క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే…

క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం గ్రామంలో జహీరాబాద్ నియోజకవర్గ శాసనసభ్యులు మాణిక్ రావు, గ్రామ పెద్దల సహకారంతో సందర్భంగా నిర్వహించిన గ్రామ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. శాసనసభ్యులు మాణిక్ రావు మాట్లాడారు. గ్రామ ప్రజలందరికీ వచ్చే మహాశివరాత్రి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆటల వల్ల శారీరక దృఢత్వం మానసిక ఉల్లాసం సామాజిక నైపుణ్యాలు పెంపొందుతాయి ఇవి కండరాల బలం గుండె ఆరోగ్యం మెరుగైన రక్త ప్రసరణను అందిస్తూ ఒత్తిడిని తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే బృంద కృషితో కూడిన ఆటలు యువకుల్లో నాయకత్వ లక్షణాలు క్రమశిక్షణ జట్టుగా పని చేసే నైపుణ్యాన్ని (Team Work) అభివృద్ధి చెందుతాయి అన్నారు. ఈ కార్యక్రమంలో నూతన సర్పంచ్ వినోద బాలరాజ్ ఉప సర్పంచ్ గడ్డం మమత అనిల్ పటేల్ మండల అధ్యక్షుడు వెంకటేశం మాజీ ఎంపీపీ సంగమేశ్వర్ తాజా మాజీ సర్పంచ్ జగదీశ్వర్ మాజీ ఎంపీటీసీ సంతోష్ రజిని ప్రియ టౌన్ ప్రెసిడెంట్ ఎజస్ బాబా నాగన్న పటేల్ సర్జన్ నాగేశ్వర్ శీను పటేల్ సద్దాం సజావుద్దీన్ మరియు ఆయా గ్రామాల సర్పంచులు కార్యకర్తలు మెంబర్ పాల్గొన్నారు.

కబడ్డీ పోటీల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర…..

కబడ్డీ పోటీల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే గండ్ర…..
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

మొగుళ్ళపల్లి మండలం, పిడిసిల్ల గ్రామ వాస్తవ్యులు నైనకంటి రంగారెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు మరియు గ్రామ సర్పంచ్ నైనకంటి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీల కార్యక్రమం లో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి పాల్గొన్నారు…

ఈ సందర్భంగా క్రీడాకారులను ప్రోత్సహిస్తూ, గ్రామీణ క్రీడల అభివృద్ధికి, క్రీడాకారులలో నైపుణ్యం పెంచడానికి, ఇటువంటి పోటీలల్లో గెలుపోటములు జీవితంలో వచ్చే అటుపోటులను ఎదుర్కోవడానికి దోహదపడతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పర్లపల్లి సర్పంచ్ జోరక సదయ్య మాజీ సర్పంచులు మాజీ ఎంపిటిసిలు కార్యకర్తలు క్రీడాకారులు పాల్గొన్నారు

రామన్ పాడు గ్రామంలో క్రికెట్ పోటీలు ప్రారంభం

రామన్ పాడు గ్రామంలో క్రికెట్ పోటీలు ప్రారంభించిన సర్పంచ్

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి జిల్లా కొత్త కోట మండలం రామన్ పాడు గ్రామములో
క్రికెట్ టోర్నమెంట్ పోటీలు సర్పంచ్ అఫ్రీన్ బేగం అంజాద్ అలీ ప్రారంభించారు
గ్రామ యూత్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ మూడు రోజులపాటు ఆడుతున్న సందర్భంగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్అఫ్రీన్ బేగం అంజాద్ అలీ ప్రారంభించి టాస్ ఎగర వేసారు ఈ సందర్భంగా సర్పంచ్ యువకులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆటలు మానసిక ప్రశాంతతనం ఏకాగ్రతను ఇస్తూ శారీరక దృఢత్వని ఇస్తాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్లు మాజీ ప్రజా ప్రతినిధులు గ్రామ యువకులు పాల్గొన్నారు

తాడూర్ రైతు సంబరాల్లో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఎద్దుల బండ లాగుట ప్రారంభం

నాగర్ కర్నూలు జిల్లా నేటి ధాత్రి

తాడూర్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న రైతు సంబరాల్లో భాగంగా ఎద్దుల బండ లాగుట పోటీలను ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ రైతుల పండుగ అని రైతుల శ్రమ ఫలించిన ఆనందాన్ని ప్రతిభంబించేదే ఈ సంబరాలు అని అన్నారు గ్రామీణ క్రీడలు సాంప్రదాయ కార్యక్రమాలు మన సంస్కృతికి ప్రతి కలాని వీటిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరి పైన ఉందని తెలిపారు
రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వ్యవసాయ రంగ అభివృద్ధికి అనేక పథకాలను అమలు చేస్తూ రైతులను ఆదుకుంటుందని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు
ఈ కార్యక్రమానికి మార్కెట్ చైర్మన్ రమణ రావు తాడూర్ సర్పంచ్ మల్లయ్య చుట్టుపక్కల గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version