పండగ వాతావరణంలో పాఠశాలల పునః ప్రారంభం

పండగ వాతావరణంలో పాఠశాలల పునః ప్రారంభం చేయాలి

మండల పరిషత్ అబివృద్ది అధికారి పెద్ది ఆంజనేయులు

పరకాల నేటిధాత్రి

 

జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జూన్ 12న పాఠశాలల పునః ప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు,విద్యార్థుల తల్లిదండ్రులు,పంచాయతీ కార్యదర్శులు సమన్వయం చేసుకుని పాఠశాలను అందంగా తీర్చిదిద్ది పండుగ వాతావరణంలో పునః ప్రారంభం చేయాలని ఎంపిడిఓ పెద్ది ఆంజనేయులు అన్నారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రతి పాఠశాలలో ప్రదానోపాద్యాయులు,గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శి,అంగన్వాడీ టీచర్ ఆశా,పేరెంట్స్ కమిటీ సభ్యులు,విఓ,లైన్ మెన్ లతో సమన్వయం చేసుకుని అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని,ప్రధానోపాధ్యాయులు మద్యాహ్న బోజనానికి సంబంధించి బియ్యం ఇతర దినుసులు సరిగా ఉండేలా చూడాలని సూచించారు.అలాగే స్కూల్ యూనిఫాం నోట్ బుక్స్ పంపిణీ కొరకు సిద్ధంగా ఉంచుకోవాలని మరుగుదొడ్లు మరియు నీటి సరఫరా ఎలక్ట్రిసిటీ మొత్తం సరిగా ఉండేలా చూడాలని ఆదేశించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version