ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య.

— ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య
• సామూహిక అక్షరాభ్యాసంలో పాల్గొన్న డీఈవో రాధా కిషన్

నిజాంపేట: నేటి ధాత్రి

 

 

 

 

ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య లభిస్తుందని జిల్లా విద్యాధికారి రాధా కిషన్ పేర్కొన్నారు. ఈ మేరకు మండలంలోని చల్మెడ గ్రామంలో శుక్రవారం సామూహిక అక్షరాభ్యాసంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ప్రైవేట్ పాఠశాల కంటే ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య లభిస్తుందని విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని కూడా ప్రభుత్వమే అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలలో కూడా ప్రోత్సాహం ప్రభుత్వ పాఠశాలలోనే లభిస్తుందని ఆయన కొనియాడారు. ప్రజా ప్రతినిధులు, ఉపాధ్యాయులతో కలిసి ప్రభుత్వ పాఠశాలకు విద్యార్థులు వచ్చే విధంగా చూడాలన్నారు. పాఠశాలలో విద్యా ప్రమాణాలను పెంచాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి సంఘాన్ని యాదగిరి, గ్రామ కార్యదర్శి వెంకట నరసింహారెడ్డి, ప్రధానోపాధ్యాయులు సతీష్ కుమార్, ఉపాధ్యాయులు నవీన్ రత్నాకర్, మోహన్, మమత, జ్యోతిలక్ష్మి ఉన్నారు.

15న వైదిక పాఠశాల ప్రవేశ పరీక్ష.

15న వైదిక పాఠశాల ప్రవేశ పరీక్ష

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండలంలోని బర్దీపూర్ శ్రీ దత్తగిరి మహారాజ్ వైదిక పాఠ ప్రవేశ పరీక్ష నిర్వహించను న్నట్లు పాఠశాల వ్యవసాపకులు సిద్దేశ్వరా నందగిరి మహా రాజ్ తెలియజేశారు. ఇప్పటికే ప్రవేశ పరీక్షకై దరఖాస్తులు స్వీక రించే ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఉమ్మడి రాష్ట్ర నుంచి 200 వరకు దరఖాస్తులు ఇంతవరకు తమకు అందాయన్నారు .దరఖాస్తులు స్వీకరించిన పిదప ఈనెల 15న విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వ హిస్తామన్నారు. ప్రవేశ పరీక్షల్లో అర్హత పొందిన విద్యార్థులకు ఆరు సంవత్సరాల పాటు వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చి వారిలో ఆధ్యాత్మికతను పెంపొందిస్తామని అన్నారు. ఆసక్తి గలవారు వెంటనే ప్రవేశ పరీక్షకై దరఖాస్తులు చేసుకో వాలని సిద్దేశ్వరానందగిరి మహారాజ్ సూచించారు.

విద్యార్థులకు దుస్తులు పుస్తకాల పంపిణీ.

విద్యార్థులకు దుస్తులు పుస్తకాల పంపిణీ.

కల్వకుర్తి నేటి ధాత్రి:

 

కల్వకుర్తి పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల, పాత మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర ఉన్న జి యు పి ఎస్ పాఠశాలలోని విద్యార్థులకు ప్రభుత్వం ద్వారా వచ్చిన నూతన పుస్తకాలు, దుస్తులను కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ అందజేశారు.ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ లు శానవాజ్ ఖాన్, గోరటి శ్రీనివాసులు,నాయకులు సాబేర్ పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

పిల్లల అనారోగ్యానికి కారణమవుతున్న పుస్తకాల బ్యాగు మోత.

పిల్లల అనారోగ్యానికి కారణమవుతున్న పుస్తకాల బ్యాగు మోత..

 ◆ చిన్నారుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం

◆ ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలు

◆ పుస్తకాల బరువు తగ్గించాలంటున్న వైద్యులు

◆ పట్టించుకోని విద్యా శాఖ అధికారులు

◆ నేలను చూస్తున్న పసి నడుములు

◆ బ్యాక్ పెయిన్ తో చిన్నారుల అవస్థలు

◆ వ్యాపారంగామారిన నోట్ పుస్తకాలు

◆ బాల్యంపై బరువు!

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

స్కూల్ పిల్లల బాల్యంపై బ్యాగుల భారం పడుతున్నది. అంత బరువును ఎలా మోస్తారో అని వారి వీపులకు బ్యాగులు చూసే తల్లిదండ్రులకు బాధేస్తున్నది. బరువైన స్కూల్ బ్యాగులతో బడులకు వెళ్లే విద్యార్థులను మనం చూస్తుంటాం. పాఠశాలల యాజమాన్యాలు అవసరం లేకపోయినా పుస్తకాలను కొనుగోలు చేయించి పిల్లల వీపునకు తగిలిస్తున్నాయి. పుస్తకాల బ్యాగు మోత.. పిల్లల అనారోగ్యానికి కారణమవుతున్నది. తద్వారా చిన్నారులు విద్యార్థి దశ నుంచే కండరాల బలహీనత, వెన్ను నొప్పి బారిన పడుతున్నారు. బడి నుంచి సాయంత్రం ఇంటికి వచ్చే సమయానికే నీరసపడిపోతున్నారు. ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్ల యాజమన్యాలు ఇష్టం వచ్చినట్లు పుస్తకాలను అంటగడుతున్నాయి.

ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు బ్యాగుల భారం తగ్గడంలేదు. గతంలో విద్యాశాఖ జీవో జారీ చేసినప్పటికీ ప్రైవేట్ పాఠశాలల్లో మాత్రం నిబంధనలు పాటించడం లేదు. ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలు విద్యార్థుల వయస్సుకు, తరగతులకు మించి పుస్తకాల భారం మోపుతున్నాయి. దీంతో పిల్లలపై మానసికంగా, శారీరకంగా తీవ్ర ప్రభావం పడుతున్నది. ఈ భారం తగ్గించేందుకు రాష్ట్రప్రభుత్వం ఆదేశాల మేరకు 2017 జూలై 19న విద్యాశాఖ జీవో నంబర్ 22 జారీ చేసింది. జీవోను పకడ్బందీగా అమలుచేయాలని ప్రభుత్వం విధివిధానాలను విడుదల చేసింది. జిల్లా విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. మండలాల పరిధుల్లో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఎంఈవోలతో అధికారులు సమావేశాలు నిర్వహించారు. కానీ ప్రైవేట్ పాఠశాలలు మాత్రం నిబంధనలను పాటించడం లేదు. విద్యను వ్యాపారంగా మారుస్తూ పాఠశాలల్లోనే విద్యార్థులకు అవసరానికి మించి పుస్తకాలను విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పలు విద్యార్థి సంఘాల నాయకులు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రాలు అందజేశారు. అయినప్పటికీ సంబంధిత శాఖల అధికారులు చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.

నిబంధనలు ఇవీ………

విద్యార్థుల బ్యాగు బరువుకు సంబంధించి గతేడాది విద్యాశాఖ పలు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నిబంధనలను ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నీ పాటించాలని ఆదేశించింది. 1, 2 తరగతులు చదివే విద్యార్థుల స్కూల్ బ్యాగుల బరువు 1.5 కిలోల లోపు, 3, 4, 5 తరగతులకు 2 నుంచి 3 కిలోల వరకు, 6, 7 తరగతులకు 4 కిలోల లోపు, 8, 9, 10 తరగతులకు 5 కిలోల లోపు ఉండాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. కానీ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు వివిధ రకాల మెటీరియల్స్, సిలబస్ల పేరుతో పిల్లల భుజాన మోయలేని భారం మోపుతున్నాయి. జిల్లాలో పలు స్కూళ్లు పలు అంతస్తుల్లో కొనసాగుతున్నాయి. విద్యార్థులు బ్యాగులు మోస్తూ పైఅంతస్తులకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో పిల్లల ఆరోగ్యంపైన భారం పడుతున్నది. పలు సమావేశాల్లో బ్యాగుల భారం తగ్గించాలని విద్యాశాఖ అధికారులకు విన్నవించినప్పటికీ పట్టించుకోవడం లేదని పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు.

లెక్కకు మించి బుక్స్…….

ప్రైవేట్ పాఠశాలల్లో రెగ్యులర్ సిలబస్తోపాటు అసైన్మెంట్, ప్రాజెక్టులు, స్లిప్ టెస్టులు, క్లాస్ వర్క్, హోం వర్కు, రఫ్ కాపీ, గైడ్, డైరీ, డ్రాయింగ్, క్రాఫ్ట్, ఆర్ట్, జనరల్ నాలెడ్జ్, కంప్యూటర్ బుక్ ఇలా విద్యార్థులకు ప్రతి సబ్జెక్ట్కు 6 నుంచి 7 నోటు బుక్స్లను కేటాయిస్తూ విద్యార్థులపై అధిక భారం మోపుతున్నారు. ప్రతి రోజూ ఆయా సబ్జెక్టులు చెప్పనప్పటికీ విద్యార్థులు ప్రతి రోజూ అన్ని పుస్తకాలను మోసుకెళ్తున్నారు. విద్యార్థుల బరువులో బ్యాగు బరువు 10 శాతం మించకూడదు. అంటే 30 కిలోల బరువు ఉన్న విద్యార్థికి 3 కిలోల బ్యాగు ఉండాలని. కానీ ఒకటో తరగతి చదివే విద్యార్థి శరీర బరువు 15 కేజీలు ఉంటే పుస్తకాల బరువు 1.5 కిలోలకు బదులుగా 5 కిలోలు ఉంటున్నది. ఇలా ఏ తరగతి విద్యార్థిలను తీసుకున్నా పరిమితికి మించి బ్యాగులు ఉంటున్నాయి. ప్రభుత్వ పాఠశాల్లో సబ్జెక్ట్ వారీగా పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్ ఉంటాయి. తమ స్కూల్లోనే పుస్తకాలను కొనుగోలు చేయాలని ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులకు సూచిస్తుండడంతో పుస్తకాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. అధిక బరువు ఉన్న బ్యాగులు మోయడం ద్వారా పిల్లల్లో ఎముకలు, కండరాల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడడంతో పాటు మెడ, భుజాలు, వెన్నునొప్పితో బాధపడుతున్నారు.

పిల్లల ఎదుగుదల పై ప్రభావం పడుతుంది……

విద్యార్థులు అధిక బరువులు మోయడం ద్వారా మానసికంగా, శారీరకంగా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది.ముఖ్యంగా మెడ, వీపు, నడుముపై తీవ్ర ప్రభావం పడుతుంది. చిన్నారుల శారీరక ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. నిబంధనలకు అనుగుణంగా బ్యాగులు ఉండేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి.

ఎక్కువ పుస్తకాలు అమ్మిన వారిపై చర్యలు తల్లిదండ్రులు………

ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు ఎక్కువ పుస్తకాలు విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. విద్యార్థులపై బ్యాగుల భారం వేయవద్దని గతంలోనే సూచనలు చేశాం. ఏ తరగతి విద్యార్థి బ్యాగు బరువు ఎంత ఉండాలో స్పష్టంగా సూచించాం. నిబంధనలు పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలన్నారు.

ఎస్ సి గురుకుల పాఠశాలనుమైదాన ప్రాంత నాయకులు తరలించుకు పోతున్నా పట్టించుకోని ఏజెన్సీ ప్రాంత కాంగ్రెస్ తెరాస నాయకులు అవసరమా డా జాడి రామరాజు నేత

ఎస్ సి గురుకుల పాఠశాలనుమైదాన ప్రాంత నాయకులు తరలించుకు పోతున్నా పట్టించుకోని ఏజెన్సీ ప్రాంత కాంగ్రెస్ తెరాస నాయకులు అవసరమా

డా జాడి రామరాజు నేత

ఏటూరునాగారం నేటి ధాత్రి

కన్నాయిగూడెం మండల కేంద్రం లోని బుట్టాయిగూడెం గ్రామంలో బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి డా జాడి రామరాజు నేత మాట్లాడుతూ ఏటూరు నాగారం లో ఉన్న సాంఘిక గురుకుల పాఠశాల ను మంగపేటకు మార్చిన తర్వాత మైదాన ప్రాంత నాయకులు ఏజెన్సీ ప్రాంత దళిత బహుజన వర్గాల విద్యార్థులకు విద్య అందకుండా చెయ్యడమే లక్ష్యాంగా నాటి జిల్లా పరిషత్ చైర్మన్ క్రీశే జగదీష్ మరియు నాటి ప్రతిపక్ష నాయకురాలు నేటి పంచాయితీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి మల్లంపల్లి కి తరలించుకు వెళ్లిన మాట్లాడాని కాంగ్రెస్ తెరాస నాయకులు ఈ ప్రాంత ప్రజలకు అవసరమా అన్నారు అదేవిదంగా పంచాయితీ రాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షమా శాఖమంత్రి ఏజెన్సీ ప్రాంతం లో ఉన్నా ఐటీడీఎ ను కూడా మైదాన ప్రాంతానికి తరలించుకొని పోవాలని చూస్తున్నా నాటి ఎమ్మెల్యే నేటి మంత్రి ఏజెన్సీ ప్రాంత ప్రజలకు అవసరమా అన్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి మైదాన ప్రాంత కాంగ్రెస్ నాయకురాలు నాటి ఎమ్మెల్యే నేటి పంచాయితీ రాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మహిళ శిశు సంక్షమా శాఖ మంత్రినాటి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే గా దళిత బంద్ నిరుపేదలకి అందకుండా నాడు అడ్డుకొని కాంగ్రెస్ నాయకులకు ఇచ్చింది నేడు ఆదివాసీ దళిత బహుజన మైనార్టీ వర్గాల ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు అందకుండా కాంగ్రెస్ నాయకులకే ఇస్తే జెండాలు మోసి జేజేలు కొట్టిన నిరుపేదలైన కాంగ్రెస్ కార్యకర్తలకైనా ఇల్లు ఇవ్వకపోవడం బాధాకరమణి అన్నారు ఇప్పటికైనా ఆదివాసీ దళిత బహుజనమైనార్టీ నాయకులారా మైదాన ప్రాంతనాయకురాలు పంచాయితీ రాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళ శిశు సంక్షమా శాఖమంత్రి మాటలు నమ్మి మోసపోకుండా ఈ మన ప్రాంత అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని విడాలని బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి డా జాడి రామరాజు నేత అన్నారు ఏటూరునాగారం కన్నాయిగూడెం తడ్వాయి మంగపేట కాంగ్రెస్ నాయకులు ఈ ప్రాంత అభివృద్ధి కోసం అలోచించి చుడండి మైదాన ప్రాంత నాయకురాలు ఏటూరు నాగారం లో ఉండవలసిన సాంఘిక సంక్షమా గురుకుల పాఠశాలను స్థానిక మండలమైన మల్లంపల్లికి తీసుకెళ్ళింది దేవాదుల లీప్ట్ ఇరిగేషన్ నుండి ములుగు మండల రైతులకు సాగు నీరు త్రాగునిరు

 

తీసుకెళ్లి ఏజెన్సీ ప్రాంతాన్ని ఎడారిగా చేసిన నాయకురాలు అవసరమా అదేవిదంగా 6 కోట్లతో కొండాయి దొడ్ల వాగుపై నిర్మించిన బ్రిడ్జి పిల్లర్ల దగ్గర ఇషిక తీసి బ్రిడ్జిని కులగొట్టి 8మంది మరణానికి కారణమైన కాంగ్రెస్ బి ఆర్ ఎస్ పార్టీలు అవసరమాఅన్నారు అదేవిదంగా మంగపేట మండలం లోని రాజుపేట గ్రామాన్ని మండలం చేస్తానానీ చెప్పి ఓట్లు వేసిన తర్వాత ఇచ్చిన మాట మర్చిపోయి మైదాన ప్రాంతమైన మల్లంపల్లి మండలం చేసుకున్నా నాయకురాలు ఆదివాసీ దళిత బహుజన వర్గాల ప్రజలకు అవసరమా 2011 మున్సిపాలిటీ చట్ట ప్రకారం ఏటూరు నాగారం గ్రామపంచాయితీ 20వేల 800వందల జనాభా కలిగి ఉన్నా ఏటూరు నాగారం గ్రామపంచాయితీ ని మున్సిపాలిటీని చేయకుండ 13వేల 600వందల జనాభా కలిగి ఉన్నా ములుగు ను మున్సిపాలిటీ ని ప్రకటించు కున్నా మంత్రి మనకు అవసరమా అన్నారు అదేవిదంగా ఏటూరునాగారం బస్సు డిపో గురించి గత 35సంత్సరాల నుండి ఏజెన్సీ ప్రాంత ప్రజలు కోరుకున్న చిరుకాల కళ నేరవేర్చకుండా ములుగు బస్సు డిపో ప్రకటించుకున్నా మంత్రి అవసరమా అన్నారు అదేవిదంగా రెవెన్యూ డివిజన్ ఇంపిల్మెంట్ కాకుండా అడ్డుకొని రాక్షసనందం పొందుతూ ఉన్నా పంచాయితీ రాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షమా శాఖమంత్రి మాటలు నమ్మి మోసపోవడంఏజెన్సీ ప్రాంత ప్రజలకు అవసరమా అన్నారు ఇప్పటికైనా ఆదివాసీ దళిత బహుజన మైనార్టీ వర్గాల ప్రజలు ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకుల అవినీతి అక్రమాలవలన వాళ్ళ కుటుంబాలు బంధువులు అభివృద్ధి అవుతున్నారు తప్ప నిరుపేదలకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్నా సంక్షమా పథకాలు అందకుండా చేస్తున్నా కాంగ్రెస్ పార్టీని భూస్థాపీతం చెయ్యడమే లక్ష్యాంగా ఆదివాసీ దళిత బహుజన మైనార్టీ వర్గాల ప్రజలు ఏకం కావలసిన అవసరం వచ్చిందని బీజేపీ దళిత మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి డా జాడి రామరాజు నేత అన్నారు

నాణ్యమైన విద్యా హామీ ఇస్తున్నాం

నాణ్యమైన విద్యా హామీ ఇస్తున్నాం

తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ

టిఆర్టిఎఫ్ బడిబాట ర్యాలీ

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ టిఆర్టిఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ర్యాలీని ఘనంగా నిర్వహించారు. టిఆర్టిఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బుర్ర కృష్ణ ప్రసాద్ గౌడ్ బోయన్న గారి నారాయణ ఆధ్వర్యంలో జరిగింది. ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్ ర్యాలీని ప్రారంభిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ పాఠశాలలో కంప్యూటర్ విద్య, ఏఐ ఆధారిత విద్య, డిజిటల్ విద్యను ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో అందిస్తుందని, మీ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపండి తరగతిగది సామర్ధ్యాన్ని విద్యా హామీగా మేము ఇస్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఉన్నారని, అనేక సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తున్నందున వాటిని ఉపయోగించుకోవాల ని ప్రజలకు పిలుపునిచ్చారు.

 

 

We guarantee quality education.

ఒత్తిడి లేని విద్య, పౌష్టికాహారం ప్రభుత్వ పాఠశాలలతోనే సాకారం అని పేర్కొన్నారు.

 

 

 

తెలంగాణ రాష్ట్ర టీచర్ల పక్షాన రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను చైతన్య పరచడం ద్వారా, ప్రభుత్వ విద్యను వారికి అందుబాటులో తెచ్చేందుకు, ప్రభుత్వ బడులను బలోపేతం చేసేందుకు, ప్రభుత్వ బడులను సమాజానికి దగ్గర చేసేందుకు, పాఠశాలల్లోని వివిధ కార్యక్రమాల్లో సమాజాన్ని అనుసంధానం చేయడం, తదితర అంశాలుగా ఈ బడిబాట విద్య ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.బైక్ ర్యాలీ జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ నుండి బయలుదేరి న్యూ బస్టాండ్ తెలంగాణ తల్లి విగ్రహం నుండి గాంధీ చౌరస్తా వరకు సాగింది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షులు కటకం రమేష్, రాష్ట్ర మెంబర్షిప్ కన్వీనర్ సుంకిశీల ప్రభాకర్ రావు, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ , రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు బుర్ర కృష్ణ ప్రసాద్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి బోయన్నగారి నారాయణ, ప్రధానోపాధ్యాయుల సంఘ అధ్యక్షులు మోతిలాల్, టిఆర్టిఎఫ్ నాయకులు పోతుగంటి రమేష్, మహేషుని లక్ష్మీనారాయణ , గోలీ రాధాకిషన్, ముత్తయ్య గారి నాగరాజు, జిల్లెల్ల శ్రీనివాస్ గౌడ్, ఇప్పకాయల ప్రకాష్, రాజశేఖర్, దేవేందర్, పప్పుల శ్రీనివాస్ సామల రాములు, కుమారస్వామి, పులి ప్రవీణ్ కుమార్, కోల వినయ్ కుమార్, ప్రధానోపాధ్యాయులు బాలఎల్లయ్య, కొమురయ్య, సుల్తాన్ రాజు, బూట్ల శ్రీనివాస్, శ్రీనివాస్ రావు, మామిడాల రమేష్, తదితరులు పాల్గొన్నారు.

జహీరాబాద్ మండల విద్యాధికారిగా బస్వరాజు నియామకం

జహీరాబాద్ మండల విద్యాధికారిగా బస్వరాజు నియామకం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

జహీరాబాద్ మండల విద్యాధికారిగా బస్వరాజును నియమిస్తూ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఎంఈఓగా పనిచేసిన బస్వరాజు పదవీ విరమణ పొందారు. ఆయన స్థానంలో మండలంలోని సత్వార్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ హెచ్ఎంగా పని చేస్తున్న బస్వరాజును ఎంఈఓగా నియమించినట్లు పేర్కొన్నారు. 

జాతీయ విద్యా దినోత్సవాన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా జరపాల్సిన రోజుగా గుర్తించాలి!

జాతీయ విద్యా దినోత్సవాన్ని పాఠశాలల్లో తప్పనిసరిగా జరపాల్సిన రోజుగా గుర్తించాలి!

◆ అకడమిక్ క్యాలెండర్‌లో వెంటనే చర్చించాలి.

◆ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించాలి.

◆ ఏఐఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు షైక్ రబ్బానీ డిమాండ్.

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల ఏఐఎంఐఎం పార్టీ అధ్యక్షులు షైక్ రబ్బానీ మాట్లాడుతు నవంబర్ 11న మన దేశ తొలి కేంద్ర విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ గారి జయంతిని పురస్కరించుకొని, భారత ప్రభుత్వం 2008 నుండే జాతీయ విద్యా దినోత్సవంగా అధికారికంగా ప్రకటించింది. విద్యా రంగాన్ని ఆధునికీకరించడంలో, ఐఐటీల స్థాపనలో, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వంటి ప్రముఖ సంస్థల ఏర్పాటులో ఆయన అపారమైన కృషి చేశారు. ఆయన సేవలను స్మరించుకుంటూ, విద్యకు ప్రాధాన్యతనిస్తూ ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాం.

ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశాలు:

విద్య ప్రాముఖ్యతను విద్యార్థులకు తెలియజేయడం

సమాన విద్యావకాశాలపై చర్చ జరగడం

విద్యా రంగ పురోగతిపై చైతన్యం కలిగించడం

ప్రతి సంవత్సరం ఈ రోజున పాఠశాలలు, కళాశాలలల్లో:

వ్యాసరచన పోటీలు

చర్చా వేదికలు, సదస్సులు

విద్య ప్రదర్శనలు

విద్యా అభివృద్ధిపై చర్చలు

వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాయి.
అలాంటి ముఖ్యమైన, విద్యావ్యవస్థకు మూలస్తంభంగా నిలిచే రోజు 2025–26 విద్యాసంవత్సరానికి సంబంధించి తెలంగాణ విద్యాశాఖ జారీ చేసిన అకడమిక్ క్యాలెండర్‌లో ప్రస్తావించకపోవడం ఆశ్చర్యకరం, బాధాకరం కూడా.విద్యార్థుల ఎదుగుదలలో అలాంటి స్ఫూర్తిదాయకమైన దినోత్సవాలను ప్రోత్సహించాలి గానీ విస్మరించకూడదు.అందుకే, జాతీయ విద్యా దినోత్సవాన్ని నవంబర్ 11 తేదీకి తగిన ప్రాధాన్యంతో తిరిగి అకడమిక్ క్యాలెండర్‌లో చేర్చాలి అనే డిమాండ్‌ను విద్యాభిమానులందరం గళమెత్తి కోరుతున్నామన్నారు.75 ఏళ్లుగా దేశాన్ని తప్పుదోవ పట్టించడంతో తృప్తి చెందనట్లుగా, జాతీయవాద పార్టీలు అని పిలవబడే పార్టీలు మరియు వారి అనుయాయులు స్వతంత్ర భారతదేశపు మొదటి విద్యా మంత్రి అబ్దుల్ కలాం ఆజాద్ వంటి వారికి ఈరోజు కూడ జేజేలు పలుకుతున్నారు. నిస్సందేహంగా “అతను జన్మతః భారతీయుడు కాదు. అతను ఏ పాఠశాలకు వెళ్లలేదు! ‘హిందూ ముస్లిం ఐక్యత’ యొక్క చిహ్నాలలో ఒకరైన, గాంధీతో సమానంగా కీర్తించబడిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్వాతంత్య్రం తర్వాత దేశానికి మొదటి విద్యా మంత్రి అయ్యాడు.భారతదేశంలో విద్యకు పునాదులు వేసిన మహనీయుడు, దృఢమైన జాతీయవాది, గంగా జమునీ తహజీబ్ యొక్క ప్రతీకగా నివాళులర్పించుకున్నాడు. ఇది ఎంతవరకు సమర్థనీయం?…అందు గురించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి
అకడమిక్ క్యాలెండర్‌లో వెంటనే చేర్చాలని
ఏఐఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు షైక్ రబ్బానీ
డిమాండ్ చేశారు.

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి.

గీతాంజలి కేంబ్రిడ్జి పబ్లిక్ స్కూల్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు

భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో నూతన విద్యా శిఖరం.

భద్రాద్రి కొత్తగూడెం/హైదారాబాద్,నేటిధాత్రి:*

నేటి ఆధునిక యుగంలో విద్యార్థులకు విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావు సూచించారు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో మంగళవారం గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ ఆధ్వర్యంలో గీతాంజలి పబ్లిక్ స్కూల్ అత్యాధునిక హంగులతో, కేం బ్రిడ్జి సిలబస్ తో కూడిన పాఠశాలను ఏర్పాటు చేయగ సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు.

 

Provide quality education to students

అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో ఇంటర్నేషనల్ (ఐజిసిఎస్ఈ), కేం బ్రిడ్జ్ సెలబస్ తో ప్రారంభించడం భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతం ప్రజలు చేసుకున్న పుణ్యమని అన్నారు.ఇంత మంచి ఇంటర్నేషనల్ హంగులతో కూడినటువంటి పాఠశాలను ప్రారంభించిన గీతాంజలి స్కూల్ ఆఫ్ చైర్మన్, డైరెక్టర్స్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.గీతాంజలి పబ్లిక్ స్కూల్ ప్రారంభంతో భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో నాణ్యతతో కూడిన విద్యా సౌకర్యాలు ఈ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాల్సిన అవసరం లేకుండా నాణ్యతతో కూడిన విద్య తమకందుబాటులో ఉండడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టమని పేర్కొన్నారు.సిపిఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి షబ్బీర్ పాషా మాట్లాడుతూ సకలహంగులతో కూడిన ఇంటర్నేషనల్ స్కూల్ భద్రాద్రి కొత్తగూడెం రావడం ఇదే మొదటిది అని ఏసీ గదులు, ఏసి బస్సులతో, డిజిటల్ బోర్డులతోఇంత మంచి స్కూల్ రావడానికి సహకరించిన సిపిఐ ఎమ్మెల్యే కునంనేని సాంబశివరావు చొరవతో నాణ్యతతో కూడిన విద్య విద్యార్థులకు అందుతుందని ఇంత మంచి ఆలోచన చేసిన గీతాంజలి గ్రూప్ ఆఫ్ చైర్మన్స్ వేములపల్లి సుబ్బారావు , డైరెక్టర్స్, ప్రిన్సిపాల్ కు కృతజ్ఞతలు తెలిపారు. గీతాంజలి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ వేములపల్లి సుబ్బారావు మాట్లాడుతూ నేటి సమాజంలో విద్యా వ్యాపారంగా కొనసాగుతుందని విద్యను వ్యాపారం చేయకుండా విద్యను ఒక సేవ దృక్పథంతో భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలో విద్యార్థులకు నాణ్యతతో కూడిన విద్యను అందించాలనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్, కేంమ్ బ్రిడ్జి సిలబస్ తో గీతాంజలి పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని పాఠశాలలోని సౌకర్యాలను చూసి ఎంతో సంతోషపడ్డారు. ఈ కార్యక్రమంలో స్దానిక సిపిఐ నాయకులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

పండగ వాతావరణంలో పాఠశాలల పునః ప్రారంభం

పండగ వాతావరణంలో పాఠశాలల పునః ప్రారంభం చేయాలి

మండల పరిషత్ అబివృద్ది అధికారి పెద్ది ఆంజనేయులు

పరకాల నేటిధాత్రి

 

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జూన్ 12న పాఠశాలల పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు,విద్యార్థుల తల్లిదండ్రులు,పంచాయతీ కార్యదర్శులు సమన్వయం చేసుకుని పాఠశాలను అందంగా తీర్చిదిద్ది పండుగ వాతావరణంలో పునః ప్రారంభం చేయాలని ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు అన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో ప్రదానోపాద్యాయులు,గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శి,అంగన్వాడీ టీచర్ ఆశా,పేరెంట్స్ కమిటీ సభ్యులు,విఓ,లైన్ మెన్ లతో సమన్వయం చేసుకుని అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని,ప్రధానోపాధ్యాయులు మద్యాహ్న బోజనానికి సంబంధించి బియ్యం ఇతర దినుసులు సరిగా ఉండేలా చూడాలని సూచించారు.అలాగే స్కూల్ యూనిఫాం నోట్ బుక్స్ పంపిణీ కొరకు సిద్ధంగా ఉంచుకోవాలని మరుగుదొడ్లు మరియు నీటి సరఫరా ఎలక్ట్రిసిటీ మొత్తం సరిగా ఉండేలా చూడాలని ఆదేశించారు.

పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలు.

పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలు.

ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొడ్డు స్మరణ కుమ్మరి రాజ్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి :

భూపాలపల్లి:: భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు ఫీజుల దోపిడీ ని అరికట్టాలని అధిక ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలల గుర్తింపు రద్దు చేయాలని అనుమతులు లేని పాఠశాలలను విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారికి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది అనంతరం ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బొడ్డు స్మరణ కుమ్మరి రాజు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల పర్మిషన్ రద్దు చేయాలని అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ స్కూళ్లలో పేద వారి దగ్గర నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూల్స్ పై వెంటనే విచారణ జరిపి స్కూల్ పర్మిషన్ రద్దు చేయాలని దాంతోపాటు అనుమతులు లేని పాఠశాలలకు వెంటనే మూసివేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా విద్యా సంవత్సరం మొదలు కాకముందే ప్రైవేట్ స్కూల్స్ యజమాన్యం గ్రామీణ స్థాయి వరకు వెళ్లి అడ్మిషన్స్ చేస్తున్నారు తక్షణమే వారి పైన చర్యలు తీసుకోవాలి దాంతోపాటు స్కూల్స్ ఓపెన్ కాకముందే లక్షల లక్షల బుక్స్ బినామీన పేర్లతో రూమ్స్ ఏర్పాటు చేసి పుస్తకాలు అమ్ముతున్నారు.. తక్షణమే ఈ సమస్యలన్నింటిని దృష్టిలో ఉంచుకొని జిల్లా విద్యాశాఖ అధికారి వెంటనే స్పందించాలని ఈ సందర్భంగా వారిని కలిసి కోరడం జరిగింది లేనియెడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పోరాటాలకు సిద్ధమవుతామని ఈ సందర్భంగా వారు అన్నారు

ఫిట్నెస్ లేని ప్రైవేట్ స్కూల్ బస్సులను సీజ్ చేయాలి.

ఫిట్నెస్ లేని ప్రైవేట్ స్కూల్ బస్సులను సీజ్ చేయాలి

ఆర్ టి ఓ కు ఫిర్యాదు

వనపర్తి నేటిధాత్రి :

 

 

 

విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఫిట్నెస్ లేని ప్రైవేటు స్కూలు బస్ లను సిజ్ చేయాలని విద్యార్థుల యువజన సంఘాల అధ్యర్య ములో ఆర్ టి ఓ కు ఫిర్యాదు చేశారు
ఈ సందర్భంగా విద్యార్థుల సంఘాల నాయకులు రాఘవేంద్ర వెంకటే ష్ కుతుబ్ లు మాట్లాడుతూ
వనపర్తి పట్టణ ము జిల్లాలోని వివిధ మండల కేంద్రంలో ప్రైవేటు స్కూలలో పిట్నెస్ లేని బస్సులను లైసెన్స్ లేని డైవర్స్ ను తొలగించాలని విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశామని చెప్పారు
పిల్లలు భవిష్యత్ లో బాగా చదవాలని తమ విద్యార్థులను ప్రైవేటు స్కూల్ లో వేలకు వేలు డబ్బులు డొనేషన్ చేసి చదివిస్తూ ఉంటే అక్కడ ఉన్న స్కూల్ యాజమాన్యం వాళ్ళు లైసెన్స్ డ్రైవర్స్ కొనసాగిస్తూ వచ్చేరాని డ్రైవింగ్ చేస్తూ విద్యార్థుల మరణ ము కు కారణం అవుతున్నారని తెలిపారు

బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులుగా పూరెల్ల నితీష్…

జాతీయ బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులుగా పూరెల్ల నితీష్…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

 

జాతీయ బీసీ విద్యార్థి సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులుగా రామకృష్ణాపూర్ పట్టణానికి చెందిన పూరెల్ల నితీష్ నియమితులయ్యారు. ఈ మేరకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు చంద్రమోహన్ గౌడ్ నియామక పత్రం అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నితీష్ మాట్లాడారు. విద్యారంగ సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తానని, విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తానని, బీసీ విద్యార్థుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తానని అన్నారు. జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్, విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు విక్రమ్ గౌడ్, బీసీ సంక్షేమ రాష్ట్ర ఉపాధ్యక్షులు నీలకంఠేశ్వర్, గౌరవ అధ్యక్షులు రాపోలు విష్ణువర్ధన్, జిల్లా అధ్యక్షులు చంద్రమోహన్ లకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య.

ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య

నడికూడ,నేటిధాత్రి:

 

 

 

మండలంలోని చౌటుపర్తి గ్రామపంచాయతీ ఆవరణలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా బడిబాట గ్రామసభను మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోడెం రాజేందర్ బాబు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నడికూడ మండల విద్యాశాఖ అధికారి కె.హనుమంతరావు మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తారు. అయితే దానికోసం మన ఊరిలో మనకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో ఉచిత విద్యను అందిస్తూ కార్పోరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో ఐ ఎఫ్ పి టివి ప్యానెల్ ద్వారా డిజిటల్ విద్యాబోధన చౌటుపర్తి ప్రాథమికోన్నత పాఠశాలలో జరుగుతుంది‌. నిరంతర సమగ్ర మూల్యాంకనం,కృత్యాధార, అనుభవజ్ఞులైన అంకితభావంతో పనిచేసే ఉపాధ్యాయులచే విద్య బోధన జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్,పాఠ్య పుస్తకాలు,వర్క్ బుక్కులు ఉచితంగా అందిస్తున్నారు, ప్రతిరోజు రుచికరమైన పౌష్టికాహారం మధ్యాహ్న‌ భోజనం,వారానికి మూడు గుడ్లు,మూడు రోజులు రాగి జావా,ప్రతినెల తల్లిదండ్రుల ఉపాధ్యాయ సమావేశం నిర్వహించి విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులకు వివరించడం జరుగుతుంది. కావున విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య లభిస్తున్నందున గ్రామంలోని విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించి,ప్రభుత్వ బడి అభివృద్ధి చెందేటట్లుగా గ్రామంలోని ప్రజాప్రతినిధులు మహిళా సంఘాలు, యువజన సంఘాలు,పూర్వ విద్యార్థులు గ్రామంలోని పెద్దలు అందరూ కలిసి పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచి ప్రభుత్వ బడులను కాపాడుకోవాలని తెలిపారు.
ఈ సమావేశంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ శ్రీమతి గూడెం రమ్య విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజాప్రతినిధులు,మహిళా స్వయం సహాయక సంఘాలు,అంగన్వాడీ టీచర్లు,పాఠశాల ఉపాధ్యాయులు,యువజన సంఘాల నాయకులు,పూర్వ విద్యార్థులు సమావేశంలో పాల్గొన్నారు.

ఖమ్మంపల్లి లో బడి బాట కార్యక్రమం.

ఖమ్మంపల్లి లో బడి బాట కార్యక్రమం

ముత్తారం :- నేటి ధాత్రి

 

 

ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామం లో ప్రభుత్వ పాఠశాల లో తమ పిల్లలను చేర్పించాలని ప్రభుత్వ ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్స్ బడి బాట కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్బంగా ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి. మల్లయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల లో కల్పిస్తున్న వసతుల గురించి విద్య బోధన గురించి వివరించారు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ పేద విద్యార్థులకు విద్య ను అందిస్తున్నదని ప్రభుత్వ పాఠశాల లో తమ పిల్లలను చేర్పించాలని కోరారు ఈ కార్యక్రమం లో టీచర్స్ డి. మమత కే. పద్మ సి ఎచ్. సునీల్ నరేష్
అంగన్వాడీ టీచర్స్ బి. రమ జి. తిరుపతమ్మ ఎస్. రమాదేవి ఏ. తిరుమల ఆశ వర్కర్ సరిత లు పాల్గొన్నారు

విద్యావ్యవస్థకు తూట్లు కార్పొరేట్లకు కోట్లు…

విద్యావ్యవస్థకు తూట్లు కార్పొరేట్లకు కోట్లు…

మహబూబాబాద్ జిల్లాలో జోరుగా సాగుతున్న ప్రైవేట్ విద్యా వ్యాపారం…

పట్టించుకోని విద్యాశాఖ అధికారులు…

సర్కారు మారిన విద్యావ్యవస్థలో కనిపించని మార్పు…

ఆదేశాలకే పరిమితమైన విద్యాశాఖ…

ప్రభుత్వ విద్య వ్యవస్థపై సవితి తల్లి ప్రేమ చూపిస్తున్న విద్యాశాఖధికారులు…

ప్రైవేటు కార్పొరేటు విద్యా వ్యవస్థకు వత్తాసు పలుకుతున్న అధికారులు…

నేటి ధాత్రి -గార్ల :-

 

 

 

 

మహబూబాబాద్ జిల్లాలో చుట్టుపక్క‌ మండలంలో విద్యా వ్యాపారం జోరుగా సాగుతున్న పట్టించుకోని విద్యాశాఖ అధికారులు.

పేద మధ్య తరగతి కుటుంబాల విద్యార్థిని, విద్యార్థులకు ప్రైవేటు విద్యా సంస్థలు ఆశలు చూపించి జాయిన్ చేస్తూ కోట్లకు కోట్లు గడ్డిస్తున్నారు.

అధిక ఫీజులతో విద్యా వ్యాపారాని కొనసాగిస్తూ విద్యార్థులను అధిక ఫీజులతో మనోవేదనకు గురి చేస్తున్నారు.

ప్రైవేటు విద్యాసంస్థలు వారి సంస్థల్లో జాయిన్ అయ్యే ముందు డిజిటల్ లో సినిమా చూపించి వారి విద్యాసంస్థ పేద, మధ్య తరగతి కుటుంబాల వారికి అనుకూలంగా ఫీజులు ఉంటాయని నమ్మబలికారు,
తీరా అడ్మిషన్ ఇచ్చిన తరువాత ఎగ్జామ్ ఫీజులని, యూనిఫామ్ ఫీజులని, పాఠ్యపుస్తకాల ఫీజులని, అడ్మిషన్ ఫీజులని వీళ్లకు వేలు దొడ్డిదారిన దోచుకుంటున్నారు‌.

కళాశాలలో చదువుకునే విద్యార్థులకు స్కాలర్షిప్ ద్వారా ఉచిత విద్యను అందిస్తామని స్కాలర్షిప్ తోనే చదవచ్చని ఆశలు పెట్టి,తీరా అడ్మిషన్ ఇచ్చిన తరువాత ఎగ్జామ్ ఫీజులని, యూనిఫామ్ ఫీజులని, మెటీరియల్ ఫీజులని, అడ్మిషన్ ఫీజులని వీళ్లకు వేలకు వేలు దొడ్డిదారిన దోచుకోవటం పరిపాటిగా మారింది.

చిన్నచిన్న గదుల్లో విద్య బోధన చేయటం మరియు కనీస విద్యార్హత లేకుండా ఉన్నవారికి ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయులుగా పెట్టుకొని నడిపిస్తున్నారు.

విద్యార్థులు జాయిన్ అయిన తరువాత అనేక పేర్ల మీద డబ్బులు గుంజటం వారికి వెన్నతో పెట్టిన విద్యగా మారింది.

తల్లిదండ్రులను జలగల్లా పీకుతూ సర్టిఫికెట్లు ఇవ్వమని మనోవేదనకు గురి చేస్తున్నారు.

చేరే ముందు నమ్మించి చేర్పించుకున్నారని నమ్మి జాయిన్ అయితే అనేక పేర్ల మీద డబ్బులు గుంజినట్టేట ముంచారని తల్లిదండ్రులు గోడు వెళ్ళబోస్తున్నారు.

 

సరైన వసతులు లేకపోయినా ఉన్నట్లు అనుమతి పొంది అధికారులను మంచిగా చేసుకుని వారికి ఇచ్చే మామూళ్లను వాళ్లకు ఇస్తూ స్కూళ్లను నడిపిస్తున్నారు.

అధికారులను నిలదీసిన వాళ్లకు అధికారులు మీరు ఎందుకు జైన్ అయ్యారు.

ప్రైవేట్ సంస్థలు అంటే ఇలాగే ఉంటాయి మీకు ఇష్టమైతే ఉండండి కష్టమైతే మానేయండి అని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైనం కనిపిస్తుంది.

 

Education Officials.

 

 

అంతేగాని విద్యార్థులను రాసిరంపాన పెడుతున్న విద్యా సంస్థలపై ఏ రకమైన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

ఇంత నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్న అధికారులు ఉంటే పేద మధ్య తరగతి కుటుంబాలు విద్యార్థిని విద్యార్థులు ఎలా చదువులు ముందుకు వెళ్తాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ముగాస్తున్న విద్యాశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాడ్ లు వినిపిస్తున్నాయి.

ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ముగాస్తున్న విద్యాశాఖ అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.

ప్రభుత్వ బడిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడి కూతురు.

ప్రభుత్వ బడిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడి కూతురు

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

 

మందమర్రిలో నివాసం ఉంటున్న గంగాపూర్ పాఠశాల ఉపాధ్యాయుడు రత్నం సంజీవ్, కరుణ ల కూతురు రత్నం ఉజ్వలిత ను మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల – ఫిల్టర్ బెడ్ లో ఐదవ తరగతిలో చేర్పించారు.ఫిల్టర్ బెడ్ పాఠశాల ఉపాధ్యాయులపై నమ్మకంతో తన కూతుర్ని అడ్మిషన్ చేసినందుకు గాను ఉపాధ్యాయులు రత్నం సంజీవ్ ను అభినందించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు సంజీవ్ బాటలోనే ప్రభుత్వ ఉపాధ్యాయులు సైతం తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోని చేర్పించేలా చొరవ తీసుకోవాలని ఫిల్టర్ పాఠశాల ఉపాధ్యాయులు కోరుతున్నారు.ఉజ్వలకు ఫిల్టర్ బెడ్ ప్రదానోద్యాయులు శ్రీనివాసాచారి, ఉపాద్యాయులు ఉమాదేవి, భీంపుత్ర శ్రీనివాస్, లలిత, రవి , ఏఏపిసి చైర్మన్ అంజలి లు సాదర స్వాగతం పలికారు..

ఉచిత విద్యను సద్వినియోగం చేసుకోండి.

“ఉచిత విద్యను సద్వినియోగం చేసుకోండి”

బాలానగర్ /నేటి ధాత్రి

 

 

 

 

బాలానగర్ మండలంలోని అమ్మపల్లి, అప్పాజీపల్లి, బోడగుట్ట తండా, గౌతాపూర్ గ్రామాలలో సోమవారం ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉంటారని.. ప్రైవేటు పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ఉంటుందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యను ప్రతి నిరుపేద విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఖమ్మంపల్లి లో బడి బాట కార్యక్రమం.

ఖమ్మంపల్లి లో బడి బాట కార్యక్రమం

ముత్తారం :- నేటి ధాత్రి

 

 

 

ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామం లో ప్రభుత్వ పాఠశాల లో తమ పిల్లలను చేర్పించాలని ప్రభుత్వ ఉపాధ్యాయులు అంగన్వాడీ టీచర్స్ బడి బాట కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్బంగా ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి. మల్లయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల లో కల్పిస్తున్న వసతుల గురించి విద్య బోధన గురించి వివరించారు అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తూ పేద విద్యార్థులకు విద్య ను అందిస్తున్నదని ప్రభుత్వ పాఠశాల లో తమ పిల్లలను చేర్పించాలని కోరారు ఈ కార్యక్రమం లో టీచర్స్ డి. మమత కే. పద్మ సి ఎచ్. సునీల్ నరేష్
అంగన్వాడీ టీచర్స్ బి. రమ జి. తిరుపతమ్మ ఎస్. రమాదేవి ఏ. తిరుమల ఆశ వర్కర్ సరిత లు పాల్గొన్నారు

పైసా ఖర్చు లేని ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య.

పైసా ఖర్చు లేని ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య

మండల విద్యాధికారి కాలేరు యాదగిరి

2025 పదవ తరగతి ఫలితాలలో ఉత్తమ ప్రతిభ చూపిన పెనుగొండ ఉన్నత పాఠశాల విద్యార్థికి సన్మానం:

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

కేసముద్రం మండలంలోని ప్రభుత్వ పాఠశాల అయినటువంటి పెనుగొండ ఉన్నత పాఠశాలలో చదివి 549 మార్కులు సాధించి, ఉత్తమ ప్రతిభ కనబర్చిన మండల యశ్వంత్ సాయిని మరియు అతని తల్లిదండ్రులను పాఠశాల ఉపాధ్యాయ బృందం ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు కేసముద్రం మండల విద్యాధికారి కాలేరు యాదగిరి మాట్లాడుతూ గూడూరు మండలంలోని అప్పరాజుపల్లి గ్రామానికి చెందిన మండల శ్రీను, సరస్వతి దంపతుల కుమారుడు యశ్వంత్ సాయి చిన్నప్పటి నుండి చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపేవాడని, ప్రభుత్వ పాఠశాలల్లో పేద బలహీన బడుగు వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందుతుందని తెలియజేయుటకు ఈ విద్యార్థి సాధించిన మార్కులే నిదర్శనమని తెలియజేశారు. అదేవిధంగా తల్లిదండ్రులందరూ ఆలోచించి పైసా ఖర్చు లేని ప్రభుత్వ పాఠశాలలో చదివించి మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేయాలని అందుకు మా ప్రభుత్వ పాఠశాలలు ముందు ఉంటాయని తెలియజేశారు. జడ్పిహెచ్ఎస్ పెనుగొండ పాఠశాలలో అంకిత భావంతో పనిచేసే ఉపాధ్యాయ బృందం నాణ్యమైన విద్యను అందిస్తున్నారని తెలియజేశారు. గ్రామ ప్రజలు మాట్లాడుతూ పెనుగొండ పాఠశాలలో అత్యుత్తమమైన విద్యా బోధన మా పిల్లలకు అందుతుందని మా పిల్లల్ని తల్లిదండ్రుల వలె ఉపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షణలో చదువు నేర్పుతున్నారని చెప్పారు. ఈ సన్మాన సమావేశంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం అంజయ్య, హుస్సేన్, వెంకటగిరి, భాస్కర్, సత్యం, రవి, భీముడు, కిషన్, మల్లేశం, విజయ్ చందర్ మరియు అప్పరాజుపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు గ్రామ పెద్దలు పూర్వ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని సన్మాన సభను విజయవంతం చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version