ప్రతి రైతుకు రైతు భరోసా అందజేస్తాం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ.

ప్రతి రైతుకు రైతు భరోసా అందజేస్తాం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి:

 

జిల్లాలో ఇప్పటి వరకు 90,837 మంది రైతులకు 72,30,42,624 రూపాయల నిధులు విజయవంతంగా జమయ్యాయని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు
పాత రైతులతో పాటు కొత్త రైతులకు కూడా రైతు భరోసా ను ఎలాంటి పరిమితులు విధించకుండా అందించాలని ప్రభుత్వం నిర్మించినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు ఈ నెల 20వ తేదీ వరకు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి రైతు భరోసా అందజేస్తామని ఆయన తెలిపారు
వానకాలం 2025 రైతు భరోసా నిధుల పంపిణీపై మండలాల వారీగా వివరాలు

జూన్ 18, 2025 నాటికి…
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వానకాలం – 2025కు సంబంధించిన రైతు భరోసా నిధుల పంపిణీ విజయవంతంగా కొనసాగుతోంది. మొత్తం 282 గ్రామాల నుంచి 1,24,397 మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్దిపొందేందుకు అర్హులుగా గుర్తించబడ్డారు. ఇందుకోసం 143,99,06,145 రూపాయల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయడానికి చర్యలు తీసుకోగా, అందులో 114,50,67,074 రూపాయలు ఖజానా ద్వారా పంపిణీకి సంబంధించి నమోదయ్యారు. కాగా ఇప్పటి వరకు 90,837 మంది రైతులకు 72,30,42,624 రూపాయల నిధులు విజయవంతంగా జమయ్యాయి.
ఈ కార్యక్రమం రైతు సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు నిదర్శనమని, వ్యవసాయ అధికారులు మరియు బ్యాంకర్లు సమన్వయంతో ఈ పంపిణీ సమర్థవంతంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version