ఇందిరమ్మ ఇండ్లలో అవినీతికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోండి.

ఇందిరమ్మ ఇండ్లలో అవినీతికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోండి

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పగిడిపెల్లి రవి

మంగపేట నేటిధాత్రి:

బుచ్చంపేట గ్రామంలో కాంగ్రెస్ గ్రామ శాఖ పార్టీ అధ్యక్షుడు కాటూరు నాగయ్య జంగం భానుచందర్ ఎడ్ల నరేష్ పల్లె శోభన్. అను నలుగురు కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పుకుంటూ సీతక్క పేరు వాడుకుంటూ అక్క కుమారుడు. రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి సూర్య పేరు వాడుకుంటూ.. వారితో దిగిన ఫోటోలు అమాయకులకు చూపిస్తూ.. మాకు అక్కకు దగ్గర మేము చెప్పింది చేస్తదని ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామని. యువ వికాసంలో లోన్ ఇప్పిస్తామని డబ్బులు వసూలు చేస్తున్నారు ఈ నెల లో కొందరికాడా వసూలు చేశారు కానీ మనం అధికారంలో ఉన్నాము కాబట్టి బయపడ్డారు మంగళవారం వచ్చిన వీడియో చూసాక వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెడ్డ పేరు వచ్చిస్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరిస్తారని వాస్తవం అధిష్టానికి మండల అధ్యక్షునికి మండల ప్రజలకు చెపుతున్న వాస్తవం నాపేరు పగిడిపల్లి రవిని నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకున్ని పైగా వారే. మీటింగ్లు పెట్టి ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదని పార్టీ ముఖ్య నాయకులను గ్రామ పేరును కాంగ్రెస్ పార్టీని చెడగొడుతున్నారు. వాస్తవంగా డబ్బులు తీసుకుంటే బయట పెట్టమని చాలెంజులు విసురుతున్నారు. నేను మీతో చెప్పినది ఏమనగా.. స్వయంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయిన నా దగ్గరే కూడా యువ వికాసం ఇస్తామని పదివేల రూపాయలను కాటూరు నాగయ్యతో కలసి నలుగురు వ్యక్తులు అడిగారు అడిగింది. వాస్తవము. నేను మొదటగా ఐదు వేల రూపాయలు ఫోన్ పే ద్వారా అందజేసింది. వాస్తవం. కాటురు నాగయ్య ఎడ్ల నరేష్ భానుచందర్ శోభన్ బాబు అధ్యక్షుని వివిధ హోదాలో ఉండి కార్యకర్త నైన నా వద్దనే ఈ విధంగా అడిగి పేపర్లలో దొంగే దొంగలు అన్నట్టుగా పేపర్లో వాస్తవములు ఉంటే బయట పెట్టమని ప్రకటనలు ఇస్తున్నారు. అందువలన నేను బయట పెట్టకు తప్పడం లేదు. నాకాడ నలుగురు మాట్లాడిన వీడియో మరియు వాయిస్ రికార్డింగ్ సాక్షులు బాధితులు ఉన్నారు బుచ్చంపేటలో ఎవ్వరిని అడిగిన చెబుతారు అందరికడా ఉన్నాయి ఇట్టి విషయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ అన్న. రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి ధనసరి సూర్య అన్న. వీరిపై చర్య తీసుకోకపోతే రానున్న స్థానిక ఎన్నికలలో బుచ్చంపేటలో కాంగ్రెస్ పార్టీ పూర్తి పరాభవము తప్పదు కావున వెంటనే వీరిపై చర్య తీసుకుని కాంగ్రెస్ పార్టీని నాయకుల మనోభావాలను కాపాడి రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పార్టీ విజయం సాధించుటకు సహకరిస్తారని కోరుతున్నాను.

పేదలకు సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యం.

పేదలకు సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యం పోతుగల్ లో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ

మొగుళ్ళపల్లి నేటి దాత్రి:
మండలంలోని పోతుగల్ గ్రామంలో భూపాలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ఆదేశాల మేరకు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొల్లపెల్లి రాములు గౌడ్, హౌసింగ్ ఎఈ హర్షిణి, పంచాయతీ కార్యదర్శి. సుజాత అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లకు పూజ కార్యక్రమం నిర్వహించి కొలతల ప్రకారం ముగ్గుపోసి పనులను ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బి రాములు గౌడ్ మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్లను నిరుపేదలకు అందించడంలో ప్రత్యేక చొరవ తీసుకొని పేదోళ్ల సొంతింటి కల నెరవేర్చిన ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇళ్ళు లేకుండా ఎన్నో ఏళ్లుగా అద్దె గృహాల్లో ఉంటున్న మాకు ఇందిరమ్మ ఇళ్ళ కలను సాకారం చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు కు లబ్ధిదారులు కృతజ్ఞత చాటుకున్నారు.

తాట తీస్తా.. అంబటి రాంబాబుకు డీఎస్పీ సీరియస్ వార్నింగ్

తాట తీస్తా.. అంబటి రాంబాబుకు డీఎస్పీ సీరియస్ వార్నింగ్

 

 

 

 

 

 

 

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు నరసరావుపేట డీఎస్పీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే తాట తీస్తామని హెచ్చరించారు.

 

 

పల్నాడు జిల్లా: మాజీ సీఎం జగన్ పల్నాడు పర్యటనలో.. మాజీ మంత్రి అంబటి రాంబాబు రెచ్చిపోయిన సంగతి తెలిసిందే. రోడ్డుపై అడ్డంగా ఉన్న బారికేడ్‌లను విసిరిపడేశారు. అంతేకాకుండా, అడ్డుకోబోయిన పోలీసులపై కూడా దౌర్జన్యంగా ప్రవర్తించారు. దీంతో డీఎస్పీ నాగేశ్వరరావు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే తాట తీస్తామని హెచ్చరించారు. పిచ్చి వేశాలు వేస్తే అరెస్ట్ చేస్తామన్నారు. బారికేడ్‌లు తొలగింపుపై మండిపడిన డీఎస్పీ అంబటిపై చర్యలు తీసుకుంటామన్నారు.

 

 

 

 

కాగా.. వైసీపీ అధినేత జగన్ పల్నాడు పర్యటనలో ఆందోళనకర పరిస్థితులు కనిపించాయి. సత్తెన్నపల్లి పట్నంలో ఓ సీఐపై వైసీపీ మూకలు దౌర్జన్యం చేశారు. అంతేకాకుండా, ఆర్టీసీ బస్సుపై దాడి చేశారు. పల్నాడు, గుంటూరు జిల్లా సరిహద్దులో పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్ల వద్ద మాజీ మంత్రి అంబటి హల్‌చల్ చేశారు. బారికేడ్లను ఎత్తివేసి వీరంగం సృష్టించారు. నిబంధనలకు విరుద్ధంగా అంబటి ర్యాలీ చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రెచ్చిపోయిన అంబటి బారికేడ్లను రోడ్డుపై నుంచి తోసిపడేశారు. ఇదిలా ఉంటే జగన్ పర్యటనలో అపశృతి చోటు చేసుకుని ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

కేరళ విమానాశ్రయంలో నిలిచిపోయిన ఎఫ్-35బి

కేరళ విమానాశ్రయంలో నిలిచిపోయిన ఎఫ్-35బి

 

 

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అడ్వాన్సెడ్ విమానాల్లో ఒకటైన ఎఫ్-35బి విమానం బ్రిటన్ రాయల్ నేవీకి చెదిన హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌లో భాగంగా ఉంది. ఇండో-పసిపిక్ సముద్ర జలాల్లో ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

 

 

 

తిరువనంతపురం: బ్రిటన్‌కు చెందిన అత్యాధునిక ఎఫ్-35బి (F-35B) లైట్నింగ్ II స్టెల్త్ యుద్ధ విమానం కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో గత శనివారం రాత్రి ల్యాండ్ అయింది. నాలుగవ రోజైన బుధవారంనాడు కూడా విమానం అక్కడే నిలిచిపోయింది. ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది.

 

 

 

 

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన, అడ్వాన్సెడ్ విమానాల్లో ఒకటైన ఎఫ్-35బి విమానం బ్రిటన్ రాయల్ నేవీకి చెందిన హెచ్ఎంఎస్ ప్రిన్స్ ఆఫ్ వేల్స్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్‌లో భాగంగా ఉంది. ఇండో-పసిపిక్ సముద్ర జలాల్లో ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇటీవల భారత నౌకాదళంతో సంయుక్త విన్యాసాలు ముగించుకుంది. అనంతరం ఇంధనం తక్కువ కావడంతో తిరువనంతపురం విమానాశ్రయానికి ఈ విమానాన్ని మళ్లించారు. అయితే విమానం హైడ్రాలిక్ సిస్టమ్స్‌లో సాంకేతిక లోపం తలెత్తినట్టు ఆ తర్వాత గుర్తించారు. బ్రిటిష్ ఏవియషన్ ఇంజనీర్లు ప్రస్తుతం మరమ్మతులు చేపడుతున్నారు. ఇందుకు మరికొంత సమయం పడుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం విమానం చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఈ రాత్రి US ఫెడరల్ రిజర్వ్ ప్రకటన..

ఈ రాత్రి US ఫెడరల్ రిజర్వ్ ప్రకటన.. అప్రమత్తమైన మదుపర్లు

 

 

 

 

ఈ రాత్రి తరువాత అమెరికాలో US ఫెడరల్ రిజర్వ్ ప్రకటన ఉండబోతోంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురవుతాయోనని మదుపర్లు అప్రమత్తమయ్యారు.

 

 

 

ఇంటర్నెట్ డెస్క్: ఈ రాత్రి తరువాత అమెరికాలో US ఫెడరల్ రిజర్వ్ ప్రకటన ఉండబోతోంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురవుతాయోనని మన మదుపర్లు అప్రమత్తమయ్యారు. దీంతో వరుసగా రెండో రోజైన ఇవాళ భారత స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. దీనికితోడు మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు కూడా భారత మార్కెట్ల మీద ప్రభావం చూపాయి.

 

 

 

మార్కెట్లు ముగిసే సమయానికి, సెన్సెక్స్ 138.64 పాయింట్లు లేదా 0.17 శాతం తగ్గి 81,444.66 వద్ద ఉంది. నిఫ్టీ 41.35 పాయింట్లు లేదా 0.17 శాతం తగ్గి 24,812.05 వద్ద ముగిసింది. BSE మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి 0.3 శాతం పడిపోయాయి. నిఫ్టీలో టాప్ లూజర్లలో TCS, అదానీ పోర్ట్స్, JSW స్టీల్, HUL, అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఉండగా. లాభపడిన వాటిలో ఇండస్ఇండ్ బ్యాంక్, ట్రెంట్, టైటాన్ కంపెనీ, మారుతి సుజుకి ఇంకా M&M ఉన్నాయి.

 

 

 

 

ఇక, రంగాల పరంగా చూస్తే, ఇవాళ మార్కెట్లో.. ఆటో, ప్రైవేట్ బ్యాంక్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ మినహా, అన్ని ఇతర సూచీలు IT, మీడియా, మెటల్, ఆయిల్ & గ్యాస్, రియాల్టీ 0.5-1 శాతం క్షీణించి నష్టపోయాయి. గడువు తేదీకి సెబీ అనుమతి ఇచ్చిన తర్వాత BSE షేర్లు నష్టపోయాయి. నోమురా లక్ష్య అప్‌గ్రేడ్‌తో ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు 4% పెరిగాయి. OnePlusతో భాగస్వామ్యంతో ఆప్టిమస్ ఇన్‌ఫ్రాకామ్ 8 శాతం పెరిగింది. ప్రీ-ఐపిఓ వాటాదారులకు తప్పనిసరి ఆరు నెలల లాక్-ఇన్ వ్యవధి ఈరోజు ముగిసిన తర్వాత మోబిక్విక్ సిస్టమ్స్ షేర్లు 8% పడిపోయాయి.

 

 

 

 

 

 

BSEలో 70 కి పైగా స్టాక్‌లు 52 వారాల గరిష్ట స్థాయిలను తాకాయి. వాటిలో ఆథమ్ ఇన్వెస్ట్‌మెంట్, ఫెడరల్-మొగల్, AU స్మాల్ ఫైనాన్స్, యాక్సిస్‌కేడ్స్ టెక్నాలజీస్, లుమాక్స్ ఇండస్ట్రీస్, PSP ప్రాజెక్ట్స్, ఆదిత్య బిర్లా క్యాపిటల్, రెడింగ్టన్, నవీన్ ఫ్లోరిన్, రెడింగ్టన్ తదితరాలు ఉన్నాయి.

ఫ్లైఓవర్ సైన్‌బోర్డ్‌లో ఉర్దూ భాష చేర్చబడిన ఇది సమానత్వం యొక్క విజయం.

ఫ్లైఓవర్ సైన్‌బోర్డ్‌లో ఉర్దూ భాష చేర్చబడిన ఇది సమానత్వం యొక్క విజయం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నుండి ఒక సంతోషకరమైన వార్త: జహీరాబాద్‌లోని ప్రసిద్ధ “మొహమ్మద్ ఫరీద్ ఉద్దీన్ ఫ్లైఓవర్” సైన్‌బోర్డ్ నుండి ఉర్దూ భాషను దూరంగా ఉంచినప్పుడు, ముస్లిం ప్రజలు దానిని తమ భావాలకు సంబంధించినదిగా భావించారు. ! ఈ నిర్ణయం ఉర్దూ మాట్లాడే ప్రజలను మాత్రమే కాకుండా, తెలంగాణలోని గంగా-జముని సంస్కృతిని కూడా అవమానించింది.
ఈ నిర్ణయం ఉర్దూ మాట్లాడే ప్రజలను మాత్రమే కాకుండా, తెలంగాణలోని గంగా-జముని సంస్కృతిని కూడా అవమానించింది.
ఈ నిర్ణయం ఉర్దూ మాట్లాడే ప్రజలనే కాకుండా తెలంగాణలోని గంగా-జమునీ సంస్కృతిని కించపరిచింది.ఈ నిర్ణయం ఉర్దూ మాట్లాడే ప్రజలనే కాకుండా తెలంగాణలోని గంగా-జముని సంస్కృతిని కూడా అవమానపరిచింది.
కానీ ప్రజలు మౌనంగా కూర్చోలేదు! ముస్లిం నాయకులు బిగ్గరగా స్వరం వినిపించి తమ డిమాండ్లను ప్రభుత్వానికి తీసుకెళ్లారు. నేడు, ఆ స్వరం రంగు పులుముకుంది! ఫ్లైఓవర్ సైన్‌బోర్డ్‌లో ఉర్దూ భాష కూడా చేర్చబడింది. ఇది కేవలం ఒక పదం యొక్క అదనంగా కాదు – ఇది సంస్కృతి, గుర్తింపు మరియు సమానత్వం యొక్క విజయం. మొహమ్మద్ ఫరీద్ ఉద్దీన్ ఫ్లైఓవర్ పేరు ఇప్పుడు ఉర్దూలో కూడా ప్రకాశిస్తుంది మరియు ప్రజల స్వరం ఎప్పటికీ వృధా కాదని ప్రజలు గుర్తు చేస్తుంది. అన్నారు

3 సూపర్‌ ఓవర్లతో రికార్డు .

3 సూపర్‌ ఓవర్లతో రికార్డు

 

క్రికెట్‌ మ్యాచ్‌ల్లో స్కోర్లు సమం కావడం అరుదుగా చోటు చేసుకుంటుంది. అలాంటి వేళ విజేతను తేల్చేందుకు సూపర్‌ ఓవర్‌ను నిర్వహిస్తుంటారు. అలాగే సోమవారం రాత్రి…
గ్లాస్గో: క్రికెట్‌ మ్యాచ్‌ల్లో స్కోర్లు సమం కావడం అరుదుగా చోటు చేసుకుంటుంది. అలాంటి వేళ విజేతను తేల్చేందుకు సూపర్‌ ఓవర్‌ను నిర్వహిస్తుంటారు. అలాగే సోమవారం రాత్రి నేపాల్‌-నెదర్లాండ్స్‌ మధ్య జరిగిన టీ20 మ్యాచ్‌ కూడా టై అయ్యింది. అయితే ఇక్కడ ఫలితం తేలేందుకు ఒక్క సూపర్‌ ఓవర్‌ సరిపోలేదు. ఏకంగా మూడుసార్లు ఇరు జట్లు బరిలోకి దిగాల్సి వచ్చింది. ఇప్పటి వరకు టీ20 లేక లిస్ట్‌ ‘ఎ’ మ్యాచ్‌ల్లో ఇలా జరగడం ఇదే తొలిసారి. ముందుగా నెదర్లాండ్స్‌ 20 ఓవర్లలో 152/7 స్కోరు చేసింది. ఛేదనలో నేపాల్‌ చివరి ఓవర్‌లో రెండు ఫోర్లతో సరిగ్గా 152/8 స్కోరే చేసింది. దీనికి తోడు రెండు జట్లు కూడా తొలి సూపర్‌ ఓవర్‌లో 19, రెండో సూపర్‌ ఓవర్‌లో 17 పరుగులు సాధించడంతో మూడోసారి అనివార్యమైంది. అందులో నేపాల్‌ పరుగులేమీ చేయకుండా 4 బంతుల్లో 2 వికెట్లు కోల్పోగా.. నెదర్లాండ్స్‌ ఓ సిక్సర్‌తో మ్యాచ్‌ను విజయంతో ముగించింది.

ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్య.

“ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్య”

ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్ నగర్ నేటి ధాత్రి:

 

ప్రభుత్వ కళాశాలలో అందిస్తున్నామని, మీ పిల్లల భవిష్యత్తు కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చేర్పించాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి విద్యార్ధుల తల్లిదండ్రులకు సూచించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల వారి కరపత్రాన్ని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నిష్ణాతులైన అనుభవజ్ఞులైన అధ్యాపకులు అందుబాటులో ఉన్నారని ఆయన తెలిపారు. కళాశాలలో చదివే విద్యార్థులకు చదువుతో పాటు కల్చరల్ కార్యక్రమాలు, స్పోర్ట్స్ లాంటి వాటికి కళాశాలలో శిక్షణ ఇస్తారని ఉన్నతంగా విద్యార్థులను అధ్యాపకులు తీర్చిదిద్దుతారని చెప్పారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివుకున్న విద్యార్థులకు ఎంసెట్ లక్ష ర్యాంకు వరకు ఉచితంగా ఇంజనీరింగ్ కళాశాలలో అడ్మిషన్ లభిస్తుంది అని ఆయన స్పష్టం చేశారు.

వెన్నునొప్పి వస్తుందా..

వెన్నునొప్పి వస్తుందా.. ఈ పొరపాట్లు చేయకండి..

 

 

 

 

వెన్నునొప్పి అనేది చాలామందిని ఇబ్బంది పెట్టే సాధారణ సమస్య. అయితే, దీని వెనుక అనేక కారణాలు ఉండొచ్చు. కానీ, ముఖ్యంగా మనం చేసే ఈ తప్పుడు అలవాట్లు ఈ సమస్యను మరింత పెరిగేలా చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

 

 

 

వెన్నునొప్పి అంటే వీపు భాగంలో కలిగే నొప్పి. ఇది కండరాలు, ఎముకలు, నరాలు, లేదా వెన్నుపాములోని ఇతర భాగాల నుండి రావచ్చు. సాధారణంగా, ఇది స్వల్పకాలికంగా లేదా దీర్ఘకాలికంగా ఉంటుంది. వెన్నునొప్పి అనేది చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య. అయితే దీని వెనుక అనేక కారణాలు ఉండొచ్చు. కానీ, ముఖ్యంగా మనం చేసే ఈ తప్పుడు అలవాట్లు ఈ సమస్యను మరింత పెరిగేలా చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 

 

 

తప్పుగా కూర్చోవడం:

గంటల తరబడి కంప్యూటర్ ముందు వంగి కూర్చోవడం, సోఫాలో సరిగా కూర్చోవడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి పెరుగుతుంది. దీన్ని తగ్గించాలంటే నేరుగా కూర్చోవాలి, కుర్చీ కూడా మంచిది ఉపయోగించాలి. ప్రతి 30-40 నిమిషాలకు లేచి కొంచెం నడవడం మంచిది.

 

 

 

 

శారీరక శ్రమ లేకపోవడం

రోజంతా కూర్చొని పని చేయడం వల్ల కండరాలు బలహీనపడతాయి. ముఖ్యంగా నడుము చుట్టూ ఉన్న కండరాలు బలహీనపడితే, వెన్నెముకకు సరైన మద్దతు లేక నొప్పి వస్తుంది. కనీసం రోజుకు కొన్ని నిమిషాలు యోగా, వాకింగ్ లేదా తేలికపాటి వ్యాయామాలు చేయడం వల్ల మంచిది.

 

 

 

 

బరువులు ఎత్తడం:

బరువులు ఎత్తేటప్పుడు వంగి ఎత్తడం, లేదా ఒక్కసారిగా ఎక్కువ బరువు మోయడం వల్ల వెన్నెముకకు నష్టం కలుగుతుంది. కింద ఉన్న వస్తువులను ఎత్తేటప్పుడు మోకాళ్లను వంచి, నెమ్మదిగా లేచే విధంగా ఎత్తాలి. అవసరమైతే ఎవరైనా సహాయం తీసుకోవాలి.

 

 

 

 

పరుపు లేదా నిద్ర భంగిమ:

మృదువైన లేదా గట్టిగా ఉన్న పరుపులు వెన్నెముకకు సరైన మద్దతు ఇవ్వవు. అలాగే నిద్రించే స్థితి సరిగాలేకపోతే ఉదయం నడుము నొప్పితో లేచే ప్రమాదం ఉంటుంది. మితమైన గట్టితనంతో ఉన్న పరుపును ఎంచుకోవాలి. వీపు నేరుగా ఉండేలా పడుకోవడం లేదా పక్కకు తిరిగి పడుకోవడం మంచిది. వెన్నునొప్పి సాధారణమైన సమస్య అయినా దీన్ని తేలిగ్గా తీసుకోకూడదు. ఆరోగ్యంగా ఉండటానికి ఈ అలవాట్లు మార్చుకోండి. వెన్ను నొప్పితో ఎక్కువగా బాధపడుతుంటే వైద్యుడిని సంప్రదించండి.

 

ప్రతి రైతుకు రైతు భరోసా అందజేస్తాం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ.

ప్రతి రైతుకు రైతు భరోసా అందజేస్తాం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి:

 

జిల్లాలో ఇప్పటి వరకు 90,837 మంది రైతులకు 72,30,42,624 రూపాయల నిధులు విజయవంతంగా జమయ్యాయని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు
పాత రైతులతో పాటు కొత్త రైతులకు కూడా రైతు భరోసా ను ఎలాంటి పరిమితులు విధించకుండా అందించాలని ప్రభుత్వం నిర్మించినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు ఈ నెల 20వ తేదీ వరకు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి రైతు భరోసా అందజేస్తామని ఆయన తెలిపారు
వానకాలం 2025 రైతు భరోసా నిధుల పంపిణీపై మండలాల వారీగా వివరాలు

జూన్ 18, 2025 నాటికి…
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వానకాలం – 2025కు సంబంధించిన రైతు భరోసా నిధుల పంపిణీ విజయవంతంగా కొనసాగుతోంది. మొత్తం 282 గ్రామాల నుంచి 1,24,397 మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్దిపొందేందుకు అర్హులుగా గుర్తించబడ్డారు. ఇందుకోసం 143,99,06,145 రూపాయల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయడానికి చర్యలు తీసుకోగా, అందులో 114,50,67,074 రూపాయలు ఖజానా ద్వారా పంపిణీకి సంబంధించి నమోదయ్యారు. కాగా ఇప్పటి వరకు 90,837 మంది రైతులకు 72,30,42,624 రూపాయల నిధులు విజయవంతంగా జమయ్యాయి.
ఈ కార్యక్రమం రైతు సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు నిదర్శనమని, వ్యవసాయ అధికారులు మరియు బ్యాంకర్లు సమన్వయంతో ఈ పంపిణీ సమర్థవంతంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.

నైట్ టైంలో ఆకలిగా అనిపిస్తుందా..

నైట్ టైంలో ఆకలిగా అనిపిస్తుందా.. ఈ విషయాలు తెలుసుకోండి..

 

 

కొంతమందికి అర్ధరాత్రి కూడా ఆకలిగా అనిపిస్తుంది. అయితే, అలాంటి వారు పడుకునే ముందు వీటిని తినవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 

 

 

 

 

 

చాలామందికి అర్ధరాత్రి ఆకలి వేస్తుంది. ఇది వివిధ కారణాల వల్ల జరగవచ్చు. ముఖ్యంగా రాత్రి మేలుకువగా ఉండేటప్పుడు లేదా ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆకలి ఎక్కువగా అనిపిస్తుంది. అలాంటి సమయంలో చాలా మంది చిప్స్, స్వీట్లు వంటి అనారోగ్యకరమైన వాటిని తింటారు. కానీ ఇవి జీర్ణక్రియను దెబ్బతీస్తాయి. నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. అంతేకాక బరువు పెరగడానికి కూడా కారణం అవుతాయి. కాబట్టి, మీకు ఆకలిగా అనిపిస్తే ఈ తేలికపాటి, ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇవి మీ ఆకలిని తీరుస్తాయని, అదే సమయంలో నిద్రకు ఇబ్బంది కలిగించవని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

 

 

 

 

గోరువెచ్చని పాలు

రాత్రిపూట ఒక చిన్న గ్లాసు గోరువెచ్చని పాలు తాగడం వల్ల కడుపు నిండుగా అనిపిస్తుంది. పాలలో ట్రిప్టోఫాన్ అనే పదార్థం ఉంటుంది. ఇది మంచి నిద్రకు సహాయపడుతుంది. అలాగే, పాలలో ప్రోటీన్, కాల్షియం కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి కండరాలకు మంచిగా పనిచేస్తాయి. అలాగే ఆకలిని కూడా నియంత్రిస్తాయి. ప్రతి రోజు పడుకునే ముందు 150–200 మి.లీ పాలు తాగడం మంచిది.

 

 

 

 

 

 

గింజలు (బాదం, వాల్‌నట్స్)

గుప్పెడు బాదం లేదా 2–3 వాల్‌నట్స్ తినడం మంచిది. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్‌ను కలిగి ఉంటాయి. బాదంలో మెగ్నీషియం ఉండటం వల్ల ఇది ఒత్తిడిని తగ్గించి నిద్రకు సహాయపడుతుంది. వీటిని తినడం వల్ల తక్షణమే ఆకలి తగ్గుతుంది. అలాగే రాత్రంతా చక్కెర స్థాయిలు స్తిరంగా ఉంటాయి.

 

 

 

 

 

 

అరటిపండు

అరటిపండులో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ B6 ఉంటాయి. ఇవి కండరాలను సడలించడంతో పాటు నిద్రకు సహాయపడతాయి. అరటిపండు ఆకలిని తీరుస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు ఒక చిన్న అరటిపండు తినవచ్చు. దీనిని పాలతో కలిపి తీసుకుంటే మరింత ఆరోగ్యకరంగా ఉంటుంది.

 

 

 

నాణ్యత లోపం ఎవరిదీ ఈ పాపం.

నాణ్యత లోపం ఎవరిదీ ఈ పాపం…

జహీరాబాద్ నేటి ధాత్రి:

కప్పాడు గ్రామం, ఝరాసంగం మండలం. సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం, ఝరాసంగం మండలంలోని కప్పడ్ గ్రామం మరియు రాయికోడ్, మండలం కప్పడ్ మరియు రాయి కోడ్, ఈ రెండు గ్రామాల మధ్యలో, దాదాపు మూడు నెలల క్రితం, సాంకేతిక పరిజ్ఞానంతో, రకరకాల మిశ్రమాలను ఉపయోగించి, తారు రోడ్డును వేశారు. కాని పని పూర్తి చేసిన మూడు నెలల లోపే, రోడ్డుకు పగుళ్లు ఏర్పడి, గుంతలుగా మారుతున్నాయి. ప్రభుత్వ అధికారులు స్పందించి, రోడ్డుకు మరమ్మత్తులు చేయాలని ప్రజలు కోరుచున్నారు.

రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎం గిరిధర్ రెడ్డి.

నూతన రాష్ట్ర మంత్రిని సన్మానించిన

రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ ఎం గిరిధర్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్,సచివాలయంలో బుధవారం కార్మిక, ఉపాధి, శిక్షణ కర్మాగారాలు, గనులు భూగర్భ శాస్త్ర మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన శుభ సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు గడ్డం.వివేక్ వేంకట స్వామి ని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్‌రెడ్డి , జడ్చర్ల శాసనసభ్యులు అనిరుధ్‌రెడ్డి ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

లారీ ఓనర్ అధ్యక్షుడిగా మేకల చంద్రయ్య ఎన్నిక.

లారీ ఓనర్ అధ్యక్షుడిగా మేకల చంద్రయ్య ఎన్నిక

భూపాలపల్లి నేటిధాత్రి:

కాకతీయ లారీ ఓనర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మేకల చంద్రయ్య భారీ మెజార్టీతో గెలుపొందారు
భూపాలపల్లి లోని మంజునగర్ లో కాకతీయ లారీ ఓనర్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించడం జరిగింది అధ్యక్షుడుగా మేకల చంద్రయ్య కోశాధికారిగా రాకేష్ ఉపాధ్యక్షుడిగా ఏనగంటి రాజేందర్ ప్రధాన కార్యదర్శిగా ఎండి అన్వర్ పాషా సహాయ కార్యదర్శిగా రాసలింగమూర్తి ఎన్నికైనారు ఈ సందర్భంగా అధ్యక్షుడు మేకల చంద్రయ్య మాట్లాడుతూ నా ఎన్నికకు సహకరించి నన్ను రెండోసారి లారీ ఓనర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా గెలిపించిన సభ్యులందరికీ రుణపడి ఉంటాను నా మీద నమ్మకంతో నన్ను రెండోసారి గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈ గెలుపు నామీద మరింత పనిచేసే భారాన్ని పెంచింది కావున కాకతీయ లారీ ఓనర్ అసోసియేషన్ మరింత అభివృద్ధి పథంలోకి నడిపియడానికి నా వంతుగా రెండోసారి కృషి చేస్తానని నేను తెలియజేస్తున్నాను

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులను తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి రజిత.

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులను తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి రజిత

సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):

సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్నజిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయ అధికారి డాక్టర్ రజిత రాజన్న సిరిసిల్ల, తంగళ్ళపల్లి మండలంలో గల చిన్న బోనాల ,పెద్దూరు ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపురం ఆరోగ్య ఉపకేంద్రములను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి, డిఐఓ, ప్రోగ్రాం ఆఫీసర్లు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం పై ఆకస్మికంగా తనిఖీ నిర్వహించినారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రికార్డులను పరిశీలించి 0-5 సంవత్సరాల పిల్లలకు టీకాలు ఇచ్చిన తర్వాత రెండు గంటలు పాటు టీకాలు వేసిన ప్రాంతంలోనే అబ్జర్వేషన్ లో ఉంచుకొని మరో రెండు రోజులపాటు సంబంధిత ఏ.ఎ.న్ఎం మరియు ఆశ వర్కర్లు టీకాలు వేసిన పిల్లల ఇంటికి వెళ్లి పర్యవేక్షించాలని సూచిస్తూ, సకాలంలో విధులు నిర్వర్తించవలసిందిగా లేనియెడల సి.సి.ఏ. రూల్స్ ప్రకారము చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం జరిగినది. ఈ కార్యక్రమంలో డి.ఐ.ఓ డాక్టర్ సంపత్ కుమార్, డాక్టర్ నహీం జహన్ మరియు సంబంధిత వైద్య అధికారులు పాల్గొన్నారు.

ఇందిరమ్మ ఇండ్లకి భూమి పూజ.

ఇందిరమ్మ ఇండ్లకి భూమి పూజ

నాగర్ కర్నూల్  నేటి ధాత్రి:

 

నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఎర్రకుంట తండా, లట్టుపల్లి, చిన్న పీరు తండా, బిజినేపల్లి తండా బోయపూర్ డాకు తండా, రావుల చెరువు తండాలకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే కూచకుళ్ళ రాజేష్ రెడ్డి బుధవారం భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిరుపేదలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి.. వారి కళా సహకారం చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వినోద్, పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు.

ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే మా లక్ష్యం.

ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడమే మా లక్ష్యం
తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షులు రవి పటేల్
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:

 

జయశం కర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మేదరమెట్ల గ్రామంలో తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ టీం సభ్యుల ఆహ్వానం మీద పర్యటించడం జరిగింది
గ్రామంలో పలువురు ఆరోగ్య సమస్యలపై రవి పటేల్ వారి కుటుంబాలను కలిసి మాట్లాడడం జరిగింది గ్రామంలో కొడారీ స్వరూప కొడుకు అనిరుద్ యూరినరీ ట్రాక్ సర్జరీ అవసరం ఉంది అని చెప్పారు
హాజర హాస్పిటల్ dr ఉషిక కిరణ్ యూరలజిస్ట్ తో ఫోన్లో మాట్లాడి సర్జరీకి సహకరించని విజ్ఞప్తి చేశారు
పైడిమల్ల ఐలయ్య గీత కార్మికుడు తడిచేట్టు మీదనుండి పడితే కాలు విరిగింది వారిని చూసి మాట్లాడి ఆరోగ్య పరిస్థితి తేలుకోవడం జరిగింది టీం సభ్యుడు నాగరాజు కూతురు లాస్య వికలాంగురాలు కావున పెన్షన్ రావడంలేదని చెప్పారు కలెక్టర్ గారితో కలిసి మాట్లాడి తప్పకుండా పెన్షన్ పెట్టిస్తానని చెప్పడం జరిగింది
మెదరమెట్ల గ్రామంలో గవర్నమెంట్ స్కూల్ కి వెళ్లి అక్కడి పరిసరాలు పరిశీలించి ఉపాధ్యాయులతో విద్యార్థులతో మాట్లాడి ఎక్కువ మొత్తంలో గవర్నమెంట్ స్కూలుకు విద్యార్థులు వచ్చే విధంగా ఉపాధ్యాయులకు కృషి చేయాలని అలాగే గ్రామ ప్రజలు గవర్నమెంట్ స్కూలుకు పిల్లలను పంపించాలని పవి పటేల్ విజ్ఞప్తి చేశారు ఇందులో పాల్గొన్నవారు గునీకంటి విష్ణు కొడారి రాజు గజ్జి కుమారస్వామి కొడారి రమేష్ కొణికటి దీక్షిత్ పెంతల రాజు p రాజేందర్ ఎడకుల సురేష్ పైడిమల్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు

బడిబాట స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో విద్యాధికారి.

బడిబాట స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో విద్యాధికారి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

బడిబాట కార్యక్రమంలో భాగంగా బడంపేట ప్రాథమికున్నత పాఠశాలలో స్వచ్ఛదనం మరియు పచ్చదనం పాఠశాల పరిధిలో వివిధ రకాల మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి మమ్మద్ జాకీర్ హుస్సేన్ (ప్రత్యేక అధికారి) మాట్లాడుతూ పాఠశాల పరిధిలో పచ్చదనం స్వచ్ఛదనంతో పాటు స్వచ్ఛమైన గాలి రావడంతో పిల్లలు ఆరోగ్యంగా మరియు మంచి నీడనిచ్చి స్వచ్ఛమైన గాలి ఇవ్వడం జరుగుతుందని వివరించడం జరిగింది కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి (FAC) కృష్ణ ఫీల్డ్ అసిస్టెంట్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ సార్ వినోద్ సార్ తదితరులు పాల్గొనడం జరిగింది

బీసీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం.

బీసీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం

నర్సంపేట నేటిధాత్రి:

 

రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్స్ దృష్టిలో ఉంచుకొని బీసీ లందరూ ఏకతాటిపైకి రావాలని కోటి సభ్యత్వ నమోదు కార్యక్రమం లో బాగంగా నర్సంపేటలో 1500 బీసీ సభ్యత్వాలు విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని వరంగల్ జిల్లా ఇంచార్జ్ వంగ రవి యాదవ్ అన్నారు. నర్సంపేట పట్టణంలో బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ అన్న ఆదేశాల మేరకు నర్సంపేట నియోజకవర్గ యూత్ అధ్యక్షులు సిలువేరు ద్రోణాచారి ఆధ్వర్యంలో వంగ రవి యాదవ్ అధ్యక్షతన జరిగింది.రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్స్ దృష్టిలో ఉంచుకొని బీసీ లందరూ ఏకతాటిపైకి రావాలని కోటి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో బాగమే అని రవి పేర్కొన్నారు. బీసీలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించలేని పాలకులు ఉన్నత వర్గాల మోసమాటలతో ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుంటున్నారన్నారు.ఈ కార్యక్రమంలో మండల కొమ్మాలు,చీర పద్మ, రమేష్, సిలువేరు మానస, ఓదెల రంజిత్,సాంబలక్ష్మి, మండల ఐలమ్మ, ఓదెల నగేష్,రమ తదితరులు పాల్గొన్నారు.

సర్కారు బడుల్లో కొత్త అడ్మిషన్లు.

సర్కారు బడుల్లో కొత్త అడ్మిషన్లు

ప్రైవేట్ పాఠశాల నుండి ప్రభుత్వ పాఠశాలలోకి విద్యార్థులు.

మరిపెడ నేటిధాత్రి:

 

రాష్ట్రంలోని సర్కారు బడుల్లో అడ్మిషన్లు జోరందు కున్నాయి. ఇటీవల ప్రభుత్వ బడుల బలోపేతానికి సర్కారు తీసుకున్న చర్యలు, బడిబాట కార్యక్రమం సత్ఫలితాలిస్తోంది. స్కూళ్లు ప్రారంభమైన వారం రోజుల్లోనే కొత్త అడ్మిషన్లు వచ్చాయి. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలోని రాంపురం ప్రాథమిక పాఠశాలలో 30 నూతన అడ్మిషన్లు రావడం జరిగిందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గుర్రం వెంకన్న గౌడ్ తెలిపారు కొత్త అడ్మిషన్లలో సగానికి పైగా ఒకటో తరగతిలో 18 మంది విద్యార్థులు, 2 వ తరగతి లో 5 మంది విద్యార్థులు, 3 వ తరగతి లో 5 మంది విద్యార్థులు, 4 వ తరగతి లో 1, 5 వ తరగతి లో 1 చొప్పున మొత్తం 30 మంది విద్యార్థులు నూతన అడ్మిషన్లు వచ్చాయని సంతోషం వ్యక్తం చేశారు అయితే, ఇంకా కొంత మంది విద్యార్థులు వచ్చే అవకాశం ఉంది అని వారు తెలిపారు, ఈ నెల 12 నుంచి 2025-26 కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైంది. సర్కారు బడుల్లో అడ్మిషన్ల పెంపునకు ఈ నెల 6 నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం వస్తుందన్నారు.

ఫలితాలిస్తున్న సర్కారు నిర్ణయాలు.

ఇటీవల బడుల బలోపేతానికి ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. కొత్తగా పదివేల కు పైగా టీచర్లను నియమించగా, ఖాళీగా ఉన్న చోట్ల బదిలీలు నిర్వహించి సబ్జెక్టు టీచర్ల కొరతను తీర్చింది. దీనికితోడు 1.10లక్షల మంది టీచర్లకు ఐదు రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చింది. దీనికితోడు బడుల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాల కల్పన, డిజిటల్ తరగతులు, చదువులో వెనుకబడిన స్టూడెంట్ల కోసం పలు బడుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజిన్స్ సహకారంతో పాఠాలు బోధించడం లాంటివి ఉపయోగపడుతున్నాయి అన్నారు,మరోపక్క బడులు తెరిచిన రోజే ఉచితంగా పాఠ్యపుస్తకాలతో పాటు యూని ఫామ్స్, నోట్ బుక్స్, వర్క్ బుక్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గువ్వడి లక్ష్మయ్య,రాజేశ్వరి, క్రాంతి, గణేష్,ఎస్ఎంసి చైర్ పర్సన్ పసుపులేటి శోభ,విద్యార్థుల తల్లిదండ్రులు బందు పరశురాములు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version