు ప్రకటించుకోవడాన్ని నిరుద్యోగులే సహించలేకపోతున్నారు. పైగా నోటిఫికేషన్లు వేయకుండా, ఆ నెపం నిరుద్యోగుల మీదే నెట్టేస్తూ సిఎం. రేవంత్‌ రెడ్డి అసత్య ప్రచారం సాగిస్తున్నారు. వరస నోటిఫికేషన్లు నిరుద్యోగులే వద్దంటున్నారంటూ సాక్ష్యాత్తు సిఎం. రేవంత్‌ ఇంత పచ్చి అబద్దాలు ఆడడాన్ని తెలంగాణ యువత జీర్ణించుకోలేకపోతోంది. అంతే కాకుండా గ్రూప్‌ వన్‌లో ఏం జరిగిందో చూస్తూనే వున్నారు. గ్రూప్‌ 2లో ఎలాంటి అవతకవకలు జరిగాయో నిరుద్యోగులే చెబుతున్నారు. ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి.
ప్రశ్న..ఎడిటర్‌ కట్ట రాఘవేంద్రరావు : అభివృద్ది అంటే ఏమిటో చూపిస్తానని రేవంత్‌ రెడ్డి అంటున్నారు?
జవాబు..రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర : అసలు అభివృద్ది అంటే అర్ధం కూడా తెలియని పాలకుడు రేవంత్‌రెడ్డి. రెండేళ్ల కాలంలో తెలంగాణలో చేసిన ఒక్క మంచి పని చూపించండి. ఒక్కటంటే ఒక్కటే..అలాంటి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అభివృద్ది అంటే ఏమిటో చేసి చూపిస్తానంటే ఎవరు నమ్ముతారు. అయినా అదికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేలు ఏం చెబుతున్నారో చూడడం లేదా? మాకు చేతిలో చిల్లి గవ్వలేదంటున్నారు. సిఎం. ఇవ్వడం లేదంటున్నారు. మరో వైపు సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలంగాణకు వస్తున్న ఆదాయం 18500 కోట్లు అంటున్నారు. అంతకు మించి ఒక్క రూపాయి రావడం లేదని స్వయంగా ఆయన చెబుతున్నారు. నన్ను కోసినా ఒక్క రూపాయి లేదనంటున్నాడు. బ్యాంకులకు వెళ్తే చులకనగా చూస్తున్నారని అంటున్నాడు. డిల్లీకిపోతే అప్పాయింటు మెంటు కూడా ఇవ్వడం లేదంటున్నాడు. ఎక్కడ చెప్పులు ఎత్తుకుపోతారో అన్నట్లు చూస్తున్నారని సిఎం. రేవంత్‌రెడ్డే అంటున్నాడు. అలాంటి సిఎం. రేవంత్‌రెడ్డి జూబ్లీహిల్స్‌లో అభివృద్ది అంటే ఏమిటో చూపిస్తామంటున్నారు. అంటే జనం అంత వెర్రిబాగులోల్లా? అయినా రేవంత్‌ రెడ్డి తెలంగాణ మొత్తానికి సిఎం అనుకుంటున్నాడా? లేక జూబ్లీహిల్స్‌కు సిఎం. అనుకుంటున్నాడో ఆయనకే క్లారిటీ లేదు. తన సొంత జిల్లా పాలమూరు ఎమ్మెల్యేలే బహిరంగంగా విమర్శిస్తున్నారు. పెళ్లిళ్లకు, చావులకు వెళ్లాలంటే కూడా భయపడుతున్నామని ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్‌రెడ్డి అంటున్నారు. లక్ష రూపాయల పనులు కూడా సాంక్షన్‌ చేయాలంటే ధైర్యం చేయలేకపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిధులు ఇవ్వకపోవడంతో జనం ముందుకు వెళ్లాలేక ముఖం చాటేస్తున్నామని చెబుతున్నాడు. పల్లెల్లో పారిశుద్యం కరువైందని స్వయంగా కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అంటుంటే, జూబ్లీహిల్స్‌ అభివృద్ది చేస్తామనడం హాస్వాస్పదం కాదా? ఇంతకన్నా అబద్దం మరొకటి వుంటుందా? కంటోన్‌మెంట్‌ ఉప ఎన్నికల్లో ఇలాగే అబద్దాలు చెప్పి గెలిచారు. కంటోన్‌ మెంట్‌లో వేల కోట్లు ఖర్చు చేస్తున్నామంటున్నారు. అదే నిజమైతే ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్‌ రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నారు. ఆయన నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా ఎందుకు ఇవ్వడంలేదు? నోరు తెరిస్తే అబద్దాలు తప్ప ఒక్క నిజం రేవంత్‌ రెడ్డి నుంచి రాదు. ఇది జనానికి ఎప్పుడో తెలిసిపోయింది. ఇంకా బుకాయిస్తామంటే ఎవరూ నమ్మరు. ప్రజలు చాల చైతన్యవంతులు.
ప్రశ్న..ఎడిటర్‌ కట్ట రాఘవేంద్రరావు : సునీత విషయంలో మంత్రుల వ్యాఖ్యలు ఎలా అర్ధం చేసుకోవచ్చు?
జవాబు..రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర : అసలు వాళ్లు మనుషులేనా? కనీసం మానవత్వం వారికి వుందా? ఒక మహిళగురించి ఇలాగే మాట్లాడతారా? జూబ్లీహిల్స్‌ బిఆర్‌ఎస్‌ అభ్యర్ధి సునీత భర్తను పోగొట్టుకొని వుంది. ఆరు నెలల సమయం కూడా కాలేదు. జనం ముందుకు వచ్చినప్పుడు, ప్రజలు గుర్తు చేస్తున్నప్పుడు సహజంగా ఏ మహిళనైన కన్నీళ్లు ఆపుకోలేదు. దాన్ని కూడా రాజకీయం చేయడం కాంగ్రెస్‌ పార్టీకే చెల్లింది. ఇలాంటి దుష్ట రాజకీయాలు మంత్రులు చేస్తుంటే ప్రజల చీ కొడుతున్నారు. సానుభూతి కోసం సునీత కన్నీళ్లు పెట్టుకుంటుందంటూ దిగజారుడు రాజకీయాలు కాంగ్రెస్‌ చేయడం దుర్మార్గం. అందుకే ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి బుద్ది చెప్పడానికి సిద్దంగా వున్నారు. కాంగ్రెస్‌ రాజకీయానికి చరమగీతం పాడేందుకు రెడీగా వున్నారు.
ప్రశ్న..ఎడిటర్‌ కట్ట రాఘవేంద్రరావు : రోడ్డు షోలకు జనం ఎగబడుతున్నారు?
జవాబు..రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర : బిఆర్‌ఎస్‌ పార్టీకి జనం నీరాజనం పలుకుతున్నారు. బ్రహ్మరథం పడుతున్నారు. బిఆర్‌ఎస్‌ ప్రచారంలో స్వయంగా ప్రజలే పాలు పంచుకుంటున్నారు. ఇంతకన్నా ఒక పార్టీకి గొప్ప సమయం ఏముంటుంది. అంతగా బిఆర్‌ఎస్‌ ప్రజల్లో వుంది. కేసిఆర్‌ కోసం తపిస్తున్నారు. మళ్లీ కేసిఆర్‌ పాలన రావాలనుకుంటున్నారు. అది మళ్లీ జూబ్లీహిల్స్‌ నుంచే నాంది కావాలని చూస్తున్నారు. అందుకు ఈ ఉప ఎన్నికలను వేదిక చేసుకుంటున్నారు. సునీత గెలుపు నల్లేరు మీద నడకే.. మెజార్టీ కోసమే మా ప్రచారం. ఇక కేటిఆర్‌ రోడ్‌ షోలకు జనం బ్రహ్మరథం పడుతున్నారు. నిజం చెప్పాలంటే జూబ్లీహిల్స్‌లో వున్న ఏడు డివిజన్ల ప్రజలు స్వచ్చందంగా రోడ్‌షోలకు తరలి వస్తున్నారు. కేటిఆర్‌ చెప్పే మాటలు వినడానికి వస్తున్నారు. కేటిఆర్‌ను చూడాలని జనం ఎగడతున్నారు. అసలు రోడ్‌ షోలకు వస్తున్న ప్రజలను చూసి కాంగ్రెస్‌ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. వేలాది మంది జనంతో రోడ్లన్నీ కిక్కిరిసిపోతున్నాయి. జనమే కేసిఆర్‌ పాటలు పెడుతున్నారు. కేరింతలు కొడుతున్నారు. డ్యాన్సులు చేస్తున్నారు. కేసిఆర్‌, కేసిఆర్‌ అంటూ నినాదాలు చేస్తున్నారు. చిన్న పిల్లలు సైతం బిల్డింగుల మీద నుంచి చూస్తూ, కేటిఆర్‌కు సెల్యూట్‌ చేస్తున్నారు. నమస్తే అంటుంటే పిల్లల్లో కూడా కేసిఆర్‌, కేటిఆర్‌ అంటే ఎంత అభిమానముందో తెలుస్తోంది. నిజంగా అంత మంది జనాలు వస్తున్నారంటే కేసిఆర్‌ పాలన లేని లోటు వారికి స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటి వరకు రోడ్‌ షోలకు వస్తున్న ఆదరణ అంతా ఇంతా కాదు. 2015లో ముస్సిపల్‌ ఎన్నికల సమయంలో కేటిఆర్‌ను చూసేందుకు జనం ఎలా ఎగబడ్డారో అంతకు మించి ఇప్పుడు వస్తున్నారు. బోరబండలో వచ్చిన జనాన్ని చూస్తే మతిపోతుంది. అలాగే అన్ని డివిజన్లలో కూడా రోడ్‌ షోలు ఎంతోవిజయవంతమౌతున్నాయి.
ప్రశ్న..ఎడిటర్‌ కట్ట రాఘవేంద్రరావు : జనం కేసిఆర్‌ను ఎంతగా గుర్తించుకున్నారు?
జవాబు..రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర : జూబ్లీహిల్స్‌లో వుంటే ప్రజానీకానికి పల్లె గురించి తెలియంది కాదు. పట్నం జీవితం తెలియంది కాదు. ఆ నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ గురించి మొత్తం తెలుసు. ఎందుకంటే జూబ్లీహిల్స్‌లోని ఏడు డివిజన్లలో తెలంగాణ పల్లెలనుంచి వచ్చినా ఇప్పటికీ ఆ మూలాలున్న వాళ్లు ఎక్కువ. వారికి పల్లెలతోఇప్పటికీ అనుబంధం వుంది. చాలా మందికి పల్లెల్లో భూములన్నాయి. ఇండ్లున్నాయి. అందువల్ల మేం ప్రచారానికి వెళ్లినప్పుడు ఒకప్పటి తెలంగాణ ఎలా వుండేది? కేసిఆర్‌ తెచ్చిన తెలంగాణ ఎలావుంది అనేది పూసగుచ్చినట్లు చెబుతున్నారు. పల్లెల్లో తెలంగాణ రాకముందు పడిన కష్టాలు ఏమిటో వారికి పూర్తిగా తెలుసు. పల్లెల్లో బతకలేక పట్నం వచ్చి ఇక్కడ చిన్నా చితకా వ్యాపారాలు, పనులు చేసుకుంటూ ఇక్కడే స్ధిరపడిన వారున్నారు. అయినా వారికి పల్లెల్లోనే బంధువులు, అయిన వారున్నారు. ఇక్కడి పరిస్దితులు, అక్కడి పరిస్దితులు అందరికీ తెలుసు. అందుకే కేసిఆర్‌ తెలంగాణ తేకముందు, తెచ్చిన తర్వాత అన్ని విషయాలు వాళ్లే మాకు చెబుతున్నారు. ప్రచారానికి ఉదయం వెళ్లి ఒక గల్లీ మధ్నాహ్నం వరకు ప్రచారం అక్కడ ముగిద్దామనుకుంటే నాలుగు ఇండ్లు దాటి వెళ్లలేకపోతున్నాం. అంటే ఆ ప్రజలు మమ్మల్ని చూసిన తర్వాత కేసిఆర్‌ను చూసినట్లు భావిస్తున్నారు. మాతో మాట్లాడుతుంటే కేసిఆర్‌తో మాట్లాడుతున్నట్లే అనుకుంటున్నారు. అంతలా కేసిఆర్‌ను జూబ్లిహిల్స్‌ ప్రజలు అభిమానిస్తున్నారు. ఒకప్పుడున్న కష్టాలకు ఇప్పుడు కేసిఆర్‌ వచ్చిన తర్వాత లేవని గుర్తు చేస్తున్నారు. కేసిఆర్‌ తెచ్చిన పథకాలను మాకే గుర్తు చేస్తున్నారు. వాటి వల్ల వారి జీవితాల్లో వచ్చిన మార్పులను గురించి చెబుతున్నారు. రైతు బంధు దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని రకాల సౌకర్యాలు చెబుతున్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్‌లో వుండే పేదల బస్తీలకు ఒకప్పుడు వారం రోజులకు కూడా సరైన మంచినీటి సరఫరా వుండేదికాదు. ఎండా కాలం జూబ్లిహిల్స్‌ ప్రజలు మంచినీటి కోసం పడే కష్టం అంతా ఇంతా కాదు. బోర బండ మీదకు రోడ్లు వేయడంతోపాటు, మంచినీటి సౌకర్యం కల్పించిన తీరు అద్భుతం. అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. రోజుకూ 20వేల లీటర్ల మంచినీరు అందుతోంది. అంతకుముందు వారం రోజులకు నీళ్లు వచ్చినా, తాగేందుకు మాత్రమే సరిపోయేవి. ముఖ్యంగా పించన్లు పొందుతున్న పెద్దలు మాత్రం కేసిఆర్‌ను దేవుడిలాగా కొలస్తున్నారు. ఇక వైద్యసేవల విషయంలో ఒకప్పుడు ఎలా వుండేది? ఇప్పుడు ఎలా వుందనేది గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు చేసిన సహాయం అంతా ఇంత కాదు. ఒకప్పుడు మహిళ పురుడు పోసుకునే వరకు పడే ఇబ్బందులు అయ్యే ఖర్చులు తల్చుకుంటున్నారు. ఇప్పుడు ప్రతి నెల ప్రభుత్వమే ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లోనే మందులు ఇస్తున్నారు. ప్రసవ సమయంలో ప్రభుత్వ వాహనం వస్తుంది. గర్బిణీ మహిళను తీసుకెళ్తుంది. ప్రసవం తర్వాత మళ్లీ ఇంటి దగ్గర దింపుతుంది. పైగా కేసిఆర్‌ ప్రసవమైన తర్వాత రూ.13వేలు ఇచ్చారు. కేసిఆర్‌ కిట్‌ ఇచ్చారు. కాని ఇప్పుడు అవి ఇవ్వడం లేదు. దాంతో ప్రజలు మళ్లీ ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తుందంటున్నారు. ఇలా ప్రతి సమస్యను చెప్పుకుంటూ కాంగ్రెస్‌ను తూర్పారపడుతున్నారు.
ప్రశ్న..ఎడిటర్‌ కట్ట రాఘవేంద్రరావు : ఎంత మెజార్టీతో గెలుస్తున్నారు?
జవాబు..రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర : ఊహించనంత మెజార్టీ సొంతం చేసుకుంటాం. జూబ్లీహిల్స్‌ నుంచి మళ్లీ విజయయాత్ర కొనసాగిస్తాం. తెలంగాణలో బిఆర్‌ఎస్‌ జెండా ఎగరేస్తాం. కేసిఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిగా చూస్తాం.
నేటిధాత్రి: ఆల్‌ది బెస్ట్‌.
రవిచంద్ర: ధంక్యూ..

సెంటర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌ ‘‘కేటీఆర్‌’’!

`జూబ్లీ హిల్స్‌ ఎన్నికల ప్రచారంలో కేటీఆరే కీలకం

`కాంగ్రెస్‌, బిజేపిలకు దక్కని క్రేజ్‌ కేటీఆర్‌ సొంతం

ktr jubliee hills election

`అన్ని రకాల ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్న కేటీఆర్‌

`అటు మీడియా సమావేశాలు.ఇటు పార్టీలో చేరికలు

`హైదరాబాదులో ప్రభుత్వ బాదితులతో సమావేశాలు

`సమయం చూసి హైడ్రాను ఉతుకుడు ఉతుకుతున్నాడు

`విస్మరించిన ప్రభుత్వ హామీలను గుర్తు చేస్తున్నాడు

`బాకీ కార్డులిచ్చి జనాన్ని చైతన్య పరుస్తున్నాడు

`అండగా వుంటామని వారికి భరోసా కల్పిస్తున్నాడు

`ఎక్కడికక్కడ సభలు, సమావేశాలు

`అన్ని డిజిజన్లలో పెద్ద ఎత్తున రోడ్‌ షోలు

`గతం కన్నా వినూత్నమైన రీతిలో ప్రచారాలు

`సీఎం. ‘‘రేవంత్‌ రెడ్డి’’కి కూడా కనిపించని క్రేజ్‌ ‘‘కేటీఆర్‌’’ సొంతం చేసుకున్నాడు

`కాంగ్రెస్‌ సభలకు రెట్టింపు జనాలు కేటిఆర్‌ సభలకు హజరౌతున్నారు

`‘‘కేటీఆర్‌’’ రోడ్‌షోలకు ప్రభంజనంలా తరలివస్తున్న జనం

`2015 జిహెచ్‌ఎంసి ఎన్నికలకు మించి సక్సెస్‌ అవుతున్న రోడ్‌షోలు

`పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ప్రచారంలో దూసుకుపోతున్నాడు

`ఒంటి చేత్తో పార్టీ స్టీరింగ్‌ పట్డుకొని కారు జోరు పెంచుతున్నాడు

`సారే రావాలని జనం కోరుకునేలా ప్రసంగాలు కొనసాగిస్తున్నాడు

`క్షణం తీరిక లేకుండా ‘‘జూబ్లీ హిల్స్‌’’ ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నాడు

`ప్రభుత్వం మీద పదునైన విమర్శనాస్త్రాలు సందిస్తున్నాడు

`అధికార పార్టీ కాంగ్రెస్‌ను గుక్క తిప్పుకోకుండా చేస్తున్నాడు

`ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ చేతులెత్తేసేలా ఇరుకున పెడుతున్నాడు

`‘‘కేటీఆర్‌’’ సభలు, రోడ్‌ షోలు జనంతో కళకళలాడుతున్నాయి

`‘‘కేటీఆర్‌’’ జిందాబాద్‌ నినాదాలతో సభలు మారుమ్రోగిపోతున్నాయి

`పిల్లలు సైతం ‘‘దేక్‌లేంగే’’ అని పాటలు పాడుతున్నారు

`’’కేటీఆర్‌’’ అంకుల్‌ నమస్తే అంటూ స్వాగతిస్తున్నారు

హైదరాబాద్‌, నేటిధాత్రి:
తులం బంగారం ఇయ్యరు. వృద్దులకు ఇస్తామని చెప్పిన నాలుగు వేల పించన్లు ఇయ్యరు. మహిళలకు ఇస్తామన్న రెండు వేల ఐదు వందలు ఇయ్యరు. విద్యార్దినులకు ఇస్తామన్న స్కూటీల జాడ లేదు. రైతులకు ఇచ్చే రైతు బంధుకు రాం..రాం..అంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వం మీద బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంటు కేటిఆర్‌ పంచ్‌ డైలాగులు కొడుతుంటే జూబ్లీహిల్స్‌ జనం కేరింతలు కొడుతున్నారు. కేటిఆర్‌ చెబుతున్నప్పుడు వంత పాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తున్నారు. అలవి కాని హమీలన్నీ ఇచ్చి ఇప్పుడు మాట మారుస్తున్న కాంగ్రెస్‌ పార్టీని జూబ్లీహిల్స్‌ ప్రజలు చిత్తు చిత్తుగా ఓడిరచాలంటూ చేస్తున్న వ్యాఖ్యలకు ప్రజలు చప్పట్లు కొడుతున్నారు. కారు గుర్తుకే మన ఓటు అంటూ కేటిఆర్‌ అంటుంటే రోడ్‌షోలకు హజరైన జనం మన ఓటు అంటూ దిక్కులు పిక్కటిల్లేలా అంటున్నారు. ఇదీ కేటిఆర్‌ క్రేజ్‌ అంటూ బి ఆర్‌ఎస్‌ శ్రేణులు సంబరపడుతున్నాయి. చాలా కాలం తర్వాత ప్రజలు బిఆర్‌ఎస్‌ పార్టీ ప్రచారంలో, స్ట్రీట్‌ కార్నర్‌ సభల్లో, కేటిఆర్‌ రోడ్‌షోలకు విపరీతంగా హజరౌతున్నారు. స్వచ్చంధంగా వచ్చి కేటిఆర్‌ చెప్పే మాటలు వింటున్నారు. కేటిఆర్‌ వేస్తున్న పంచ్‌ డైలాగులకు జనం ఊడిపోతున్నారు. ఇంతటి క్రేజ్‌ ఈ మధ్య మరే నాయకుడికి లేదు. సహజంగా బిఆర్‌ఎస్‌ అధినేత కేసిఆర్‌ను చూసేందుకు జనం ఇలా ఎగబడుతుంటారు. సభలకు హజరౌతుంటారు. ఆయన మాటలు వినడానికి లైవ్‌ కార్యక్రమాలు చూస్తుంటారు. ఇప్పుడు సరిగ్గా ఆ క్రెడిట్‌ను కేటిఆర్‌ సొంతం చేసుకున్నారు. జూబ్లీహిల్స్‌ ఎన్నికల ప్రచారంలో బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంటు కేటిఆర్‌ సెంటఆర్‌ ఆఫ్‌ అట్రాక్షన్‌గా నిలుస్తున్నారు. కేటిఆర్‌ సభలకు విచ్చినంత జనం ఇతర పార్టీలకు రావడం లేదు. కాంగ్రెస్‌ పార్టీ తరుపున అసలైన స్టార్‌ క్యాంపెయిన్‌ అయిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి సైతం ఇంత మంది రావడం లేదు. ఆయన సభలు చాలా సప్పగా సాగుతున్నాయి. గత వారం రోజుల నుంచి సిఎం. రేవంత్‌ రెడ్డి ఎంతో కష్టపడుతున్నారు. ప్రచారంలో విసృతంగా పాల్గొంటున్నాడు. అటు మంత్రులు, ఇటు కాంగ్రెస్‌ అభ్యర్ధిని వెంట పెట్టుకొని సిఎం. రేవంత్‌ రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు. దానికి తోడు రహమత్‌ నగర్‌లో సిఎం. రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో ఆగ్రహాన్ని తెప్పించాయి. జూబ్లీహిల్స్‌ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ గెలిస్తే ఇటీవల ఇచ్చిన 25వేల రేషన్‌కార్డులు కట్‌ అవుతాయని హెచ్చరించారు. ఉచిత కరంట్‌ బంద్‌ అవుతుందన్నారు. సన్న బియ్యం ఆపేస్తామన్నారు. సబ్సిడీ సిలిండర్‌ ఇవ్వమన్నారు. ఇదిలా వుంటే తాజాగా కొత్తగా నియామకమైన మరో మంత్రి అజహరుద్దీన్‌ కాంగ్రెస్‌ను గెలిపించకపోతే జూబ్లీహిల్స్‌ రాను అంటూ వ్యాఖ్యానించారు. ఇది కేటిఆర్‌కు ఆయుధాలుగా మారాయి. మామూలుగానే కేటిఆర్‌ లాంటి వాగ్ధాటి వున్న నాయకులకు చిన్న అవకాశం దొరికినా రచ్చ రచ్చ చేస్తారు. అలాంటిది సాక్ష్యాత్తు సిఎం. రేవంత్‌రెడ్డి బియ్యం ఆపేస్తాం. రేషన్‌ కార్డులు కట్‌ చేస్తామంటూ ప్రజలను బెదిరించేలా వ్యాఖ్యలు చేస్తే ఊరుకుంటారా? వీటిపై కేటిఆర్‌ ప్రభుత్వాన్ని తూర్పారపడుతున్నారు. దుమ్ము దుమారం రేపుతున్నారు. ప్రజలను చైతన్యం చేస్తున్నారు. ప్రజలను బెదిరిస్తే ఓట్లు పడతాయని రేవంత్‌ అనుకుంటున్నారు. అలాంటి నియంతకు తగిన బుద్దిచెప్పాలంటూ కేటిఆర్‌ ప్రజలకు సూచిస్తుంటే జనం చప్పట్లు కొడుతున్నారు. సహజంగా రోడ్‌ షోలలో కార్నర్‌ మీటింగ్‌లు పది నిమిషాలు, పావు గంట సాగితేనే ఎక్కువ. కాని కేటిఆర్‌ కార్నర్‌ సభలు గంటకు పైగా సాగుతున్నాయి. జోరు వానలో కేటిఆర్‌ మాట్లాడుతుంటే జనం కదలడం లేదు. పైగా వానలో కూడా డ్యాన్సులు చేస్తూ కేటిఆర్‌కే ఉత్సాహాన్ని నింపుతున్నారు. దాంతో కాంగ్రెస్‌, బిజేపి నాయకులకు దక్కని క్రేజ్‌ కేటిఆర్‌కు సొంతమౌతోంది. ఇక బిజేపి నుంచి స్టార్‌ క్యాంపెయినర్లు ఎంత మంది వున్నా, రోడ్‌షోలకు, సభలకు, ప్రచారానికి పెద్దగా స్పందన లేదు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో ఆది నుంచి అన్ని రకాల బాధ్యతలు కేటిఆర్‌ నిర్వహిస్తూ వస్తున్నారు. అన్ని రకాల ప్రచార బాద్యతలు ఆయన భుజాన వేసుకున్నారు. మాగంటి గోపీనాధ్‌ చనిపోయిన నుంచి జూబ్లీహిల్స్‌లో అనేక రకాల పార్టీ సభలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఎన్నికల సమయంలో పార్టీ నాయకులకు అప్పగించే బాధ్యతలు అప్పగించినా, అందిరికన్నా ఎక్కువ కష్టపడుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ మీద కౌంటర్ల కోసం ఎప్పటికప్పుడు మీడియా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వాన్ని, కాంగ్రెస్‌ పార్టీని తూర్పారపడుతున్నారు. పైగా ఓట్‌ చోరి అంశంలో జూబ్లీహిల్స్‌లో దొంగ ఓట్ల నమోదుపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎన్నికల కమీషన్‌ దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ఉప ఎన్నికల వేళ పార్టీలోకి పెద్దఎత్తున చేరికలు జరుగుతున్నాయి. అటు కాంగ్రెస్‌, ఇటు ఎంఐఎం, బిజేపిలనుంచి బిఆర్‌ఎస్‌లోకి డివిజన్ల వారిగా చేరికలు జరుగుతూనే వున్నాయి. వాటన్నింటికీ హజరౌతూ, వారితో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీ గెలుపుకోసం కృషి చేస్తున్నారు. పార్టీలోకి చేరుతున్న వారికి స్వయంగా కేటిఆర్‌ కండువాలు కప్పి ఆహ్వానిస్తున్నారు. వారిలో ఉత్సాహం నింపుతున్నారు. ఇక ఇటీవల ప్రభుత్వం వల్ల నష్టపోయిన హైడ్రా బాదితులు, మూసీ బాధితులను స్వయంగా కలుస్తున్నారు. వారు తెలంగాణ భవన్‌కు వస్తామంటే రమ్మంటున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. ఆ కుటుంబాలు పడిన భాధనలు, వేధనలు వింటున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా హైడ్రా బాదితులతో ఇటీవల ఏర్పాటు చేసిన సమావేశం చూసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం వణికిపోయిందనే చెప్పాలి. అందుకే వెంటనే స్పందించిన కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంటు జగ్గారెడ్డి హైడ్రా వల్ల తమ పార్టీకి నష్టం జరుగుతోందని అన్నారు. అంటేనే హైడ్రా పేదల జీవితాలను ఎలా తలకిందులు చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు. తెలంగాణ భవన్‌కు వచ్చిన చిన్న పిల్లలు తమ అనుభవాలను చెబుతూ కన్నీటి పర్యంతమౌతుంటే కేటిఆర్‌ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రజలను ఓదార్చే ప్రయత్నం చేశారు. ఇలా అన్ని వర్గాల ప్రజలనుంచి కేటిఆర్‌ ప్రశంసలు అందుకుంటున్నారు. ఇక ఎన్నికల ముందు కాంగ్రెస్‌పార్టీ ఇచ్చిన హమీలు, ప్రజలకు ప్రభుత్వం వున్న బాకీలను గుర్తు చేస్తూ ప్రచారం సాగిస్తున్నారు. బాకీ కార్డులను ప్రజలకు అందజేస్తూ, ప్రచారానికి వస్తున్న కాంగ్రెస్‌ నాయకులను నిలదీయాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం వల్ల నష్టపోయిన వారికి హైడ్రా బాధితులకు తప్పకుండా పార్టీ అండగా వుంటుందని భరోసా కల్పిస్తున్నారు. పొరపాటున జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ను నమ్మితే, ఇక్కడికి కూడా బుల్డోజర్‌ వస్తుందని ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇలా ఎక్కడిక్కడ సభలు, సమావేశాలు నిర్వహిస్తూ క్షణం తీరుకలేకుండా ప్రచారంలో పాల్గొంటున్నారు. బిఆర్‌ఎస్‌ అభ్యర్ది సునీతను గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. గతం కన్నా వినూత్నమైన రీతిలో కేటిఆర్‌ ప్రచారం సాగిస్తున్నారు. ఎల్‌ఈడీ స్క్రీన్‌లలో ప్రభుత్వం ఇచ్చిన హమీలు, చేసిన మోసాలు చూపిస్తూ ప్రచారంలో పాల్గొంటున్నారు. దాంతో కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం చేసిన మోసాలను గుర్తు చేస్తూ ప్రజలను చైతన్యం చేస్తున్నారు. సిఎం. రేవంత్‌రెడ్డి సభలకు, రోడ్‌షోలకు వస్తున్న జనాలకంటే రెట్టింపు జనాలు కేటిఆర్‌ సభలకు ప్రజలు హజరౌతున్నారు. కేటిఆర్‌ రోడ్‌షోలకు జనం ప్రభంజనంలా వస్తున్నారు. 2015 జిహెచ్‌ఎంసి ఎన్నికల సమయంలో కేటిఆర్‌ రోడ్‌షోలకు జనం తండోపతండాలుగా వచ్చే వారు. కేటిఆర్‌ ఎక్కడికెళ్లినా జనం పెద్దఎత్తున సమూహమయ్యేవారు. ఇక రోడ్‌షోలలో కేటిఆర్‌ వెహికిల్‌ కదిలేది కాదు. అంత జనం వచ్చే వారు. ఇప్పుడు సరిగ్గా జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారంలోనూ కేటిఆర్‌ సభలకు ప్రజలు వస్తున్నారు. కేటిఆర్‌కు హైదరాబాద్‌ ప్రజల్లో ఎంత ఆదరణ వుందో, క్రేజ్‌ వుందో ఈ రోడ్‌షోల ద్వారా మరోసారి రుజవౌతోంది. తెలంగాణ ప్యూచర్‌ లీడర్‌ కేటిఆరే అనేది తేలిపోతోంది. అందుకే కేటిఆర్‌ను చూస్తూ జనం కేరింతలు కొడుతున్నారు. ఈలలు, చప్పట్లతో ఆయన మాటలకు ఫిదా అవుతున్నారు.

దెబ్బ మీద దెబ్బ!

`వరుస విపత్తులతో తెలంగాణ రైతు కుదేలు!

`ప్రకృతి కన్నెర్రతో రైతు పడుతున్న అష్ట కష్టాలు

`ఈ ఏడాది రైతుపై పగ పెంచుకొని గండాలు తెచ్చిన కాలం

`అతివృష్టితో తెలంగాణ వ్యవసాయం అతలాకుతలం

`ముందుగా మురిపించి ముఖం చాటేసిన వరణుడు

`తొలకరితో విత్తనాలు చల్లి రైతు నష్టపోయాడు

`ఆలస్యంగా కురిసిన అంతులేని వర్షాలు

`అటు విత్తనాలు, ఎరువుల కష్టాలు

`తీరా పంట చేతికొచ్చే సమయంలో ‘‘మోంథా’’ చెడగొట్టు వానలు

`పొలంలో వున్న వరి ఒరిగిపోయి, వంగిపోయి, రాలిపోయింది

`చేతికందకుండా నీళ్ళలో మురిగి చెడిపోయింది

`కోత కోసి ఆరబెట్టిన వడ్లు కల్లాలలో కొట్టుకుపోయాయి

`పుట్లకొద్దీ వడ్లు కళ్ల ముందు మాయమైపోయాయి

`లక్షల రూపాయల రైతు పెట్టుబడి నీళ్లపాలైంది

`రైతు ఆరు నెలల కష్టం కన్నీటి పాలైంది

`ఈ రబీ పంటలు దుఖాన్ని మిగిల్చాయి!

`తెల్ల బంగారమంతా నల్లని బొగ్గైపోయింది

`వానకు తడిసి రాలి నేలపాలై కొట్టుకుపోయింది

`ఏ పంట చేతికందక రైతుకు అప్పులు మెడకు చుట్టుకున్నాయి

`ప్రభుత్వం ఆదుకుంటే తప్ప బతకలేని పరిస్థితులు దాపురించాయి

హైదరాబాద్‌, నేటిధాత్రి:                         రైతంటే పాలకులకే కాదు, ప్రకృతికి కూడా చిన్న చూపే వుంది. ప్రతిసారి అయితే అతి వృష్టి లేకుంటే అనావృష్టితో రైతు జీవితంతో కాలం ఆటలాడుకుంటోంది. రైతుకు అడుగడుగునా ప్రకృతి పరీక్ష పెడుతోందో..పగ పెంచుకుంటుందో అర్దం కావడం లేదు. దశాబ్దాలపాటు కనికరం చూపించని పాలకులు, కరువును తెచ్చి రైతుల జీవితాలను ఆగం చేసిన వరణుడు వణికిస్తున్నారు. ఏనాడు రైతును కడుపులో పెట్టుకున్న పాలకులు లేరు. ఏనాడు రైతుకు సహకరించిన కాలం లేదు. అయినా రైతు తన భూమిని నమ్ముకొని బతుకుతూనే వున్నాడు. దేశానికి అన్నం పెడుతూనే వున్నారు. తన పొట్ట నిండపోయినా, చేసిన అప్పుల కోసమైనా రైతులు పంటలు పండిరచాల్సి వస్తోంది. అప్పుల మీద అప్పులు చేసుకోవాల్సి వస్తోంది. భూమిని నమ్ముకున్నందుకు రైతు బాగు పడిరది లేదు. కడుపు నిండా తిన్నది లేదు. కంటి నిండా నిద్ర పోయింది లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత రైతుకు ఊరట లభించింది. కొంత మెరుగైన జీవితం మొదలైంది. ఒకనాడు నీళ్లు లేక పంటలు పండక, కరువు రక్కసి కాటేస్తుంటే బతకలేక వలసలుపోయిన తెలంగాణ కటిక దరిద్రం అనుభవించింది. ఆనాడు పాలకులు కనీసం పట్టించుకోలేదు. తెలంగాణ మేలు కోరలేదు. రాజుల కాలంలో రైతును పీడిరచుకుతిన్నారు. ప్రజా పాలకులు రైతులను నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారు. ఈ రెండిరటికీ పెద్ద తేడా లేదు. కాని రైతు మాత్రం గోస అనుభవిస్తున్నాడు. చుక్క నీరు చూడని తెలంగాణ పచ్చగా మారడం కాలానికి కూడా కన్ను కుట్టినట్లుంది. పంట చేలు పచ్చ కనిపిస్తుంటే కన్ను కుట్టినట్లుంది. అందుకే ఈ సారి రైతును కాలం అరిగోస పెడుతోంది. రైతుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ ఆరు నెలలు రైతు అనుభవించిన కష్టం అంతా ఇంతా కాదు. ఎప్పుడూ లేని విధంగా మే నెలలో వరణుడు ఊరించాడు. రైతు సంతోషించాడు. ఒక నెల ముందుగానే కాలమౌతోందని సంబరపడ్డాడు. ఆ ఆనందం మిగలకుండా వరణుడు మళ్లీ ముఖం చాటేశాడు. రైతు మీద కన్నెర్ర చేశాడు. మేలో నీళ్లను కురిపించి, జూన్‌లో సూర్యునితో చేతులు కలిపి, నిప్పులు కురిపించాడు. జూన్‌లో కరువు రుచి చూపించాడు. తెలంగాణ వ్యాప్తంగా భూ గర్భ జలాలు అడగంటేలా చేశాడు. రైతుల ఆశల మీద నిప్పులు కురిపించాడు. రైతుకు ఆత్రమెక్కువ. నీళ్లను చూసి ఆగలేడు. నీళ్లు కనిపిస్తే సాగు చేయకుండా వుండలేడు. నేల తల్లికి మొక్కకుండా వుండలేడు. అందుకే మేలో కురిసిన వానలకే దుక్కి దున్ని విత్తనాలు చల్లాడు. ఒక నెల మందుగానే పంట చేతికొస్తుందని సంబరపడ్డాడు. వేలాది రూపాయలు ఖర్చు చేసి భూమి చదును చేయించుకున్నాడు. ఈసారి తెల్ల బంగారం పండిరచాలని కలలు గన్నాడు. ముఖ్యంగా పత్తి పంట ఉత్తర తెలంగాణలో ఎక్కువ. అందులోనూ ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పత్తి పంట విరివిగా పండే అవకాశం వుంది. ముందుగా మురిపించిన వానను చూసి పత్తిని సాగు చేశాడు. కాని రైతు ఆత్రం కాలానికి అర్ధం కాలేదు. రైతు కష్టం చూసి చలించలేదు. జూన్‌లో ఎండలు కాసి, మొలకెత్తిన మొక్కలను మాడిపోయేలా చేసింది. వేసిన విత్తనాలు పురుగుల పాలు చేసింది. అయినా రైతు కన్నీళ్లను దాచుకొని మళ్లీ కురిసిన వానలకు పత్తి వేశాడు. వరి రైతు ఆలస్యంగానే పంటలు వేశాడు. ఈ రెండు పంటలే కాకుండా మర్చి, ఇతర ధాన్యపు పంటలు కూడా రైతు సాగు చేశారు. వాటికి అవసరమైన ఎరువుల కోసం నెలల తరబడి ఎదురుచూశారు. కాని అందలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఏటా పడిన కష్టాలు ఈసారి మళ్లీ తెలంగాణ రైతులు పడ్డారు. మందు బస్తాలు దొరకలేదు. సమాయానికి అందలేదు. ఎకరానికి అవసరమైన యూరియాను సరఫరా చేయలేకపోయారు. కేంద్రం, రాష్ట్రం మీద, రాష్ట్రం కేంద్రం మీద నెపాలు నెట్టేసుకున్నాయి. రైతును ఆగం చేశాయి. ఓ వైపు వరి వేసి రెండు నెలలౌతున్నా, ఒక్క యూరియా బస్తా అందక పంట పెరడం లేదని బాధపడుతన్నా, ఇచ్చిన వాళ్లు లేరు. రాష్ట్రానికి అవసరమైన ఎరువులు ఎన్నో అనేది రాష్ట్ర ప్రభుత్వం చూసుకోలేదు. అధికారులు నివేదికలు తయారు చేయలేదు. కేంద్రానికి లెక్కలు పంపలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ముందే జాగ్రత్తపడలేదు. ఇది రెండు ప్రభుత్వాల పాపమే. అటు ప్రకృతి ఆవేశం, పాలకుల నిర్లక్ష్యం మూలంగా దిగుబడి సగానికి తగ్గే పరిస్ధితి ఎదురైంది. అయినా వచ్చిన పంటే చాలనుకున్న రైతుకు మోంధా తుఫాను రూపంలో సర్వం నాశనం చేసింది. చేతికొచ్చిన పత్తి పంట మూడు రోజుల రికార్డు స్ధాయి వానలకు రాలిపోయింది. నీళ్లలో కలిసిపోయింది. తెల్లబంగారం కాస్త నల్లని బొగ్గులా మారిపోయింది. చేళ్లలో నిండిన నీళ్లలో మురిగిపోయింది. ఇంతటి దుస్ధితి గతంలో ఎప్పుడూలేదు. కరువు వచ్చిన రోజుల్లో కూడా రైతు ఇంతగా కష్టం ఎదుర్కొలేదు. అప్పుడు పెట్టిన పెట్టుబడి అయినా చేతికొచ్చేది. ఇప్పుడు పెట్టుబడితోపాటు, కష్టం నీళ్లపాలైంది. నీళ్లలో కొట్టుకుపోయంది. తెల్ల బంగారాన్ని నమ్ముకుంటే మహిళల మీద వున్న బంగారాన్ని అమ్ముకొని అప్పులు తీర్చుకోవాల్సిన దుష్టకాలం దాపురించింది. ఇదిలా వుంటే వరి రైతుల కష్టం అంతా ఇంత కాదు. జూలై నెలలో కురిసిన వర్షాలను నమ్ముకొని కొంత మంది ఆలస్యంగా పంటలు వేసుకున్నారు. మేలో పడిన వర్షాలను నమ్ముకొని వరి నాట్లు వేసిన రైతులు ఇప్పటికే ఒకసారి నష్టాన్ని తెచ్చుకున్నారు. ఇప్పుడు మోంధా తుపానుతోపాటు, వరసగా కురిసిన వర్షాలకు మొత్తం పంట చేతికి రాకుండాపోయి కన్నీటి పర్యంతమౌతున్నాడు. ముందుగా వరి నాట్లు వేసిన రైతులు చాల మంది పంటలు కోశారు. కళ్లాలల్లో వడ్లను ఆరపెట్టుకున్నారు. కొంత మంది మార్కెట్లకు తరలించారు. కాని కాంటాలు పెట్టలేదు. తూకాలు వేయలేదు. ప్రభుత్వం ఇంకా కొనుగోలు చేయలేదు. ఒక్కసారిగా ఉరుము లేకుండా వచ్చిన పిడుగులాంటి తుఫానుతో ఆరబెట్టిన వడ్లు కొట్టుకుపోయింది. లక్షలకు లక్షలు చేసిన అప్పులు కనిపిస్తున్నాయి. చేతికొచ్చిన పంట కొట్టుకుపోతుంటే గుండెలు అవిసిపోతున్నాయి. పుట్లకు పట్లు కళ్లముందు కొట్టుకుపోతుంటే చూసి తట్టుకోలేకపోయారు. ఆరు నెలల కష్టం గంగపాలౌతుంటే చూస్తూ గుండెలు బాదుకున్నాడు. కోత కోసిన రైతు గుండె కోతలు మిగులుతున్నాయి. ఇక పంట కోయని రైతు కష్టం అంతకన్నా ఎక్కువైపోయింది. మోంధా తుఫానుకు వరి వంగిపోయింది. పొలంలో నిండిని నీళ్లలో కూరుకుపోయింది. మూడు రోజలు పాటు నీళ్లలో మునిగి మురిపిపోయింది. చేతికి రాకుండాపోయింది. రాలిపోయి కొట్టుకోపోయేది పోయింది. నీళ్లలో ముగినిపోయింది నల్లగా మారిపోయింది. కోతకు కూడా పనికి రాకుండాపోయింది. ఇంతటి కష్టం రైతుకు వస్తుందని ఎవరూ ఊహించలేదు. తుఫానులంటే సహజంగా ఆంద్రా ప్రాంతానికే పరిమితమనుకునే తెలంగాణకు తుఫాను కూడా రక్కసిలా మారుతుందని కలలో కూడా ఎవరూ అనుకోలేదు. రికార్డు స్ధాయి వానలు కురిసి కుదేలైపోవాల్సి వస్తుందిన కల గనలేదు. ఇటు ప్రజలు, అటు రైతులు అల్లాడిపోయారు. ఇలాంటి పరిస్ధితులు కాకున్నా, గతంలో కేసిఆర్‌ వున్నప్పుడు వచ్చిన అకాల వర్షాల సమయంలో రూ.560 కోట్లు విడుదల చేశారు. ఒక్క రోజులో రైతులను ఆర్ధికంగా ఆడుకున్నారు. ఎకరాకు రూ.10 వేలు బ్యాంకుల్లో వేసి రైతు కన్నీటిని కొంత వరకు తూడ్చారు. తర్వాత పంట ఎలా వున్నా కొనుగోలు చేశారు. కాని ఇప్పుడు కొట్టుకుపోయిన పంట ఎలాగా చేతికి రాదు. దానికి లెక్కలు లేవు. పొలాల్లోనే మురిగిపోయిన వరికి చేతికొచ్చేలా లేదు. రైతుకు ఓదార్పు దక్కేలా లేదు. రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటుందని ప్రభుత్వం మాత్రం ప్రకటించింది. తక్షణ సాయం కింద రూపాయి అందలేదు. రైతుకు ఓదార్పు ఇంకా దక్కలేదు. ఆదుకుంటారా… నాలుగు రోజులు గడిస్తే అందరూ మర్చిపోతారా? అన్నది చూడాలి. రైతుకు కష్టం వస్తే సాయం చేసే వాళ్లు లేరు. గతంలో తుఫానులు అంటే అందరూ స్పందించేవాళ్లు. ఆంధ్రా రైతులను ఆదుకునే వారు. సినీ వర్గాలు ముందుగా స్పందిస్తూ వచ్చేవి. మోంధా తుఫాను ఏపిపై కరుణ చూపించి, తెలంగాణను కనికరం లేకుండా నాశనం చేసింది. కాని సినీ పెద్దలకు ఈ విపత్తు కనిపించడం లేదు. సాయం చేస్తామన్న మాట ఎక్కడా ఇంత వరకు వినిపించలేదు. తెలంగాణ రైతంటే అంతే..ఎవరికీ పట్టని విగత జీవి అంతే!!

అధికారం రేవంత్‌ పుణ్యమే!

`ఎవరు ఔనన్నా కాదన్నా సత్యమిదే!

`మూడేళ్ళు రేవంత్‌ పడిన కష్టం అందరికీ తెలిసిందే!

`పిసిసి. ప్రెసిడెంట్‌ అయ్యాక పార్టీకి పెరిగిన బలమే.

`పార్టీ కార్యకర్తల్లో రేవంత్‌ నింపిన నమ్మకమే.

`నాయకులకు కూడా రేవంత్‌ వల్లనే జనం ఆదరణ.

`పదేళ్ల ప్రతిపక్షంలో రేవంత్‌ ఒక్కడు జరిపిన పోరాటమే.

`ఏ ఇతర నాయకుడు రోడ్డెక్కింది లేదులే.

`కేసీఆర్‌ మీద తిరగబాటు చేసింది రేవంత్‌ ఒక్కడే.

`అడుగడుగునా కేసీఆర్‌ ను ఎదుర్కొన్నది రేవంతే.

`కేసీఆర్‌ పాలనలో అవినీతిని వెలికితీసింది ఆయనే.

`కేసీఆర్‌ ను ఎదిరించడానికి అందరూ భయపడిన వాళ్లే.

`కోవర్టులుగా ఆరోపణలు ఎదుర్కొన్నది చాలా మందే.

`ఇప్పుడు బీరాలు పలుకుతున్న వాళ్లంతా కేసీఆర్‌ టైంలో సైలెంటే.

`కేసీఆర్‌ మీద కన్నా రేవంత్‌ మీదే ఎక్కువ యుద్ధం చేసినవాళ్లే.

`రేవంత్‌ పిసిసి కాకుండా అడ్డుకున్న వాళ్లే.

`రేవంత్‌ ను ఆనాడు నెగలకుండా చేసిన వాళ్లే.

`అధికారంలోకి తెచ్చినా రేవంత్‌ సీఎం కాకుండా శత విధాల ప్రయత్నించిన వాళ్లే.

`ఇప్పటికీ సిఎం సీటు కోసం ఆశ పెట్టుకున్న వాళ్లు చాలా మందే.

`కాంగ్రెస్‌ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేసి నిలిచింది రేవంతే.

`పార్టీని ఒంటి చేత్తో గెలిపించిన ఘనత రేవంత్‌ దే!

హైదరాబాద్‌, నేటిధాత్రి:                                                  

 అదికారంలో వున్నప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో అందరూ హీరోలే. అదికారంలోకి తీసుకురావడానికి కష్టపడంలో మాత్రం అందరూ దూరమే. పార్టీ అధికారంలోకి వస్తే మాత్రం వారికంటే పెద్ద నాయకులు లేరని అందరూ అనుకుంటారు. పార్టీ అధికారంలోకి వస్తే మేమే ముఖ్యమంత్రులంటారు. కాని అందరం కలిసి అదికారంలోకి తీసుకొద్దాం. కష్టపడదాం అనే ఆలోచనలు చేసే నాయకులు పెద్దగా కనిపించరు. అది ఆ పార్టీకి అలవాటైందో..లేక అదే సంస్కృతిగా మారిందో గాని, పార్టీ కోసం కష్టపడే నాయకులు మాత్రం పెద్దగా కనిపించరు. కాని పార్టీ అధికారంలో వున్నప్పుడు నిత్యం వివాదాలు సృష్టిస్తుంటారు. పార్టీ ప్రతిపక్షంలో వున్నప్పుడు అలాగే విడివిడిగా వుంటారు. పార్టీ పదవులు కావాలనుకుంటారు. ఒకప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో పిసిసి. పదవి ఎవరిని వరిస్తుందో కూడా తెలిసే పరిస్దితి వుండేది కాదు. మాకు ఆ పదవి వద్దని చెప్పేవారు కూడా వుండేవారు కాదు. కాని తెలంగాణ వచ్చిన తర్వాత తొలి పిసిసి అద్యక్షుడైన పొన్నాల లక్ష్మయ్య ఆ పదవి నిర్వహించడం నా వల్ల కాదు. పార్టీని నడపడం నాకు చేతగాదని వదిలేశారు. తర్వాత మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని చేశారు. ఆయన కూడా 2018 ఎన్నికల దాకా పార్టీని నడిపాడు. తర్వాత ఆ పదవి నాకొద్దనుకున్నాడు. అప్పటికే రెండుసార్లు పార్టీ ఓడిపోయింది. ఇక పిపిసి అధ్యక్షుడు సమర్ధవంతమైన నాయకుడికి ఇవ్వాలని అదిష్టానం భావించింది. పిసిసి. పదవి ఇస్తే పార్టీని ఖచ్చితంగా అధికారంలోకి తీసుకొస్తానని సిఎం. రేవంత్‌ రెడ్డి భరోసా కల్పించారు. ఆ పని ఇతర నాయకులు ఎవరూ చేయలేదు. కాని పిపిసి అధ్యక్షుడు కావాలని మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఆశించారు. మరో నాయకుడు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా కోరుకున్నారు. వారిద్దరినీ కాదని అధిష్టానం రేవంత్‌ రెడ్డికి ఇచ్చారు. ఆ సమయంలో వి. హనుమంత రావు లాంటి నాయకుడు కూడా నేను అర్హుడిని కాదా? అంటూ ప్రశ్నించిన రోజులున్నాయి. ఇక రేవంత్‌రెడ్డి పిపిసి. అధ్యక్షుడైన తర్వాత కాళ్లలో కట్టెలు పెట్టినట్లు అటు వెంకటరెడ్డి, ఇటు జగ్గారెడ్డి, వి. హనుమంతరావు, మధుయాష్కీ గౌడ్‌ లాంటి వారు అనేక ప్రయత్నాలు చేశారు. పిసిసి. అధ్యక్షుడుగా రేవంత్‌ రెడ్డిని విఫల అద్యక్షుడుగా చేయాలని చూశారు. కాని అందరి ఊహలు పటా పంచెలు చేస్తూ రేవంత్‌ రెడ్డి దూసుకెళ్లారు. రేవంత్‌రెడ్డి పదవిని కొనుగోలు చేశారంటూ కూడా ఘాటైన వ్యాఖ్యలు వెంకటరెడ్డి చేసిన సందర్భం వుంది. పిసిసి. అద్యక్షుడుగా రేవంత్‌రెడ్డి జిల్లాల పర్యటన పెట్టుకున్నప్పుడు తనకు తెలియకుండా నల్లగొండకు ఎలా వస్తాడంటూ ప్రశ్నించారు. రేవంత్‌ రెడ్డి నల్లగొండకు రావాల్సిన అవసరం లేదు. ఆ జిల్లా నా సొంతం. అక్కడ ఏ రాజకీయమైనా తన కనుసన్నల్లో జరగాలన్నట్లు కూడా మాట్లాడిన సందర్భాలున్నాయి. రాజగోపాల్‌ రెడ్డి పిసిసి. అధ్యక్షుడుగా వున్న రేవంత్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు అన్నీ ఇన్నీ కావు. పైగా ఆయన పార్టీకి రాజీనామా చేసి బిజేపిలో చేరారు. మునుగోడు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ఆ సమయంలో మంత్రి వెంకటరెడ్డి ఆస్ట్రేలియాలో వున్నారు. ఎన్నికలు జరిగిన తర్వాత వచ్చారు. ఆస్ట్రేలియా నుంచి నాయకులకు ఫోన్‌లు చేసి ఏం మాట్లాడారో కూడా పార్టీ నాయకులు తెలుసు. ఇదే దారిలో జగ్గారెడ్డి కూడా రేవంత్‌ రెడ్డి మెదక్‌ ఎలా వస్తారంటూ నిలదీసిన సందర్భం వుంది. మెదక్‌ జిల్లాకు వచ్చే ముందు నాకు సమాచారం ఇవ్వరా? అంటూ ప్రశ్నించారు. పిపిసి. అధ్యక్షుడైతే కొమ్ములున్నాయా? అంటూ కూడా ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. అయినా అందరిన్నీ కలుపుకుపోయి, ఎంతో సహనంతో పదవిని రేవంత్‌ రెడ్డి నిర్వహించారు. నిజానికి ఆ సమయంలో రేవంత్‌ రెడ్డి ఇచ్చిన సమాధానాలు ఎంతో హుందాగా వుండేవి. తిట్టేవాళ్లుంతా నా వాళ్లే. వాళ్లంతా నాకు సోదరులే. అంటూ నవ్వుతూ రేవంత్‌ సమాధానమిచ్చేవారు. కొంత మంది నాయకులు ఎంత రెచ్చగొట్టాలని చూసినా ఏనాడు రేవంత్‌రెడ్డి తన అదుపు తప్పలేదు. అప్పటి బిఆర్‌ఎస్‌ నాయకులతోపాటు, సొంత పార్టీ నాయకులు రేవంత్‌ రెడ్డిని ఎంత డీమోరలైజ్‌ చేయాలని చూసినా ఏనాడు అదుపు తప్పలేదు. సొంత పార్టీ నేతలను ఏనాడు పల్లెత్తు మాట అనేలేదు. తన లక్ష్యం మాత్రమే చూసుకున్నాడు. పార్టీకి ఇచ్చిన హమీ మాత్రం గుర్తు చేసుకుంటూ ముందుకు సాగారు. పార్టీని ఎలా అధికారంలోకి తీసుకురావాలన్నదానిపైనే దృష్టిపెట్టారు. పిపిసి. అధ్యక్షుడైన నుంచి మొదలు, పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దాకా ఆయన పడిన శ్రమ అంతా ఇంత కాదు. పార్టీని నడపడం అంటే పాన్‌ డబ్బా నడిపినంత సులువు కాదని ఓసారి కేసిఆర్‌ అన్నాడు. అలాగే పిపిసి. పదవులు నిర్వహించడం తమ వల్ల కాదని వదిలేసిన వారి ముందు పార్టీని అధికారంలోకి తీసుకురావడం అనేది సామాన్యమైన విషయం కాదు. రేవంత్‌రెడ్డి పిపిసి. అధ్యక్షుడు అయ్యే వరకు తెలంగాణలో కాంగ్రెస్‌ ఎంతో బలహీనంగా వుండేది. ఎప్పుడైతే రేవంత్‌ రెడ్డి తన పదునైన వ్యూహాలతో ముందుకు సాగారు. ఆ సమయంలో జరిగిన ఉప ఎన్నికల్లో గెలుస్తూ బిజేపి మంచి ఊపు మీద వున్నది. దానిని కాదని దాటుకుంటూ వెళ్లి, ప్రజల మన్ననలు పొంది, అధికారంలోకి తీసుకురావడానికి రేవంత్‌రెడ్డి చేసిన ప్రయత్నం ఎంతో గొప్పది. అందుకే ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా పార్టీని అధికారంలోకి తసుకొచ్చింది మాత్రం ముమ్మాటికీ సిఎం. రేవంత్‌ రెడ్డి మాత్రమే. ఇక్కడ సమిష్టి కృషి అనే పదం ఇప్పటికీ రేవంత్‌ రెడ్డి తన హుందాతనాన్ని నిలుపుకోవడానికి చెబుతుంటారు. అంత కష్టపడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినా ఆయనను సిఎం. కాకుండా అడ్డుకోవడానికి శత విధాలుగా ప్రయత్నించిన నాయకులున్నారు. ఆఖరుకు అధిష్టానం ఆదేశాలతో మాత్రమే వాళ్లు చల్లబడ్డారు. పార్టీని ఎవరు అదికారంలోకి తీసుకొచ్చారో మాకు తెలుసు. అందులో ఎవరి కష్టం ఎంత వుందో తెలుసని తలంటిన తర్వాతే వారి వారి ప్రయత్నాలు విరమించుకున్నారు. రేవంత్‌ రెడ్డి సిఎం. కావడాన్ని అయిష్టంగానే అంగీకరించారు. అయినా ఎప్పుడు అవకాశం దొరుకుతుందా? రేవంత్‌రెడ్డి ఫెయిల్యూర్‌ సిఎం కావాలని కలలు కంటున్నవాళ్లు కూడా వున్నారు. ఈ విషయాలు అన్నీ తెలిసినా సిఎం. రేవంత్‌ రెడ్డి మౌనంగానే వుంటున్నారు. వారితో సఖ్యతతోనే వుంటున్నారు. తాను సిఎం. అనేది ఎక్కడా చూపించకుండా వారందరికీ ఎంతో మర్యాదను ఇస్తున్నారు. తనతో సమానంగా చూసుకుంటున్నారు. వారి వారి శాఖల్లో ఇప్పటి వరకు రేవంత్‌ రెడ్డి జోక్యం చేసుకున్న సందర్భాలు లేవు. మంత్రులకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. దాని వల్ల కూడా ఏం జరుగుతుందో సిఎం. రేవంత్‌రెడ్డికి తెలియంది కాదు. అయినా ఇప్పటి వరకు ఏ మంత్రిని కూడా మందలించింది లేదు. దాంతో సిఎం.రేవంత్‌ రెడ్డి తమను జోలికి రావడానికి భయపడుతున్నారన్న ఆలోచనలో కొంత మంది మంత్రులున్నట్లు కూడా పార్టీలో చెప్పుకుంటుంటారు. ప్రభుత్వాన్ని కొంత మంది మంత్రులు ఎలా అబాసుపాలు చేస్తున్నారో అందరూ చూస్తున్నదే. ఏ ఏ మంత్రి మీద ఎలాంటి ఆరోపణలు వస్తున్నాయో తెలియంది కాదు. సరైన సమయం కోసం సిఎం. రేవంత్‌ రెడ్డి ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వాన్ని నిర్వహించడం, కాపాడుకోవడం, మళ్లీ పార్టీని అదికారంలోకి తీసుకురావడం అనేది కష్టపడేవారికి మాత్రమే తెలుస్తుంది.. పార్టీని ఎంత కష్టపడి అదికారంలోకి తీసుకొచ్చాడో సిఎం. రేవంత్‌ రెడ్డికి మాత్రమే తెలుసు. ఇతర మంత్రులలో ఎంత మంది పార్టీని భుజాల మీద వేసుకొని ముందుకు సాగారో జనానికి కూడా తెలుసు. అందుకే ఇప్పటికీ సిఎం. రేవంత్‌ రెడ్డి ఎంతో ఓపికతో వుంటున్నారు. ఈ మధ్య వివాదాలు అనేకం తలెత్తినా, ఆయన మంత్రి వర్గ సమావేశంలో మంత్రులకు తలంటారే గాని, బైట ఏనాడు వారిపై నోరు విప్పలేదు. అదీ హుందాతనం అంటే..అదే స్ధానంలో ఇతర నాయకులెవ్వరున్నా ఈ పాటికి కంపు కంపు చేసేవారు. కాని రేవంత్‌ రెడ్డి ఎంతో హుందాగా, పదవి నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇప్పుడు పార్టీ హైకమాండ్‌ కూడా ఈ విషయాలన్నీ తెలుసుకొని ఆయనకు ఫ్రీ హాండ్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతుంది. అప్పుడు అసలైన ఆట, రాజకీయం, పాలన రేవంత్‌ చూపిస్తాడని తెలుస్తోంది.

హై కమాండ్‌..రేవంత్‌కు ఫ్రీ హాండ్‌!

`అందరినీ దారిలో పెట్టే బాధ్యత!

`అన్ని విధాలుగా పూర్తి అధికారం

`పని చేయని వారిని పక్కన పెట్టండి

`పార్టీ ప్రతిష్టకు భంగవాటిల్లితే ఉపేక్షించొద్దు

`ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే సహించొద్దు

`జూబ్లీ హిల్స్‌ ఎన్నికలలో గెలిచి తీరాలి

`ఏ విషయంలోనైనా అంతిమ నిర్ణయం సిఎం. రేవంత్‌కే

`రాష్ట్ర వ్యవహారాలలో రేవంత్‌ నిర్ణయం అందరూ ఆమోదించాల్సిందే

`మెతక వైఖరి అవసరం లేదని రేవంత్‌ కు సూచించిన హై కమాండ్‌

`అధిష్టానం పిలిస్తే తప్ప మంత్రులెవరూ డిల్లీకి రావొద్దు

`పార్టీ పరంగా ఎవరు హద్దు దాటినా వేటు వేయండి

`ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా పార్టీ నాయకులు మాట్లాడినా సహించకండి

హైదరాబాద్‌, నేటిధాత్రి:                        రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి హైకమాండ్‌ పూర్త స్ధాయి ఫ్రీ హాండ్‌ ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. ఇకపై పాలన అంటే ఎలా వుంటుందో, రేవంత్‌ రెడ్డి పవర్‌ ఎలా వుంటుందో తెలిసే సమయం వచ్చిందని కూడా అనుకుంటున్నారు. ఇంత కాలం ఆయనకు పూర్తి స్దాయిలో వెసులుబాటు లేదన్నది కొంత వరకు సత్యం. కాని ఇటీవల ఆయనపై అనేక రకాల వార్తలు వినిపిస్తున్న నేపధ్యంలో హైకమాండ్‌ కూడా స్పందించినట్లు తెలుస్తోంది. వీటన్నింటికీ చెక్‌ పెట్టాలంటే పూర్తి స్దాయిలో సిఎం.రేవంత్‌ రెడ్డికి ఫ్రీ హాండ్‌ ఇస్తే తప్ప వివాదాలు సమసిపోవు అనే ఆలోచనకు వచ్చింది. అందుకే ఇటీవల జరిగిన మంత్రి వర్గ సమావేశంలో కూడా సిఎం. రేవంత్‌ రెడ్డి ఇకపై తన మార్కు పాలనను చూపిస్తానని కూడా స్పష్టం చేసినట్లు సమాచారం. ముఖ్యంగా ఓ దినపత్రికలో వచ్చిన వార్త ప్రకారం సిఎం. రేవంత్‌ రెడ్డి మంత్రుల్లో ఎవరు తనపై అసత్య ప్రచారాలు సాగేలా వ్యవహరిస్తున్నారన్న దానిపై చాల సేపు ప్రశ్నించినట్లు కూడా సమాచారం. ఎందుకంటే పార్టీ కోసం కష్టపడిరది రేవంత్‌ రెడ్డి. పార్టీని అదికారంలోకి తీసుకురావడంలో అందరికన్నా కీలకభూమిక పోషించింది రేవంత్‌ రెడ్డి. అధిష్టానం ఆషామాషీగా రేవంత్‌రెడ్డిని సిఎం. చేయలేదు. అదిష్టానానికి అన్నీ తెలుసు. రేవంత్‌ రెడ్డి రాజకీయ వ్యూహాలు తెలుసు. రేవంత్‌ రెడ్డి వేసిన ఎత్తుగడల్లో కేసిఆర్‌ ఎలా చిక్కుకున్నారో తెలుసు. అందుకే పార్టీ అధిష్టానం రేవంత్‌రెడ్డిని సిఎం. చేసింది. ఈ మాత్రం అవగాహన రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలుసు. కాని కాంగ్రెస్‌ పార్టీ నాయకులందరికీ తెలుసు. అయినా తాము ముఖ్యమంత్రి కావాలన్న ఆకాంక్ష మేరకు కొ ంత మంది మంత్రులు పరోక్షంగా ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు కూడా సిఎం. దృష్టికి వచ్చింది. పైగా వ్యక్తిగతంగా సిఎం. రేవంత్‌రెడ్డిని ఇరుకున పెట్టే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయన్నది గుర్తించారు. అందుకే మంత్రి వర్గ సమావేశంలో మంత్రులందిరి పనితీరుపై సుధీర్ఘంగా చర్చ జరిగింది. పైగా ఆయా మంత్రుల తీరుపై కూడా అదిష్టానానికి సమగ్రమైన నివేధిక కూడా సిఎం. రేవంత్‌ రెడ్డి ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం వున్న క్యాబినేట్‌లో చాలా మంది మంత్రులు సిఎం.కు ఇబ్బందికరమైన పరిస్ధితులు తెచ్చిపెట్టాలనే చూస్తున్నారు అనేది వెల్లడౌతోంది. పైగా తమ ఇష్టాను సారం కూడా కొంత మంది మంత్రులు పనిచేస్తున్నారు. అందుకే ఇలాంటి ఇబ్బ ందికరమైన పరిస్ధితులు ఎదురౌతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడం వల్లనే తాము పదువుల్లో వున్నామన్న విషయాన్ని చాలా మంది మంత్రులు మర్చిపోతున్నట్లున్నారు. తమ వల్లనే పార్టీ అధికారంలోకి వచ్చిందని కూడా కొంత మంది అనుకుంటున్నట్లు కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరి ప్రోద్భలం వల్లనే కొంత మంది ఎమ్మెల్యేలు సైతం ప్రభుత్వం మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటన్నింటికీ పుల్‌స్టాప్‌ పెట్టేందుకు సిఎం. రేవంత్‌ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకున్నా ఫరావా లేదన్నట్లు అధిష్టానం కూడా తేల్చిచెప్పినట్లు కూడా సమాచారం అందుతోంది. రాజకీయంగా సిఎం. రేవంత్‌రెడ్డి వ్యూహాలు ఇప్పుడున్న మంత్రులకు ఎవరికీ తెలియవు. అర్ధం కావు. అందుకే రేవంత్‌ రెడ్డి పిపిసి అధ్యక్షుడు అయిన నుంచి ఆయనను తప్పు పడుతూనే వున్నారు. రేవంత్‌ రెడ్డి వేసిన ఎత్తుగడలు ఎలా వున్నాయో ఒక్కసారి తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే. గత ఎన్నికల ముందు నుంచి కూడా సిఎం.రేవంత్‌రెడ్డి వేసిన ప్రతి స్కెచ్‌లోనూ కేసిఆర్‌ చిక్కుకుంటూ వచ్చారు. రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణలకు సమాధానం కూడా కేసిఆర్‌ చెప్పలేకపోయాడు. ఇక్కడ ఒక్క విషయం సూటిగా చెప్పుకోవాలి. గత ఎన్నికలు ముందు రెండేళ్లుగా కేసిఆర్‌ అంటేనే జనం చీ కొట్టేలా చేయడంలో రేవంత్‌ రెడ్డి సక్సెస్‌ అయ్యారు. రైతులు కూడా కేసిఆర్‌కు వ్యతిరేంగా మారడంలో కీలక భూమిక పోషించారు. రైతుల ఓట్లు బిఆర్‌ఎస్‌కు పడకుండా నిరుద్యోగులను అస్త్రంగా చేసుకొని కేసిఆర్‌ను దెబ్బకొట్టిన ఘనత రేవంత్‌ రెడ్డిది. పల్లె సీమలను భాగ్య సీమలు చేశానని గొప్పలు చెప్పుకున్న కేసిఆర్‌కు ఆ పల్లెలే చుక్కలు చూపించేలా చేసిన ఘనత రేవంత్‌రెడ్డిది. ఇలా ఏ పల్లె జనాన్ని తనకు ఎదురులేదు. తిరుగులేదు. అనుకొని ప్రజలు కూడా కలవకుండా పాలన సాగించిన కేసిఆర్‌ను ఫామ్‌ హౌజ్‌కు పరిమితం చేసి, కోలుకోలేని దెబ్బలు కొడుతున్న నాయకుడు, పాలకుడు రేవంత్‌ రెడ్డి. ఒకప్పుడు కేసిఆర్‌ వ్యూహాం ముందు అప్పటి నాయకులు చతికిలపడేవారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి వ్యూహాన్ని పసిగట్టలేక కేసిఆర్‌ గింగిరాలు తిరుగుతున్నాడని చెప్పడంలో సందేహం లేదు. ఎన్నికల సమయం వచ్చిందంటే చాలు కేసిఆర్‌ను స్ధానం లేకుండా చేశారు. నిజం చెప్పాలంటే కేసిఆర్‌ను రేవంత్‌ రెడ్డి హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నుంచి తన మార్కు రాజకీయ దెబ్బ చూపిస్తూ వస్తున్నారు. హుజూరాబాద్‌లో ఈటెల రాజేందర్‌ గెలిచేలా చేసి, కాంగ్రెస్‌కు వీక్‌ అభ్యర్ధిని నిలబెట్టి బిఆర్‌ఎస్‌ను ఓడిరచారు. అప్పుడు రేవంత్‌రెడ్డి అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. కాని రేవంత్‌ తన వ్యూహాంలో విజయం సాధించారు. ఎందుకంటే ఆ సమయంలో కాంగ్రెస్‌ అప్పటి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిస్తే అంతిమంగా బిఆర్‌ఎస్‌ గెలుస్తుంది. అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చేసి,ఈటెల రాజేందర్‌ గెలిచేలా చేసి, కేసిఆర్‌ను దెబ్బకొట్టారు. కేసిఆర్‌కు మొదటిసారి ఓటమి రుచి చూపించారు. తర్వాత దుబ్బాకలో ఇదే వ్యూహాన్ని అమలు చేశాడు. అక్కడా బిఆర్‌ఎస్‌ పతనాన్ని రచించారు. ఆ తర్వాత వచ్చిన సార్వత్రిక ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ ఓటమిని రేవంత్‌ రెడ్డి రచించారు. విజయం సాదించారు. సిఎం. అయ్యారు. అందుకు ముందుగా అమలు చేసిన స్కెచ్‌నే ఇప్పటికీ రేవంత్‌రెడ్డి అమలు చేస్తున్నారు. కాని కేసిఆర్‌ అదే ఉచ్చులో పదే పదే చిక్కుకుంటున్నారు. దమ్ముంటే సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకే టికెట్‌ ఇచ్చి గెలిపించుకో అంటూ రేవంత్‌ రెడ్డి చేసిన సవాలును స్వీకరించి గత ఎన్నికల్లో ఓడిపోతారని తెలిసినా అదే ఎమ్మెల్యేలకు కేసిఆర్‌ టిక్కెట్లు ఇచ్చి ఓటమిని తానే కొని తెచ్చుకునేలా చేశారు. కొంత మంది ఎమ్మెల్యేలను మార్చకపోతే పార్టీ ఓడిపోతుందని ఎంతో మంది సీనియర్లు కేసిఆర్‌కు చెప్పినా వినలేదు. రేవంత్‌ రెడ్డి పన్నిన పద్మవ్యూహంలో చిక్కుకున్నారు. పార్టీని ఓటమికి కేసిఆరే కారకులయ్యారు. ఇప్పుడు కూడా అదే వ్యూహాన్ని అమలు చేసినా కేసిఆర్‌ పసిగట్టలేకపోతున్నారు. రేవంత్‌రెడ్డి మళ్లీ అదే దారిలో వెళ్తున్నాడని తెలిసినా కేసిఆర్‌ చేతులెత్తేసే రాజకీయమే చేస్తూ వస్తున్నారు. సరిగ్గా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఇదే ఫార్ములా రేవంత్‌రెడ్డి అనుసరించినా ఇప్పటికీ కేసిఆర్‌ పసిగట్టలేపోయారా? లేక తెలిసే వదిలేస్తున్నారా? ముఖ్యంగా జూబ్లీహిల్స్‌ ఎన్నికలలో కేసిఆర్‌ ప్రచారానికి రాకుండా కట్టడి చేయడంలో రేవంత్‌రెడ్డి వేస్తున్న ఎత్తుగడలే నిదర్శనమని చెప్పకతప్పదు. ఇప్పుడు కూడా జూబ్లీహిల్స్‌లో కేసిఆర్‌ ప్రచారానికి రావడానికి ఇష్టపడం లేదు. జూబ్లీహిల్స్‌ ఓడిపోయే సీటుకు ప్రచారం చేసి మరింత పరువు తీసుకోవడం కన్నా, ప్రచారానికి దూరంగా వుండడమే మేలనే పరిస్ధితికి కేసిఆర్‌ను నెట్టి వేయడంతో కూడా రేవంత్‌ రెడ్డి సక్సెస్‌ అయ్యారు. దానికి తోడు తాజాగా రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయంతో మైనార్టీ ఓట్లను గుండు గుత్తగా కాంగ్రెస్‌కు పడేలా చేసుకోవడం కోసం మరో ఎత్తుగడ వేస్తున్నారు. ఇండియన్‌ మాజీ క్రికెట్‌ కెప్టెన్‌, మాజీ ఎంపి, ప్రస్తుత ఎమ్మెల్సీ అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇస్తున్నారు. ఇప్పటి వరకు మైనార్టీలకు మంత్రి వర్గంలో చోటు లేదు. అజహరుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడంతో మైనార్టీ ఓట్లను బిఆర్‌ఎస్‌ వైపు మళ్లకుండా చేసేఎత్తుగడ వేశారు. ఇప్పటికే ఎంఐఎంను ఒప్పించి అభ్యర్దిని నిలబెట్టకుండా చూసుకున్నారు. ఎంఐఎం సూచనల మేరకు నవీన్‌ యాదవ్‌కు టికెట్‌ ఇచ్చారు. ఇలా రేవంత్‌రెడ్డి వేస్తున్న ఎత్తుగడలు కేసిఆర్‌కు మింగుడు పడడం లేదు. వ్యక్తిగతంగానే నవీన్‌ యాదవ్‌కు వేలాది ఓట్లు వున్నాయి. ఆయన ఇండిపెండెంటుగా పోటీ చేస్తేనే 20వేల ఓట్లకు పైగా సాదించారు. ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి గత ఎన్నికల్లో రెండో స్ధానంలో నిలిచారు. ఇప్పుడు కాంగ్రెస్‌ అభ్యర్ధిగా ఎంఐఎంల సపోర్టుతో కలుపుకుంటే నవీన్‌యాదవ్‌కు భారీ మెజార్టీ ఖాయంగానే కనిపిస్తోంది.. మరో వైపు సినీ ఇండ్రస్ట్రీనీ ఆకట్టుకోవడం కోసం రేవంత్‌ రెడ్డి రంగంలోకిదిగారు. ఇలాంటి వ్యూహాలు ఏనాడు సీనియర్లైన నాయకులు ఎవరూ అమలు చేయలేదు. గుడ్డిగా కేసిఆర్‌ వేసిన ఎత్తుల్లో చిక్కుకున్నారు. కాని రేవంత్‌రెడ్డి వేసే ఎత్తులు అర్ధం కాక బిఆర్‌ఎస్‌ కూడా చతికిలపడిపోతోంది. అలాంటి సిఎం. రేవంత్‌రెడ్డిని పదవి నుంచి దించే కుట్రలకు ఎంత మంది తెరతీసినా వాటిని పటా పంచెలు చేయగల రాజకీయ యుక్తి, శక్తి రేవంత్‌రెడ్డికి వుంది. పార్టీ కోసం ఆయన పడిన శ్రమ, అదికారంలోకి తెచ్చేందుకు ఆయన పడిన కష్టం సున్నితంగా వదిలేసుకుంటారని ఎవరూ అనుకోవడం లేదు. ఇకపై సీనియర్‌ మంత్రులైనా, ఇతర నాయకులైనా సరే ఉపేక్షించేందుకు సిఎం. సిద్దంగా లేరు. ఏ మాత్రం మంత్రులు సరిగ్గా పని చేయకపోయినా తప్పించడం ఖాయంగానే కనిపిస్తోంది. పైగా ప్రభుత్వం వచ్చి రెండేళ్ల కావొస్తోంది. మంత్రి వర్గ కూర్పు, మార్పు కూడా తప్పదని తెలుస్తోంది. అదంతా పార్టీ అధిష్టానం పూర్తిగా సిఎం. రేవంత్‌ రెడ్డి చేతుల్లోనే పెట్టినట్లు కూడా తెలుస్తోంది. ఏది ఏమైనా ఇకపై సిఎం. రేవంత్‌ వ్యవహార శైలిని సరికొత్తగా చూడొచ్చని అనుకుంటున్నారు.

వివాహ వేడుకలో పాల్గొన్న మాజీ చైర్మన్…

వివాహ వేడుకలో పాల్గొన్న మాజీ చైర్మన్

◆:- తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ పట్టణంలోని శుభం కన్వెన్షన్ హాల్లో హోతి బి గ్రామపంచాయతీ సెక్రెటరీ నరేష్ గారి సోదరుని వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులకు అక్షింతలు వేసి వివాహ శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రియల్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్ గారు వారితోపాటు ఈ కార్యక్రమంలో పర్వేస్ బిజీ సందీప్ అమన్ నవీద్ బాల్ రెడ్డి తదితరులు ఉన్నారు,

కట్టు దాటక ముందే కట్టడి చేయండి!?

`కప్పదాటు మంత్రులను పీకేయండి?

`కఠిన నిర్ణయాలు తప్పవు..ఉపేక్షిస్తూ పోతే ఆగవు.

`తెలంగాణలో కాంగ్రెస్‌ కు రక్ష రేవంత్‌ రెడ్డి మాత్రమే.

`మొండిగా లేకుంటే నాయకులు మొదటికే మోసం తెచ్చేలా వున్నారు?

`అధికారంలో వున్నా కొందరు కోవర్టు గుణం మానుకోవడం లేదు!

`తాబేదార్ల పని వదులుకోవడం లేదు.

రేవంత్‌ కష్టపడి తెచ్చిన ప్రభుత్వం మీద కుట్రలు చేస్తున్నారు.

`ప్రతిపక్షాలకు అస్త్రాలౌతున్నారు?

`అతి స్చేచ్ఛ ఎప్పటికీ హస్తవ్యస్తమే!

`కూర్చున్న కొమ్మనే నరుక్కుకుంటున్నారు.

`సీఎం. రేవంత్‌ రెడ్డి మంచి తనం అలుసుగా తీసుకుంటున్నారు.

`అందరిలో ఒకడిగా మెలుగుతుంటే మెతకవైఖరి అనుకుంటున్నారు?

`సీఎం. ను లెక్క చేయకుండా నిర్ణయాలు తీసుకుంటున్నారు?

`పదేళ్ల తర్వాత వచ్చిన అధికారాన్ని కొందరు మంత్రులే దుర్వినియోగం చేస్తున్నారు?

’’సీఎం కుర్చీ మీద కన్నేసి’’ ప్రభుత్వాన్నే అస్థిర పరచాలని చూస్తున్నారు!

సీఎం. రేవంత్‌ రెడ్డి’’ ఉదాసీనత మితి మీరిన స్చేచ్ఛకు కారణం

`మంత్రులకు పూర్తి స్చేచ్ఛ కూడా కొంప ముంచుతుంది

`సీనియర్లు అనే గౌరవాన్ని చాలా మంది మంత్రులు నిలుపుకోవడం లేదు.

`‘‘సీఎం’’. రేవంత్‌ ను ఫెయిల్యూర్‌ ‘‘సిఎం’’గా చిత్రీకరించే కుట్ర చేస్తున్నారా?

’’సీఎం’’. పై పదే పదే అధిష్టానం ముందు అబద్ధాలు ప్రచారం చేస్తూ వస్తున్నారా!

`గల్లీ లొల్లి..డిల్లీ పంచాయతి!

`కాంగ్రెస్‌ పార్టీ అంటేనే అంత!

`ఎప్పుడూ మారనిదే ఇదంతా!

`ప్రతి చిన్న విషయానికి సిఎం.ను డిల్లీకి పిలవడం పార్టీకే నష్టం!

`జిల్లా అధ్యక్షుల ఎంపిక కూడా హై కమాండ్‌ జోక్యం చేసుకోవాలా?

`ఇప్పటికే ఏఐసీసీ పరిశీలకులు వడపోసి పోయారు!

`ఇప్పుడు మళ్ళీ సీఎం, మంత్రులతో డిల్లీలో మంతనాలు!

`అధిష్టానం ‘‘సీఎం’’ను గౌరవిస్తే మంత్రులు భయంతో వుంటారు.

`అధిష్టానం మంత్రులకు ప్రాధాన్యతనిస్తే ‘‘మొదటికే మోసం’’ తెస్తారు

హైదరాబాద్‌, నేటిధాత్రి: 

పాలనలో సామరస్యముండాలి. పరిపాలనలో మొండి తనముండాలి. ప్రజల విషయంలో ఆలోచనా దృక్పధం వుండాలి. పాలనా బాగస్వాములు పట్ల ముఖ్యమైన పాలకుడు కఠినంగానే వుండాలి. ఇది సిఎంలకు వుండాల్సిన అతి ముఖ్య లక్షణం. మెతక తనం కూడా కొన్ని సార్లు చేత కాని తనమౌతుందని అనుకునే పరిస్ధితి వుంటుంది. అందుకే ఉమ్మడి రాష్ట్రంలోనైనా, తర్వాతనైనా సరే ముఖ్యమైన పాకులు కఠినంగా వుండాల్సిన అవసరం వుంది. నిజం చెప్పాలంటే ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు పరిపాలన చేసిన ముఖ్యమంత్రులలో ప్రస్తుత సిఎం. రేవంత్‌ రెడ్డి లాంటి మంచి తనం నిండిన పాలకులు లేరు. ప్రభుత్వం ఏర్పాటై రెండు సంవత్సరాలు గడుస్తున్నా ఆయన ఏ ఇతర శాఖల్లోనూ వేలు పెట్టడం లేదు. ఏ మంత్రిపట్ల ఇప్పటి వరకు సీరియస్‌గా వ్యవహరించలేదు. శాఖల నిర్వహణలో మంత్రులు అలసత్వం వహిస్తున్నా పెద్దగా మందలించిన దాఖలాలు లేవు. ఇవన్నీ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఉదార స్వభావానికి నిదర్శనం. కాని అది సిఎం. రేవంత్‌ రెడ్డి చేతగాని తనంగా కొందరు మంత్రులు భావిస్తున్నట్లున్నారు. పైగా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కావాలన్న కోరిక వున్న వాళ్లు కూడా కొంత మంది వున్నారు. ఎప్పుడు తమకు అవకాశం వస్తుందా? అని ఎదురుచూస్తున్న వారు కూడా వున్నారు. ఈ విషయం సిఎం. రేవంత్‌రెడ్డికి తెలియంది కాదు. అయినా అలాంటి మంత్రుల విషయంలో కూడా రేవంత్‌ రెడ్డి ఎంతో ఉదాసీనతతో వ్యవహిస్తున్నారు. వారికి ఇవ్వాల్సిన ప్రాదాన్యత కంటే ఎక్కువ ఇస్తున్నారు. ఎక్కడా తాను ముఖ్యమంత్రి అనే దర్పం చూపించడం లేదు. ప్రతి విషయంలోనూ, సందర్భంలోనూ ఆయన మంత్రులను సమాన భాగస్వాములుగానే చూస్తున్నారు. వారికి మితిమీరిన మర్యాద కల్పిస్తున్నారు. ఇదంతా రేవంత్‌రెడ్డి గొప్పదనం. రాజకీయాల్లో అందరూ సమానమనుకునే మనస్తత్వం. ఇలాంటి ముఖ్యమంత్రులే సమస్యలు ఎదుర్కొంటారని అని చెప్పడానికి ఇది కూడా ఒక నిదర్శం. ఎందుకంటే గతంలో ఎప్పుడూ ఏ ముఖ్యమంత్రి ఇంతగా మంత్రులకు స్వేచ్ఛ నిచ్చిన సందర్భాలులేవు. ప్రాంతీయపార్టీలలో సహజంగా సిఎంలు ఒకింత నియంతలుగా వుంటారన్న భావన వుంది. నిజం కూడా. ఆయా మంత్రులైనా, నాయకులైనా సరే ప్రతి విషయాన్ని తమకు తెలియకుండా ఏ ఒక్క ఫైలు ముందుకు కదలొద్దు అని హుకూం జారీ చేసేవారు. గత ప్రభుత్వంలో కూడా అదే జరిగింది. కేసిఆర్‌ పాలనలో కూడా అదే అనుసరించారు. గతంలో చంద్రబాబు పాలన కూడా అలాగే సాగింది. ఎన్టీఆర్‌ కాలంలోనూ సిఎం.కు తెలియకుండా చీమ చిటుక్కుమనలేదు. కాంగ్రెస్‌లో కూడా అదే జరిగింది. ఈ విషయాలను సిఎం. రేవంత్‌ రెడ్డి తెలుసుకోవాల్సిన అవసరం వుంది. అయినా పాలన అంటే సమిష్టి బాద్యత అనే ఉదారస్వభావంతో సిఎం. రేవంత్‌ రెడ్డి వున్నారు. రేవంత్‌ అతి మంచితనం కూడా చెడుగా మారుతోంది. మంత్రులకు ఇచ్చిన అతి స్వేచ్చ దుర్వినియోగమౌతోంది. అంతిమంగా అది రేవంత్‌రెడ్డి మెడకు చుట్టుకుంటోంది. దాంతో సిఎం. రేవంత్‌ రెడ్డి ఉక్కిరి బిక్కిరి కావాల్సి వస్తుంది. ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పార్టీని మళ్లీ అదికారంలోకి తీసుకురావాలి. ప్రజా పాలన సాగించాలని సిఎం. రేవంత్‌ రెడ్డి అనుకుంటున్నారు. కాని చాల మంది మంత్రుల్లో ఈ అభిప్రాయం వున్నట్లు కనిపించడం లేదు. మళ్లీ అధికారంలోకి వస్తామో? లేదో? అనే అభద్రాతా భావంలోనే కొంత మంది మంత్రులున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే పదువుల్లో వున్నప్పుడు ఇల్లు చక్కదిద్దుకోవడం, అవకాశంవస్తే సిఎం. కావాలన్న ఆశతో చాలా మంది వున్నారు. వారి వల్ల ఏమీ కాదన్న సంగతి ప్రజలకు తెలుసు. వారి వల్ల ఈ మాత్రం పాలన కూడా నడవదని తెలుసు. అయినా వారికి సిఎం కావాలన్న కోరిక రోజు రోజుకూ పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే సిఎం. రేవంత్‌రెడ్డి పదవిలో వుంటే తప్ప కాంగ్రెస్‌ను ఎవరూ కాపాడలేరు. సిఎం. రేవంత్‌కు ఏ మాత్రం ఇబ్బంది ఎదురైనా కాంగ్రెస్‌ను రక్షించే నాధుడే వుండరు. గత పదేళ్ల కాలంలో కనీసం పంచాయితీ ఎన్నికల్లో కూడా పార్టీని గెలిపించలేని నాయకులు, రాష్ట్రానికి అధికారం తెస్తారని అనుకోవడం లేదు. అసలు వారికి పార్టీ ఎలా అధికారంలోకి వచ్చిందో తెలుసు. సిఎం. రేవంత్‌రెడ్డి పిసిసి అధ్యక్షుడుగా ఎంత శ్రమించాడో తెలుసు. పార్టీని నడిపేందుకు ఎంత ప్రయాసపడ్డాడో అందరికీ తెలుసు. పార్టీకి ఒక్కొ ఇటుక ఏలా పేర్చాడో తెలుసు. ప్రజల మనసు ఎలా చూరగొన్నాడో తెలుసు. పార్టీని నడపడమే చేతగాని కాడి పడేసిన వాళ్లు కూడా ఇప్పుడు పాలిస్తాం..ముఖ్యమంత్రి అవుతామని అని కలులు గంటున్నారు. ఈ విషయాలు అదిష్టానానికి తెలియక కాదు. కాని సిఎం.రేవంత్‌రెడ్డిని స్ట్రాంగ్‌ చేస్తే వైఎస్‌. రాజశేఖరెడ్డిలాగా మారుతాడేమో? అనే భయం అధిష్టానంలో కూడా వుంది. వారి మదిలో లేకపోయినా, నేర్పించే నాయకులు పార్టీలో చాల మంది వున్నారు. సిఎం. కవాలన్న ఆశ వున్నవాళ్లంతా ఇదే చేస్తున్నారు. వైఎస్‌కు అధిష్టానం పూర్తి స్వేచ్చ ఇవ్వడం వల్లనే పార్టీకి తీరని నష్టం జరిగిందన్న అభిప్రాయం చాలా మందిలో వుంది. ఏపిలో పార్టీ నామ రూపాలు లేకుండాపోవడానికి కారణం అదే అని అధిష్టానానికి చెప్పిన వాళ్లున్నారు. అయితే వైఎస్‌ తర్వాత పనిచేసిన ముఖ్యమంత్రులు కూడా సిఎం. రేవంత్‌లాగా ఉదాసీనతంగా వ్యవహరించలేదు. సిఎం. అంటే సిఎంలాగానే వ్యవహరించారు. ప్రభుత్వమంటే అందరూ సమానమే అయినా, సిఎం. ఎక్కువ సమానం అన్నట్లుగానే పాలన సాగించారు. రోశయ్య లాంటి వారు కూడా మంత్రుల మీద అజమాయిషీ చేశారు. అందర్నీ కట్టడి చేశారు. అసలు ఏ అనుభవం లేని కిరణ్‌కుమార్‌ రెడ్డి కూడా సిఎం. కాగానే తనేంటో చూపించారు. ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం సాగుతున్న సమయంలో తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వను ఏం చేసుకుంటారో చేసుకోండి? అనేంత ధైర్యంగా పాలన సాగించారు. అలా సిఎం. స్ట్రాంగ్‌గా వుంటే ఏ మంత్రులు నోరు మెదపరు. ఇప్పుడు సిఎం. రేవంత్‌రెడ్డి కూడా అలా వుంటే తప్ప మంత్రులు భయపడరు. వున్న ఈ మాత్రం పదవి కూడా సిఎం. కనికరంతోనే వుందన్న భయం మంత్రుల్లో ఖచ్చితంగా వుండాలి. తమకు పదవి రేవంత్‌ రెడ్డి ఇవ్వలేదు. అధిష్టానం ఇచ్చింది అనే ఆలోచన వున్న కొందరు మంత్రులు సిఎం.ను లెక్క చేయడం లేదన్నది సర్వత్రా వినిపిస్తోంది. ఈ ఆలోచన మంత్రుల్లో మారాలి. సిఎం. దృక్పధంలో కూడా మార్పు రావాలి. తాను మిగతా వారికన్నా ఎక్కువ సమానం అనుకుంటే తప్ప పరిస్ధితులు చక్కబడవు. తెలంగాణలో గతంలో వున్నట్లు పది జిల్లాలు కాదు. ఇప్పుడు 33 జిల్లాలు. అంటే వాటి పరిధి చాలా చిన్నది. గతంలో రెవిన్యూ డివిజన్‌ అంత కూడా ఇప్పుడు జిల్లాలు లేవు. అలాంటి జిల్లాల అధ్యక్షుల ఎంపిక కూడా అధిష్టానం నుంచి జరగాలంటే, ఇక్కడ సిఎంకు ప్రాధాన్యత ఎలా వుంటుంది. ఉమ్మడి రాష్ట్రంలోనే సిఎంలు సూచించిన వారికి జిల్లా అధ్యక్ష కార్యదర్శుల పదవులు ఇచ్చిన సందర్బాలున్నాయి. అప్పుడంటే ఉమ్మడి జిల్లాలు కావడంతో పార్లీ పరంగా కొంత పలుకుబడి వుండేది. ఇప్పుడు పార్టీ పదవుల వల్ల వచ్చేది లేదు. ఆ నాయకులు ఒరిగేది లేదు. అయినా ఆ పదవులకు అంత ప్రాదాన్యత కల్పిస్తూ, సిఎంను పదే పదే డిల్లీకి పిలిచి సంప్రదింపులు జరపాల్సిన పనిలేదు. ఇక్కడే సిఎం. వారి ఎంపిక ప్రక్రియ పూర్తి చేస్తే సరిపోతుంది. మంత్రుల అభిప్రాయాలు, వారి ప్రాదాన్యతలు తీసుకొని ఎంపిక ప్రక్రియ పూర్తి చేయొచ్చు. ఇప్పటికే డిల్లీ నుంచి ప్రతినిధులు, పరిశీలలకు వచ్చారు. వడపోత పోశారు. కొంత మంది పేర్లు వాళ్లే ఫైనల్‌ చేశారు. ఇక ప్రకటనే తరువాయి. కాని దానిపై కూడా సిఎం.కు స్వేచ్చ నివ్వకుండా మళ్లీ అధిష్టానం వద్ద వడపోతలు చేయడం అంటే రాష్ట్ర నాయకత్వాన్ని అవమానించడమే అవుతుంది. సిఎం. రేవంత్‌రెడ్డి నాయకత్వాన్ని తక్కువ చేయడమే అవుతుంది. పదేళ్ల తర్వాత, తెలంగాణ ఇచ్చినా కాంగ్రెస్‌ను ఏ నాయకుడు అధికారంలోకి తీసుకురాలేకపోయారు. అందరూ సమిష్టిగా పనిచేయలేకపోయారు. కాని సిఎం. రేవంత్‌ రెడ్డి పార్టీని అధికారంలోకి తీసుకురావడం కోసం పడిన శ్రమలో చాల మంది నాయకులు పది శాతం కూడా పడలేదు. అలాంటి నాయకులు కూడా మంత్రులయ్యారు. ఇప్పుడు పాలనకు ఇబ్బందికరంగా మారుతున్నారు. ఒక్ససారి సిఎం. రేవంత్‌రెడ్డి తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శిస్తే, ఇప్పుడున్న అసమ్మతి మంత్రులంతా ఎందుకు దారిలోకి రారో చూడండి. ప్రభుత్వంపై ప్రజల్లో మంచి సంకేతాలు ఎందుకు వెళ్లవో గమనించండి. ప్రభుత్వానికి తలనొప్పులుగా మారుతున్న మంత్రులను పీకి పారేయండి. అంతే!!! దేవుడంటే భక్తి ఒక్కటే వుంటే సరిపోదు. భయం కూడా వుండాలి. సిఎం. అంటే మంత్రులకు భక్తి లేకపోయినా ఫరవాలేదు. భయం మాత్రం ఖచ్చితంగా వుండాలి. అప్పుడే పాలన గాడిలో సక్కగా నడిచేది.

పాపం చిన్నారులు..కుక్కల దాడికి బలౌతున్నారు!

`ఎంతో మంది తల్లిదండ్రులు కడుపుకోతను అనుభవిస్తున్నారు.

`కుక్కల మీద కనికరం.. పిల్లల మీద లేదా!?

`ఇంత దిక్కుమాలిన వ్యవస్థలో బతుకుతున్నామా?

`నిత్యం ఎక్కడో ఒకచోట కుక్క కరిచి అనే వార్తలు చూస్తూనే వున్నాం.

`రేబిస్‌ బారిన పడి చనిపోతున్నారని వింటూనే వున్నాం.

`కుక్కల దాడిలో చిన్న పిల్లలు చనిపోతున్నా పాపకులకు పట్టదా!

`జంతు ప్రేమికులారా జర ఆలోచించండి.

`కుక్కల మీద వున్న ప్రేమ పిల్లల మీద లేదా!

`పిల్లల ప్రాణాలకన్నా కుక్కల ప్రాణమే ఎక్కువైపోయిందా!

`జంతు ప్రేమికుల ముసుగులో జనం ప్రాణాలతో చెలగాటమా!

హైదరాబాద్‌, నేటిధాత్రి:
సమాజమే మానవత్వమనే పదానికి అర్దాన్ని మార్చేస్తుంది. మానవత్వమనే పదానికే రంగులు మార్చుతుంది. అవును. ఇది ముమ్మాటికీ నిజం. ఒకప్పుడు మనిషిని కుక్క కరిస్తే వార్త కాదు. అనేవారు. మనిషే కుక్కను కరిస్తే వార్త అవుతుందని చెప్పుకునే వారు. ఎందుకంటే ఒకప్పుడు కుక్క కరిస్తే పెద్దగా పట్టించుకునేవారు కాదు. పల్లెల్లో ఏదో మంత్రం వేసే వాళ్లు. ప్రభుత్వాసుపత్రికి వెళ్తే బొడ్డుచుట్టూ ఇంజక్షన్లు ఇచ్చేవారు. తర్వాత మరింత అలాంటి అవసరం లేని ఖరీదైన వైద్యం కూడ అందుబాటులోకి వచ్చింది. అయితే ఓ ఇరవై ఏళ్ల క్రితం వరకు కుక్క కాటు అనే వార్త ఎప్పుడో వింటుండేది. ఎవరైనా ఇంట్లో పెంచుకుంటున్నారన్న విషయం తెలియక ఇంట్లోకి వెళ్తే కుక్క కరిచింది అని చెప్పడం విన్నాం. లేకపోతే పిచ్చి కుక్క కరిచింది అనే వార్తలు విన్నాం. కాని నిత్యం కుక్క కరిచిన వార్తలను కోకొల్లలుగా వినడం మాత్రం ఇటీవల బాగా పెరిగింది. ప్రతి ఏటా మన దేశంలో కుక్క కాటుకు గురై మరణిస్తున్న వారి సంఖ్య పది లక్షలు వుంటుందనే వార్త వింటుంటే గుండె గుబేల్‌మనక మానదు. ఇంతలా కుక్కల దాడిలో మనుషులు మరణిస్తుంటే పాలకులు ఏం చేస్తున్నారు. వ్యవస్ధలు ఏం చేస్తున్నాయి. గ్రామాలలో పంచాయితీలు ఏం చేస్తున్నాయి. మున్సిపల్‌ శాఖ ఏం చేస్తుందనే ప్రశ్న అందరికీ టక్కున తెలుత్తుంది. ఈ వ్యవస్ధలన్నీ పనిచేయాలనే అనుకుంటున్నాయి. కాని ఇటీవల మూగజీవాల మీద ప్రేమ కురిపించే వాళ్లు చాలా పెరిగిపోయారు. వాళ్లంతా ఎక్కడో వుండరు. సెల్‌ ఫోన్లో వుంటారు. కుక్కలను పట్టుకొని వెళ్తుంటే వాళ్లు తట్టుకోలేరు. కుక్కలకు ఏదైనా హాని జరిగితే వారి మనసు విలవిలలాడపోతుంది. అది కూడా కేవలం సెల్‌పోన్లో మాత్రమే…అవే వీధి కుక్కలు మనుషుల ప్రాణాలు తీస్తుంటే మాత్రం ఎవ్వరూ మాట్లాడరు. అయ్యో అని కూడా అనరు. కుక్క కనిపించినప్పుడు జాగ్రత్తగా వుండాలి కదా? అని నీతులు చెబుతారు. వీధుల్లో కుక్కలున్నాయని తెలిసినప్పుడు పిల్లలను బైటకు పంపకుండా జాగ్రత్తగా చూసుకోవాలని కదా! హితవులు పలుకుతున్నారు. అంతే కాని వీధుల్లో గుంంపులు గుంపులుగా పెరిగిపోతున్నా కుక్కలను నిర్మూలించండి అని మాత్రం అడిగే వాళ్లు లేకుండాపోయారు. ఎవరు ఎలా పోతే మాకేమిటి? అనే ఓ పిరికి బ్యాచ్‌ వుంటుంది. వారి వరకు వస్తే గాని అయ్యో అన్యాయమైపోయామే! అంటుంటారు. ఇక మరికొందరు జంతు ప్రేమికులు. వాళ్లకు మనుషులకన్నా జంతువులే ఎక్కువ. వారిలో మనుషులపై కనిపించని జాలి, దయ , కరుణ అన్నీ జంతువులపై మాత్రమే కురిపిస్తారు. ఇంట్లో పెంచుకునే కుక్కలను మాత్రం సొంత పిల్లలుగా చూసుకుంటారు. ఆ కుక్కలకు ఏమైనా అయితే మాత్రం విలవిలలాడిపోతున్నట్లు వీడియోలు చేసి సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. కన్న పిల్లలకన్నా కుక్కల మీద ప్రేమ కురిపిస్తూ వీడియోలు చేస్తుంటారు. అయితే ఇంట్లో పెంచుకునే హైబ్రీడ్‌ కుక్కపిల్లలకు అన్ని రకాల వ్యాక్సిన్‌లు వేయిస్తారు. వాటికి స్నానం చేయిస్తారు. కొంత శుభ్రత తీసుకుంటారు. మన పెద్దలు ఎప్పుడో చెప్పారు. మనం వేసుకునే చెప్పులు, కుక్కలు ఇంటి ముందే వుండాలన్నారు. కాని అదేంటో ఇప్పుడు చెప్పులు కూడా ఇంట్లో వాడుతున్నారు. బైట వుండాల్సిన కుక్కలను ఇంట్లో పెట్టుకుంటున్నారు. అయితే ఇలాంటి వాళ్లకు వీధి కుక్కలంటే ప్రేమ ఏమీ వుండదు. కాని కుక్క అనగానే వారిలో ప్రేమ పొంగిపోయినట్లు నటిస్తుంటారు. డిల్లీ నుంచి గల్లీ వరకు నిత్యం ఎంతో మంది చిన్నారులు కుక్కల దాడిలో చనిపోతున్నారు. గాయాల పాలౌతున్నారు. రేబిస్‌ వ్యాధి బారిన పడి భయంకరమైన చావును చూస్తున్నారు. అభం శుభం తెలియని పిల్లలు కూడా ఇలాంటి పరిస్దితులను ఎదుర్కొని నరకం చూస్తూ చనిపోతుంటే కూడా కొంత మందికి పాపం అనిపించడం లేదు. వాళ్లే జంతు ప్రేమికులు. వారి మానవత్వం మనుషుల మీద కాన్న కుక్కల మీద ఎక్కువౌతోంది. ఇది మానవత్వం మంట కలవడం కాదా? మనుషుల మీద మనుషులే విషం నింపుకోవడం కాదా? ఒక కాకిని కొడితే వంద కాకులొస్తాయి. గాయి గాయి చేస్తాయి. కొట్టిన వ్యక్తిని వెంటాడుతాయి. వేదిస్తాయి. ఇంట్లో నుంచి బైటకు రాకుండా చిత్ర వధ చేస్తాయి. ఒక కోతిని కొడితే నాలుగు కోతులు మీదకు వస్తాయి. కాని ఒక వ్యక్తిని ఎవరైనా కొడుతుంటే చూస్తూ వుండిపోతారు. గతంలో ఇలా చూస్తూపోయేవారు. కాని ఇప్పుడు సెల్‌పోన్లో చిత్రీకరిస్తున్నారు. తాజాగా పిల్లలు కుక్కల దాడికి గురైన సందర్భంలో సిసి టివీలలో రికార్డు అయ్యే వీడియోలు కొన్ని అయితే, వాటిని షూట్‌ చేసి పోస్టు చేస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతూనే వుంది. ఇటీవల కర్నూల్‌లో బస్సు తగలబడి పోతుంటే, బస్సు అద్దాలు పగలగొట్టాల్సిన వాళ్లు వీడియోలు తీశారని కూడా అంటున్నారు. ఇలాంటివి చూస్తుంటే, వింటుంటే మనం మనుషులమేనా అనిపించకమానదు. నిజం చెప్పాలంటే అసలు మనం మనుషులమే కాదు. అభం శుభం తెలియని పసిపిల్లలను కుక్కలు మీద పడి కరుస్తూ, పీక్కు తింటున్నాయి. అవి మూగ జీవాలు కాదు. కోరలున్న జంతువులు. కొరికి కొరికి చంపుకుతినే జంతువులు. సాదు స్వభావంలో వున్న రాక్షస జాతి జంతువు. దాని మీద జాలి చూపిస్తూ పోతే జనం ప్రాణాలను అరిచేతిలో పెట్టుకోవాల్సి బతకాల్సి వచ్చే ప్రమాదం లేకపోలేదు. కన్న తల్లిదండ్రుల మీద ప్రేమ లేని వాళ్లు కూడా జంతు ప్రేమికులౌతుంటారు. కన్నతల్లికి అన్నం పెట్టని వాళ్లు కూడా కుక్కల కోసం తల్లడిల్లిపోతున్నట్లు నటిస్తున్నారు. ఇలాంటి వాళ్లు దేశానికి ఎంతో ప్రమాదకరం. ఆఖరుకు సుప్రింకోర్టు తీర్పును కూడా తప్పు పట్టే స్ధాయికి చేరుకున్నారు. అలాంటి పిచ్చి ప్రేమికుల గురించి ఆలోచించకుండా పాలకలు కఠినంగా వ్యవహరించాలి. వీది కుక్కల నిర్మూలన చేపట్టాలి. గతంలో ఇలా కుక్కలు పెరిగిన సందర్భాలలో గ్రామ పంచాయితీ నుంచి మొదలు మున్సిపాలిటీల వరకు కుక్కలను పట్టుకెళ్లి చంపి, పూడ్చిపెట్టేవారు. అలా కుక్కల బెడత తీర్చేవాళ్లు. ఇప్పుడు ఆ పనిని వదిలేస్తున్నారు. జంతు ప్రేమికులకు భయపడి ప్రజల ప్రాణాల మీదకు వస్తున్నా ప్రభుత్వాలు చోద్యం చూడడం కూడా సరైంది కాదు.

బీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం!

`ప్రచారానికి వెళ్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులకే ప్రజల భరోసా.

`ఎక్కడికక్కడ ప్రజలు కారు పార్టీ నాయకులకు స్వాగతం

`200 వున్న పింఛన్‌ రెండు వేలు చేసింది కేసీఆర్‌.

`హైదరాబాద్‌ అభివృద్ధి చేసింది కేసీఆర్‌

`మంచినీటి కరువు లేకుండా చేసింది కేసీఆర్‌

`వరదలొస్తే 10 వేలు ఇచ్చి ఆదుకున్నది కేసీఆర్

 

`కరోనా సమయంలో ప్రజలను ఆదుకున్నది బీఆర్‌ఎస్‌ నాయకులు

`పెద్ద ఎత్తున ప్రజలకు నిత్యావసర వస్తువులు ఇచ్చింది బిఆర్‌ఎస్‌

`ప్రభుత్వం తరుపున నిత్యావసర వస్తువులతో పాటు 500 ఇచ్చింది బీఆర్‌ఎస్‌

`ప్రాణాలకు తెగించి ప్రజల కోసం నిలబడ్డది బీఆర్‌ఎస్‌

`కరోనా సమయంలో బిఆర్‌ఎస్‌ తప్ప ఏ పార్టీ సాయం చేయలేదు

`బస్తీ దవఖానాలు పెట్టి పేదలకు వైద్యం అందించింది కేసీఆర్‌

`గర్భిణీ మహిళలకు అన్ని రకాల సదుపాయాలు కల్పించింది కేసీఆర్‌

`ప్రభుత్వాసుపత్రికి తీసుకుపోయి ప్రసవాలు చేశారు

`కేసీఆర్‌ కిట్‌ ఇచ్చి పసి పిల్లలను సంరక్షించారు

`ప్రసవం తర్వాత తల్లీబిడ్డలను క్షేమంగా ఇంటి దగ్గర చేర్చింది కేసిఆర్‌

`కేసీఆర్‌ కిట్‌ తో పాటు రూ. 13 వేలు ఇచ్చింది కేసీఆర్‌

`పేదలను ఆదుకున్నది కేసీఆర్‌

`పేదలకు ఉచిత విద్య, వైద్యం పెద్ద ఎత్తున అందించింది కేసీఆర్‌

`గురుకులాలు పెట్టి బస్తీ పిల్లలకు చదువు చెప్పించినది కేసీఆర్‌

`ఈ విషయాలు బీఆర్‌ఎస్‌ నాయకులకు చెబుతున్నదే ప్రజలు

`జూబ్లీ హిల్స్‌ లో సునీతను గెలిపించుకుంటామంటున్నారు

 

హైదరాబాద్‌, నేటిధాత్రి:

కష్టమెక్కడుంటుందో చైతన్యం కూడా అక్కడే వుంటుంది. జూబ్లిహిల్స్‌ లాంటి నియోజక వర్గంలో వున్న అనేక బస్తీలలో వుండే ప్రజలకు అన్నీ తెలుసు. కష్టం తెలుసు. సుఖం తెలుసు. బాధలు తెలుసు. గోసలు తెలుసు. వేధింపులు తెలుసు. బెదిరింపులు తెలుసు. అన్నీ చవిచూసిన వాళ్లే. గతంలో వారి జీవితాలు ఎలా వుండేవో తెలంగాణ వచ్చిన తర్వాత ఎలా మారిపోయాయో తెలుసు. కేసిఆర్‌ వారిని ఎలా కళ్లల్లో పెట్టుకొని చూసుకున్నారో తెలుసు. తెలంగాణ రాకముందు జూబ్లీహిల్స్‌లో వుండే కొన్ని ప్రాంతాలు ఎలా వుండేవో ఇప్పుడు ఎలా వున్నాయో చూస్తూనే వున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత సత్వర అభివృద్ది జరిగిన నియోజకవర్గాలలో జూబ్లీహిల్స్‌ ఒకటి. ప్రత్యేకంగా యూసఫ్‌గూడ, వెంగల్‌రావు నగర్‌, బోరబండ, రహమత్‌ నగర్‌, లాంటి ప్రాంతాల పరిసి ్ధతి ఎలా వుండేదో ఇప్పుడు ఎలా వుందో చూస్తున్నదే. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు. సాక్ష్యాత్తు జూబ్లీహిల్స్‌ నియోకవర్గంలో వున్న పేదల బస్తీల ప్రజలు. ఒకప్పుడు పేదల బస్తీలలో వుండే వారికి సరైన సౌకర్యాలు వుండేవి కాదు. కాని అనేక మౌళిక సదుపాయాలు కల్పించి వారి జీవితాలలో వెలుగులు నింపిన పాలకుడు కేసిఆర్‌. ఆయా ప్రాంతాలలో కనీస విద్యా సౌకర్యాలు వుండేవి కాదు. వైద్య సదుపాయాలు పేదలకు అందేవి కాదు. అక్కడ ప్రాంతాల ప్రజలకు వైద్య సదుపాయల కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యల కోసం కూడ వైద్య సదుపాయం అందేది కాదు. దాంతో ప్రజలు అనేక అవస్ధలు ఎదుర్కొనేవారు. అలాంటి ప్రాంతాలలో బస్తీ దవఖానాలు ఏర్పాటు చేసిన ఘనత కేసిఆర్‌ది. తెలంగాణ తెచ్చిన కేసిఆర్‌ హైదరాబాద్‌ మొత్తంగా సుమారు 350 బస్తీ దవఖానాలు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతాలు, బస్తీలలో వీటిని అడుగడుగునా ఏర్పాటు చేశారు. దాంతోపేద ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు అందడం మొదలయ్యాయి. ఒకప్పుడు వారికి ప్రభుత్వ వైద్యం అంటే అటు ఈఎస్‌ఐ, లేకుంటే నిమ్స్‌, సికింద్రాబాద్‌ వెళ్తే గాంధీ, కోఠి దవఖాన, ఉస్మానియాలు మాత్రమే వుండేవి. ఇక ప్రైవేటు ఆసుపత్రులు ఎన్ని వున్నా, పేదలకు ఆ ఖరీదైన వైద్యం చేయించుకోవాలంటే ఆ ఖర్చు భరించే పరిస్ధితి వుండేది కాదు. ప్రైవేటు చిన్న చిన్న ఆసుపత్రులున్నా వాటిలో కూడా వైద్యం ఖరీదుగానే వుండేది. దాంతో పేద ప్రజలకు కోసం నిపుణులైన వైద్యులతో బస్తీ దవఖానాల నిర్వహణతో పేదలకు ఎంతో మేలు జరిగింది. ముఖ్యంగా కరోనా లాంటి సమయంలో బస్తీ దవఖానల వల్ల ఎంతో మేలు జరిగింది. ఇక ఇదిలా వుంటే పేద మహిళల గర్బీణీల అవస్ధలు అన్నీ ఇన్నీ కావు. వారు నెల నెల చెకప్‌ల కోసం కూడ ఎంతో దూరం వెళ్లాల్సి వచ్చేది. లేకుంటే వేలాది రూపాయలు ఖర్చు చేసి, ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వచ్చేది. ఒక మహిళ గర్భం దాల్చిన నుంచి డెలవరీ వరకు ఎంతో ఖర్చు చేయాల్సిన పరిస్థితి వుండేది. ఆఖరుకు డెలివరీ సమయంలో ప్రైవేటు ఆసుపత్రులు ఆపరేషన్‌ చేయాల్సిందే అంటే ఆ కుటుంబం విలవిలాడిపోయేది. వేలల్లో ఖర్చుకు భయపడిపోయేవారు. దాంతో ఆసుపత్రులకు వెళ్లలేక ఇంట్లోనే ఇబ్బందులు పడి, ప్రాణాలు కోల్పోయిన మహిళలు కూడా వున్నారు. అలాంటి పరిస్ధితులను తప్పించుకునేందుకు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించక తప్పని పరిస్దితి ఎదురయ్యేది. ప్రైవేటు ఆసుపత్రులు అంటే కచ్చితంగా ఆపరేషన్‌ అనేవారు. దాంతో వేలాది రూపాయలు అప్పులు చేయాల్సి వచ్చేది. ఒక వేళ ఆ స్ధోమత లేని వాళ్లు గాందీ లాంటి ఆసుపత్రులకు వెళ్లినా, సమయం దాటిపోయిందనో, ప్రాణాపాయ పరిస్ధితులున్నాయనో ఆక్కడ కూడా చేతులేత్తేస్తే మరింత ఖర్చులు భరించి ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లిన వాళ్లున్నారు. గాందీ ఆసుపత్రులలో వైద్యులు పట్టించుకోక ప్రాణాలు కోల్పోయిన వాళ్లు కూడా వున్నారు. హైదరాబద్‌లో వుండే పేద ప్రజలకు ఇలాంటి పరిస్ధితి రాకుండా వుండేందుకు బస్తీ దవఖానాలే కాకుండా ప్రభుత్వమే ఆ గర్భినీ మహిళలను డెలివరికీ ఆసుపత్రికి తీసుకెళ్లే ఏర్పాటు చేశారు. గర్భిణీ మహిళలకు డెలివరీ సమయం వచ్చిందంటే 108కు కాల్‌ చేస్తే వెంటనే ఆసుపత్రి వర్గాలు వచ్చి ఆ మహిళలను ఆసుపత్రికి తీసుకెళ్లి డెలివరీ చేసేవి. అది కూడా నార్మర్‌ డెలివరీ చేసి, తల్లీ పిల్లలను కాపాడుతున్నాయి. డెలవరీ అయిన తర్వాత డిచ్చార్జి రోజున ఆడ పిల్ల పుట్టిన తల్లిదండ్రులకు రూ.13వేలు, మగ పిల్లాడు పుట్టిన తల్లిదండ్రులకు రూ.12 వేల నగదు కూడా కేసిఆర్‌ ప్రభుత్వం ఇచ్చేది. దానికితోడు ఒక ఏడాది కాలం పుట్టిన పిల్లలకు అవసరమయ్యే సబ్బులు, పౌడర్లు, డైపర్లు, మందులతో కూడిన కేసిఆర్‌ కిట్‌ను కూడా అందజేశారు. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మాణం చేసిన ఘనత కేసిఆర్‌కే దక్కిందని జూబ్లీహిల్స్‌ ప్రజలే చెబుతున్నారు. ఇక బస్తీలలో వుండే పేద ప్రజల పిల్లలు ప్రైవేటు స్కూళ్లలో చదువుకునేందుకు వేలల్లో ఖర్చవుతుంది. దాంతో ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలను స్కూళ్లకు కాకుండా పనులకు పంపిస్తూ వుండేవారు. అలాంటి పిల్లలకు ఖచ్చితంగా ఉచిత విద్య అందించాలన్న లక్ష్యంతో కేసిఆర్‌ కేజీటు పీజి అనే పథకాన్ని తీసుకొచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 1900 గురుకులాలు ఏర్పాటు చేశారు. అందులో భాగంగా పెద్దఎత్తున హైదరాబాద్‌ కూడా ఏర్పాటు చేశారు. హస్టల్‌ వసతితోపాటు, ఉచిత విద్యను అందించారు. అంతే కాకుండా మామూలు ప్రభుత్వ పాఠశాలలో ఉదయం అల్పాహారం, మధ్నాహ్న భోజనం ఏర్పాటు చేశారు. పిల్లల తల్లిదండ్రుల కోరిక మేరుకు ఎంతో మంది విద్యార్ధులు గురుకులాలలో విద్యను అభ్యసిస్తున్నారు. అక్కడే సన్నబియ్యంతో భోజనం, మెరుగైన నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. ఒకప్పుడు బస్తీలంటే నిరక్షరాస్యులు ఎక్కువగా వుండేవారు. కాని ఇప్పుడు ప్రతి ఇంటిలోని పిల్లలు స్కూళ్లకు వెళ్తున్నారు. గురుకులాలలో చదువుకుంటున్నారు. ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దబడుతున్నారు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క పాఠశాల ఏర్పాటుకు అప్పటిపాలకులు సహకరించపోయేవారు. కాని కేసిఆర్‌ బస్తీ బస్తీకి స్కూల్‌ ఏర్పాటు చేశారు. గురుకులాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని వెనుకబడిన ప్రాంతాలలో విద్యా కుసుమాలు విరబూసేలా చేస్తున్నారు. అలాంటి జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నిక జరుగుతోంది. ప్రజలంత ముక్తకంఠంతో కేసిఆర్‌ పాలనకు జై కొడుతున్నారు. మాగంటి సునీతను గెలిపించుకుంటామని చెబుతున్నారు. కాంగ్రెస్‌, బిజేపిలు ఎన్ని విన్యాసాలు చేసినా, ప్రజల మధ్య లేనిపోని అపోహలు సృష్టించినా సరే కేసిఆర్‌ వస్తేనే మళ్లీ మంచి రోజులు వస్తాయని ప్రజలు అంటున్నారు. మాగంటి సునీతను గెలిపించి మా రుణం తీర్చుకుంటామంటున్నారు. కారు గుర్తుకు ఓటేస్తామంటున్నారు. కారే కావాలి, సారే రావాలంటూ ప్రజలే పాడుకుంటున్నారు. ప్రచారానికి వెళ్తున్న బిఆర్‌ఎస్‌ శ్రేణులను ప్రజలే స్వచ్చందగా సాదరంగా ఆహ్వానం పలుకుతున్నారు. బస్తీలలోని ఇతరపార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బిఆర్‌ఎస్‌లో పెద్దఎత్తున చేరుతున్నారు. బిఆర్‌ఎస్‌ను బలపరుస్తున్నారు. కేసిఆర్‌కు జై కొడుతున్నారు.

కారుకే ఓటేస్తం..సునీతనే గెలిపిస్తం!

`జూజ్లిహిల్స్‌లో జనమంతా అంటున్న మాట.

`ఎక్కడ విన్నా కేసీఆర్‌ ముచ్చటే.

`ఎక్కడ విన్నా సారే రావాలంటూ కోరుకుంటున్న పాట.

`కేసీఆర్‌ లేకుంటే తెలంగాణ ఆగమే!

`అధికారంలోకి కాంగ్రెసోళ్లు గోసపెడుతున్రు.

`ఆరు గ్యారెంటీలు అంతా ఉత్తమాట.

`ఇంక నమ్ముతమా కాంగ్రెస్‌నంటున్న ఆడపడుచులు.

`ప్రచారానికి వస్తున్న కాంగ్రెస్‌ నాయకులను నిలదీస్తున్నరు.

`ఇదీ జూబ్లీ హిల్స్‌ జనం మాట.

`బీఆర్‌ఎస్‌ నాయకులకు విక్టరీ సింబల్‌ చూపిస్తున్న మహిళలు.

`మా ఓటు కారుకే అంటున్న బస్తీల వాసులు.

`కేసీఆర్‌ వున్నప్పుడే మంచిగుండె అని ప్రజలే చెప్తున్నరు.

`కాంగ్రెస్‌ గెలిస్తే రౌడీ రాజ్యమే అని బాహటంగానే అంటున్న మహిళలు.

`బీఆర్‌ఎస్‌ నాయకులకు జనం నుంచి అడుగడుగునా నీరాజనాలు.

`కాంగ్రెస్‌ను నమ్మితే కాటగలిసినట్లే.

`బస్తీ మహిళలు కాంగ్రెస్‌ నాయకుల ముఖం మీదే చెబుతున్న మాట.

`మారు మాట్లాడకుండా జారుకుంటున్న కాంగ్రెస్‌ నాయకులు.

`పదేళ్లు మంచి నీళ్ల కరువు లేదు.

`సారున్నప్పుకు నీళ్లకు ఇబ్బంది పడలేదు.

`ఇప్పుడు మంచినీళ్లు సక్కగొస్తలేవు.

`కేసీఆర్‌ సారున్నప్పుడు కరంటు పోలేదు.

`ఇప్పుడు ఎప్పుడొస్తదో, ఎప్పుడు పోతందో తెలుస్తలేదు.

`మోరీలు సక్కగ సాఫ్‌ చేస్తలేరు.

`కాంగ్రెస్‌ అంటే కూలగొట్టుడే..పేదోళ్ల బతుకు బజారే.

`అడుగడుగునా కాంగ్రెస్‌ నాయకులను నిలదీస్తున్న మహిళలు.

`కాంగ్రెస్‌ నాయకులతోనే మీకెయ్యం..కారుకే ఏస్తమంటున్న జనం.

హైదరాబాద్‌, నేటిధాత్రి:
కారు గుర్తుకే ఓటేస్తాం. సునీతనే గెలిపించుకుంటాం. మాగంటి గోపీనాధ్‌ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ది చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్‌ మమ్మల్ని అన్ని రకాలుగా ఆదుకున్నారు. బస్తీలలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు. కాంగ్రెస్‌ వచ్చి కష్టాలు తెచ్చింది. జనాన్ని గోస పెడుతోంది. ఇంకా కాంగ్రెస్‌ను నమ్ముతామా? బరాబర్‌ సునీతనే గెలిపించుకుంటం..సునీతను బంపర్‌ మెజార్టీతో గెలిపిస్తం. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు. జూబ్లీహిల్స్‌ ప్రజలు. గల్లీలు, బస్తీలు, కాలనీల ప్రజలంతా ముక్త కంఠంతో చెబుతున్న మాటలు. కాంగ్రెస్‌ విచ్చనంక పడుతున్న గోసలు అన్నీ ఇన్నీ కావు. నీళ్లు రావు. కరంటు సక్కగ రాదు. తెలంగాణ రాకముందు వారం పది రోజులకు ఒకసారి మంచినీళ్లు వచ్చేటివి. ఎండాకాలమొస్తే బోరు నీళ్లు తప్ప మంచినీళ్లు గతి వుండేవి కాదు. మున్సిపల్‌ నీళ్ల కోసం కిలోమీటర్ల దూరం పోయి, క్యాన్లలో తెచ్చుకునేటోల్లం. గంటలు గంటలు క్యూలో నిలబడి ఒక్క క్యాన్‌ నీళ్ల కోసం రోజంతా క్యూలో నిల్చున్న రోజులున్నయి. కాని తెలంగాణ వచ్చిన తర్వాత కేసిఆర్‌ రోజూ నీళ్లిచ్చిండు. ఇంటింటికి నల్లా కనెక్షన్‌ ఇచ్చిండు. రోజూ ఇరవై వేల లీటర్ల నీళ్లు ఉచితంగా ఇచ్చిండు. ఒక్కనాడు కూడా నీళ్ల గోసలేకుండా చూసుకున్నడు. ఎండాకాలమైనా, వానా కాలమైనా సరే నీళ్లకోసం ఎదురుచూసింది లేదు. మళ్ల కాంగ్రెస్‌ వచ్చింది. రెండేళ్లుగా ఎండా కాలంలో పడుతున్న గోస అంతా ఇంతా కాదు. మున్సిపల్‌ నీళ్లు మూడు రోజులకోసారి కూడా సక్కగ వస్తలేవు. ఎండాకాలంలో వారం రోజులకు ఓసారి వచ్చినయ్‌. తెలంగాణ రాకముందు కరంటు కష్టాలు చూసినం. అప్పుడు సక్కగ కరంటే వుండేది కాదు. తెలంగాణ వచ్చినంక కేసిఆర్‌ ఇరవై నాలుగు గంటల కరంటు ఇచ్చిండు. కరంటు ఎప్పుడూ పోయేది కాదు. బస్తీలలో దోమలుంటాయి. కరంటు లేకపోతే రాత్రి పూట నరకం చూస్తాం. కాంగ్రెస్‌ వచ్చింది.. కరంటు కష్టమొచ్చింది. కేసిఆర్‌ వున్నప్పుడు ఎంత వాన పడుతున్నా కరంటు పోయేది కాదు. ఇప్పుడు చినుకు పడితే ఖతం కరంటు పోతది. ఎప్పుడొస్తదో తెల్వది. కరంటు కోతలు. దోమలుతో జరాలు వస్తున్నయి. కాంగ్రెస్‌ సక్కదనానికి ఉచిత కంరటు అన్నది. ఎవలికి వస్తలేదు. ఉచిత ఆరు గ్యారెంటీలు చెప్పిండ్రు. ప్రజలను మోసం చేసింన్రు. కల్యాణ లక్ష్మి లక్షరూపాయలతోపాటు, తులం బంగారం ఇస్తామన్నారు. ఏది ఒక్కలికి కూడా ఇయ్యలే. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులు కూడా సక్కగ వస్తలేవు. ఆడపిల్లలకు స్కూటీలిస్తన్నరు. మహిళలందరికీ రూ.2500 ఇస్తమన్నరు. ఒక్కలికన్నా ఇచ్చిండ్రా.. 500లకే గ్యాస్‌ సిలిండర్‌ అన్నరు. ఇచ్చింది లేదు. సచ్చింది లేదు. ఇదీ జూబ్లీహిల్స్‌లో వున్న పేద ప్రజలు కాంగ్రెస్‌ నాయకులు ముఖం పట్టుకొని అంటున్న మాట. ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్‌ నాయకులతో ఈ మాటలు అంటుంటే వాళ్లు సమాధానం చెప్పలేక, అక్కడి నుంచి జారుకుంటున్నారు. పైగా కాంగ్రెస్‌ పార్టీని, ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పెద్దలను తిడుతుంటే నవ్వుకుంటున్నరు. ఇంకా తిట్టకు అనుకుంటూ వెళ్లిపోతున్నారు. ఇదీ జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌ పరిస్తితి. ఇదిలా వుంటే పెద్దఎత్తున బిఆర్‌ఎస్‌ పార్టీలోకి కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు వస్తున్నారు. బిఆర్‌ఎస్‌ కండువా కప్పుకుంటున్నారు. బిఆర్‌ఎస్‌ను గెలిపిస్తామని శపధం చేస్తున్నారు. కాంగ్రెస్‌కు డిపాజిట్‌కూడా రానివ్వమని బిఆర్‌ఎస్‌లో చేరిన నాయకులు అంటున్నారు. ఇక బిఆర్‌ఎస్‌ నాయకులు ప్రచారం సాగిస్తుంటే ప్రజలు సాదరంగా స్వాగతం పలుకుతున్నారు. ఇటీవల ఓ బస్తీలో ప్రచారానికి వెళ్లిన మాజీ మంత్రి జగదీశ్వరరెడ్డిని చూసిన ఓ మహిళ విక్టరీ సింబల్‌ చూపించి ఆహ్వానించింది. జగదీశ్వరెడ్డి ప్రచారంలో బాగంగా ఓటు గురించి చెబుతుంటే కారే..కారే మాది అంటూ చెప్పడంతో బిఆర్‌ఎస్‌ నాయకుల మోములో నవ్వులు మెరిశాయి. నా పెద్ద కొడుకు కేసిఆర్‌ అంటూ ఓ ముసలవ్వ చెబుతూ, జై కేసిఆర్‌ అంటూ నినదించింది. ఇక సర్వేలు చేస్తున్న వారికి కూడా ప్రజలు స్పష్టమైన సమాధానం చెబుతున్నారు. సహజంగా సర్వేలకు వెళ్లిన వారికి గాని, ప్రచారానికి వెళ్లిన వారికి గాని తమ మనోగతాన్ని చెప్పడానికి సుముఖత వ్యక్తం చేయరు. కాని ఎక్కడికెళ్లినా కారు గుర్తుకే ఓటేస్తామని ప్రజలు చెప్పడం అంటే వారిలో ఎంత చైతన్యం వుందో అర్దం చేసుకోవచ్చు. ఏ మాత్రం భయపడుకుండా మహిళలు సునీతనే గెలిపిస్తామని చెబుతుంటే కాంగ్రెస్‌ నాయకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో ఎక్కడ విన్నా కేసిఆర్‌ పాటే. సారే రావాలంటున్నది అంటూసాగే పాటనే గల్లీ గల్లీలో వినిపిస్తున్నది. గులాబీల జెండలమ్మా అంటూ సాగే పాట అడుగడునా వినిపిస్తున్నది. ఆరు గ్యారెంటీలు ఉత్త మాట. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చేది లేదు. సచ్చేది లేదంటూ మహిళలు కాంగ్రెస్‌ నాయకుల ముఖం మీద చెబుతున్నారు. ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ముస్లిం, మైనార్టీ ప్రజలు కూడా కారు గుర్తుకే ఓటు అంటూ చెబుతున్నారు. బిజేపి, కాంగ్రెస్‌ నాయకులకు జనమే చుక్కలు చూపిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్దఎత్తున సెక్యూటితో తిరుగుతున్నారు. జనాన్ని భయపెట్టాలని చూస్తున్నారు. అయినా జనం జంకడం లేదు. ఓటేస్తే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తమని రాసిస్తరా? అంటూ మంత్రులను కూడా జనం నిలదీస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల ప్రచారంలో ప్రజల కన్నా, సెక్యూరిటీలే ఎక్కువ వుంటున్నారు. దాంతో కాంగ్రెస్‌ నాయకులు ప్రచారనికి వెళ్లలేక, జనంతో చీవాట్లు పడలేక సతమతమౌతున్నారు. కాంగ్రెస్‌ ఎంచుకున్న అభ్యర్ధి కూడా ఆ పార్టీకి మైనస్‌గా మారింది. బస్తీలలో నవీన్‌ యాదవ్‌, ఆయన అనుచరుల మూలంగా పడుతున్న ఇబ్బందులను గురించి కూడా జనం చెప్పుకుంటున్నారు. నవీన్‌ అనుచరులు రాత్రి సమయాల్లో చేసే హంగామాలను గురించి కధలు, కథలుగా జనం చెప్పుకుంటున్నారు. ఇప్పుడే నవీన్‌ యాదవ్‌, ఆయన అనుచరులతో పడరాని పాట్లు పడుతున్నామని, పొరపాటున గెలిపిస్తే నిత్యం నరకం చూడాల్సిందే అని మహిళలు అంటున్నారు. దాంతో ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్‌ నాయకులు ఏం మాట్లాడాలో తెలియక అవస్ధలు ఎదుర్కొంటున్నారు. ఇక చిరు వ్యాపారులు కాంగ్రెస్‌ అభ్యర్ధి మీద చేస్తున్న ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు. మామూళ్ల వసూళ్లతో తమ జీవితాలను ఆగం చేస్తున్నారంటూ చిరు వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. అందుకే తాము బిఆర్‌ఎస్‌నే గెలిపిస్తామంటున్నారు. కేసిఆర్‌ వున్నప్పుడు గల్లీలల్ల సప్పుడు వుండేది కాదు. లొల్లి లేకుండా బస్తీలు ప్రశాంతంగా వుంటేటివి. ఇప్పుడు రోజుకో లొల్లితో నిద్రలు కూడా వుంటలేవని జనం అంటున్నారు. కాంగ్రెస్‌ గెలిస్తే ఈ చిన్న చిన్న వ్యాపారాలు కూడా చేసుకోలేమంటూ చిరు వ్యాపారులు అంటున్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే రౌడీల రాజ్యమౌతుందని జనం భయపడుతున్నారు. సునీతను గెలిపించుకొని ప్రశాతంగా వుంటామంటున్నారు. సునీత గెలుసుడు పెద్ద కష్టం కాదని ప్రజలే అంటున్నారు. బిఆర్‌ఎస్‌ నాయకులు మెజార్టీ కోసమే ప్రచారం చేస్తున్నామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్‌, బిజేపిలకు డిపాజిట్‌ కూడా దక్కదని బిఆర్‌ఎస్‌ నాయకులు చెబుతున్నారు. కాంగ్రెస్‌ వస్తే జూబ్లీహిల్స్‌లో పేదల బస్తీలుండవు. పేదలను బస్తీలలో వుండనివ్వరు. హైడ్రా పేరుతో కూల్చివేతలు మొదలు పెడతారని జనం భయపడుతున్నారు. కాంగ్రెస్‌ను ఓడిస్తేనే తాము ప్రశాంతంగా వుంటామని ప్రజలు చర్చించుకుంటున్నారు.

‘‘కౌలు’’, ‘‘పట్టాల’’ మధ్య కయ్యం!

`‘‘సీఎం’’. రేవంత్‌ రెడ్డి కి నాయకులు తెచ్చి పెడుతున్న తలనొప్పులు.

`ముదురుతున్న లొల్లులు…పార్టీలో లుకలుకలు!

`కాంగ్రెస్‌ పార్టీ లో ఈ రెండు వర్గాలున్నాయా!

`అధిష్టానానికి తెలియకుండానే రాజకీయాలు సాగుతున్నాయా?

`అసంతృప్తులు కాంగ్రెస్‌ లో పెరిగిపోతున్నారు.

`అసలైన కాంగ్రెస్‌ లో అసమ్మతి వాదులు పెరుగుతున్నారా?

`జీవన్‌ రెడ్డి రాజేస్తున్న మంటకు లేదు అంతం.

`జగిత్యాలలో రోజు రోజుకూ ముదురుతున్న విభేదం.

`అసలు పట్టాదారులం మేమంటూ జీవన్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు.

`కౌలు దారుల పెత్తనం పెరిగిపోయిందని ఆరోపణలు.

`మంత్రుల వల్ల నలిగిపోతున్నామంటూ విమర్శలు.

`బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన సంజయ్‌ వల్ల పార్టీకి నష్టమంటూ ఆవేదనలు.

`పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల మధ్య సమస్యలు.

`నాయకుల మధ్య పొడసూపుతున్న విభేదాలు.

`మంత్రుల మధ్య పెరుగుతున్న అంతరాలు.

`ఆధిపత్యాలలో తవ్వుకుంటున్న అగాధాలు.

`పార్టీకి నలుసులుగా మారుతున్న కొంతమంది ఎమ్మెల్యేలు.

`ఏదో ఒక వివాదం రగిలిస్తూ పార్టీ పరువు తీస్తున్నారు.

`ఆ మధ్య ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, మందుల సామెల్‌ మధ్య మాటల యుద్ధం.

`‘‘ఎంపి’’ కి కాదు సమస్యలు నా దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే వివాదం.

`ఎప్పుడూ ఏదొ ఒక చిటపట రాజేస్తున్న కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి.

హైదరాబాద్‌, నేటిధాత్రి:                        తెలంగాణలో వరుస వివాదాలతో కాంగ్రెస్‌నాయకులు, ప్రభుత్వంలో కీలకంగా వున్న కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు వరుసగా ఏదో ఒక కాక రేపుతూనే వున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఏదో ఒక తలనొప్పి తెచ్చిపెడుతూనే వున్నారు. తెలంగాణ రాజకీయాలలో వేడిని పెంచుతున్నారు. ప్రతిపక్షాలు ఆ రాజకీయంలో చలి కాచుకునేలా చేస్తున్నారు. పార్టీ పరువును, ఓ స్ధాయిలో వున్న నాయకులు కూడా బజారు కీడుస్తున్నారు. ఓ వైపు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఎలా గెవాలన్నదానిపై ఎరికీ శ్రద్దలేదు. కాని వివాదాలు మాత్రం రాజేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి, సీనియర్‌ నాయకుడు మంత్రి అడ్లూరి లక్షణ్‌ ముందు చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారాయి. నిజానికి మాజీ మంత్రి జీవన్‌రెడ్డికి కాంగ్రెస్‌ పార్టీ చేసిన అన్యాయం లేదు. ఆయన గౌరవానికి భంగం వాటిల్లింది లేదు. ఆయనకు వరసగా అవకాశాలిస్తూనే వున్నారు. కాని ఆయన ఓడిపోతున్నారు. గత ఎన్నికల్లో కూడా ఆయన ఓటమి పాలయ్యారు. అయినా తనదే పెత్తనం కావాలని ఆరాటపడుతున్నారు. గత శాసన సభ ఎన్నికల్లో ఓడిపోయిన జీవన్‌రెడ్డి, మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్‌ కోసం నానా యాగీ చేశారు. ఇప్పుడు తనకు ప్రాదాన్యత దక్కడం లేదని గొగ్గోలు పెడుతున్నారు. బిఆర్‌ఎస్‌ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే సంజయ్‌ పై నిత్యం విమర్శలు గుప్పిస్తున్నారు. పార్టీని నిలదీస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి తాము పట్టాదారులమంటూ లెక్కలు చెబుతున్నాడు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని కౌలుదారులంటున్నాడు. కౌలు దారులు పట్టాదారుల మీద పెత్తనం చేస్తున్నారంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. తన వాదన అరణ్య రోధన అని తెలిసినా జీవన్‌ రెడ్డి ఊరుకోడం లేదు. తన వితండ వాదం సరైంది కాదని తెలిసినా వివాదాలు సృష్టించకుండా వుండడం లేదు. కాంగ్రెస్‌పార్టీకి ప్రతిపక్షం అవసరం లేదని అంటారు. కాంగ్రెస్‌ పార్టీ అదికారంలో వున్నప్పుడు ఆ పార్టీలోనే పాలకపక్షం, ప్రతిపక్షం కూడా కలిసే వుంటాయంటారు. కాంగ్రెస్‌ పార్టీలో సహజంగానే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. ఏ నాయకుడు ఏది మాట్లాడినా పెద్దగా పట్టించుకోవడం అనేది వుండదు. నాయకుల తీరు మరీ మితిమీరితే తప్ప చర్యలుండవు. పార్టీలో నాయకులు చేసే పనిని, చేసే ప్రతి వ్యాఖ్యను పట్టించుకోవడం అనేది సహజంగానే వుండదు. అందువల్ల ఆ పార్టీలో ఎవరి అభిప్రాయాలు వారు స్వేచ్చగా చెప్పుకునే అవకాశం వుంటుంది. అదే కాంగ్రెస్‌ పార్టీ కొంప ముంచుతుంది. నాయకుల మధ్య వున్న విభేదాలు ఎప్పటికప్పుడు బైట పడుతూనే వుంటాయి. కాంగ్రెస్‌పార్టీలో ఏ నాయకుడికి అన్యాయం జరిగినా బహిరంగంగానే చెప్పుకునే వెసులుబాటు ఇప్పటికీ కొనసాగుతోంది. ధైర్యం వున్న నాయకులు కొంత మంది తమ గళాన్ని సవరిస్తూనే వుంటారు. తమ అభిప్రాయాలు చెప్పేస్తుంటారు. అలా చెప్పగలిగే నాయకులలో మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్‌ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన ఎవరికీ భయపడరు. మొహమాటం అసలే చూపించరు. తాను మనసులో ఏమనుకున్నా సరే దానికి బైట పెడతారు. ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు చెబుతూనే వుంటారు. 2023 ఎన్నికల్లో మళ్లీ మునుగోడు నుంచి గెలిచిన రాజగోపాల్‌రెడ్డి మంత్రి పదవి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కాని ఆ కల తీరలేదు. దాంతో ఆయన సొంత ప్రభుత్వం మీద ఎప్పటికప్పుడు తన అసమ్మతిని చూపిస్తూనే వుంటారు. తాజాగా ఆయన ఆర్‌ఆర్‌ఆర్‌ విషయంలో ఘాటైన వ్యాఖ్యలే చేశారు. ప్రభుత్వాన్ని పడగొట్టైనా సరే రైతులకు న్యాయం చేద్దామని ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. ఇది పెద్ద సంచలనంగా మారింది. పైగా ఇటీవల వైన్స్‌ టెండర్ల విషయంలోనూ తన ఇలాఖాలో రూల్‌ వేరుగా వుంటుందని ప్రకటించారు. తన నియోజకవర్గంలో బెల్టు షాపులు వుండకూడదని హుకూం జారీ చేశారు. అంతే కాకుండా వైన్స్‌ నిర్వహణ సమయాన్ని కూడా ప్రకటించారు. ఇలా ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు కాళ్లలో కట్టెలు పెట్టే పని ఆయన చేస్తూనే వున్నారు. తనకు మంత్రి పదవి ముఖ్యం కాదంటూనే విమర్శలు గుప్పిస్తూనే వున్నారు. అయితే ఇటీవల ఆయన వ్యాఖ్యలను పెద్దగా పట్టించునేవారు లేకుండాపోయారు. ఇక మరో ఎమ్మెల్యే దొంతి మాదవరెడ్డి. నర్సంపేట నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికలైన ఆయన మంత్రి పదవి మీద ఆశలు పెట్టుకున్నారు. కాని ఆయనకు ఆ పదవి దక్కలేదు. దొంతి మాధవరెడ్డి తీరు కూడా సిఎం. రేవంత్‌రెడ్డికి తలనొప్పిగా మారింది. ఇక మహాబూబ్‌ నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఓ దినపత్రికలో రాసిన వ్యాసం సంచలనాన్ని సృష్టించింది. పంచాయితీలకు, నగర పంచాయితీలకు నిధుల విడుదలలో అన్యాయం జరుగుతోందన్న విషయాన్ని ఆయన రాసుకొచ్చారు. ఇక జడ్చర్ల ఎమ్మెల్యే అనురుద్‌ రెడ్డి కూడా ఎప్పటికప్పుడు ఏదో ఒక కుంపటి రగిలిస్తూనే వున్నారు. ఆ మధ్య కొంత మంది ఎమ్మెల్యేలు సమావేశమైన సంగతి అందరికీ తెలిసిందే. అప్పటి నుంచి ఆయన కూడా అసమ్మతి వాదిగానే ముద్ర వేసుకున్నారు. ఈ నలుగురు ఎమ్మెల్యే ప్రభుత్వానికి కంట్లో నలుసులా తయారయ్యారని అంటున్నారు. వీరిపై చర్యలు తీసుకోలేరు. వారి వ్యాఖ్యలను ఎవరూ ఖండిరచలేరు. అదంతే కాంగ్రెస్‌ పార్టీ..అసమ్మతి లేకపోతే సాగదు. ఇక ఓ వారం రోజులుగా కరీంనగర్‌కు చెందిన ముగ్గురుమంత్రుల మధ్య అగాధం కనిపించింది. జూబ్లీహిల్స్‌ ప్రచార కార్యక్రమంలో పాల్గొనాల్సిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ రాక ఆలస్యం కావడం వల్ల మంత్రి పొన్నం ప్రభాకర్‌ నోరు జారిన సంగతి తెలిసిందే. తాను మంత్రిని ఉద్దేశించి చేయలేదని మంత్రి పొన్నం చెప్పిన మాట విన్నదే. మంత్రి పొన్నం చేసిన ఆలస్యానికి కొంత రాజకీయ రగడ జరిగిందే. నిజం చెప్పాలంటే ఎప్పుడైతే మంత్రి పొన్నం మాటలు బైటకు రాగానే, క్షమాపణ చెబితే పోయేది. కాని బేషజానికి వెళ్లడం వల్ల ఆలస్యం అమృతం విషమైంది. మంత్రి పొన్నం ఒక మెట్టు దిగాల్సి వచ్చింది. అయినా అప్పటికే జరగాల్సినంత రచ్చ జరిగిపోయింది. దళిత సంఘాలు రంగంలోకి దిగాయి. మంత్రి పొన్నం దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. మంద కృష్ణ మాదిగ, మోత్కుపల్లి నర్సింహులు లాంటి వారు మీడియా ముందుకు వచ్చారు. మంత్రి అడ్లూరికి అండగా నిలిచారు. దాంతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కూడా మంత్రి పొన్నం క్షమాపణ చెపాల్సిందే అని డిమాండ్‌ చేయక తప్పలేదు. ఈ వివాదం ముగిసింది అనే లోపు మరో మంత్రి వివేక్‌ వెంకటస్వామి కొన్ని సంచనల వ్యాఖ్యలు చేశారు. తనపై రాజకీయ కుట్ర జరుగుతుందన్నారు. తనపై సామాజిక మాధ్యమాలలో టార్గెట్‌ చేసి కులం ఆధారంగా విమర్శలు చేస్తున్నారని మంత్రి వివేక్‌ అన్నారు. జూబ్లీహిల్స్‌ ఎన్నికల బాద్యతలో వున్న తాను, అక్కడ కాంగ్రెస్‌ గెలిస్తే తనకు పేరు వస్తుందన్న అక్కసుతో తనపై లేనిపోని నిందలు వేస్తున్నారని వివేక్‌ అన్నారు. అంతే కాకుండా మంత్రి లక్ష్మణ్‌ తనపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్దం కావడం లేదని కూడా చెప్పుకొచ్చారు. లక్ష్మణ్‌కు రాజకీయ ప్రోత్సాహాన్ని కల్పించిందే తన తండ్రి వెంకటస్వామి అని గుర్తు చేశారు. తనకు పదవి మీద వ్యామోహం లేదని అన్నారు. రాజకీయంగా తన ఎదుగుదలను కొందరు ఓర్వలేకపోతున్నారని వివేక్‌ అన్నారు. కొంత మంది పనిగట్టుకొని తాను అనని మాటలు ప్రచారం చేస్తున్నారని అంటూనే మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు రాజకీయం నేర్పిందే మేము అన్నారు. తన తండ్రి వెంకటస్వామి ఆశీస్సులతోనే మంత్రి అడ్లూరి రాజకీయంగా ఎదిగారని అన్నారు. అయితే మంత్రి పొన్నం ఎపిసోడ్‌లో పక్కనే మంత్రి వివేక్‌ కూడా వున్నారు. దాంతో ఆ సమయంలోనే మంత్రి అడ్లూరి కొన్నికీలకమైన వ్యాఖ్యలు చేశారు. మంత్రి వివేక్‌ తనను చిన్న చూపు చూస్తున్నారని అన్నారు. తనపై రాజకీయ కక్ష పెంచుకున్నారని చెప్పారు. తాను మంత్రి వివేక్‌ పక్కన కూర్చోవడం ఆయనకు ఇష్టం లేదని మంత్రి అడ్లూరి అన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ ముగ్గురు మొదటి సారి ఎమ్మెల్యేలు అయ్యారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన మొదటిసారేమంత్రులయ్యారు. కాకపోతే మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వివేక్‌ వెంకస్వామిలు గతంలో ఎంపిలుగా గెలిచారు. తర్వాత ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ ఇద్దరూ గెలవలేదు. తొలిసారి ఈ ఇద్దరు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మంత్రులయ్యారు. అదే దారిలో అడ్లూరి కూడా మొదటిసారి గెలిచి మంత్రి అయ్యారు. అడ్లూరి మాత్రం ఈ మధ్యనే మంత్రి అయ్యారు. ఉమ్మడి కరీంనగర్‌ నుంచి నలుగురు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాని ఈ ముగ్గురి మధ్య మాత్రం సయోధ్య ఎంత కుదిరిందో ఎవరికీ తెలియదు. నల్లగొండ జిల్లాకు చెందిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్‌ చేసే వ్యాఖ్యలు కూడా పార్టీకి ఇబ్బం ది కరమైన పరిస్ధితులే సృష్టిస్తున్నాయి. ఆ మధ్య డైరీ ఎన్నికల సమయంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య మీద తుంగతుర్తి ఎమ్మల్యే మందులు సామెల్‌ తీవ్రమైన ఆరోపణలు చేశారు. అదే ఎమ్మెల్యే ఒక దశలో ప్రజలు గాని, పార్టీ నాయకులు ఏ సమస్యలున్నా ముందు తన వద్దకే రావాలంటూ హుకూం జారీ చేశారు. ముందు ఎంపి, చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి వద్దకు వెళ్లొద్దని ఆయన ముందే తేల్చి చెప్పారు. ఇవి చిన్న చిన్న సమస్యలు కాదు. పార్టీని ముంచడానికి ఈ చిన్న సమస్యలే పెద్దవై పార్టీని ఆగం చేస్తాయి.

’’నెంబర్‌’’ 2 ‘‘శీనన్నే’’!

’’పొంగులేటి’’ ముందు ఎవరి కుప్పిగంతులు చెల్లవులే!

అధిష్టానం ముందు ‘‘పితూరీలు’’ చెప్పే వారి పాచికలు పారవులే!

అధిష్టానానికి అన్నీ తెలుసు.

పార్టీని అధికారంలోకి తీసుకురావడం

‘‘పాన్‌ నమిలినంత’’ సులువు కాదు.

`గెలిచిన తర్వాత ఫోజులు కొట్టినంత మాత్రాన సరిపోదు.

పదేళ్ళ తర్వాత పార్టీని అధికారంలోకి తేవడానికి ‘‘శీనన్న’’ పడిన కష్టం అధిష్టానానికి తెలుసు.

`జిల్లాలకు జిల్లాలు గెలిపించిన నాయకుడు ‘‘శీనన్న’’.

ఖమ్మంలో కారు తిరగకుండా చేసిన నాయకుడు ‘‘శీనన్న’’.

`తన సీటు గెలవడానికే ఆపసోపాలు పడ్డ వాళ్లు కూడా మాట్లాడుతున్నారు.

’’సిఎం. రేవంత్‌ రెడ్డి’’ తో కలిసి పార్టీ గెలుపుకు అహర్నిశలు కృషి చేసింది ‘‘శీనన్న’’.

ఖమ్మం సభతో కాంగ్రెస్‌ ను కదం తొక్కేలా చేసింది ‘‘శీనన్న’.

`తెలంగాణ లో కాంగ్రెస్‌ ను అధికారంలోకి తేవడానికి తొలి ‘‘గర్జన ఖమ్మం సభ’’.

కాంగ్రెస్‌ కు వేవ్‌ తెప్పించడంలో రేవంత్‌ రెడ్డి’’ తర్వాత కష్టం ‘‘శీనన్న’’దే.

`అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ మాట్లాడతారు.

పదేళ్లలో ఓడిపోయిన వాళ్లు కూడా గొప్పలకు పోతున్నారు.

`’’శీనన్న’’ రాజకీయం పలుచన చేయాలని చూస్తున్నారు.

`పార్టీని అధికారంలోకి తేవడంలో ‘‘శీనన్న’’ కష్టం పార్టీ పెద్దలందరికీ తెలుసు.

పార్టీకి పది పైసలు సాయం చేయలేని వాళ్లు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు.

`ఇప్పుడున్న పరిస్థితులలో పార్టీని నిలబెట్టే శక్తి వున్న నాయకులెవరో పెద్దలకు బాగా తెలుసు.

`పదవులకు న్యాయం చేయలేని వాళ్లు కూడా పెత్తనం కోసం ఆరాటపడుతున్నారు.

’’పొంగులేటి’’ ప్రభ తగ్గించాలని కలలు గంటున్నారు.

`పదవులొచ్చేలా దారి వేసిన ‘‘శీనన్న’’ నడవకుండా ముల్లకంప వేయాలని చూస్తున్నారు.

`వారి గోతులు వాళ్లే తవ్వుకుంటున్నారు.

`చెరపకురా చెడేవు అని తెలిసినా చాలా మంది మారరు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:
ఏటికి ఎదురీదేవాళ్లు మాటలు చెప్పరు. చెప్పినా వాటిని నిజం చేస్తారు. విజయాన్ని కళ్లముందు ఆవిష్కరిస్తారు. అలాంటి వారిలో రాష్ట్ర్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఒకరు. ఏమీ చేయలేని వారు ఏతులెక్కువ చెబుతారు. కూర్చున్న చోటంతా నాదే అంటారు. గుర్రాలు మలుతున్నామని గొప్పలు చెప్పుకుంటారు. పదేళ్లుగా పార్టీకి ఇటుక కూడా పేర్చని వాళ్లు ఇదంతా మాదే అంటారు. ఇదంతా మా వల్లే అని గొప్పలు చెప్పుకుంటారు. అలాంటి వాళ్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి మీద పడి ఏడుస్తుంటారు. పార్టీలో పొంగులేటికి లభించే ప్రాధాన్యత చూసి ఓర్వలేకపోతున్నారు. పార్టీ అధిష్టానం వద్ద మంత్రి పొంగులేటికి వున్న పలుకుబడిని చూసి తట్టుకోలేకపోతున్నారు. ఆయన ప్రాభవం చూసి జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన నాయకత్వాన్ని భరించలేకపోతున్నారు. వారి పెత్తనం సాగడం లేదని కుళ్లుకుంటున్నారు. ఇదంతా పొంగులేటి మూలంగానే తమకు గుర్తింపు లేదన్న అక్కసుతో లేనిపోని రాద్దాంతం చేస్తున్నారు. అసలు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి చేసిన కృషి ఏమిటో తెలియని వాళ్లు కాదు. కాంగ్రెస్‌ పార్టీ కోసం మంత్రి పొంగులేటి ఎంత కష్టపడ్డారో తెలియని వాళ్లు కాదు. అయినా అదంతా గతం అనుకునే బాపతు కాంగ్రెస్‌లో పెరిగిపోయారు. ఓడదాటే దాకా ఓడ మల్లన్న అని పొంగులేటిని పొగిడిన వాళ్లే, ఇప్పుడు గెలిచి పదవులు రాగానే పొంగులేటిని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. అలాంటి వల్లనే కాంగ్రెస్‌ పార్టీ ఈ స్ధితికి వచ్చింది. అయినా వారు మారరు. ఇలా మంత్రి పొంగులేటి మీద పడి ఏడ్చే వారి వల్ల ఊదు కాలేదు లేదు. పీరు లేచేది లేదు. అయినా సరే పొంగులేటిని విమర్శిస్తే తప్ప మీడియాలో కూడా కనిపించలేని స్ధాయికి దిగజారుతున్నారు. పార్టీ పేరు చెప్పుకొని రాజకీయాలు చేసే వారు..పార్టీని కష్ట కాలంలో వదిలేసి వచ్చిన వారు కూడా పొంగులేటిని విమర్శిస్తుంటే జనం నవ్వుకుంటున్నారు. ఆఖరుకు కాంగ్రెస్‌ పార్టీకి తీరని ద్రోహం చేసిన వాళ్లు కూడా పార్టీ అదికారంలోకి రావడానికి ప్రముఖ పాత్ర పోషించిన పొంగులేటిపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇంతకన్నా విడ్డూరం మరొకటి వుండదు. పార్టీ పెంచి పెద్ద చేసినా, ఆ కృతజ్ఞత లేకుండా, అవకాశ వాద రాజకీయాల కోసం కండువాలు మార్చినవారున్నారు. పార్టీ అన్ని పదవులు ఇచ్చినా స్వార్ధం కోసం పార్టీని వీడిన వాళ్లున్నారు. ఎక్కడా దిక్కూ దివానం లేక మళ్లీ పార్టీ గూటికి చేరి పదవులు పొందిన వాళ్లు కూడా నిత్యం పొంగులేటిని ఆడిపోసుకుంటున్నారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రాజకీయం అలాంటిది కాదు. ఆయన రాజకీయంగా తొలి అడుగుతోనే తెలంగాణ రాష్ట్రానికి వైసిపికి తొలి అధ్యక్షుడయ్యారు. తెలంగాణ వచ్చిన తర్వాత వైసిపి నుంచి ఎంపిగా గెలిచారు. ఖమ్మం జిల్లాలో తన పట్టు ఏమిటో చూపించారు. తనతోపాటు ఖమ్మం జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. తన నాయకత్వ పటిమ మొదటి ఎన్నికల్లోనూ చూపించారు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని విమర్శిస్తున్న వారిలో ఏ ఒక్కరికీ ఇలాంటి బలమైన రాజకీయ చరిత్ర లేదు. పార్టీ పేరు చెప్పుకుంటే తప్ప గెలవలేరు. పార్టీలు బిఫామ్‌లు ఇస్తే తప్ప పోటీ చేయలేరు. పార్టీకి అడుగడుగునా మోసం చేసిన వాళ్లు పొంగులేటిపై నీతి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇదీ తెలంగాణ ప్రజల దౌర్భాగ్యమని చెప్పుకోవాలి. తమ స్ధానాలలో తాము గెలవలేని వాళ్లు కూడా పదవులు అందుకొని నీతిబాహ్యమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆకాశం మీద ఉమ్మేస్తే అది మొహంమీదే పడుతుంది. అది తెలిసినా పదే పదే అలాంటి పొరపాట్లు చేస్తూనే పోతుంటారు. గత పదేళ్ల కాలంలో కాంగ్రెస్‌ పార్టీ ఒడిదొడుకులు ఎదుర్కొన్న కాలంలో పార్టీ పక్కన నిలబడిన వారు కాదు. పార్టీకి అండగా వున్న వాళ్లు కాదు. పార్టీని నిలబట్టే ప్రయత్నం ఏనాడు చేసిన వాళ్లు కాదు. అవకాశ వాద రాజకీయాల కోసం ఇతరపార్టీలకు వెళ్లి అక్కడి నుంచి కాంగ్రెస్‌ను తిట్టిన వాళ్లే ఇప్పుడు నీతులు వల్లిస్తున్నారు. మంత్రి పొంగులేటి పెత్తనాన్ని ప్రశ్నిస్తున్నారు. మంత్రి పొంగులేని ప్రభుత్వంలో నెంబర్‌ టూగా కొనసాగుతుండడాన్ని ఓర్వలేకపోతున్నారు. సరిగ్గా ఆరు ఎన్నికలకు ఆరు నెలల క్రితం వరకు కాంగ్రెస్‌ పార్టీ పరిస్థితి ఏమిటి? ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరక ముందు ఆ పార్టీ పరిస్ధితి ఏ స్దితిలో వుంది? అనేది అందరికీ తెలిసిందే. ఎప్పుడైతే ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పిసిసి పగ్గాలు అందుకున్నారో అప్పటి నుంచి పార్టీని గాడిలో పెట్టారు. పార్టీని బలోపేతం చేస్తూ వచ్చారు. పార్టీ క్యాడర్‌లో నమ్మకాన్ని నింపుతూ వచ్చారు. పార్టీ క్యాడర్‌కు భరోసా కల్పించారు. అడుగడుగునా అప్పటి ప్రభుత్వం మీద సిఎం. రేవంత్‌రెడ్డి అలుపెరగని పోరాటం చేశారు. అనేక సార్లు జైలు పాలయ్యారు. అనేక ఉద్యమాలు చేపట్టారు. పోరాటాలు చేశారు. బిఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని, కేసిఆర్‌ను ఊపిరి సలపనివ్వకుండా రాజకీయం చేశారు. బిఆర్‌ఎస్‌ను చీల్చి చెండాడారు. కేసిఆర్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వచ్చారు. కేసిఆర్‌ పాలనలో జరిగిన అవినీతి, అక్రమాలను వెలికి తీస్తూ వచ్చారు. కేసిఆర్‌ పాలనలో జరిగిన భూముల ఆక్రమణపై ప్రజల్లో చైతన్యం కల్గించారు. ప్రాజెక్టుల పేరుతో జరిగిన దోపిడీని ప్రజల ముందుంచారు. ఇలా రేవంత్‌రెడ్డి ఒంటరి పోరాటం సాగించారు. ఆఖరుకు పాదయాత్ర చేపట్టారు. పార్టీని గ్రామ గ్రామం నుంచి బలోపేతం చేసేందుకు అనేక రకాలుగా కృషి చేశారు. కాని పార్టీకి ఇంకా బలం కావాలి. బిఆర్‌ఎస్‌ను కొట్టడానికి మరో బలం తోడు కావాలి అనుకున్నప్పుడు పార్టీకి కనిపించిన వెపన్‌ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. ఆ సమయంలో పిపిసి. అధ్యక్షుడైన రేవంత్‌రెడ్డి వెళ్లి , పార్టీలోకి ఆహ్వానించిన తర్వాత పొంగులేటి కాంగ్రెస్‌లోకి వచ్చారు. పార్టీని బలోపేతం చేసే బాధ్యత తీసుకున్నారు. ఖమ్మం నుంచే కాంగ్రెస్‌ గర్జన మొదలు పెట్టారు. బిఆర్‌ఎస్‌ను రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోయేలా పొంగులేటి రాజకీయం చేశారు. ప్రజలను చైతన్యం చేశారు. తానున్నానని భరోసా కల్పించారు. కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టోను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఖమ్మంలో కారును తిరగన్వికుండా చేస్తానని శపథం చేసి నెరవేర్చారు. ఇదీ మంత్రి పొంగులేటి రాజకీయ యుద్దం. ఇలాంటి యుద్దం పార్టీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తప్ప మరొకరెవరైనా చేశారా? టిక్కెట్ల కోసం ఆరాపటపడ్డారు. టిక్కెట్ల కోసం ఎదురుచూశారు. వాళ్ల గెలుపుకోసమే శ్రమించారు. కాని ఇతర నియోజకవర్గాలలో ప్రచారం చేసే ప్రయత్నం చేశారా? తమ కన్నా పార్టీ గెలుపు ముఖ్యమని ముందుకుసాగారా? ఎన్నికల సమయమంతా చెమటోడ్చి వాళ్లు గెలిచేందుకే సమయం సరిపోలేదు. కాని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి తమ నియోజకవర్గాలలో కనీస ప్రచారానికి వెళ్లకుండానే గెలిచిన నాయకులు. ఇతర నియోజక వర్గాలలో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధుల గెలుపుకోసం అహర్నిషలు కృషి చేశారు. ఇదీ పొంగులేటి నాయకత్వ పటిమ. పార్టీని అధికారంలోకి తీసుకురావడం అంటే పాన్‌ నమిలినంత సులువు కాదు. అయినా అధిష్టానానికి అన్నీ తెలుసు. ఎవరు ఏమిటో వారికి పూర్తిగా తెలుసు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అంకితభావం ఎంత గొప్పదో తెలుసు. పార్టీ కోసం ఆయన కష్టపడిన తీరు తెలుసు. పార్టీకి అండగా వుంటూ ఆయన ఏం కోల్పోయారో కూడా తెలుసు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఎన్ని త్యాగాలు చేస్తే పార్టీ గెలిచిందో కూడా డిల్లీ పెద్దలందరికీ తెలుసు. ఇప్పుడు మంత్రి పొంగులేటి మీద లేనిపోని విమర్శలు చేస్తే డిల్లీ పెద్దలు నమ్మరు. లేనిపోని రాద్దాంతాలు చేసి పార్టీకి నష్టం చేకూర్చుతున్న వాళ్లు ఎవరో డిల్లీ అధిష్టానానికి అన్నీ తెలుసు. ఇచ్చిన పదవులకు న్యాయం చేయలేక, పని చేయలేని వాళ్లే లేనిపోని పితూరీలు మోస్తుంటారు. ఇతర నాయకులు ఎదుగుతుంటే చూడలేరు. అందుకే మంత్రి పొంగులేటి మీద లేనిపోని పుకార్లు పుట్టించి, అసత్యాలు ప్రచారం చేయాలని చూస్తున్నారు. కాని ప్రజలు నమ్మడం లేదు. పార్టీ క్యాడర్‌ నమ్మడానికి సిద్దంగా లేదు. అవకాశ వాదుల మాటలు ఎవరూ నమ్మరు. చెరపకురా చెడేవు అని సామెతను నిజం చేసుకున్న వాళ్లు కూడా మళ్లీ మళ్లీ అదే పని చేస్తున్నారు. వాళ్లు అక్కడే వుంటారు. ఎదుగుతున్న వారిని చూస్తూ ఏడుస్తూనే వుంటారు. మంత్రి పొంగులేటి ప్రభను తగ్గించలేరు. ఆ వెలుగులు తక్కువ చేయలేరు.

‘‘పిఏ’’లు పైర’’వీరులు’’..’’పిఆర్వో’’లు ‘‘వసూల్‌ రాజాలు’’???

ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు

‘‘పిఏ పిఆర్‌ఓ’’ లు ‘‘మూటల కోసమే’’ పనిచేస్తున్నారు!

`మంత్రులు, ఎమ్మెల్యేలను బద్నామ్‌ చేస్తున్రు!

`ప్రజల నుంచి పిఏ, పిఆర్వోల మీద సామాన్యుల నిరసనలు.

`పార్టీ నాయకులకు కూడా విలువివ్వరు.

`కార్యకర్తలను పురుగుల్లా చూస్తారు!

`మంత్రులు, ఎమ్మెల్యేలకు చెప్పుకోలేక నాయకులు మధనపడుతున్నారు.

`ఎమ్మెల్యేలను నాయకులను కూడా కలువనివ్వరు!

`మంత్రుల దరి చేరనివ్వరు!

`ఎమ్మెల్యే బిజీ, బిజీ అని చెప్పి తిప్పించుకుంటున్నారు.

`ఎలాంటి సమాచారం తెలియనీయకుండా జాగ్రత్త పడుతుంటారు.

`సామాన్యులకు అప్పాయింట్‌ ఇవ్వరు!

`జనాలకు మంత్రులు, ఎమ్మెల్యేలను దూరం చేస్తున్నారు.

??జర్నలిస్టుల ఫోన్లుకు కూడా స్పందించరు.??

`మంత్రులు, ఎమ్మెల్యేల అధికారిక పర్యటనలపై వివరాలివ్వరు.

`కనీసం వార్త రాసి మీడియాకు పంపడం కూడా చేతకాదు!

`మంత్రుల సక్సెస్‌ స్టోరీలకు సమాచారం ఇవ్వరు.

`వార్తలను చూసి పారిశ్రామిక వేత్తలకు ఫోన్లు?

`రియల్‌ వ్యాపారులకు బెదిరింపులు?

`ఎమ్మెల్యేల పేరు చెప్పి దందాలు, పైరవీలు!

`అధికారులను సైతం హడలెత్తించి పనులు చేసుకుంటున్నారు!

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించడం లేదన్న సామెతను నిజం చేస్తున్నారు కొంత మంది ప్రజా ప్రతినిదుల పిఏలు, పిఆర్వోలు అనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కొంత మంది పిర్వోలు, పిఏలు అత్యుత్సాహానికి పోయి, మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలకు దూరం చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల పలకుబడిని పలుచన చేస్తున్నారు. వారి పేర్లు చెడగొడుతున్నారు. వారికి వున్న ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నారు. ప్రజల్లో వారికి వున్న ఆదరణను దూరం చేస్తున్నారు. మంత్రులకు, ఎమ్మెల్యేలకే తలవంపులు తెస్తున్నారు. రాజకీయంగా మంత్రులు, ఎమ్మెల్యేలు విమర్శల పాలయ్యేలా చేస్తున్నారు. ప్రత్యర్ధి పార్టీలకు అస్త్రాలంచేలా వ్యవహరిస్తున్నారు. పిఏలు, పిఆర్వోలు చేసే మకిలి పనులకు ప్రజా ప్రతనిధులు సమాధానం చెప్పుకునే పరిసి ్దతి తీసుకొస్తున్నారు. మేమే ఎమ్మెల్యేలకు బాస్‌లమన్నంత దర్పం ప్రదర్శిస్తున్నవాళ్లున్నారు. మూడు ముడుపులు, ఆరు పైరవీలు అన్నట్లు అడ్డగోలు సంపాదనకు ఎగబడుతున్నారు. ప్రజా ప్రతినిధుల పరువు గంగపాలు చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్ధలో ప్రజలే పాలకులు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిదులైన నాయకులు ప్రజా సేవకులు. ప్రజల కోసం ఆరాటపడే మనస్తత్వం వున్న వారు మాత్రమే సహజంగా నాయకులౌతారు. ప్రజలకు దూరంగా వుండాలనుకునే వారు నాయకులు కాలేరు. నాయకులు కావాలని చాలా మందికి వుంటుంది. కాని ప్రజా సేవ చేయగలిగే వారు మాత్రమే నాయకులుగా మారుతారు. ప్రజా జీవితంలో వుంటారు. ప్రజలు తమను ఎన్నుకంటే మరింత మేలైనా, మెరుగైన సేవ చేయడానికి ప్రజా ప్రతినిధులౌతారు. ప్రజల కోసం జీవితాలు త్యాగం చేసిన వారు మన దేశంలో చాలా మంది వున్నారు. ప్రజల ప్రాణంగా బతికిన వారు అనేక మంది వున్నారు. ప్రజల కోసం జీవితాంతం తపన పడిన వారు మాత్రమే చరిత్రలో నిలిచిపోతారు. ఏ నాయకుడైనా సరే ప్రజల గుండెల్లో చిరస్దాయిగా నిలిచిపోవాలనే కోరుకుంటారు. తన తర్వాత తరాలు తనను గుర్తు చేసుకోవాలని తపన పడుతుంటారు. అలాంటి సేవలు చేస్తుంటారు. ఒక్కసారి నాయకుడైన తర్వాత ఎవరూ ప్రజలకు దూరంగా బతకాలని కోరుకోరు. గెలిచినా, ఓడినా ప్రజల్లోనే వుంటారు. ఒకప్పుడు నాయకులు ఎదరులేకుండా, తిరుగులేకుండా వరుస విజయాలు చూస్తుండేవారు. ఇప్పుడు ఒక్కసారి గెలిచిన నాయకుడు మళ్లీ గెలుస్తామా? లేదా? అన్న మీమాంసలోనే రాజకీయం చేస్తున్నారు. ప్రజలు మార్పు కోరుకున్నా, ప్రభుత్వాలను మార్చినా, కొంత మంది నాయకులు ఎప్పుడూ గెలుస్తూనే వుంటారు. అది వాళ్ల నాయకత్వ పటిమకు, ప్రజా సేవకు నిదర్శనం. కాని కొన్ని సార్లు నాయకులు ఎందుకు ఓడిపోయారో కూడా అర్దం కాని పరిస్ధితులు నెలకొంటున్నాయి. ఐదేళ్లపాటు నిరంతరం ప్రజల్లోనే వుంటారు. ప్రజా సేవలో వుంటారు. అభివృద్ది పనులు అనేకం చేస్తూనే వుంటారు. తమ నియోజకవర్గ అభివృద్ది కోసం పాటు పడుతూనే వుంటారు. కాని మరుసటి ఎన్నికల్లో ఓటమి పాలౌతుంటారు? కారణం ఆ నాయకులు కాదు. నాయకులు నమ్మిన మనుషులు. నాయకుల వద్ద పనిచేసే అనుచరులు. ముఖ్యంగా పిఏలు, పిర్వోలు. ఈ విషయం పదవులు పోయిన తర్వాత గాని సదరు నాయకులకు తెలియకుండాపోతోంది. పిఏలు, పిర్వొల మూలంగా ఇటీవల కాలంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు ఓడిపోతున్నారన్న సంగతి చాలా మందికి తెలియదు. ఎందుకంటే వాళ్లు నమ్మిన వాళ్లు బాగా పనిచేస్తున్నారని అనుకుంటారు. అలా వాళ్లు చెప్పిన మాటలు వింటూ నాయకులు వినడమే రాజకీయానికి ఇబ్బందికరమైన పరిస్దితులు వస్తున్నాయి. గతంలో గొప్పగా పనిచేసిన నాయకులు కూడా పిఏలు, పిర్వోల మూలంగా రాజకీయ మనుగడలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవాళ్లున్నారు. ఇప్పుడు ప్రజా ప్రభుత్వంలో కూడా వాళ్లే కనిపిస్తున్నారు. నాయకులు మారినా, ప్రభుత్వాలు మారినా పిఆర్వోలు, పిఏలు మాత్రం మళ్లీ, మళ్లీ ప్రత్యక్షమౌతుంటారు. అదే పనిని వాళ్లు చేస్తుంటారు. దశాబ్ధాల తరబడి అదే పిఏలు, అదే పిర్వోలుగా పనిచేస్తున్న వాళ్లు అనేకమంది వున్నారు. అలా పాతుకుపోయి ప్రభుత్వాలను భ్రష్టుపట్టించిన వాళ్లే , మళ్లీ మళ్లీ ప్రత్యక్షమౌతుంటారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి మొదలు, ఇప్పటి వరుకు కొనసాగుతున్న వాళ్లు అనేక మంది వున్నారు. కాని పాపం వీళ్లను నమ్ముకున్న నాయకులు మాత్రం ఓటమి పాలై రాజకీయాలకు దూరమైన వారు కూడా వున్నారు. అలా వుంటుంది. పిఏల పనితీరు. ఎమ్మెల్యే, మంత్రులు అంటే ప్రజల మనుషులు. ప్రజా ప్రతినిధులు. ప్రజల కోసం వున్న సేవకులు. ఒక్కసారి ప్రజా ప్రతినిధి అయిన తర్వాత వారిని ప్రజలకు కలవకుండా చేస్తున్నదే ఈ పీఆర్వో, పిఏలు. వారికి లేనిపోనివి చెప్పి, నాయకులకు, ప్రజలకు దూరం చేస్తుంటారు. ఎన్నికల సమయంలో అందరూ కలిసిపనిచేస్తారు. కొందరు నాయకులు ఎక్కువ పనిచేయొచ్చు. కొంత మంది నాయకులు తక్కువ పనిచేయొచ్చు. కాని వారందరూ అదే పార్టీకి చేందిన నాయకులు. కాని ఒక నాయకుడు ప్రజా ప్రతినిధి అయిన తర్వాత వారికి దగ్గర కావడానికి అనేక మంది రకరకాల వార్తలు మోసుకొని వస్తారు. నిజానికి అందరూ కలిసి పని చేస్తేనే నాయకులు గెలుస్తుంటారు. కార్యకర్తల్లో కూడా కొన్ని విభేదాలుంటాయి. ఆదిపత్యాలుంటాయి. నాయకులుగా ఎదగాలన్న తపన వుంటుంది. ఎమ్మెల్యే, మంత్రి ఆశీస్సులతో మరింత ఉన్నత స్దానానికి చేరుకోవాలని వుంటుంది. ఈ ద్వితీయ శ్రేణి నాయకుల ఆశలే పిఏలకు, పిఆర్వోలకు వరంగా మారుతుంది. ద్వితీయ శ్రేణి నాయకులు చెప్పే ప్రతి విషయాన్ని ఎమ్మెల్యే చెవిలో వేసి, తనకు అత్యంత సమ్మకస్తుడు అని పేరు పొందేందుకు పిఏలు, పిర్వోలు ప్రయత్నిస్తుంటారు. అలా నాయకుడు గుడ్డిగా నమ్మే స్ధితికి వచ్చిన తర్వాత ఇక పిర్వోలు, పిఏలు తమ ప్రతాపం చూపిస్తుంటారు. ప్రజలకు ప్రజా ప్రతినిధులను దూరం చేస్తుంటారు. ఎమ్మెల్యేల ఫోన్లుకూడా తన చేతుల్లో పెట్టుకొని, ఎవరి ఫోన్‌ ఎత్తాలో, ఎవరి ఫోన్‌ ఎత్తకూడదో కూడా పిఏలు, పిర్వోలే నిర్ణయించే స్ధాయికి చేరుకుంటారు. కేవలం తమకు పనికి వచ్చే వారి ఫోన్లు మాత్రమే లిప్ట్‌ చేస్తుంటారు. లేకుంటే ఎమ్మెల్యే బిజీగా వున్నారంటూ దాట వేస్తుంటారు. ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా, అదే సమాదానం చెబుతుంటారు. నాయకులు ఫోన్‌ చేసిన విషయం, ఎమ్మెల్యేలు, మంత్రులకు చేరవేయరు. ఎందుకంటే ఆ స్దాయిలో వుండే ప్రజా ప్రతినిధులకు ఊరిపి సలపనంత పని వుంటుంది. పని ఒత్తిడి కూడా గతం కాన్న ఎక్కువౌతుంది. దీనిని ఆసరా చేసుకొని పిఏలు, పిర్వోలు చెలరేగిపోతుంటారు. ఎమ్మెల్యేల దర్శనం చేసుకోవాలంటే, పిఏలు, పిర్వోలను ప్రసన్నం చేసుకోవాల్సిన దుస్తితి వస్తుంది. ఇక పార్టీ నాయకులు, కార్యకర్తల పరిస్దితే ఇలా వుంటే సామాన్య ప్రజల పరిస్దితి ఎలా వుంటుందో ఊహించుకోవచ్చు. ఒకప్పుడు నాయకుడి వద్దకు ప్రజలు నేరుగా వెళ్లిపోయే పరిస్దితి వుండేది. నాయకులు కూడా ప్రజల వద్దకు చేరుకొని ప్రజాసమస్యలు తెలుసుకునే వెసులుబాటు వుండేది. ఇప్పుడు ఆ పరిస్దితి లేదు. ఎమ్మెల్యేల చుట్టూ అధికారులు, వ్యక్తిగత సిబ్బంది, పిఏలు, పిర్వోలు అంటూ చక్రబందనాలుంటాయి. వీళ్లందరినీ దాటుకొని వేళ్తేగాని ప్రజలకు నాయకులు అందుబాటులోకి రాని పరిస్ధితి నెలకొన్నది. ఈ విషయం సదరు ఎమ్మెల్యేలకు తెలియదు. మంత్రులకు కూడా తెలియదు. ఒకప్పుడు జర్నలిస్టులు నేరుగా ఎమ్మెల్యే, మంత్రులను కలిసే అవకాశాలుండేవి. అప్పుడు అది కూడా లేదు. ఎమ్మెల్యేలు, మంత్రుల అప్పాయింటు మెంటుకోసం పిఏ, పిర్వోలను అడగాల్సిన పరిస్ధితి ఎదురౌతోంది. ఇంతకీ ఈ పిఏలు, పిర్వోలు ఏం చేస్తున్నారంటే దందాలు చేస్తున్నారు. వసూళ్ల పర్వం మొదలు పెట్టారు. పైరవీ కారుల అవతారం ఎత్తుతున్నారు. వసూల్‌ రాజాలుగా మారుతున్నారు. రోజుకు ఎంత సంపాదిస్తున్నామన్నదానిపై దృష్టిపెడుతున్నారు. ఇదీ బైట వినిపిసున్న మాట. ప్రతి పనికి రేటు నిర్ణయిస్తూ వసూళ్లు చేస్తున్నారన్న ఆరోపణలు అనేకమంది పిఏలు, పిర్వోల మీద వున్నాయి. పిఆర్వోలు మంత్రులకు సంబంధించిన షెడ్యూల్‌ను మీడియాకు ఎప్పటికప్పుడు అందజేయాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు చేసే అభివృద్ది, ప్రగతిని ఎప్పటికప్పుడూ వివరిస్తూ, వార్తలు పంపిస్తూ వుండాలి. సంబంధిత నియోజకవర్గాలలో వార్తా పత్రికల్లో వచ్చిన ప్రజా సమస్యలు ఎమ్మెల్యేలు, మంత్రుల దృష్టికి తీసుకెళ్లాలి. కాని ఆ పని చాల మంది పిర్వోలు చేయడం లేదు. జర్నలిస్టులకు కనీస సమాచారం అందించేందుకు కూడా ఇష్టపడడంలేదు. ఓ నాలుగుసార్లు ఫోన్‌ చేస్తే జర్నలిస్టుల నంబర్లు కూడా బ్లాక్‌ చేస్తున్నారు. ఇలా ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై ప్రజల్లో లేనిపోని అపోహలు ఎదురయ్యేలా చేస్తున్నారు. ఇక పత్రికల్లో వచ్చే వార్తలలో తమకు ఆదాయ వనరులు సమకూరుతాయనుకున్నప్పుడు సదరు వ్యక్తులకు ఫోన్లు చేయడం, ఎమ్మెల్యే పేరు చెప్పి వసూళ్ల పాల్పడడం చేస్తుంటారు. అవతలి వ్యక్తులు నిజంగానే ఎమ్మెల్యే చేయించారేమో అనే భయంతో ముళ్లెలు మట్ట చెప్పడం కూడా జరుగుతుంది. ఇక వ్యవస్దలో అనేక రకాల పనులు వుంటాయి. వాటి కోసం కొంత మంది పైరవీలు చేసుకుంటారు. అలాంటి పనులతో పిఏలు పంట పండిరచుకుంటున్నారు. పైరవీలు, పనులు చక్కదిద్ది నాలుగు రాళ్లు సంపాదించుకోవడంలో పిఏలు, పిర్వోలు బీజీబిజీగా వున్నారంటూ ఆనేక ఆరోపణలున్నాయి. ఇలాంటి పిర్వోలను, పిఏలను గుర్తించి ఎమ్మెల్యేలు, మంత్రులు తేరుకోకపోతే మాత్రం రాజకీయంగా నష్టం చవి చూడాల్సింది వాళ్లే.. ఇప్పటికైనా ఎమ్మెల్యేలు, మంత్రులు తేరుకొని నాయకులు, ప్రజలను కలిసి, ఎదురులేని, తిరుగులేని రాజకీయాలు చేస్తూ, మళ్లీ మళ్లీ గెలుస్తూ, ప్రజా సేవ చేయాలంటే స్వార్ధపరులైన పిఏలను, పిర్వోలను పక్కన పెట్టకపోతే తీరని నష్టాన్ని కొని తెచ్చుకున్న వాళ్లవుతారు.

గతిశీలి..ప్రగతి శీలి.

జనం గుండెల్లో సారే బడి గుడి.

`జనసర్వస్వమంతా కేసీఆర్‌ మది.

`తెలంగాణ కోసం పడరాని పాట్లు పడిన నాయకుడు.

`తెలంగాణ కోసం అందరి మెట్లు ఎక్కి దిగిన నాయకుడు.

`తెలంగాణ విషయంలో బేషజాలకు పోలేదు.

`అభివృద్ధిలో ఎక్కడా రాజీపడలేదు.

`తెలంగాణ కన్నీరు తూడ్చడం కోసం పదేళ్లు కంటి నిద్ర పోలేదు.

`తెలంగాణ కోసం పద్నాలుగేళ్లు కడుపు సరిగ్గా తిన్నది లేదు.

`రాజకీయ విలువలకు ప్రాణం పెట్టిన నాయకుడు కేసీఆర్‌.

`అవకాశ వాద రాజకీయాలకు తావివ్వని నాయకుడు కేసీఆర్‌.

`గెలుపోటముల గురించి ఏనాడు మధనపడలేదు.

`ప్రజలు ఓడిపోవద్దని తాపత్రయ పడిన నాయకుడు కేసీఆర్‌.

`నా ప్రజలు మళ్ళీ మోసపోవద్దని భావించిన నాయకుడు.

`నా ప్రజలు కలలో కూడా గోస పడొద్దని కోరుకున్న నాయకుడు.

`ప్రజలు కష్టాలు పడుతుంటే చూడలేక తల్లడిల్లిపోతున్నాడు.

`పదేళ్లలో తెలంగాణను నందనవనం చేసిన నాయకుడు.

`మోడువారిపోతున్న తెలంగాణకు జీవం పోసే నాయకుడు కేసీఆర్‌.

`అందుకే మళ్ళీ జనమంతా కేసిఆర్‌ జపం చేస్తున్నారు.

`కేసీఆర్‌ మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు

`ఎక్కడ విన్నా కేసీఆర్‌ పాటలతో నృత్యాలు చేస్తున్నారు.

`కేసీఆర్‌ పై తమ అభిమానాన్ని ప్రపంచానికి చాటేలా తెలియజేస్తున్నారు.

`ఉరకలెత్తే ఉత్సాహం జై కేసీఆర్‌ అని నినదిస్తున్నారు.

`‘‘జూబ్లీ హిల్స్‌’’ జనమంతా ‘‘కేసిఆర్‌’’ నామస్మరణే చేస్తున్నారు.

హైదరాబాద్‌, నేటిధాత్రి:                        రాజకీయాలంటే కేసిఆర్‌కు ఆట విడుపు కాదు. అధికారం కోసం అసలేకాదు. ప్రజల కోసం. ప్రజల సంక్షేమం కోసం, ప్రజా చైతన్యంకోసం, వారి జీవితాల్లో వెలుగుల కోసం. ఇదీ కేసిఆర్‌ రాజకీయం. అందుకే తెలంగాణ సాదన కోసం ఎవరూ చేయని త్యాగం చేశారు. పోరాటం చేశారు. ఉద్యమాన్ని ఎత్తుకొని తెలంగాణ సాదించారు. జీవితమే పోరాటం చేసుకొని ముందుకు సాగారు. తెలంగాణ సాధనే జీవిత లక్ష్యంగా ముందుకెళ్లారు. తెలంగాణ మొత్తం ఏకం చేశారు. తెలంగా మొత్తం కేసిఆర్‌ గొంతుగా మార్చారు. అందుకే ఇప్పుడు ఎక్కడ విన్నా, ఎక్కడ చూసినా ఒకటే మాట. ఒకటేపాట. ఒకటే బొమ్మ. అది కేసిఆర్‌. సారే రావాలంటున్నది తెలంగాణ అంటూ ఉద్యమ కాలంలో ఎలా వినిపించిందో ఇప్పుడూ అదే వినిపిస్తుంది. అంతకన్నా వంద రెట్లు ఎక్కవ వినిపిస్తుంది. పండగైనా, పబ్బమైనా సరే కేసిఆర్‌ పాట లేకుండా జరగడం లేదు. పెండ్లిల్లో కేసిఆర్‌ పాటలు పెట్టుకొని డ్యాన్సులు చేస్తున్నారు. బరాత్‌లల కేసిఆర్‌ పాటలు పెట్టుకుంటున్నారు. ఆఖరుకు గణేష్‌ నవరాత్రి ఉత్సవాలలో, ఊరేగింపుల్లో కూడా ఎక్కడ విన్నా కేసిఆర్‌ పాటలే. బతుకమ్మ ఆడిన సందర్భాలలో కేసిఆర్‌ పాటలే వింటున్నారు. పల్లెల్లో ఎవరిని కదిలించినా కేసిఆర్‌ జపం చేస్తున్నారు. కేసిఆర్‌ను పదే పదే గుర్తుచేసుకుంటున్నారు. కేసిఆర్‌ను తల్చుకోకుండా రోజు గపడం లేదు. ఎక్కడో అక్కడ ఏదో సందర్భంలో తెలంగాణలోని మహిళలు, పెద్దలు, వృద్దులు, రైతులు అన్ని వర్గాలు కేసిఆర్‌ను గుర్తు చేసుకుంటున్నారు. పదేళ్ల పాలన గురించి చెప్పుకుంటున్నారు. తెలంగాణకు కేసిఆర్‌ తెచ్చిన నీళ్లను గురించి చెప్పుకుంటున్నారు. కేసిఆర్‌ నింపిన చెరువులు గురించి చెప్పుకుంటున్నారు. ఇంటింటికీ ఇచ్చిన మిషన్‌ భగీరధ నీళ్ల గురించే చెప్పుకుంటున్నారు. తెలంగాణకు కాలువలు తెచ్చిన కేసిఆర్‌ గురించే చర్చలు పెడుతున్నారు. పదేళ్లు పంటలు ఎండిపోకుండా చూసుకున్న కేసిఆర్‌ గొప్పదనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇరవై నాలుగు గంటల కరంటును తల్చుకుంటున్నారు. పదే పదే కరంటు పోతున్నప్పుడల్లా కేసిఆర్‌ వున్నప్పుడు ఒక్కసారి పోకపోతుండే అనుకుంటున్నారు. ఇలా ఏ సందర్భమైనా సరే కేసిఆర్‌ను ప్రతి పల్లె తల్చుకుంటోంది. ప్రతి పట్టణం గుర్తు చేసుకుంటోంది. అందుకే కేసిఆర్‌ కేసిఆరే అంటోంది. ఒకటా రెండా..కేసిర్‌ చేసిన మంచి పనులు జనం గుండెల్లో నిలిచిపోయాయి. వారికి ప్రతి క్షణం గుర్తుకు వస్తున్నాయి. ఒకప్పుడు రూ.200 వున్న పించన్‌ తెలంగాణ రాగానే ఒకేసారి రూ.1000కి పెంచారు. తర్వాత మళ్లీ రూ.2000 వేలు చేశాడు. దివ్యాంగులకు ఏకంగా రూ.6500 పించన్‌ ఇచ్చాడు. కుల వృత్తుల దారులకు పించన్లు ఇచ్చాడు. ఇలా 57 సంవత్సరాలు దాటిని సుమారు 46లక్షల మందికి పించన్లు ఇచ్చి, ఆ కుటుంబాలను అదుకున్నారు. ఇక కేసిఆర్‌ రైతులకు చేసిన మేలు ప్రపంచంలో ఏ పాలకులు చేయలేదు. ఏ నాయకులు రైతుల మేలు కోసం ఆలోచించలేదు. రైతు బంధు పేరు మీద పెట్టుబడి సాయం చేయడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇలాంటి ఆలోచన ఒకటి చేయొచ్చని స్వతంత్ర భారతావినిలో ఏ నాయకుడు, పాలకుడు ఆలోచించింది లేదు. రైతుల మేలు కోరి సాయం చేసింది లేదు. రైతులు రుణగ్రస్తులు కాకుండా చూసుకున్నది లేదు. తెలంగాణ రాక ముందు రైతు అనే పేరు చెప్పుకోవడానికి కూడా కన్నీళ్ల పర్యంతమైపోయేవారు. పడావు బడ్డ భూములను చూసి దుక్కిస్తుండేవారు. ఎండిన దుక్కిని చూసి కళ్ళతో తడుపుకోవాలని అనుకునేవారు. ఆశాకం చేసి చూస్తూ, వానమ్మా రావమ్మా అంటూ పాటలు పాడుకుండే వారు. కరువు తప్ప కాలం కాకపోయినా, భూమిని నమ్ముకొని మన్ను తిని బతికారు. కూలీలుగా మారి జీవితాలు గడుపుకున్నారు. ధైర్యం వున్న వాళ్లు ఊరెళ్లిపోయారు. పొట్ట చేత పట్టుకొని అప్పులు చేసుకొని ఇతర రాష్ట్రాలకు వలసలు పోయారు. తెలంగాణ వచ్చిన వెంటనే తెలంగాణ రైతులంతా రాజులయ్యారు. కేవలం తెలంగాణ రాగానే రాజులైన రైతులకు అన్నీ సౌకర్యాలను కల్పించి, రారాజులను చేశాడు. రైతులు రారాజుల్లా కాలుమీద కాలేసుకొని బతికేలాచేశాడు. నీళ్లిచ్చాడు. పెట్టుబడి సాయం చేశాడు. సకాలంలో అవసరమైన ఎరువులు అందించాడు. పండిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాడు. పండిన పంటను కళ్లాలలోనే కొనుగోలు చేశాడు. మూడురోజుల్లో వడ్లపైకం బ్యాంకు ఖాతాల్లో వేశాడు. ప్రతి సారి టంగ్‌ టంగ్‌ మని పెట్టుబడి సాయం అందించాడు. పంటలు నష్టపోతే నష్టపరిహారం వెంటనే అందించాడు. ఇలా అన్ని రకాలుగా రైతులను ఆదుకున్న ప్రపంచంలోనే ఏకైక నాయకుడు కేసిఆర్‌. రాజకీయాల్లో నైతిక విలువలు అంటే అర్దం కేసిఆర్‌ అనే చెప్పాలి. తెలంగాణ కోసం ఎక్కే మెట్టు దిగే మెట్టు అన్నట్లు తన రాజకీయం కన్నా, తెలంగాణ రాష్ట్రమే ముఖ్యమనుకున్న ఏకైక నాయకుడు కేసిఆర్‌. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎక్కడా వెనకడుగు వేయలేదు. తెలంగాణ అభివృ ద్దిలోనూ ఎక్కడా రాజీ పడలేదు. తెలంగాణ తెచ్చి, ఎలా బంగారు తెలంగాణ చేయాలో తెలిసిన ఏకైక నాయకుడు కేసిఆర్‌. అందుకే తెలంగాణ అరవై ఏండ్లు గోసపడగింది చాలు. ఇంక ఎప్పుడూ గోస పడొద్దని అనుకున్న నాయకుడు కేసిఆర్‌. అరవై ఏళ్లలో తెలంగాణ పడిన గోసను, ఆరేళ్లలో తీర్చిన గొప్ప దార్శనికుడు కేసిఆర్‌. తెలంగాణ తేవడం కోసం కడుపు నిండా తిన్నది లేదు. తెలంగాణ బాగు కోసం కంటి నిండా నిద్రపోయింది లేదు. అందుకే తెలంగాణ ఇప్పుడు ఇలా వెలుగుతోంది. లేకుంటే అదే పాత కాలపు చీకట్లోనే మగ్గుతూ వుండేది. బిఆర్‌ఎస్‌ను వీడిన వాళ్లయినా సరే కేసిఆర్‌ వ్యక్తిత్వాన్ని ఎవరూ ప్రశ్నించిన సందర్భం లేదు. పార్టీలు మారిని ఎమ్మెల్యేలు కూడా కేసిఆర్‌ గొప్పదనమే గుర్తు చేస్తారు. తన జేబులో పెన్ను వున్నా, ఆఖరుకు అది కూడా ఇతరులకు ఇచ్చే మనస్తత్వం కేసిఆర్‌ది అని కేశవరావు చెప్పిన మాట అందరూ విన్నదే. అంటే రాజకీయంగా విభేదించి వెళ్లిన వారు కూడా కేసిఆర్‌ను పల్లెత్తు మాట అనాలంటే కూడా నోరు రాదు. అదీ కేసిఆర్‌ నాయకత్వం విశిష్టతకు సంకేతం. ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా ఆయన అనుసరించిన తీరు అందరి చేత ప్రశంసలు అందుకుంటూనే వుంటుంది. ఎమ్మెల్యేల మరణంతో వచ్చిన ఏ ఉప ఎన్నికైనా సరే వారి కుటుంబాలకు మాత్రమే ఇవ్వడం కేసిఆర్‌కు తెలుసు. రాజకీయాల కోసం ఆయన ఇతరులకు సీట్లు కేటాయించింది లేదు. గెలిచినా, ఓడినా నైతికతను ఆయన ఏనాడు వదిలిపెట్టలేదు. అయితే కేసిఆర్‌ వల్ల మేలు పొంది, రాజకీయంగా ఎదిగిన వారిలో కొంత మంది స్వార్ధపరులుంటారు. వారి అవకావాద రాజకీయాలను చూపిస్తుంటారు. తిన్నింటి వాసాలు లెక్కబెడుతుంటారు. అలాంటి వారు మాత్రమే కేసిఆర్‌ను విమర్శిస్తుంటారు. అంతే కాని తెలంగాణలోని ఏ పార్టీ నాయకులైనా, ఏ సమాజమైనా సరే కేసిఆర్‌ వ్యక్తిత్వాన్ని శంకించేందుకు ఇష్టపడరు. అంత గొప్పది కేసిఆర్‌ నాయకత్వం. కొందరు కురుచ గుణం వున్న నాయకులు చేస్తున్న విమర్శల వల్ల వాళ్లే చులకనౌతున్నారు. కేసిఆర్‌ గ్రాఫ్‌ మరింత పెంచుతున్నారు. నిజం చెప్పాలంటే రాజకీయ ప్రత్యర్ధులే ప్రజల కన్నా ఎక్కువగా కేసిఆర్‌ను గుర్తు చేసుకుంటున్నారు. కేసిఆర్‌ పేరు పదేపదే తల్చుకుంటూ రాజకీయం చేస్తున్నారు. ప్రస్తుత పాలక పెద్దలందరూ నిత్యం కేసిఆర్‌ జపం చేస్తూనే పూట గడుపుకుంటున్నారు. ప్రతి సందర్భంలోనూ పదే పదే పలు సార్లు గుర్తు చేసుకుంటున్నారు. తాము చేసిందేమీ చెప్పలేక, కేసిఆర్‌ను నిందించి పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు. బొక్కా బోర్లా పడుతున్నారు. తెలంగాణ కథ మళ్లీ మొదలైంది. ఇప్పుడే మొదలైంది. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలతో మళ్లీ మొదలౌతోంది. జనమే చూసుకుందామని ఇతర పార్టీలకు సవాలు విసురుతున్నారు. కేసిఆర్‌ ఫోటోను పక్కన పెట్టుకొని కొండంత ధైర్యం యువత ప్రదర్శిస్తున్నారు. దటీజ్‌ కేసిఆర్‌ అని యువత నోట జాలు వారుతుంటే కేసిఆర్‌ గర్జన వినిపిస్తోంది.

ఇది కంకరా..సుద్దముక్కా!?.. ఎపిసోడ్‌ -1

‘‘వేల కోట్లు’’ దోచుకున్నారు?

`దుబ్బను కూడా కంకర అని నమ్మిస్తున్న ఘనులు!

`‘‘క్రషర్‌ కంపెనీలన్ని’’ సిండికేట్‌ అయ్యి ప్రజాధనం దోచుకుతిన్నాయి.

`‘‘మహా నిర్మాణాన్ని’’ నవ్వుల పాలు చేశాయి

`పలుగు రాయితో సమానం కూడా కాదు!

`ఇదా కంకర..కండ్లు మూసుకున్నారా!

`కాసులకు కక్కుర్తి పడి కంకర అని తేల్చారా!

`ఈ కంకర ప్రాజెక్టులకు వాడతారా!

`ఎర్ర గుట్టల రాయిని కంకర అంటారా?

`కాసులకు కక్కుర్తి పడి ప్రజా ధనం దోచుకున్నారు?

`క్వాలిటీ కంట్రోల్‌ బోర్డు వద్దన్నా వినిపించుకోలేదు!

`క్వాలిటీ కంట్రోల్‌ బోర్డు కాదన్నా వాడేశారు!

`కాంట్రాక్టర్ల ధన దాహానికి అధికారులు తోడయ్యారు!

`చూసేవారెవరని విచ్చలవిడిగా ఎర్రకంకర వాడేశారు!

`మహా ప్రాజెక్టును సర్వనాశనం చేశారు!

`అది కంకరే కాదు! ప్రాజెక్టులకు సరఫరా చేశారు!!

`మన్ను మశానం తప్ప కంకర అసలే కాదు!

`అవునవును అని తల ఊపే అధికారులు!

`వరంగల్‌ గుట్టల్లో బలమైన బండలే లేవు!

`కంకర తయారు చేయడం సాధ్యమే కాదు!

`గులకరాళ్లను కంకర అని సరఫరా చేస్తున్నారు!

`ఎర్రగుట్టలు తొలిచి కంకర అని నమ్మిస్తున్నారు.

`కాంట్రాక్టర్లు..అధికారులు పంచుకుతింటున్నారు!

`ఇదే కంకర ఓ పెద్ద ప్రాజెక్టులో కూడా వాడారు?

`ఇప్పుడు నేషనల్‌ హైవేల నిర్మాణానికి వాడుతున్నారు!

`ఇంటికి ఏ మాత్రం పనికి రాదు!

`ప్రాజెక్టుల నిండా నింపేశారు!

`ప్రాజెక్టుల నిర్మాణం అబాసుపాలు చేశారు!

`ప్రజాధనం నీళ్ల పాలు చేశారు!

`సగం వాటలు అధికారుల చేతుల్లో పెట్టి చేతులు దులుపుకున్నాయి!

హైదరాబాద్‌, నేటిధాత్రి:                        తెలంగాణలో కాంట్రాక్టర్ల బరితెగింపు, అధికారుల కాసుల కక్కుర్తి మూలంగా ప్రజా దనం పెద్దఎత్తున దుబారా అవుతోంది. దుర్వినియోగమౌతోంది. ప్రభుత్వానికి నాణ్యమైన కంకర సరఫరా చేస్తామనిచెప్పి, టెండర్లు దక్కించుకొని పనికి రాని కంకర సరఫరా చేస్తున్నారు. సుద్దకూడా అంతో నయమనేంత నాసిరకమైన కంకర సరఫరా చేశారు. అసలు దానిని కంకర అని ఎలా నిర్ధారించారో..ఎలా కంకర అని కాంట్రాక్టర్లు నిర్ణయించుకున్నారో అర్ధం కాదు. కంకర పేరుతో సరఫరా చేస్తున్న దానిని అది కంకరే అని అదికారులు ఎలా నిర్దారిస్తున్నారో..ఎలా అందుకు అనుమతులు జారీ చేస్తున్నారో తెలియకుండాపోతోంది. గత పదేళ్ల కాలంగా ఈ దుబారా వ్యవహరం విపరీతంగా సాగుతోంది. సహజంగా ఏ నిర్మాణానికైనా సరే నాణ్యమైన కంకర కావాలని కోరుకుంటాం. మంచి కంకరలో చిన్న డస్టు కూడా వుండకుండా జాగ్రత్తపడతాం. ఆ కంకర తెచ్చుకున్న తర్వాత ఏ మాత్రం అనుమానం వచ్చినా తిరిగి వాపస్‌ చేయిస్తాం. మరి అలాంటిది తెలంగాణ ప్రభుత్వం చేపట్టే అనేక కార్యక్రమాలకు అధికారులు దగ్గరుండి పనికి రాని, ఎందుకూ పని చేయని కంకరను ప్రోత్సహిస్తున్నారు. కంకర అంటే ఏళ్ల తరబడి మన్నేలా వుండాలి. చెక్కు చెదరకుండా వుండాలి. గాలి, నీటి కోతను తట్టుకోగలగాలి. దశాబ్ధాల తరబడి బలంగా,దృఘంగా వుండాలి. నిజమైన రాయితో తయారైన కంకర వందల సంవత్సరాలైనా సరే గట్టిగా వుంటుంది. నిర్మాణాలను పటిష్టంగా వుంచుతుంది. ఇంటి నిర్మాణాలకే ఇన్ని రకాలుగా ఆలోచిస్తాం. అలాంటిది ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టే నిర్మాణాలకు మరింత బలమైన కంకర అవసరం. ఎండకు, వానకు, వరదలకు తట్టుకొని నిలబడేలా వుండాలి. అది రోడ్డైనా, ప్రాజెక్టులైనా, చెరువులైనా, చెక్‌ డ్యామ్‌లైనా, రిజర్వాయర్లైనా సరే కంకర ఎంత బలంగా వుంటే ఆ నిర్మాణాలు అంత ఎక్కువ కాలం నిర్మాణాలు చెక్కు చెదరకుండా వుంటాయి. కాని తెలంగాణలోని కొంత మంది అవినీతి అదికారుల దుర్భుద్ది మూలంగా, దుర్మార్గులైన కొంత మంది కాంట్రాక్టర్లు కలిసి ప్రజా ధనం దోచుకుతినేందుకు ఎందుకూ పనికి రాని కంకర విచ్చలవిడిగా వాడుతున్నారు. అందుకే మన కళ్లముందే అనేక నిర్మాణాలు చెదిరిపోతున్నాయి. కూలిపోతున్నాయి. కొట్టుకుపోతున్నాయి. అవి నాసిరకం కంకర నిర్మాణాలని తేలిపోతున్నాయి. వాటి గురించి పట్టించునే నాధుడే కరువయ్యారు. ఎంత సేపు రాజకీయాలు తప్ప, వ్యవస్ధలో నిటారుగా నిలడాల్సిన అధికారులు ఎందుకు వంగిపోతున్నారు. ఎందుకు ఇంత లాలూచీగా వ్యవహరిస్తున్నారు. భయం లేకుండా పోతున్నారు. అనేది కూడా ఇక్కడ ప్రభుత్వం దృష్టిపెట్టాల్సిన అవసరం వుంది. ముఖ్యంగా తెలంగాణలోని కొన్ని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు, రోడ్ల నిర్మాణాలకు ఎందుకూ పనికి రాని ఎక్రకంకరణను సరఫరా చేసినట్లు ఆరోపణలున్నాయి. వరంగల్‌ జిల్లాలో కట్టడాలకు అవసరమైనటు వంటి కంకరను అందించే గట్టలే లేవు. ఆ గుట్టలన్నీ కేవలం ఎర్రమట్టితో నిండి వున్న తూర్పు కనుమలకు చెందినవి. ఆ గుట్టలు పూర్తిగా మట్టితో మాత్రం ఎక్కువ శాతం వుంటాయి. ఆ మట్టిలో ఎర్ర రాయి గుండ్లు మాత్రమే వుంటాయి. అవి చాలా నాసిరకంగా వుంటాయి. అవి నిర్మాణాలకు ఎట్టి పరిస్దితుల్లో ఉపయోగార్హం కాదు. కంకర తయారు చేసే గుట్టల్లో పెద్ద పెద్ద బరువైన బండలుండాలి. కొన్ని ఎకరాల్లో విస్తరించి వుండే బండ నుంచి మాత్రమే కంరర తయారు చేయాలి. కాని గుండ్లతో కూడిన గుట్టలను కాంట్రాక్టర్లు ఎంచుకోవడం? వాటికి అధికారులు పర్మిషన్లు ఇవ్వడం జరుగుతోంది. అలా కొండలు తవ్వేస్తున్నారు. అటు మట్టి, ఇటు ఎర్ర గుండ్లతో తయారు చేసిన కంకరను సరఫరా చేస్తున్నారు. కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. నేటిధాత్రి పై చిత్రంలో చూపిస్తున్న ఎర్ర రంగు రాయిని కూడా కంకర అని ఎవరైనా అంటారో మీరే చెప్పండి? అది నిర్మాణాలకు వాడుకునే వాళ్లు ఎవరైనా వుంటారా? ఇక్కడ విచిత్రమేమిటంటే మాకు పెద్ద కొండ వుంది. అందులో లక్షల టన్నుల కంకర తయారయ్యే గుట్టలున్నాయని ఎవరూ అధికారులకు అర్జీలు పెట్టుకోలేదు. మేము కంకర వ్యాపారం చేయాలనుకుంటున్నాం. మీరు ఏవైనా గుట్టలను మాకు అప్పగిస్తే కంకర తయారు చేసి, ప్రభుత్వానికి సరఫరా చేస్తామని దరఖాస్తులు పెట్టుకున్నారు. అలా దరఖాస్తులు పెట్టుకున్నవారికి అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు కనిపించిన ప్రతి గుట్టను అధికారులు కాంట్రాక్టర్లకు రాసిచ్చారు. కంకర తెమ్మని రాతపూర్వక ఆదేశాలిచ్చారు. ఇది కంకరేనా..ఈ కంకర నిర్మాణాలకు ఎవరైనా వాడుతారా? అంటూ నేటిధాత్రి ప్రశ్నిస్తే మాదేముంది? మేం కాంట్రాక్టు చేద్దామనుకున్నాం! కంకర సరఫరా చేసే క్రషర్లు ఏర్పాటు చేసుకుంటామని చెప్పాం! మాకు అందుబాటులో వున్న కొండలు లీజుకిస్తే, వాటి కంకర తయారు చేసి, ప్రభుత్వానికి సరఫరా చేస్తామని చెప్పాం!! ఇదీ స్దూలంగా అడ్డదారిలో, అడ్డగోలుగా, ప్రజా దనం దుర్వినియోగం చేసిన కొందరు కాంట్రాక్టర్లు చెబుతున్న మాట!!! ఇదిలా వుంటే సదరు కాంట్రాక్టర్లు ఓ మహా నిర్మాణానికి పెద్దఎత్తున కంకర సరఫరా చేసే ముందు రాజేంద్ర నగర్‌లో వున్న క్యాలిటీ కంట్రోల్‌ బోర్టుకు కంకర రాయిని పంపించారు. అక్కడున్న నిపుణులు ఇది కంరరే కాదని నిర్ధారించారు. అది కంకరగా పనికి రాదని తేల్చేశారు. ఇది సుద్దకన్నా అద్వాహ్నమైందని చెప్పారు. ఈ ఎర్రరాయికి కరిగిపోయే గుణం వుంటుందని చెప్పారు. ఎట్టి పరిస్దితుల్లోనూ నిర్మాణాలకు ఈ కంకర అసలే వాడొద్దని హెచ్చరించారు. తెలంగాణలో చేపట్టిన ఓ మహా నిర్మాణానికి ఈ రాతి కంకర వాడడం ఎంతో ప్రమాదకరమని కూడా తేల్చిచెప్పారు. ఎట్టిపరిస్ధితుల్లోనూ తాము అంగీకరించే పరిస్దితి లేదని చెప్పారు. అయినా అదికారులు అదే కంకరను ఈ మహా నిర్మాణానికి సుమారు 20వేల కోట్ల రూపాయల విలువైన కంకరను సరఫరా చేయించుకున్నారు. సహజంగా కంకరకు మంచి బలమైన నల్లరాతి గ్రానైట్‌ కావాలి. అంతే కాని గులకరాయిలా కూడా పనిచేయని ఎర్రరాయిని విచ్చలవిడిగా వాడేశారు. ఆ మహా నిర్మాణానికే కాదు, కేంద్ర ప్రభుత్వం నిర్మాణం సాగిస్తున్న జాతీయ రోడ్లకు కూడా వరంగల్‌ జల్లాలో ఇదే కంకరను విస్తారంగా వినియోగిస్తున్నారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన మహా నిర్మాణం ఇప్పుడు ఆరోపణల పాలు కావడంలో ఎర్ర కంకర పాత్రే ఎక్కువ అని నిపుణులు అంటున్నారు. ఎంత చెప్పినా అదికారులు పట్టించుకోలేదు. కాంట్రాక్టర్లు వినలేదని కూడా అంటున్నారు. ఏదైనా జరిగితే మొత్తం నిర్మాణానికే ప్రమాదం ఎదురౌతుందని తెలసి కూడా అటు అదికారులు, ఇటు కాంట్రాక్టర్లు బరితెగించారంటే సామాన్యమైన విషయం కాదు. ప్రభుత్వం ఇప్పటికైనా మేలు కోవాలి. ఈ దిశగా దర్యాప్తు సాగించాలి. ఎంత మంది కాంట్రాక్టర్లకు ఎన్ని గుట్టలు అదికారులు అప్పగించారు? ఎన్నికొండలు తొలిచేశారు? ఆ కొండల మూలంగా ఎంత కంకర వచ్చింది? రాజేంద్ర నగర్‌ క్వాలిటీ కంట్రోల్‌బోర్డు వద్దని ఆదేశాలు జారీ చేసినా, ఎవరు పక్కకు పెట్టారు. ఎందుకు తొక్కిపెట్టారు? దీని వెనుక ఎవరున్నారు? వేలకోట్ల రూపాయలు ఖర్చు చేసి మరీ నాసిరకం కంకర సరఫరా చేయడం అంటే నేరం కాదా? కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన మొత్తానికి సమానమైన లాభంతో ఎంబిలు తయారు చేసినట్లు సమాచారం. సగం, సగం వాటాలు అన్నట్లు ఇద్దరూ కలిసి వేల కోట్లు దోచేశారు. ప్రజా ధనం నీళ్లలోపోశారు. ఆ కాంట్రాక్టర్లు ఎవరు? అనుమతులిచ్చిన అదికారులెవరు? ఎంత కంకర సరఫరా చేశారు? ఎంత సొమ్ము దుబారా చేశారు? అనే పూర్తి వివరాలతో కూడిన ప్రత్యేక కధనాలు త్వరలోనే మీ నేటిధాత్రిలో…

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version