కేంద్ర ప్రభుత్వ పథకాలను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-23T152052.705-1.wav?_=1

 

కేంద్ర ప్రభుత్వ పథకాలను పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం

రాష్ట్రంలో మాతృ వందన యోజన పథకం అమలు చేయాలి

బిజెపి మండల అధ్యక్షుడు ఊర నవీన్ రావు

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలం పేద ప్రజలకు ఎంతో మేలు చేసే కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రాష్ట్రంలో మాతృ వందన యోజన పథకం అమలు చేయాలని బిజెపి మండల శాఖ అధ్యక్షుడు ఊర నవీన్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వివిధ రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఉద్దేశపూర్వకంగానే అమలు చేయడం లేదన్నారు. గతంలో అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదేవిధంగా కొనసాగిందని ప్రస్తుత ప్రభుత్వం అదే బాటలో నడుస్తుందన్నారు. దారిద్ర రేఖకు దిగువన ఉండే మహిళలకు కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో మాతృ వందన యోజన పథకం ప్రవేశపెట్టిందని ఆ పథకం వల్ల గర్భిణీ స్త్రీలకు రెండు విడతల్లో అంగన్వాడి కేంద్రాల ద్వారా సుమారు 5000 రూపాయలు వారికి అందించే అవకాశం ఉంటుందని నవీన్ రావు అన్నారు. గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయకపోవడం వల్ల 12 సంవత్సరాల పాటు నిరుపేద కుటుంబాల మహిళలు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కేంద్ర ప్రభుత్వ పథకాలను తక్షణమే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆవు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-23T113732.763-1.wav?_=2

 

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఆవు

జైపూర్,నేటి ధాత్రి:

 

 

మండల కేంద్రంలోని ఎస్టిపిపి పవర్ ప్లాంట్ సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వాహనం ఢీకొని ఆవు మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పశువుల యజమానులు వాటిని నిర్లక్ష్యంతో వదిలిపెట్టడం వల్ల రోడ్డుపైకి వచ్చి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రయాణికులు అన్నారు. రోడ్డుపై ప్రమాదకరంగా ఉన్న ఆవుని గ్రామపంచాయతీ సిబ్బందితో ఎలాంటి ప్రమాదాలు జరగకముందే తొలగించాలని ప్రయాణికులు అధికారులను కోరుతున్నారు

అడ్డు అదుపు లేకుండా ఇసుక లారీలు….

అడ్డు అదుపు లేకుండా ఇసుక లారీలు

*వాహనదారులు ప్రజల భయాందోళన

మంగపేట నేటి ధాత్రి

 

 

మంగపేట మండల
అధ్యక్షులు రావుల జానకి రావు నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు స్థానిక ఎమ్మార్వో కి వినతి పత్రం సమర్పించారు.

ములుగు జిల్లాలో, ముఖ్యంగా మంగపేట మండలకేంద్రంలో వందలాది ఇసుక లారీలు రోడ్లపై తిరుగుతూ వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ లారీల పైన పట్టాలు కట్టకపోవడం వల్ల వెనుక నుంచి వచ్చే వాహనాల వాహనదారుల కళ్లలో ఇసుక రేణువులు పడుతూ నిత్యం ఆక్సిడెంట్లు జరుగుతున్నాయి. పాదాచారులు సురక్షితంగా రోడ్లను ఉపయోగించలేక, భయంతో వణుకుతున్నారు. ఈ పరిస్థితులు కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో, అడ్డు, అదుపు లేకుండా కొనసాగుతున్నాయని బిజెపి నేతలు కార్యకర్తలు అన్నారు.

ఇలాంటి ఇసుక లారీల వల్ల ప్రజలకు, వాహనదారులకు కలిగే భీభత్సాన్ని గుర్తుచేసి, వెంటనే లారీలను నియంత్రించి, సరైన పార్కింగ్‌లో ఉంచేటట్టు, రోడ్ల భద్రతను, ప్రజలకు సౌకర్యాన్ని కల్పించేటట్లు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

జాతీయ జెండాకు అవమానం…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-16T123932.348-1.wav?_=3

 

జాతీయ జెండాకు అవమానం

#నెక్కొండ, నేటి ధాత్రి:

 

 

దేశానికి స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు గడిచిన కొందరు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ జాతీయ జెండాను అవమానపరుస్తున్న సంఘటనలు జరుగుతున్నాయి. అందులో భాగంగా 79 వ స్వాతంత్ర దినోత్సవ పురస్కరించుకొని వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని పోస్ట్ ఆఫీస్ లో జెండా ఎగరేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించి జాతీయ జెండాను అవమాన పరిచారు. సంబంధిత అధికారి సెలవులో ఉన్నట్టు నీ లక్ష్యంగా సమాధానం చెబుతున్నారు. ఒకరిపై ఒకరు చెప్పుకుంటూ బాధ్యతగల వ్యక్తులే ఇలా చేస్తే ఎలా ఉంటుంది. దేశ ప్రధాని నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ శ్రేణులు ఒకపక్క భారత్ మాతాకీ జై అంటూ దేశం పట్ల ప్రజలకు ప్రేమ ఉండాలని దేశభక్తి పెరగాలనే ఉద్దేశంతో ప్రతి ఇంటిపై భారత జాతీయ జెండా ఎగరేస్తూ దేశభక్తిని చాటుతుంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినా పోస్టల్ డిపార్ట్మెంట్ అధికారులే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం, కేంద్ర ప్రభుత్వ పనితీరుకు
ఆ పార్టీ వారు చెప్పే మాటలకు చాలా తేడా కనిపిస్తున్నట్టు పలు వర్గాల ప్రజలు విమర్శిస్తున్నాయి.

ప్రభుత్వ నిర్లక్ష్యం..గురుకులాల్లో ఫుడ్ పాయిజన్…

ప్రభుత్వ నిర్లక్ష్యం..గురుకులాల్లో ఫుడ్ పాయిజన్

-కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో పేరుకే సంక్షేమం..గురుకులాలన్నీ సంక్షోభం

-కస్తూర్బా గురుకులంలో ఫుడ్ పాయిజన్..అస్వస్థతకు గురైన విద్యార్థులు

-ఫుడ్ పాయిజన్ బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకోవాలి

-సర్పంచ్ ల ఫోరం మొగుళ్ళపల్లి మండలం మాజీ అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల తల్లిదండ్రులు కార్పోరేట్ స్థాయి విద్యను కొనలేని దీనస్థితిలో ఉండడాన్ని కళ్ళారా చూసిన మాజీ ముఖ్యమంత్రి..బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గత బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో 5వ తరగతి నుంచే గురుకులాల విద్యను పేద విద్యార్థులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు, అందుబాటులోకి తెచ్చి..ఆ గురుకులాల్లో ఎలాంటి అసౌకర్యాలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాడని..కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి పేద విద్యార్థులు చదువుకునే గురుకులాలను పట్టించుకోకపోవడం వలన రాష్ట్రంలో ఏదో ఒకచోట రోజురోజుకు ఫుడ్ పాయిజన్ జరుగుతుండడంతో..విద్యార్థులు అస్వస్థతకు గురై ఆస్పత్రుల పాలవుతున్నారని సర్పంచ్ ల ఫోరం మొగుళ్ళపల్లి మాజీ మండల అధ్యక్షుడు చదువు అన్నారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలోని కొర్కిశాల గ్రామంలో ఉన్నటువంటి కస్తూర్బా గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో..చాలామంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో..గుట్టుచప్పుడు కాకుండా..విద్యార్థులను చిట్యాల సివిల్ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయిస్తుండగా..మీడియా మిత్రులకు సమాచారం తెలియగానే..మీడియా మిత్రులను పాఠశాలల్లోకి రానివ్వకుండా..గేటుకు తాళం వేసి..ఇంత పెద్ద సమస్యను దాచిపెట్టడానికి కుట్రలు చేయడం వెనుక ఎవరి హస్తం ఉందని అన్నారెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేరుకే గురుకులాలు సంక్షేమమని, ప్రస్తుతం రాష్ట్రంలోని గురుకులాలు సంక్షోభంలో కొట్టుమిట్టు లాడుతున్నాయని..గురుకులాల్లో ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడమే ఫుడ్ పాయిజన్ కు కారణమవుతున్నాయా..? లేకుంటే ప్రభుత్వమే విద్యార్థులను నిర్లక్ష్యంగా చూస్తుందా..? అని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థను నిర్లక్ష్యంగా వదిలేసి..పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. గురుకులాల్లో ఉడికి ఉడకని పురుగుల అన్నం, నీళ్ల చారుతో భోజనం పెట్టడం వలన ఇలా ఫుడ్ పాయిజన్ లు అవుతున్నాయని, కాంట్రాక్టర్లు, గురుకులాల ప్రిన్సిపాల్ లు కుమ్మక్కై విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టకపోవడం, అధికారులు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు అండగా ఉండి గురుకులాల్లో పేద విద్యార్థులకు పెట్టె భోజనంలో ఈ దందాను కొనసాగించడం సిగ్గుచేటని విమర్శించారు. కొర్కిశాల కస్తూర్బా గురుకుల పాఠశాలలోని విద్యార్థుల ఫుడ్ పాయిజన్ కు కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, మెనూ ప్రకారం భోజనం పెట్టని కాంట్రాక్టర్ల లైసెన్స్ రద్దు చేయాలని అన్నారెడ్డి డిమాండ్ చేశారు.

కరెంట్ అధికారుల నిర్లక్ష్యానికి ప్రజలు బలి కావల్సిందేనా?

కరెంట్ అధికారుల నిర్లక్ష్యానికి ప్రజలు బలి కావల్సిందేనా?

మందమర్రి నేటి ధాత్రి

కరెంట్ తీగలపై ప్రమాదకరంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించాలని మొరపెట్టుకున్న పట్టించుకోని అధికారులు.

అధికారులు స్పందించి కరెంట్ తీగలపై నుంచి కొమ్మలను తొలగించకుంటే కరెంట్ ఆఫీసు ముందు ధర్నా తప్పద్దు.

సంకె రవి
సిపియం మంచిర్యాల జిల్లా కార్యదర్శి.

మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని దొర్లబంగ్లా.ఊరు రామకృష్ణపూర్ దారిలో ఉన్న కరెంట్ తీగలపై చెట్ల కొమ్మలు ప్రమాదకరంగా మారి ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని కాలనీ వాసుల ఇబ్బందిని గుర్తించి.ఈ రోజు సిపియం పార్టీ ఆధ్వర్యంలో పర్యటించడం జరిగింది.ఈ సందర్భంగా సంకె రవి సీపీఎం జిల్లా కార్యదర్శి, దూలం శ్రీనివాస్ సీపీఎం మందమర్రి మండల కార్యదర్శి మాట్లాడుతూ…

కరెంట్ తీగలపై ప్రమాదకరంగా చెట్ల కొమ్మలు పెరిగి ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితిలో ప్రజలు బిక్కు బిక్కుమంటున్న అధికారులు స్పందించకపోవడమంటే ప్రజల ప్రాణాలంటే అధికారులకు ఎంత చులకన భావమో అర్థమవుతుందని సిపియం జిల్లా కార్యదర్శి విమర్శించారు.కొమ్మలు ఇరిగిపడితే సుమారు పది కరెంటు పోల్స్ విరిగిపోయి సుమారు మూడు నాలుగు లక్షల రూపాయల నష్టం జరిగే ప్రమాదం ఉంది. విద్యుత్ అధికారులు తమకు సంబంధం లేదన్నట్టుగా ఉన్నారు.
ఇక్కడి ప్రజలు పదేపదే అధికారులకు చెప్పిన మాకు సంబంధం లేదు అనడం ఏమిటని అడుగుతున్నాము.కొమ్మలను తొలగించి రాబోయే నష్టాన్ని నివారించే బాధ్యత,ప్రజలకు నిరంతరం కరెంటు పిచ్చే బాధ్యత విద్యుత్ అధికారులకు లేదా.అని సందర్భంగా అడుగుతున్నాం. మీ నిర్లక్ష్యం మూలంగా ప్రజలు నష్టపోవాలా.వెంటనే అధికారులు స్పందించి కరెంట్ తీగలపై ఉన్నా చెట్ల కొమ్మలను తొలగించకుంటే కరెంట్ ఆఫీసు ముందు ధర్నా సైతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వాళ్ల ప్రజలు పాల్గొన్నారు

వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి.

వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి

చిట్యాల ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో చనిపోయిన సరోజన

వైద్యులపై చట్టపురమైన చర్య తీసుకోవాలని

సిపిఐ ఎం ఎల్ లిబరేషన్ కార్యదర్శి మారపల్లి మల్లేష్

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-54.wav?_=4

భూపాలపల్లి నేటిధాత్రి

సరోజన అనే మహిళ చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రికి లోబీవీ తో రావడం జరిగింది వచ్చిన తర్వాత అంబులెన్స్ లో తీసుకొచ్చినటువంటి ఈ పి టి 12 గంటల సుమారులో ఆక్సిజన్ పెట్టినాడు ఆక్సిజన్ పెట్టిన వెంటనే డమెల్ మనీ పేలింది…..

CPI ML Liberation Secretary Marapalli Mallesh

ఈపీటి వెంటనే తొందరగా బయటికి వచ్చినాడు ఏం జరిగిందని చెప్పేసి పేషెంట్లు అంత నిద్ర లేచారు అప్పటికి సరోజన అరుస్తూనే ఉంది అమ్మా అయ్యాను పేషెంట్ వచ్చి అరగంట ఆయన అప్పటివరకు డాక్టర్ గాని సిస్టర్స్ గాని సెక్యూరిటీ సిబ్బంది గానీ వార్డు భాయ్ వచ్చిన పరిస్థితి కానరాలేదు క్షణమైతే చనిపోతుంది అప్పుడు అందరు వచ్చినారు వచ్చేసరికి ఆమె చనిపోయింది అప్పుడు వచ్చి ఆక్సిజన్ కొడితే అప్పటికే ఆమె చనిపోయింది నేను చేసే ప్రయత్నం చేశాను అంటున్న డ్యూటీ డాక్టర్ వాస్తవంగా రాత్రి 12 కాకముందుకే ఎక్కడి వాళ్ళు అక్కడ పడుకున్నారు వార్డు బాయ్ లేసింది లేదు సెక్యూరిటీని లేపింది లేదు సెక్యూరిటీ సిస్టర్ ను లేపింది లేదు సిస్టర్ డాక్టర్ను లేపింది లేదు ఈ సమయంలో అర్ధగంట గడిచిపోయింది ప్రాణాలు కాపాడతారని వస్తే నిర్లక్ష్యం మూలంగా ప్రాణాలు పోయినవి తక్షణమే ఇన్చార్జి సూపర్ డెంట్ సస్పెండ్ చేయాలి నిర్లక్ష్యం వహించిన వీళ్ళందరూ పైన చట్టపరమైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను ఏ పేషెంట్ వచ్చిన వంద పడకలకు పో గాంధీ హాస్పిటల్ వరంగల్ పో అని రెఫర్ చేస్తా ఉన్నారు ఇక్కడ తగ్గాల్సిన రోగాన్ని అక్కడికి పొమ్మని చెప్పేసి చేతులు దులుపుకుంటున్నారు వచ్చిన తర్వాత సిస్టర్ గ్లూకోజ్ పెడతా ఉంది డాక్టర్ మాత్రం గంట తర్వాత వచ్చి కూడా చూడలేని పరిస్థితి అమ్మ ఎప్పుడు వస్తాడు అని అడిగితే తాత వస్తాడని అంటున్నారు నిర్లక్ష్య సమాధానం ఉద్యోగం మీద బాధ్యత లేకపోకుండా నిర్లక్ష్యంగా ఉండడం వల్లే హాస్పిటల్ దివాలా తీస్తోంది గతంలో నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ ఎంతో అందుబాటులో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి చిట్యాల ఈరోజు దివాలా తీయడానికి కారణం పాలకులే నిర్లక్ష్యం మూలంగా నిండుపానం బలైపోయింది 9 గంటల వరకు డ్యూటీ లో ఉన్నారు తొమ్మిదిన్నరకే అందరు పడుకున్నారు వాస్తవానికి నైట్ డ్యూటీ అంటే రాత్రంతా మేలుకొని ఉండాలి కానీ అందుకు విరుద్ధంగా డ్యూటీ చేస్తున్నారు తమ ఉద్యోగాన్ని కాపాడుకోవడం కోసమే తప్ప బాధ్యతతో పనిచేసిన దాఖలు లేవు తక్షణమే హాస్పిటల్ పైదృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ని పోలీసులకు డిమాండ్ చేస్తున్నాం

ప్లాట్ల మధ్యలో ఉన్న ఖాళీ ప్రాంతాలను శుభ్రంగా.!

ప్లాట్ల మధ్యలో ఉన్న ఖాళీ ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు

మున్సిపల్ కమిషనర్ కె.సుష్మ

పరకాల నేటిధాత్రి
పరకాల మున్సిపాలిటీ పరిధిలోని ఆవాస ప్రాంతాలలో గృహాల మధ్య నిర్మాణాలు లేని ఖాలి ప్లాట్లు ఉండడం వలన పిచ్చి మొక్కలు ఏపుగా పెరగండం,ప్లాట్లలో మొరం నింపకుండా నిక్ష్యంగా వదిలేయడం వలన దోమలు ఎక్కువవుతున్నాయని ఆయా ఫ్లాట్ల యజమానులు గమనించి పిచ్చిమొక్కలను తొలగించాలని దోమల వ్యాప్తి,చెందకుండా తమ ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని నిరక్ష్యం వహిస్తే మున్సిపల్ చట్టం 2019 ప్రకారం చర్యలు తీసుకుంటామని పరకాల మున్సిపల్ కమిషనర్ సుష్మ తెలిపారు.

అధికారుల నిర్లక్ష్యంతో.. నీటి కటకట.

అధికారుల నిర్లక్ష్యంతో.. నీటి కటకట.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

మిషన్ భగీరథ నీరు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు బంద్ అవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది దీనికంతటికి కారణం అధికారుల నిర్లక్ష్యం అలసత్వం అసలు పట్టింపు లేకుండా వ్యవహరించడంతో నెలలో ఎన్నోసార్లు నీరు బంద్ కావడం జరుగుతుంది* దీంతో జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అధికారుల పనితీరుపై ప్రజా ప్రతినిధులు ఓ కన్ను వేయాలని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు నాయకులే నాలుగు గ్రూపులుగా ఉండడమే దీనికి అంతటికి కారణంగా భావిస్తున్నారు.

 

 

Mission Bhagiratha

 

అధికారులకు నాయకుల గ్రూప్ తగాదాలతో ఎవరు పట్టించుకోరు అనే విషయం తెలుసుకున్న అధికారులు దానిని ఆసరాను చేసుకొని జహీరాబాద్ లో అధికారుల నిర్లక్ష్యం చాలా పెద్ద ఎత్తున కనిపిస్తుంది. కావున అధికారులను పనితీరుపై జహీరాబాద్ లో లీడర్ లు అని చెప్పుకుంటున్న నాయకులు అధికారుల తీరు పై సమీక్షించాలని కోరుతున్నారు.

రెచ్చిపోయి వసూళ్లు.!

రెచ్చిపోయి వసూళ్లు.

పలుగుల తొమ్మిది సీరియల్ పేరుతో 1100 వసూలు చేస్తున్న కాంట్రాక్టర్.

ప్రభుత్వ నిర్లక్ష్యం, టీజీఎండిసి పుణ్యం.

మహాదేవపూర్ పుసుక్ పల్లిలో ఒకటి లో ఇదే తంతు.

అధికారులు హోటల్లో సెటిల్మెంట్ చేసుకుంటే ఇలాగే ఉంటుంది.

దర్జాగా వసూళ్ల సాక్షాలు అయిన టీఎస్ఎండిసి నిశ్శబ్దం, అమ్ముడుపోయిందని ప్రజలకు అర్థం.

మహాదేవపూర్ నేటి ధాత్రి:

ఇసుక రీచ్ లో అక్రమ వసూళ్ల వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో, టీజీఎండిసి శాఖ కాసులకు కక్కుర్తి పడడం, కాంట్రాక్టర్లతో చీకటి ఒప్పందాలు చేసుకొని అక్రమ వసూళ్లకు సహకరించడం యదేచ్చగా కండ్ల ముందు అక్రమ వసూళ్ల దందాను టీజీఎండిసి సిబ్బంది తోపాటు కాంట్రాక్టర్ సిబ్బంది వసూళ్ల పరంపరను కొనసాగిస్తున్నప్పటికీ టీజీఎండిసి ఉన్నత అధికారులు మరోవైపు ప్రభుత్వం అక్రమ వసూళ్ల వ్యవహారాన్ని పట్టించుకోకపోవడం తో మండలంలోని ఇసుక రీచులు అక్రమ వసూళ్ల వ్యవహారాన్ని రెచ్చిపోయి కొనసాగించడం జరుగుతుంది. మరోవైపు పక్క జిల్లాలకు సంబంధించిన ఇసుక రీచుల కాంట్రాక్టర్లు హద్దులు దాటి గోదావరిలో అక్రమ రోడ్ల నిర్మాణాన్ని చేసి ఇసుకను రవాణా కొనసాగిస్తుంటే ప్రభుత్వం టీజీఎండిసి అధికారులు చర్యలకు ససేమీరా అనడం తో కాంట్రాక్టర్లు ఇసుక రీచుల్లో అక్రమాలకు హద్దు అదుపు లేకుండా పోయింది. అక్రమాలపై టీజీఎండిసి చర్యలు తీసుకోకపోవడం, ఇసుక రిచుల్లో అక్రమాల వ్యవహారం అదునపు వసూళ్లు తీసుకుంటున్న టీజీఎండిసి సిబ్బంది కాంట్రాక్టర్ సూపర్వైజర్ లా ఫోటోలు వీడియోల సాక్షాలు వచ్చినా కూడా ఇప్పటివరకు ఒక్క క్వారీపై కూడా చర్యలు తీసుకోలేదంటే టీజీఎండిసి కిందిస్థాయి నుండి పై స్థాయి అధికారి వరకు కాంట్రాక్టర్లకు అమ్ముడుపోయారని స్పష్టంగా కనబడుతుంది.

పలుగుల తొమ్మిది సీరియల్ పేరుతో 1100 వసూలు చేస్తున్న కాంట్రాక్టర్.

సోమవారం రోజు పలుగుల తొమ్మిది ఇసుక క్వారీలో కాంట్రాక్టర్ సిబ్బంది లారీ డ్రైవర్ నుండి 1100 రూపాయలు సీరియల్ పేరుతో వసూలుచేస్తూ. తరువాత లోడింగ్ కొరకు సీరియల్ నంబర్ చిట్టిని అందించాడు. ఈ క్వారీలో గత నెల రోజులు నుండి పెద్ద మొత్తంలో అన్ని క్వారీల కంటే ఎక్కువగా వసూళ్ల పరంపర కొనసాగుతుందని, దానికి సంబంధించిన సాక్షాలు గత నెలలో 1200 తీసుకున్న పలుకుల 9 ప్రస్తుతం 1100 వందలు తీసుకోవడం జరుగుతుంది. మరోవైపు లోడింగ్ వద్ద 200. వందల రూపాయలు గత నెలలో 1400 వసూలు చేయడం జరిగింది. ప్రస్తుతం 1300 పాసింగ్ పై అదనపు ఇసుకను తీసుకోవడం జరుగుతుంది. పలుగుల తొమ్మిది గత నెల ప్రతిరోజు 119 నుండి 148 వరకు లారీల్లో ఇసుక నింపి రవాణా చేయడం జరిగింది. ఈ క్వారీ మార్చ్ నెలలో నాలుగవ తేదీన ప్రారంభమై మొదట్లో ఆవరేజ్ 60 నుండి మొదలుకొని నేటి వరకు ప్రతిరోజు 100కు పైచిలుకు లారీల ఇసుక రవాణా చేయడం జరుగుతుంది. ఇప్పటికీ మూడు నెలల్లో సుమారు ఈ క్వారీ 60 రోజుల్లో 6000 లారీల ఇసుక రవాణా చేయడం జరిగింది. లారీకి 14 నుండి 1100 అక్రమ వసూళ్ల విషయానికొస్తే 65 నుండి 85 లక్షల రూపాల అక్రమ వసూళ్లను సొమ్ము చేసుకుంది. ఇంత పెద్ద మొత్తంలో అక్రమ వసూళ్లకు తెరలేపిన పలుగుల తొమ్మిది పై, టి జి ఎం డి సి కనీసం కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు, మరి కొన్ని రోజుల్లో అక్రమ వసూళ్లతో తమ క్వాంటిటీని సమాప్తం చేసుకునే వరకు టీజీఎండిసి అధికారులు చూస్తూనే ఉంటారు.

collect

 

ప్రభుత్వ నిర్లక్ష్యం, టీజీఎండిసి పుణ్యం.

మండలంలో ఇసుక క్వారీల అక్రమాల వ్యవహారం, సాక్షాలు వసూళ్ల పర్వం, నిబంధనలు దాటి తవ్వకాలు, యదేచ్ఛగా కొనసాగుతుంటే టి జి ఎం డి సి చర్యలు తీసుకోకపోవడాన్ని ప్రశ్నించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం, టీజీఎండిసి అధికారుల పుణ్యం కాంట్రాక్టర్లు రెచ్చిపోయి, తమకు అడ్డు ఎవరు అని అక్రమ వసూళ్ల వ్యవహారాలను తమ ఇష్టారాజ్యంగా కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా మండలంలో నిర్వహించబడే ఇసుక రిచుల్లో పలుగుల తొమ్మిది మహదేవపూర్, పుసుక్ పల్లి 1, పలుగుల 8, ఈ రిచుల్లో పెద్ద మొత్తంలో అక్రమ వసూళ్ల వ్యవహారాలను దర్జాగా కొనసాగించడం జరుగుతుంది. అంతేకాకుండా పక్క జిల్లా ఇసుక క్వారీలు కూడా గోదావరిలో అక్రమ రోడ్ల నిర్మాణాలు చేసి, కుంట్లం గోదావరి వద్ద అక్రమ తవ్వకాలు జరిపి, నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తోడుతు యదేచ్చగా అక్రమాలను కొనసాగించడం జరుగుతుంది. కొత్తగా ఇసుక పాలసీ అమలులో ఉన్న క్రమంలో పెద్ద మొత్తంలో అక్రమాలు జరుగుతుంటే ప్రభుత్వం టీజీఎండిసి పై చర్యలు తీసుకోవాల్సి ఉండగా నిశ్శబ్దాన్ని పాటించడం, అనేక అనుమానాలకు దారితీస్తుంది.

collect

మహాదేవపూర్ పుసుక్ పల్లిలో ఒకటి, లో ఇదే తంతు.

మహదేపూర్ పుసుపుపల్లి1, పేరుతో నిర్వహించబడే ఇసుక క్వారీ లోను కూడా అక్రమ వసూళ్లకు హద్దు లేకుండా పోయింది.

ఇక్కడ టీజీఎండిసి సిబ్బంది 900 రూపాయలు, సీరియల్ పేరుతో వసూలు చేయడం, లోడింగ్ వద్ద 200, కాంటా వద్ద అదనపు ఇసుకకు 300 నుండి 500, యథేచ్ఛగా కొనసాగడం జరుగుతుంది.

ఈ ఇసుక క్వారీ మార్చ్ నెల ఆరవ తేదీన ,ప్రారంభించడం జరిగింది, కానీ కొద్ది రోజులు నామమాత్రంగా లారీలో ఇసుక నింపిన ఈ క్వారీ ఏప్రిల్ నెలలో, అక్రమ వసూళ్ల పరంపరను ప్రారంభించడంతో 60 నుండి మొదలుకొని 175 యావరేజ్ గా ప్రతిరోజు లారీల్లో ఇసుకను రవాణా చేయడం జరిగింది. ఈ క్వారీ ఇప్పటివరకు అక్రమ వసూళ్ల తో 45 లక్షల నుండి 60 లక్షల వరకు సొమ్ము చేసుకోవడం జరిగింది.

ప్రస్తుతం పలుకుల 8 ఇసుక క్వారీ స్థానికులకు భూమికి సంబంధించిన డబ్బులు ఇవ్వకపోవడంతో లోడింగ్ నిలిచివేయడం జరిగింది, పలుకుల సిక్స్, పుసుక్ పల్లి ఒకటి, టీజీఎండిసి అధికారుల పుణ్యమని అక్రమ వసూళ్లు పెద్ద మొత్తంలో జరుపుకొని లక్షల రూపాయల సొమ్ము చేసుకుని ఇసుక క్వాంటిటీని సమాప్తం చేసుకోవడం జరిగింది.

అధికారులు హోటల్లో సెటిల్మెంట్ చేసుకుంటే ఇలాగే ఉంటుంది.

అక్రమ వసూళ్ల వ్యవహారం మండలంలోని ఇసుక క్వారీలకు ఒక వరంగా అందించింది టీజీఎండిసి, అదుపు ఇసుక రవాణా నిలిపివేయడం, నూతన ఇసుక పాలసీ విధానం అమలు చేయడం జరుగుతుంది అని చెప్పిన ప్రభుత్వం, టీజీఎండిసి అధికారులకు ఇచ్చిన” డేడ్” లైన్ అధికారులు లెక్కచేయకుండా ప్రభుత్వ డెడ్ లైన్ ను
తీసిపారేశారు, గత వారం రోజుల క్రింద ఓ అధికారి” హోటల్లో మకాం వేసి, కాంట్రాక్టర్ అందరికీ తమ వద్దకు పిలుచుకొని, సెటిల్మెంట్ చేసుకోవడం జరిగింది.

ఆ అధికారి విధులు కూడా హోటల్లోనే పూర్తి చేసుకున్నాడు.

ఇలా అధికారులు హోటల్లో సెటిల్మెంట్ చేసుకుంటే, అక్రమ వసూళ్ల పరంపర జోరుగా కొనసాగకుంటే, కాంట్రాక్టర్లు ఎందుకు ఊరుకుంటారు.

అధికారుల హోటల్లో సిట్టింగ్ పరంపర, గత కొన్ని రోజులుగానే కొనసాగుతుందని చెప్తున్నారు, అందుకే ఏమో ఇసుక క్వారీల ప్రారంభం నుండి, అక్రమ వసూళ్ల పై చర్యలు తీసుకోవడం లేదని స్పష్టం గా కనబడుతోంది.

దర్జాగా వసూళ్ల సాక్షాలు అక్రమ ఇసుక తవ్వకాలు మైనింగ్ నిబంధనలకు తూట్లు పొడుస్తుంటే, టీజీఎండిసి అధికారులు చర్యలకు బదులు హోటల్లో” సిట్టింగ్ తో సెట్టింగ్” చేసుకోవడానికి, ప్రజలు గమనించి వాస్తవమే అక్రమాలకు చర్యలు కాదు, సిట్టింగ్లతో సక్సెస్ అయింది, ఇంకేముంది టిజీఎండిసి కాంట్రాక్టర్లకు అమ్ముడుపోయిందని అక్రమ వసూళ్ల సాక్షాలు చెబుతున్నాయి అని చెప్పుకొస్తున్నారు.

ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చీఫ్ సెక్రటరీ టీజీఎండిసి అధికారులపై చర్యలకు ఆదేశించి, ఇసుక రీచుల్లో అక్రమ వ్యవహారాలు కొనసాగిస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఆగిన పనులు.

కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఆగిన బ్రిడ్జి నిర్మాణం పనులు.

ఓడేడ్ బ్రిడ్జి ని పూర్తి చేయండి.

రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి.

పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించి దూరాన్ని తగ్గించాలని డిమాండ్.

సిపిఐ జిల్లా పూర్వ కార్యదర్శి గౌతం గోవర్ధన్.

ముత్తారం :- నేటి ధాత్రి

 

 

మంథని నియోజక వర్గ పరిధిలో ఓడేడ్ గ్రామ శివారులో మానేరు నది పై గత ప్రభుత్వ పాలన లో ప్రారంభమైన బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాకుండానే కూలి పోయిందని, దానిని వెంటనే పూర్తి చేసి పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించి దూరాన్ని తగ్గించాలని సిపిఐ జిల్లా పూర్వ కార్యదర్శి గౌతం గోవర్ధన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం ఆయన ఓడెడ్ గ్రామ శివారులో లో కూలి పోయిన బ్రిడ్జి ని పరిశీలించి అనంతరం మాట్లాడుతూ బ్రిడ్జి నిర్మాణం లో లోపాలు ఉన్న మూలంగా నిర్మాణం పూర్తి కాకుండానే పిల్లర్ లు కూలిపోయాయని ఆయన ఆరోపించారు. బ్రిడ్జి నిర్మాణం లో కాంట్రాక్టర్ నాణ్యత ప్రమాణాలు పాటించక పోవడం, ప్రభుత్వ అధికారుల అజమాయిషీ లేక పోవడం మూలంగా బ్రిడ్జి పిల్లర్లు గాలి దుమారానికి కూలీ పోయాయని ఆయన ఆరోపించారు. బ్రిడ్జి పిల్లర్లు కూలీ రెండు సంవత్సరాలు గడిచినా ఇంత వరకు రాష్ట్ర ప్రభుత్వం దీనిని పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తుందని ఆయన ఆరోపించారు. బ్రిడ్జి నిర్మాణం పూర్తి కాక పోవడం వల్ల బ్రిడ్జి పక్క నుంచి తాత్కాలికంగా మట్టి రోడ్డు మీద వాహానాల ద్వారా సమీప ప్రాంతంలో ఉన్న ప్రజలు మరియు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు కూడా చాలా మంది ఈ బ్రిడ్జి ప్రక్క నుంచి ప్రయాణం చేస్తున్నప్పటికీ ని వర్షాకాలంలో ఇబ్బందులకు గురి అవుతారని ఆయన పేర్కొన్నారు. కనుక ఇప్పటికైనా ప్రభుత్వం, జిల్లా మంత్రి వర్యులు శ్రీదర్ బాబు దృష్టి సారించి బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు, ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తి ఐతే దాదాపు ముప్పై కిలోమీటర్ల దూరం రెండు జిల్లాల ప్రజలకు తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు.

మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం..!

మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం..!

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ పట్టణంలో ఈనెల 21న కురిసిన అకాల వర్షానికి చెట్లు విరిగి రోడ్లపై, మురికి కాలువలలో విరిగిపడ్డాయి. వారం రోజులు కావస్తున్నా మున్సిపల్ సిబ్బంది పట్టించుకోవడం లేదు. ఇదే విషయంపై మున్సిపల్ అధికారిని సంప్రదించగా తీయిస్తామని తెలిపారు. కానీ ఇంతవరకు మురికి కాలువలో నుంచి చెట్లను, చెత్తను ఇంకా తీయలేదు. మున్సిపల్ అధికారులు స్పందించి చెట్లను, మురికిని తీయించాలని కాలనీవాసులు కోరుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version