కేంద్రీయ విద్యాలయ పాఠశాలకు బస్ సౌకర్యం ఏర్పాటు.

కేంద్రీయ విద్యాలయ పాఠశాలకు బస్ సౌకర్యం ఏర్పాటు

 

సిరిసిల్ల టౌన్  (నేటి ధాత్రి)

 

సిరిసిల్ల పట్టణంలో నిర్వహిస్తున్న కేంద్రీయ విద్యాలయ పాఠశాల(కేవీ స్కూల్)ని తంగళ్లపల్లి మండలం లోని పద్మనగర్ లో గల సొంత భవనంలోకి మార్చాగ విద్యార్థుల తల్లిదండ్రుల కోరిక మేరకు మంగళవారం రోజున సిరిసిల్ల కొత్త బస్టాండ్ నుండి బస్ ని సిరిసిల్ల డిపో మేనేజర్ ప్రకాష్ రావు కొబ్బరికాయ కొట్టి బస్ ని ప్రారంబించారు..సుమారు 180 మంది విద్యార్థులు సిరిసిల్ల పట్టణం నుండి విద్యాభ్యాసం కోసం కేవీ స్కూల్ కి వెళ్లనున్నారు.. ఈ సందర్భంగా డిపో మేనేజర్ మాట్లాడుతూ విద్యార్థులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆర్.టి.సి ని లాభాల్లోకి తీసుకురావాలని కోరారు..విద్యార్థుల కోసం మరో బస్ ని కూడా ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి రోజు ఈ బస్ ఉదయం 7:30 నిమిషాలకి కొత్త బస్ స్టాండ్ నుండి ప్రారంభం అయ్యి పాత బస్టాండ్,గాంధీ చౌక్,పోలీస్ స్టేషన్ వద్ద విద్యార్థులను ఎక్కించుకొని వెళ్తుందని తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు డిపో మేనేజర్ ని శాలువాతో సత్కరించారు.. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సూపర్ వైజర్ వర్జిలాల్, కంట్రోలర్ రామ్ రెడ్డి, కార్గో డి.ఎం. ఈ శేఖర్ రావు, ఆర్. టి. సి సిబ్బంది మరియు విద్యార్థుల తల్లి దండ్రులు పెద్ది నవీన్ కుమార్,బండరాజు, కొండికొప్పుల రవి , తడుకల సురేష్,శ్రీనివాస్,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

ముందస్తు విద్యార్థుల నమోదు కార్యక్రమం.

ముందస్తు విద్యార్థుల నమోదు కార్యక్రమం

పాఠశాల ప్రధానోపాధ్యాయులు తాటికొండ వీరస్వామి

కమలాపూర్, నేటిధాత్రి :

 

రాబోయే విద్యా సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకొని కమలాపూర్ మండలం భీంపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందం ముందస్తుగా విద్యార్థుల నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించింది.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తాటికొండ వీరస్వామి మాట్లాడుతూ విద్యా సంవత్సరం చివర్లోనే తల్లిదండ్రులు,యువత, ప్రజాప్రతినిధులను కలవడం ద్వారా ముందుగా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తే,వచ్చే ఏడాది విద్యార్థుల ప్రవేశాలు పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు.అందుకే ఈ కార్యక్రమాన్ని ముందుగా చేపట్టామన్నారు.పాఠశాల అందిస్తున్న సౌకర్యాలను వివరించేందుకు,అలాగే ఉపాధ్యాయ బృందం విద్యార్హతలను తెలియజేయడానికి ప్రత్యేక కరపత్రాన్ని ముద్రించి మండల విద్యాశాఖ అధికారిచే ఆవిష్కరించారు.గత వారం రోజులుగా ఉపాధ్యాయ బృందం గ్రామంలోని వివిధ ప్రాంతాలను సందర్శిస్తూ, గ్రామ పెద్దలు,తల్లిదండ్రులు, యువతతో సమావేశమై, వారికి కరపత్రాలను అందజేస్తూ,తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.విద్యార్థులకు మంచి భవిష్యత్తు అందించేందుకు గట్టి పునాది వేస్తామనే నమ్మకాన్ని తల్లిదండ్రుల్లో కల్పిస్తున్నారు.తల్లిదండ్రులు సానుకూలంగా స్పందించి తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు సిద్దంగా ఉన్నారని తెలిపారు. త్వరలోనే బడి ఈడు పిల్లల తల్లిదండ్రులతో ఉపాధ్యాయ బృందం సమావేశం నిర్వహించనుందని తెలిపారు.ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఇలాంటి కార్యక్రమాలు మార్గదర్శకమని మండల విద్యాశాఖ అధికారి అభిప్రాయపడ్డారు.భీంపల్లి పాఠశాల ఉపాధ్యాయ బృందాన్ని మండల విద్యాశాఖ అధికారి శ్రీధర్,కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు వాణి అభినందించారు.ఈ కార్యక్రమంలో పాఠశాలఉపాధ్యాయులు ఎన్. ప్రభాకర్ రెడ్డి,బి.జోత్స్న, కె.సుజాత అంగన్వాడీ టీచర్ ఏ.వరలక్ష్మి,ప్రీ ప్రైమరి టీచర్ కె.పూజిత,తదితరులు పాల్గొన్నారు.

అస్తవ్యస్తంగా సంగం(కె) ప్రాథమిక పాఠశాల.

అస్తవ్యస్తంగా సంగం(కె) ప్రాథమిక పాఠశాల

◆ శిథిలావస్థలో మరుగుదొడ్లు,
◆ మూత్రశాలలు నిరుపయోగంగా వాటర్ ట్యాంక్ పాఠశాలలో లోపించిన పారిశుధ్యం

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

ఝరా సంగం మండలంలోని సంగం (కె) గ్రామంలో గల ప్రాథ మిక పాఠశాల అస్తవ్యస్తంగా మారింది. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలు చేపడుతున్నప్పటికీ ఈ పాఠశాల రూప రేఖలు మార్చలేకపోయాయి. ఈ పాఠశాల ఆవరణలో ఉన్న మరు గుదొడ్లు, మూత్రశాలలు శిథిలావస్థలో ఉండటంతో విద్యా ర్థులు ఉపయోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ఈ శిథిలాలతో విద్యార్థులకు ప్రమాదం పొంచి ఉన్న వాటిని తొలగించడం లేదు. అలాగే నీటి సరఫరా కోసం ఏర్పాటు
చేసిన వాటర్ ట్యాంక్ రంధ్రాలు పడి నిరుపయోగంగా మారింది. ఈ పాఠశాల చుట్టూ పూర్తిస్థాయిలో కాంపౌండ్ వాల్ లేనందున పశువులు లోపలికి వచ్చే అవకాశం ఉంది. పాఠశాల భవనానికి అక్కడక్కడ పెచ్చులు ఊడిపోయాయి. రంగులు వెలిసిపోయి భవనం కళ హీనంగా కనిపిస్తుంది. పాఠశాల పరిసర ప్రాంతాల్లో చెత్తాచెదారం నెలకొని పారి శుద్ధ్యం లోపించింది. ఈ పాఠశాలలో ఇంకా పలు సమ స్యలు నెలకొనడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతు న్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు విద్యాభివృద్ధికై పాఠశాలలో మౌలిక సదుపాయాల కోసం అవసరమైన నిధులు మంజూరు చేయాలని విద్యార్థినీ, విద్యార్థుల తల్లి దండ్రులు కోరుతున్నారు.

నవోదయ ఫలితాల్లో గీతాంజలి డిజి.!

నవోదయ ఫలితాల్లో గీతాంజలి డిజి ప్రైమరీ విద్యార్థుల ప్రభంజనం

నర్సంపేట,నేటిధాత్రి:

 

2025 జనవరి న జరిగిన నవోదయ ప్రవేశ పరీక్ష ఫలితాలు ఇటీవల విడుదల కాగా ఈ ఫలితాల్లో నర్సంపేట
పట్టణంలోని గీతాంజలి డిజి ప్రైమరీ పాఠశాల విద్యార్థుల ప్రభంజనం సృష్టించారు.ఈ ఫలితాల్లో విద్యార్థులు పి. అభిరామ్, కే. అశ్విత మరియు వి. హిమబిందులు సీట్లు సాధించారని చైర్మన్ వేముల సుబ్బారావు గారు ఒక ప్రకటనలో తెలిపారు.తమ పాఠశాల విద్యార్థులు ఉన్నత విద్య కోసం సీట్లు సాధించడం చాలా సంతోషకరమని చైర్మన్ పేర్కొన్నారు.కష్టపడితే ఎప్పటికైనా ఫలితం దానంతట అదే వస్తుందనే దానికి నిదర్శనమని తెలిపారు.ఈ సందర్బంగా పాఠశాల లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీట్లు సాధించిన విద్యార్థులకు సన్మానం చేశారు.అనంతరం కష్టపడ్డ ప్రతీవిద్యార్ధికి,ఉపాధ్యాయులకు,సహకరించిన పోషకులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సౌజన్య రావ్, వైస్ ప్రిన్సిపాల్ విమల,ఇంచార్జి జాగృతి, మాథ్స్ ఉపాధ్యాయులు రాజు, అశోక్, చిరంజీవిలు పాల్గొన్నారు.

బీసీ రిజర్వేషన్ అమలు కోసం ఏప్రిల్ 2న హలో.

బీసీ రిజర్వేషన్ అమలు కోసం ఏప్రిల్ 2న హలో బీసీ..చలో ఢిల్లీ

-బీసీలకు విద్యా, ఉద్యోగ రంగాలలో, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సిందే

-విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న వేముల మహేందర్ గౌడ్

మొగుళ్ళపల్లి నేటి ధాత్రి

 

 

బీసీ రిజర్వేషన్ల అమలు కోసం చేస్తున్న పోరాటం గల్లీలో ముగిసింది..

ఇక ఢిల్లీలో చేపడుతున్నామని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు వేముల మహేందర్ గౌడ్ అన్నారు.

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ఏప్రిల్ 2న చేపట్టిన హలో బీసీ..

చలో ఢిల్లీ కార్యక్రమం సందర్భంగా ఆయన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

బీసీలకు విద్యా, ఉద్యోగ రంగాలతో పాటు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఏప్రిల్ 2న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా, ఉద్యోగ రంగాలతో పాటు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లకు ఆమోదం తెలిపినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.

బీసీ రిజర్వేషన్ల చట్టం కోసం గల్లీలో పోరాటం ముగిసిందని, ఇక ఢిల్లీలో పోరాటం చేయబోతున్నామన్నారు.

చరిత్రలో కనివిని ఎరుగని రీతిలో దేశంలోని 29 రాష్ట్రాల నుండి ఢిల్లీని బీసీల దండు ముట్టడించబోతుందన్నారు.

ఏప్రిల్ 2వ తేదిలోగా కేంద్ర ప్రభుత్వం 42 శాతం బీసీ బిల్లు ఆమోదిస్తే విజయోత్సవ సభ పెడతామన్నారు.

కేంద్ర ప్రభుత్వం ద్వంద వైఖరి అవలంబిస్తే కేంద్రంలోనే అగ్గి రాజేస్తామని హెచ్చరించారు.

బీసీ నినాదాన్ని ఇక ఎవ్వరూ ఆపలేరన్నారు.

బీసీలను అణగదొక్కాలని చూస్తే వదిలిపెట్టబోమన్నారు.

బీసీలు సర్పంచులు, కౌన్సిలర్లు కూడా కారాదని కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

బీసీలకు అన్యాయం చేస్తే వెంటాడుతాం..మేలు చేస్తే గుండెల్లో దాచుకుంటామన్నారు.

మా పోరాటంతోనే 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని హైకోర్టు తీర్పునిచ్చిందన్నారు.

హలో బీసీ..చలో ఢిల్లీ కార్యక్రమానికి జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి మహిళలు, విద్యార్థులు, యువకులు, బీసీ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున తరలిపోతున్నామని ఆయన తెలిపారు.

బాలాజీ టెక్నో స్కూల్ విద్యార్థులు.!

ఐదు నవోదయ సీట్లుసాధించిన బాలాజీ టెక్నో స్కూల్ విద్యార్థులు

నర్సంపేట,నేటిధాత్రి:

 

ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలో చదివించుకునే ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటుగా నవోదయ కోచింగ్ సెంటర్లలో చదివించుకుంటారు.కానీ మా పాఠశాలలో చదివే విద్యార్థులకు మా ఉపాధ్యాయులు ఇచ్చే కోచింగ్ ద్వారా ప్రతి సంవత్సరం నవోదయలో సీట్లు సాధిస్తున్నారని, అందుకు తమకు ఎంతో గర్వంగా ఉందని బాలాజీ విద్యాసంస్థల అధినేత డాక్టర్ అండ్ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి అన్నారు.నర్సంపేట మండలంలోని లక్నేపల్లి బాలాజీ టెక్నో స్కూల్లో నవోదయలో సీట్లు సాధించిన ఐదుగురు విద్యార్థులు వి.నిఖిత, ఇ. వర్షిత్, ఎ. సంజిత్, ఎ.రేవంత్,కె. దీక్షిత్ లను వారు అభినందించారు.వీరి విజయానికి తోడ్పడిన ఉపాధ్యాయులను,విద్యార్థుల తల్లిదండ్రులను ఈ సందర్భంగా వారు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో బాలాజీ టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ పెరుమాండ్ల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ చిన్నతనం నుండి ఇష్టంతో కష్టపడి పని చేయడం అలవాటు చేసుకుని, ఒక క్రమ పద్ధతిలో చదువుకుంటే ఏదైనా సాధించవచ్చన్నారు. ఈ చిన్నారులను ప్రేరణగా తీసుకొని ప్రతి విద్యార్థి చదువుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, నవోదయ సీట్లు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు.

పదవ తరగతి పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్…

పదవ తరగతి పరీక్ష కేంద్రాలను పరిశీలించినజిల్లా కలెక్టర్…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ మండల కేంద్రంలో పదవతరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.

ఈ సందర్భంగా తంగళ్ళపల్లి మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు మైనార్టీ గురుకుల పాఠశాల పదవ తరగతి పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి పరీక్ష జరుగుతున్న సరళని క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్.

విద్యార్థులకు పరీక్ష కేంద్రాల్లో ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలి విద్యార్థులందరూ సమయపాలన పాటించాలని సమయానికి పరీక్షా కేంద్రాలకు హాజరుకావాలని విద్యార్థులందరూ 10వ తరగతి పరీక్షలలో .

అధిక శాతం ఉత్తీర్ణత సాధించాలని విద్యార్థులకు ఉపాధ్యాయులు సంబంధిత అధికారులు పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ వాటిని కచ్చితంగా పాటించాలని. జిల్లా కలెక్టర్ ఆదేశించారు

ఎడ్యుకేషనల్ హబ్ గా కరీంనగర్..

ఎడ్యుకేషనల్ హబ్ గా కరీంనగర్..

 

ఇంజినీరింగ్, లా కాలేజ్ మంజూరుతో విద్యారంగం మరింత అభివృద్ధి..

 

విద్యా రంగంలో సీఎం రేవంత్ రెడ్డి విప్లవాత్మక కార్యక్రమాలు..

 

దేశంలోనే అత్యుత్తమ

గుర్తింపు తెస్తున్న ముఖ్యమంత్రి

 

శాతవాహన యూనివర్సిటీకి లా కాలేజీ, హుస్నాబాద్ లో ఇంజినీరింగ్ కళాశాల మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డి, ఇందుకు కృషి చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు ప్రత్యేక ధన్యవాదాలు

 

కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు

 

కరీంనగర్, నేటిధాత్రి:

 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యారంగంలో చేపడుతున్న విప్లవాత్మక మార్పులతో కరీంనగర్ ఉమ్మడి జిల్లా రాబోయే కాలంలో ఎడ్యుకేషనల్ హబ్ గా మారబోతున్నదని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు.

కరీంనగర్లోని శాతవాహన యూనివర్సిటీకి లా కాలేజీ, హుస్నాబాద్ లో ఇంజినీరింగ్ కాలేజ్ మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇందుకోసం ప్రత్యేకంగా కృషి చేసిన బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

మంగళవారం వెలిచాల రాజేందర్ రావు మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ కి లా కాలేజ్, హుస్నాబాద్ కు ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.

పెద్దపల్లి జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళాశాలలు ప్రకటించారని, మూడు నెలల లోపే వాటిని మంజూరు చేస్తూ హామీని నిలబెట్టుకోవడం చారిత్రాత్మకమన్నారు.

గత పాలకుల నిర్లక్ష్యం వల్ల కరీంనగర్ జిల్లాలో విద్యారంగం కుంటుపడిందని తెలిపారు.

అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం కరీంనగర్ కు మెడికల్ కాలేజ్ మంజూరు చేయలేదని మండిపడ్డారు. మెడికల్ కాలేజ్ ఏర్పాటు కోసం గతంలో ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్ అనేక ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కరీంనగర్ కు మెడికల్ కళాశాల మంజూరు చేశారని పేర్కొన్నారు. మెడికల్ కళాశాల ఏర్పాటులో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలకపాత్ర పోషించారని తెలిపారు.

బిఆర్ఎస్ పాలకులు గత పదేళ్ల కాలంలో విద్యారంగాన్ని బ్రష్టు పట్టించారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యారంగ అభివృద్ధికి అనేక విప్లవాత్మకమైన కార్యక్రమాలు చేపడుతున్నారని రాజేందర్ రావు తెలిపారు.

ప్రతి ఏటా ప్రభుత్వం బడ్జెట్లో విద్య రంగానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నదని చెప్పారు.

ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ ప్రభుత్వం విద్య శాఖకు ఈ 23,108 కోట్ల రూపాయలు కేటాయిం చిందని రాజేందర్ రావు పేర్కొన్నారు. డా.బి.ఆర్. అంబేద్కర్ దూరదృష్టితో అర్ధ శతాబ్దానికి పూర్వం చెప్పిన ఈ మాటలు నేటికీ మన సమాజానికి వర్తిస్తాయనీ, అందులో భాగంగానే యువతకు శాస్త్ర- సాంకేతిక నైపుణ్యతను పెంపొందించే ఉద్దేశ్యంతో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని హైదరాబాదులో ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిపారు.

డా.బి.ఆర్.అంబేద్కర్ కలలు కన్న విద్యావ్యవస్థను తయారు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు.

దీనికోసమే రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 58 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి 11, 600
కోట్ల రూపాయలు మంజూరు చేసిందని వెల్లడించారు. ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయం ఒక చారిత్రాత్మకమని పేర్కొన్నారు.

ప్రతి నియోజక వర్గంలో కనీసం ఒక యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ ను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నదని తెలిపారు.

శాతవాహన యూనివర్సిటీ పరిధిలో హుస్నాబాద్లో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో బీటెక్ సీఎస్ఈ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ, ఈసీఈ బ్రాంచులను ఏర్పాటు చేయనున్నారని తెలిపారు.

ఇంజినీరింగ్ కాలేజీ నిర్మాణానికి రూ.44.12 కోట్లు కేటాయించగా అందులో రూ.29.12 కోట్లు ప్రస్తుతం ప్రభుత్వం మంజూరు చేసిందని పేర్కొన్నారు.

శాతావాహన వర్సిటీలో ఏర్పాటు చేయనున్న లా కాలేజీలో మూడేళ్ల కోర్సు, రెండేళ్ల కోర్సు(మేధో సంపత్తి చట్టం)లో అడ్మిషన్లను ఇవ్వనున్నారని తెలిపారు. ఈకాలేజీ నిర్మాణానికి మొత్తం రూ.22.96 కోట్లు కేటాయించగా..

అందులో ప్రస్తుతం ఐదు కోట్లు మంజూరు చేశారనీ, మొత్తంగా రూ.67.08 కోట్లను ప్రభుత్వం ఈ రెండు కాలేజీలకు కేటాయించనుందని రాజేందర్రావు పేర్కొన్నారు.

లా కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇందుకోసం ప్రత్యేకంగా కృషి చేసిన రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు వెలిచాల రాజేందర్ రావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

కళాధార పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవం.

ఆనందోత్సాహాల మధ్య కళాధార పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవం

నేటి ధాత్రి కథలాపూర్

 

ఆనందోత్సవాల మధ్య కళాధార పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు.
కథలాపూర్ మండల కేంద్రంలోని కళాధార పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఆనందోత్సవాల మధ్య జరిగాయి. ముఖ్యఅతిథిగా కోట్ల సిఐ సురేష్ బాబు హాజరై ప్రసంగించారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని అన్నారు. ఉపాధ్యాయులకు కూడా కష్టపడి విద్యార్థులకు మంచి బోధన అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. తహసిల్దార్ వినోద్ కుమార్ మాట్లాడుతూ… గ్రామీణ ప్రాంతాల్లో అన్ని వసతులతో కూడిన విద్యా సంస్థ ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. కథలాపూర్ ఎస్ఐ నవీన్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిరోజు ఉపాధ్యాయుల సూచనలు పాటిస్తే మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించవచ్చు అన్నారు. అనంతరం విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు, డ్యాన్సులు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ వేడుకల్లో పాఠశాల చైర్మన్ గడ్డం భూమారెడ్డి, డైరెక్టర్ గడ్డం దివాకర్ రెడ్డి, ప్రిన్సిపల్ కమలాకర్, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అర్ధరాత్రి విద్యార్థుల నిర్భందఖాండ.

అప్రకటిత ఎమర్జెన్సీ తలపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం… అర్ధరాత్రి విద్యార్థుల నిర్భందఖాండ…

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ లో బి.ఆర్.ఎస్వీ నాయకుల అక్రమ నిర్బంధం…విద్యార్థుల సమస్యలపై ప్రశ్నించేందుకు అసెంబ్లీ కి బయల్దేరిన బి.ఆర్.ఎస్వీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన జహీరాబాద్ పోలీసులు.

విద్యార్థుల జీవితాలతో చెలగాటం తగదు..
బీ.ఆర్.ఎస్వీ జహీరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి రాకేష్…

Student

జహీరాబాద్ కార్యలయంలో ఎర్పాటు చేసిన సమావేశం లో బీ.ఆర్.ఎస్వీ జహీరాబాద్ నియోజకవర్గ రాకేష్ మాట్లాడుతూ సీ.ఎం రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టో లో ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి డుమ్మా కొట్టడమే కాకుండా జాబ్ క్యాలెండర్ ఎగవేసి విద్యార్థులను మోసం చేశాడు అని ద్వజమెత్తారు. అదే విధంగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగ యువతకు మొండి చెయ్యి ఇవ్వడం జరిగింది అని అన్నారు. మహిళా విద్యార్థినిలకు స్కూటీల పేరు చెప్పి ఓట్లు దండుకుని నేడు వారికి బడ్జెట్ లో కనీసం వారీ ప్రస్తావన సైతం తీయలేదని ఎద్దవ చేశారు. మరి ముఖ్యంగా అనగారిన విద్యార్థులు చదువుకునే ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్స్ గురించి బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడమే కాకుండా బడ్జెట్లో ప్రస్తావన లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. విద్యార్థుల హక్కుల కోసం బి.ఆర్.ఎస్వీ ప్రశ్నిస్తే విద్యార్థి నాయకులను అరెస్టు చేసి అర్ధరాత్రి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యి పట్టున పది రోజులు గడువక ముందే ఇప్పటి అనేక మార్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి నాయకులను రాత్రికి రాత్రే అరెస్టులు చేసి నిర్బంధకాండ సృష్టిస్తున్నారని అన్నారు. ఈలాంటి కాంగ్రెస్ ప్రజాపాలన చూస్తే ఎమర్జెన్సీ పాలనను తలపించే విధంగా సాగుతుందని ఎద్దేవా చేశారు.జహీరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా విద్యార్థి నాయకులను భయబ్రాంతులకు గురి చేసి అక్రమ అరెస్టులు తక్షణమే మానుకోలవని హెచ్చరించారు. ఇప్పటి వరకు విద్యార్థుల జోలికి వొచ్చిన ఏ ముఖ్యమంత్రి కూడా చరిత్రలో నిలిచిన దాఖలు లేవని విధ్యార్థులు జోలికి వొస్తే ఊరుకోబోమని బీ.ఆర్.ఎస్వీ తరపున పోరాటం ఉదృతం చేస్తాం అని ముందస్తు అరెస్టులు ఆపాలని కాంగ్రెస్ ప్రభుత్వన్ని కోరారు. ప్రజా సమస్యలను గాలికి వొదిలేసి విద్యార్థులను అరెస్టు చేయడాలను ఆపాలని హెచ్చరించారు . ఈ సమావేశం లో బీ.ఆర్.ఎస్వీ పట్టణ అధ్యక్షులు ఓంకార్ , బీ.ఆర్.ఎస్వీ న్యాల్కాల్ మండల అధ్యక్షులు జెట్గొండ మారుతి యాదవ్ , సీనియర్ బీ.ఆర్.ఎస్వీ నాయకులు పరశురాం , ఎం.డీ ఫయాజ్ , రఘు తేజ , ఆవేజ్ , అజీమ్ , ఇక్బాల్ , మహేష్ , రజాక్, మరియు తదితరులు పాల్గొన్నారు.

10 పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన అధికారులు.

పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని సందర్శించిన అధికారులు

జైపూర్,నేటి ధాత్రి:

జైపూర్ మండల కేంద్రంలో రెండవ రోజు జరుగుతున్న పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని జైపూర్ ఎసిపి వెంకటేశ్వర్లు,తహసీల్దారు వనజా రెడ్డి,ఎస్సై శ్రీధర్ సందర్శించారు.పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులు సరియైన సమయానికి పరీక్ష కేంద్రానికి చేరుకొని ఎలాంటి ఒత్తిడిలకు లోనవ్వకుండా సమయస్ఫూర్తితో తగు జాగ్రత్తలు తీసుకొని పరీక్షలు బాగా రాయాలని ఉన్నత ఫలితాలను మండల కేంద్రానికి తీసుకురావాలని విద్యార్థులకు సూచనలు చేశారు.

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ.

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

నిజాంపేట, నేటిధాత్రి

 

నిజాంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో శనివారం స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి అన్ని తరగతుల్లో విద్యాబోధన అందించారు.వీరిలో ప్రధానోపాధ్యాయులుగా సింధు,
డీఈవోగా నవదీప్ గౌడ్, ఎంఈఓ గా సాత్విక్,లు ఉన్నారు. పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి విద్యార్థులకు చక్కటి విద్యను అందించారని ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందించామన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయురాలు అరుణ, ఉపాధ్యాయులు వినోద్, శ్రీలత, రాజేందర్, శ్రీకాంత్ గౌడ్, శ్రీనివాస్,ఇంతియాజ్ భాను, బాల్ లక్ష్మి,ప్రమీల,తదితరులు పాల్గొన్నారు.

చిన్నారి వైద్యచికిత్సల కోసం ఆర్ధిక సహాయం అందజేత.

చిన్నారి వైద్యచికిత్సల కోసం ఆర్ధిక సహాయం అందజేత

 

వరంగల్/నర్సంపేట,నేటిధాత్రి:

 

గీసుకొండ మండల కేంద్రానికి చెందిన తాళ్లపెళ్లి రమేష్ – నాగమణిల కూతురు పుట్టిన కొన్ని రోజుల తర్వాత కడుపు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నది. నిరుపేద కుటుంబం కావడంతో ఆ చిన్నారి పాపకు వైద్య చికిత్స చేయించడానికి ఇబ్బందులు పడుతూ, సాయంఅందించాలని ప్రాధేయపడుతున్నారు.ఈ విషయాన్ని తెలుసుకున్న హన్మకొండలో ఉంటున్న గీసుకొండ గ్రామానికి చెందిన ఏనుగుల మంజుల -సాంబరెడ్డి దంపతులు మానవత్వంతో స్పందించి రూ.3వేలు పంపగా ఆ నగదును కర్ణకంటి రజిత -రాంమూర్తి దంపతులు ఆ చిన్నారి పాప తల్లికి అందజేశారు.ఈకార్యక్రమంలో స్థానికులు చాపర్తి రాజమ్మ పాల్గొన్నారు.

నవత విద్యాలయంలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు.

నవత విద్యాలయంలో ఘనంగా వార్షికోత్సవ వేడుకలు.
– పట్టణ పాఠశాలలకు ధీటుగా విద్యాబోధన
– లుసిడా చేతివ్రాతలో ప్రభంజనం
– ప్రోపెల్ డిజిటల్ తరగతుల బోధనలో జాతీయ మొదటి బహుమతి
– విద్యార్థుల భవిష్యత్తు కోసం ప్రతి నిమిషం కృషి
– ఉపాధ్యాయుల కృషి అభినందనీయం
– పాఠశాల కరస్పాండెంట్ పత్తిపాక నాగరాజు

చందుర్తి, నేటిధాత్రి:

 

చందుర్తి మండల కేంద్రంలోని నవత ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు శనివారం అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలలో భాగంగా విద్యార్థుల ఆటపాటలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ పత్తిపాక నాగరాజు మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా దినదినాభివృద్ధి చెందుతూ విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందించడంలో పురోగతిని సాధిస్తున్నామని అన్నారు. పట్టణ ప్రాంత పాఠశాలలకు దీటుగా విద్యను అందిస్తున్నామని, అందుకు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల కృషి అభినందనీయమని అన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పోరేట్ స్థాయి విద్యను అందించాలనే సత్సంకల్పంతో ఈ విద్యా సంవత్సరం పాఠశాలలో డిజిటల్ తరగతుల బోధనలు ప్రారంభించగా మంచి ఫలితాలు వచ్చాయని అన్నారు. ఆడియో వీడియో విజువలైజేషన్లో తరగతుల నిర్వహణతో విద్యార్థుల సామర్థ్యాలు పెరిగాయని అన్నారు. ప్రోపెల్ డిజిటల్ తరగతుల బోధనలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచి శిక్ష అవార్డు పొందామని తెలిపారు. అలాగే విద్యార్థి భవిష్యత్తుకు చక్కటి చేతి వ్రాత ఎంతో అవసరమని అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో లుసిడ చేతి వ్రాత తరగతులు నిర్వహించామని, చేతివ్రత పోటీలలో నవత విద్యాలయం విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ప్రభంజనం సృష్టించారని అన్నారు. నవత విద్యార్థుల ప్రతిభతో అక్షర చేతివ్రాత ఫౌండేషన్ అధ్యక్షులు మీరజ్ అహ్మద్ ఆశ్చర్యపోయారన్నారు. రాష్ట్రస్థాయి సూపర్ 10 లో మూడు బహుమతులు, స్టేట్ 50లో 12 బహుమతులతో పాటు వివిధ కేటగిరీలో మొత్తం 90 అవార్డులు సాధించి రాష్ట్రంలోనే మరే ఇతర పాఠశాల సాధించని ఘనత సాధించామని తెలిపారు. విద్యార్థులను ఉన్నత శిఖరాలకు చేర్చడంలో తల్లిదండ్రులు ఎల్లవేళలా సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Anniversary Celebration

అక్రమ అరెస్ట్ అప్రజాస్వామికం..

అక్రమ అరెస్ట్ అప్రజాస్వామికం

 

మందమర్రి నేటి ధాత్రి

 

బడ్జెట్లో విద్యా రంగానికి తీవ్రమైన అన్యాయం చేసిన రేవంత్ రెడ్డి సర్కార్

 

బి ఆర్ ఎస్ వి మందమర్రి పట్టణ అధ్యక్షులు MD.ముస్తఫా ..

కాంగ్రెస్ ప్రభుత్వం కచ్చితంగా విద్యా రంగానికి 15% బడ్జెట్ ను కేటాయించాలి.

అసెంబ్లీ ముట్టడి నిరసన గా ఈ రోజు ఉదయం 6 గంటలకు బి అర్ ఎస్ వి పట్టణ అధ్యక్షులు MD ,ముస్తఫా తో పాటు టౌన్ వైస్ ప్రెసిడెంట్ దాసరి నవీన్ మరియు md,తాజ్ గారిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్ కు తరలించిన పోలీసులు.

అక్రమ అరెస్ట్ అప్రజాస్వామికం…

విద్యను పాతాళానికి తొక్కుతున్న రేవంత్ రెడ్డి సర్కార్

ఈ సందర్భంగా ముస్తఫా మాట్లాడుతూ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేవలం 7.53 శాతమే అనగా 23108 కోట్ల బడ్జెట్ ను విద్యా రంగానికి కేటాయించడం వల్ల విద్య పట్ల ఎంత నిర్లక్ష్యంగా ఉందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మన ముందు కనబడుతుంది అని అన్నారు.

ఇప్పటికే ఈ రాష్ట్రంలో దాదాపు 8,000 కోట్లు విద్యార్థులకు రావాల్సిన బకాయిలు అనగా స్కాలర్షిప్లు గాని ఫీజు రియంబర్స్మెంట్ గాని పెండింగ్లో ఉన్నాయి కానీ మొన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 23,108 కోట్లు మాత్రమే కేటాయించారు.ఈ బడ్జెట్ ఫీజు రీయింబర్స్మెంట్ కూడా సరిపోని పరిస్థితి ఉన్నదని అని తెలిపారు.
హామీలు మాత్రం గంపేడిచ్చి బడ్జెట్ మాత్రం అరకొర కేటాయించి విద్యా వ్యవస్థను అందా:పాతాళానికి తొక్కడం దుర్మార్గం అని కోరారు.

ప్రతి విద్యార్థికీ 5 లక్షల విద్య భరోసా కార్డుకు బడ్జెట్ కేటాయింపు లో సున్నా అని కోరారు.ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ ఊసే లేదు..

ప్రతి మండలానికి ఒకటి అని చెప్పి నేడు నియోజకవర్గానికి ఒకటి ఇంటర్నేషనల్ స్కూల్ ఇస్తామని అనడం దానికి బడ్జెట్ కేటాయించకపోవడం దుర్మార్గం.

ప్రతి మండలంలో నవోదయ విద్యాలయంతో పాటు సమానంగా బీసీలకు ఒక కొత్త గురుకులం అని చెప్పి మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం కు సిగ్గు చేటు అని పేర్కొన్నారు.

ప్రతి మండల కేంద్రంలో హైస్కూల్ ఇంటర్ కాలేజీ మరియు ప్రతి నియోజకవర్గంలో ఒక డిగ్రీ కాలేజీ అదేవిధంగా జిల్లా కేంద్రంలో పీజీ కాలేజీ లను నిర్మిస్తామని చెప్పినారు కానీ బడ్జెట్ మాత్రం సున్నా కేటాయించారు ఎలా సాధ్యమవుతుందన్నారు.

3 లక్షల వార్షికో ఆదాయం లోపు ఉన్నవారికి బీసీలకు మొత్తం ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని చెప్పి మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మండిపడ్డారు.
ఉన్నత చదువులు చదివే వారికి పది లక్షల వరకు రుణాలు ఇస్తామని చెప్పి మోసం చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని అన్నారు.

ఉద్యమంలో చనిపోయిన విద్యార్థి అమరులకు 25వేల పింఛన్ హామీ పచ్చి మోసని తెలిపారు.

18 ఏళ్ల పైబడి చదువుకునే విద్యార్థినిలకు ఎలక్ట్రిక్ స్కూటీస్ ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు.

అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులకు 10 పాస్ అయితే 10000, ఇంటర్ పాస్ అయితే 15000, డిగ్రీ పాసైతే 25000, పీజీ పాస్ అయితే ఒక లక్ష, పిహెచ్డి ఎంఫిల్ పాస్ అయితే ఐదు లక్షలు ఇస్తా అని చెప్పడం పచ్చి మోసం. అని పేర్కొన్నారు.

ప్రశాంతంగా మొదటి రోజు పదవ తరగతి పరీక్షలు.

ప్రశాంతంగా మొదటి రోజు పదవ తరగతి పరీక్షలు

ముత్తారం :- నేటి ధాత్రి:

 

ముత్తారం మండలం ధర్యపూర్ మోడల్ స్కూల్ లో పదవ తరగతి పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయి పదో తరగతి పరీక్ష కేంద్రం వద్ద ముత్తారం ఎస్ ఐ నరేష్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు పోలీస్ సిబ్బంది పరీక్ష కేంద్రం లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని ఎస్ ఐ నరేష్ తెలిపారు

ఎస్ ఎస్ సి పరీక్ష మొదటి రోజు ప్రశాంతం.

ఎస్ ఎస్ సి పరీక్ష మొదటి రోజు ప్రశాంతం

గణపురం నేటి ధాత్రి

గణపురం మండల కేంద్రంలో ఆదర్శ మోడల్ స్కూల్ సెంటర్లో పదో తరగతి పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా ముగిశాయి శుక్రవారం ఉదయం 9 .30 గంటలకు ప్రారంభమైన పరీక్షలు మధ్యాహ్నం 12:30 వరకు జరిగాయి మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ లో జిల్లా విద్య శాఖ అధికారి రాజేందర్ పరీక్ష నిర్వహణను పర్యవేక్షించారు మండలంలో రెండు సెంటర్లు 360 మంది విద్యార్థులకు గాను 359 మంది హాజరు కాగా ఒకరు ఆఫ్ సెంట్ అయినట్లు ఎంఈఓ ఊరుకొండ ఉప్పలయ్య తెలిపారు మొదటి రోజు ఎలాంటి మాస్ షాపింగ్ జరగకుండా స్థానిక ఎస్సై రేఖ అశోక్ పటిష్ట భద్రత ను ఏర్పాటు చేశారు

పదో తరగతి పరీక్షల తొలిరోజే అధికారుల నిర్లక్ష్యం.

పదో తరగతి పరీక్షల తొలిరోజే అధికారుల నిర్లక్ష్యం.. మారిన పేపర్

జెడ్పీ బాయ్స్ హై స్కూల్ లో రెండు గంటలు ఆలస్యంగా పదో తరగతి పరీక్షలు

మంచిర్యాల,నేటి ధాత్రి:

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు శుక్రవారం మొదలయ్యాయి.పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే అధికారుల నిర్లక్ష్యం బయటపడింది.తెలుగు ప్రశ్న పత్రానికి బదులు హిందీ ప్రశ్నా పత్రం ఇవ్వడంతో పరీక్ష రెండు గంటలు ఆలస్యంగా మొదలైంది.ఒక సబ్జెక్ట్‌కు ప్రిపేర్ అయితే మరో సబ్జెక్ట్ పేపర్ రావడంతో విద్యార్థులు ఒకింత ఆందోళనకు గురయ్యారు.ఈ విషయాన్ని అక్కడి అధికారులకు తెలియజేయడంతో జరిగిన తప్పిదాన్ని గుర్తించారు. వెంటనే మరో పేపర్ తెప్పించి పరీక్ష రాయించారు.అయితే అప్పటికే రెండు గంటలు గడిచిపోయింది.మంచిర్యాల జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.జిల్లా కేంద్రంలోని జెడ్పీ బాయ్స్ హైస్కూల్ పరీక్ష కేంద్రంలో దాదాపు రెండు గంటలు ఆలస్యంగా పదో తరగతి పరీక్షలు మొదలయ్యాయి.ఉదయం విద్యార్థులంతా పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.పరీక్ష హాల్లో తమకు కేటాయించిన సీట్లలో కూర్చుకున్నారు. పరీక్షలు రాసేందుకు సిద్ధమయ్యారు.అక్కడి ఇన్విజిలేటర్లు ప్రశ్నాపత్రాన్ని విద్యార్థులకు ఇచ్చారు.అయితే ఆ ప్రశ్నాపత్రాన్ని చూసి విద్యార్థులంతా అవాక్కయ్యారు.ఏంటిది అంటూ ఒకింత భయాందోళనకు గురయ్యారు. ఒక ప్రశ్నాపత్రానికి బదులుగా మరో పేపర్‌ను అధికారులు పంపిణీ చేశారు. విద్యార్థులు దాన్ని గుర్తించి చెప్పడంతో అధికారులు హైరానా పడ్డారు. హడావుడిగా మరో పేపర్ తెప్పించడంతో దాదాపు రెండు గంటలు ఆలస్యంగా విద్యార్థులు పరీక్ష రాశారు.

డీఈవో పై కలెక్టర్ సీరియస్

అయితే ప్రశ్నాపత్రం తారుమారైన విషయం కలెక్టర్ దృష్టికి వెళ్లింది. దీంతో ప్రశ్నాపత్రాల విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం, పరీక్ష ఆలస్యంపై కలెక్టర్ సీరియస్ అయ్యారు.ఒక ప్రశ్నాపత్రం బదులు మరో పేపర్ రావడంతో వెంటనే విచారణ జరిపి నివేదిక అందించాల్సిందిగా డీఈవోకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.పదో తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాల విషయంలో అధికారుల నిర్లక్ష్యం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సిఎస్ఐ హై స్కూల్ పరీక్ష సామాగ్రి వితరణ.

సి. ఎస్. ఐ. హై స్కూల్ పరీక్ష సామాగ్రి వితరణ

గణపురం నేటి ధాత్రి:

 

గణపురం మండలం గాంధీనగర్ గ్రామంలో ని సి ఎస్ ఐ హై స్కూల్ చదువుతున్న పదోతరగతి పిల్లలకు పరీక్ష సామాగ్రీ అందజేసిన, మొగుళ్ళపల్లి పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ మారపెళ్లి ప్రభాకర్ ఈ కార్యక్రమం లో స్కూల్ ప్రిన్సిపల్ హన్నా జాన్, స్కూల్ సిబ్బంది శివాజీ, రత్న బాబు పాల్గొన్నారు, హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్ ను మొగుళ్ళపల్లి ఎస్ ఐ.బి. అశోక్  అభినందించారు

పదవ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం..

పదవ తరగతి వార్షిక పరీక్షలు ప్రారంభం…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

The annual exams for class 10th have begun…

10వ తరగతి వార్షిక పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయి. రామకృష్ణాపూర్ పట్టణం లో పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థుల కోసం పట్టణంలో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆల్ఫాన్సా పాఠశాల, తవక్కల్ పాఠశాల ల్లో 291 మంది విద్యార్థులు 10 పరీక్షలు రాస్తున్నారు. పదోతరగతి పరీక్ష కేంద్రాల వద్ద రామకృష్ణాపూర్ పట్టణ ఎస్ఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.

 

The annual exams for class 10th have begun…

పరీక్ష కేంద్రాల వద్ద ఆకతాయిలు అలజడి చేయకుండా పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పరీక్ష కేంద్రాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా, బెల్లంపల్లి ఏసిపి రవికుమార్, మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి ల ఆదేశాల మేరకు పరీక్ష కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ విదించడం జరిగిందని ఎస్ఐ పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలలో విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాసేందుకు అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని మండల విద్యాధికారి తెలిపారు. వేసవి కాలం కావడం తో పరీక్షా కేంద్రాల వద్ద మంచినీటి సౌకర్యం తో పాటు, వైద్య సిబ్బందిని సైతం నియమించడం జరిగిందన్నారు. ఏఎస్ఐ రజిత, పోలీస్ సిబ్బంది పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్తు చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version