ఎండబెట్లలో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి బాలసదన్ భవనం శంకుస్థాపన

నాగర్ కర్నూల్ జిల్లా నేటి దాత్రి

 

నాగర్ కర్నూల్ ఎండబెట్ల గ్రామంలో కోటి 30 లక్షల మంజూరైన బాల సదన్ బిల్డింగ్ కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాలల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని బాలసదన్ భవన నిర్మాణం ద్వారా అనాధ మరియు ఆశ్రయంలేని పిల్లలు కు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు
అభివృద్ధి పనుల్లో భాగంగా నాగర్ కర్నూల్ పట్టణంలో అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పనకు నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు
ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు మాజీ పట్టణ కౌన్సిలర్లు ఎండబెట్ల ప్రజలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

ముదిరాజ్ సహకార సంఘ భవనం ప్రారంభం

ముదిరాజ్ సహకార సంఘం భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో మాదన్నపేట ముదిరాజ్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నూతన భవనం రూ.10 లక్షల ప్రభుత్వ నిధులతో నిర్మించగా శుక్రవారం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభం చేశారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, పిసిసి సభ్యులు పెండెం రామానంద్,పిఎస్ సిఎస్ చైర్మన్ బొబ్బల రమణారెడ్డి,పట్టణ అధ్యక్షుడు బత్తిని రాజేందర్, మున్సిపల్ ఫోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్,ఓబీసీ జిల్లా అధ్యక్షులు ఓర్స్ తిరుపతి, నియోజకవర్గ నాయకులు ముదిరాజ్ కుల సంఘం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version