కౌండిన్య కళ్యాణ మండపమే లక్ష్యంగా గౌడ.

కౌండిన్య కళ్యాణ మండపమే లక్ష్యంగా గౌడ వెల్ఫేర్ సొసైటి.

గౌడ వెల్ఫేర్ సొసైటి అధ్యక్షుడు గండి లింగయ్య.

ఘనంగా 3 వ వార్షిక మహాసభ విజయవంతం

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

నర్సంపేట డివిజన్ పరిధిలో కౌండిన్య కళ్యాణ మండపం లక్ష్యంగా గౌడ వెల్ఫేర్ సొసైటి అడుగులు వేసిందని గౌడ వెల్ఫేర్ సొసైటి అధ్యక్షుడు గండి లింగయ్య అన్నారు.గౌడ సంక్షేమ సంస్థ 3 వ వార్షిక మహాసభ అధ్యక్షుడు గండి లింగయ్య గౌడ్ అధ్యక్షతన పట్టణంలోని సిటిజన్ క్లబ్ లో జరిగింది.500 మంది సభ్యులతో సంస్థ కొనసాగుతున్నదని పేర్కొంటూ ఈ నేపథ్యంలో వార్షిక నివేదికను అధ్యక్షుడు ప్రవేశపెట్టి సంస్థ స్థితిగతులు పట్ల వివరించారు. నర్సంపేట డివిజన్ పరిధిలో గల గౌడ వెల్ఫేర్ సంస్థ గత మూడు సంవత్సరాలుగా వివిధ రూపాల్లో అభివృద్ధి చెందుతున్నదని ఆయన పేర్కొన్నారు.అలాగే భవిష్యత్తు కార్యాచరణ పట్ల సభ్యులకు వివరించారు.ఇప్పటి వరకు నర్సంపేట డివిజన్ పరిధిలో గౌడ కులస్తుల ఫంక్షన్ హాల్ ఎదన్నారు. నమ్మకంతో,సమాజ సేవతో ముందుకుపోతున్న గౌడ వెల్ఫేర్ సొసైటిలో ఎలాంటి అపోహలు ఉండవని తేల్చిచెప్పారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గండి నర్సయ్య గౌడ్, బూర అశోక్ గౌడ్, ప్రధాన కార్యదర్శి మాచర్ల ఐలుమల్లు గౌడ్, సహాయ కార్యదర్శి ఊడుగుల శ్రీనివాస్ గౌడ్, ఆర్ధిక కార్యదర్శి గండి రాము గౌడ్, రామగిరి సుధాకర్ గౌడ్,ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ కారుపోతుల విజయ్ కుమార్ గౌడ్,
బూర వేణు గౌడ్, రావుల లక్ష్మీ నారాయణ గౌడ్, గందం చంద్రమౌళి గౌడ్, కక్కెర్ల అశోక్ గౌడ్, తాళ్ళపెల్లి చంద్రమౌళి గౌడ్, కందుల శ్రీనివాస్ గౌడ్, గిరగాని సాంబయ్య గౌడ్,వల్లాల శ్రీహరి గౌడ్,విజయ్ గౌడ్,ముఖ్యులు వేముల సాంబయ్య గౌడ్, బత్తిని శ్రీనివాస్ గౌడ్, తండ సారంగపాణి గౌడ్, వేముల రవి గౌడ్, గంప రాజేశ్వర్ గౌడ్, పీఈటి శ్రీలత గౌడ్, గౌరవ సభ్యులు గౌడ సంఘ సభ్యులు సర్వ సభ్యులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version