గణేష్ ఉత్సవాలకు పటిష్ట భద్రత…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-88-1.wav?_=1

నవరాత్రి ఉత్సవాలకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

వినాయక చవితి వేడుకల సందర్భంగా విగ్రహాల ప్రతిష్ఠాపన నుండి నవరాత్రుల అనంతరం నిమజ్జనాల వరకు ఎటువంటి అంతరాయం కలగకుండా పటిష్ఠమైన భద్రతా చర్యలు చేపట్టాలని
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
అధికారులను ఆదేశించారు.
ఈ నెల 27వ తేదీ వినాయక చవితి పండుగను పురస్కరించుకుని విగ్రహాలు ఏర్పాటు, నిమజ్జన కార్యక్రమాలపై ఐడిఓసి కార్యాలయంలో
రెవెన్యూ, పోలీస్, పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి, వైద్య, దేవాదాయ, అగ్నిమాపక, విద్యుత్, ఎక్సైజ్ తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి విభాగం సమన్వయంతో పనిచేసి పండుగ వేడుకలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. మండపాలకు విద్యుత్తు సరఫరాకు, మైకు ఏర్పాట్లుకు తప్పనిసరి అనుమతి తీసుకోవాలని సూచించారు. లూజు విద్యుత్తు వైర్లు వాడరాదని, ఎంసిబి వేయాలని, వేలాడే విద్యుత్తు తీగల నుండి వైర్లు ఏర్పాటు ద్వారా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని తెలిపారు. మండపాల వద్ద వ్యర్థాలు వేసేందుకు అనువుగా డస్ట్ బిన్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. విద్యుత్తు తీగల క్రింద విగ్రహాలు ఏర్పాటు వల్ల విద్యుత్తు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు. శాంతియుత వాతావరణంలో గణేష్ విగ్రహాలు ఏర్పాటు, నిమజ్జన ఉత్సవాలు జరగాలని అన్నారు. నిమజ్జన రోజున అత్యవసర వైద్య కేంద్రాలు ఏర్పాటుతో. పాటు మహాదేవపూర్, జిల్లా ప్రధాన ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది అందుబా ఉండాలని తెలిపారు. అత్యవసర సేవలకు అంబులెన్స్ సేవలు వినియోగించడానికి సిద్ధంగా ఉంచాలన్నారు. ముఖ్యంగా కాళేశ్వరం వద్ద విగ్రహాలు నిమజ్జనం జరుగుతుందని తెలిపారు. అన్ని మండలాలలో నిమజ్జనానికి నీటి వనరులను గుర్తించాలని, నిమజ్జనం చేయడానికి అనుమతి ఉన్న ప్రదేశంలో నిమజ్జనం చేయాలని తెలిపారు. గణేష్ శోభా యాత్ర సందర్భంగా క్రమ సంఖ్యలో వెళ్ళడానికి అనువుగా నంబర్లు కేటాయించాలన్నారు. మండపాల ఏర్పాటును పోలీస్ రిజిస్టర్ చేసుకోవాలని తెలిపారు.
ఉత్సవాల నిర్వహణకు జిల్లా యంత్రాంగం తరపున పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. శోభాయాత్ర సందర్భంగా రహదారుల పై గుంతలకు మరమ్మతులు చేపట్టాలని తెలిపారు.
జిల్లాలో గతంలో కూడా సహృద్భావ వాతావరణంలో ఈ వేడుకలు జరుగాయని, ఈ దఫా అదే స్ఫూర్తితో మత సామరస్యంతో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని ఆయన సూచించారు.
నిమజ్జన ప్రాంతాల్లో విద్యుత్తు, క్రేన్లు, మంచినీరు ఏర్పాటు చేయాలని, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వేడుకల నిర్వహణ సజావుగా జరిగేలా అధికారులు పర్యవేక్షణ చేయాలని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, డిపిఓ శ్రీలత, అగ్నిమాపక అధికారి శ్రీనివాస్, ఆర్డిఓ రవి, అన్ని శాఖల అధికారు లు తదితరులు పాల్గొన్నారు.

అక్రమ అరెస్టులతో ప్రతిపక్షాల గొంతులను నొక్కలేరు.

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-25T161118.191-1.wav?_=2

అక్రమ అరెస్టులతో ప్రతిపక్షాల గొంతులను నొక్కలేరు
బిజెపి నాయకులు
వర్ధన్నపేట (నేటిధాత్రి):

 

వర్ధన్నపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జనహిత పాదయాత్ర అడ్డుకుంటారనే వంకతో భారతీయ జనతా పార్టీ వర్ధన్నపేట నాయకులను అరెస్టు చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లో ఉంచుకోవడం చాలా విడ్డూరంగా ఉందని భారతీయ జనతా పార్టీ నాయకులు ఆరోపించారు. భారతీయ జనతా పార్టీ నాయకులు కుందూరు మహేందర్ రెడ్డి. జడ సతీష్. కొండేటి సత్యం మాట్లాడుతూ అరెస్టులతో ప్రతిపక్షాల గొంతులను నొక్క లేరని ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలపై అబద్ధపు హామీలపై ప్రతిపక్ష పార్టీగా మా పోరాటం కొనసాగుతుందని భారతీయ జనతా పార్టీ నాయకులు అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా యాత్రలు చేపట్టడం వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని వారు చేసేది జనహిత యాత్ర కాదని జనద్రోహయాత్రాన్ని ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా పనిచేయాలని మహిళలకు 2500 రూపాయలు మరియు కళ్యాణ లక్ష్మి పథకం కింద తులం బంగారం ఆసరా పెన్షన్ల పెంపుదల. గ్యాస్ సబ్సిడీలు అందే విధంగా వారి హామీలు నెరవేర్చే విధంగా ఆలోచించి పని చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి హితవు పలికారు. బిజెపి నాయకులతోపాటు విద్యార్థి పరిషత్ నాయకులను అరెస్ట్ చేయడం చాలా బాధాకరమని అన్నారు.

భాధిత కుటుంబానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నివాళులు.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-87.wav?_=3

 

భాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి

పరకాల నేటిధాత్రి

 

దామెర మండలంలోని కొగిల్ వాయ్ గ్రామానికి చెందిన జిల్లా బిజెపి ప్రధానకార్యదర్శి కొండి జితేందర్ రెడ్డి తండ్రి కొండి మాధవరెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించగా దశదినకరలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పాల్గొని నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి కట్ట సుధాకర్ రెడ్డి,బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయచందర్,మాజీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల అశోక్ రెడ్డి , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుజ్జ సత్యనారయణ రావు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వేల్పుల రాజ్ కుమార్,మాజీ మండల అధ్యక్షులు జంగిలి నాగరాజు,గంకిడి బూచి రెడ్డి,రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజలకు అవసరమైన మౌళిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనివ్వండి..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-25T155542.794.wav?_=4

 

*ప్రజలకు అవసరమైన మౌళిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనివ్వండి..

*టిడిఆర్ బాండ్లు అర్హులైన వారికి ఇస్తున్నాం..

*గ్రామాలనుంచి వచ్చే ఆదాయం గ్రామాభివృద్ధికే ఖర్చు చేయాలి..

*శెట్టిపల్లి భూముల సమస్య త్వరలో పరిస్కారం…

*ఆదాయం పెంపుదలకు కొత్త లే అవుట్స్ ఏర్పాటు..

*పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ..

తిరుపతి(నేటిధాత్రి)ఆగస్టు 25 :

 

ప్రజలకు అవసరమైన మౌళిక సదుపాయాల కల్పనకు అధికారులు ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేస్తున్నారని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు.
సోమవారం ఉదయం తుడా కార్యాలయంలో నగరపాలక సంస్థ ,తుడా అధికారులతో అభివృద్ధి పనులు, ప్రజలకు కల్పించాల్సిన వసతులపై మంత్రి నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారుతుడా టవర్స్ , ప్లాట్స్ , దుకాణాల పై వచ్చే అదాయ, వ్యయాలపై తుడా చైర్మన్ దివాకర్ రెడ్డి, వి.సి., జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, నగరపాలక సంస్థ లో పారిశుద్ధ్యం, సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు, కార్మికులకు కల్పించాల్సిన వసతులపై కమిషనర్ ఎన్.మౌర్య వివరించారు. టౌన్ షిప్ లను అభివృద్ధి చేసి తుడా ఆదాయాన్ని పెంచాలని అధికారులను ఆదేశించారు. తుడా ప్రాజెక్ట్ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని అన్నారు. పక్కా ప్రణాళికతో ముందుకెళ్లి లక్ష్యాన్ని చేరుకోవాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించే నివేదికలను ఇవ్వకుండా వాస్తవాలను వివరించి, ప్రజల సమస్యలు పరిష్కరించాలని అన్నారు. నెల్లూరు తరహాలో తిరుపతిలో కూడా రోడ్ల శుభ్రతకు స్వీపింగ్ మిషన్ లను వినియోగించాలని అన్నారు.
ఈ సమావేశంలో రాష్ట్ర గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, డిప్యూటీ మేయర్ ఆర్.సి.మునికృష్ణ,డిప్యూటీ కమిషనర్ అమరయ్య, తుడా సెక్రటరీ డాక్టర్ శ్రీకాంత్, సూపరింటెండెంట్ ఇంజినీర్లు కృష్ణా రెడ్డి, శ్యాంసుందర్, ఈ.ఈ.లు రవీంద్ర,తులసి కుమార్, గోమతి, పలు విభాగాల అధికారులు పాల్గొన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-25T154921.524.wav?_=5

 

రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

జిల్లా కన్వీనర్ గుజ్జల ప్రేమ్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏబీవీపీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ గుజ్జల ప్రేమ్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు తో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తుంది పేద విద్యార్థులకు ఎంతో వరంగా ఉండే ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు ఎంతో నష్టపోతున్నారు ప్రైవేటు ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులు రావలసిన ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో విద్యార్థుల నుంచి బస్సులు చేస్తూ కళాశాల కేంద్రాలు వ్యాపార కేంద్రాలుగా మారిపోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు డిగ్రీ పూర్తి తర్వాత పై చదువులకు వెళ్లాలంటే వారి యొక్క సర్టిఫికెట్స్ ఎంత అవసరం ఉంటాయి అలాంటి వాటిని కళాశాలలు ఇవ్వకుండా విద్యార్థులకు ఇబ్బందుల గురి చేస్తున్నాయి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో విద్యార్థులు గుర్తుకొస్తారు కానీ గద్దెనింకినంక విద్యార్థులకు ఎందుకు గుర్తురారని డిమాండ్ చేశారు ప్రభుత్వము ఇకనైనా విద్య రంగ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్రంలో గురుకులాలలో ఫుడ్ పాయిజన్లు అవుతున్న పట్టించుకోకుండా ఈ ముఖ్యమంత్రి రోజులు గడుపుతున్నాడు హాస్టళ్లకు పక్కా భవనాలు లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు రాష్ట్రంలో పాఠశాలల నుంచి కళాశాలల వరకు ఉన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా కన్వీనర్ గుజ్జల ప్రేమ్ కుమార్,సాయి,విఘ్నేష్,ప్రదీప్,చారి,వైష్ణవి,మానస, తదితరులు పాల్గొన్నారు.

25వ వార్డు సమస్యలపై సిపిఐ ధర్నా…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-86.wav?_=6

25 వ వార్డు సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా

క్యాతరాజు సతీష్
సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి మున్సిపల్ పరిధిలో ఉన్న కారల్ మార్క్స్ కాలనీ 25వ వార్డులో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 25వ వార్డు శాఖా సమితి ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది అనంతరం మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు 25వ వార్డు ఇంచార్జ్ సతీష్ మాట్లాడుతూ 25వ వార్డులో మంచినీటి సౌకర్యం కల్పించాలని మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీటి విడుదల సమయాన్ని పెంచాలని పరిశుభ్రమైన నీరును విడుదల చేయాలని, కాలనీలో అంతర్గత రోడ్లను నిర్మించాలని, సైడ్ కాల్వల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించాలని, 6 ఇంక్లైన్ గని గోడకు సింగరేణి స్కూల్ గోడకు మధ్యలో ఉన్న రోడ్డుపై చెత్తాచెదారం పేరుకుపోయి ఉండడం మూలాన ఆ రహదారి మొత్తం డంపింగ్ యార్డ్ ల తయారైన పరిస్థితి కనపడుతుందన్నారు దీని మూలాన కార్మికులు స్కూలుకు పోయే పిల్లలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మున్సిపల్ అధికారులు తక్షణమే ఆ రోడ్డుపై ఉన్న చెత్తాచెదారాన్ని తొలగించాలని, కోరారు అంతేకాకుండా వార్డులో వీధి దీపాలు వెలగడం లేదని అడిగితే టెండర్ అయిపోయిందని సమాధానం గత రెండు నెలలుగా చెబుతున్నారని ఇకనైనా వీధిలైట్లు ఏర్పాటు చేయాలని కోరారు అంతేకాకుండా వార్డులో ఉన్న సెల్ టవర్ ను తొలగించాలని డిమాండ్ చేశారు సమస్యలతో సతమతమవుతున్న కాలనీ ప్రజలను మున్సిపల్ అధికారులు చొరవ తీసుకొని సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు లేనియెడల సిపిఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సమితి సభ్యులు నేరెళ్ల జోసెఫ్, డి హెచ్ పి ఎస్ జాతీయ సమితి సభ్యురాలు పొన్నగంటి లావణ్య, 25 వ వార్డు మహిళా నాయకురాలు పల్లెల రజిత, పెద్దమాముల సంధ్య, క్యాత రాజు అనూష, పోతుగంటి స్వప్న, గుండేటి శివకుమార్, బిల్ సింగ్, మట్టి కృష్ణ, తోపాటు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ములుగు మండల సమస్యలపై బిజెపి నేతల వినతి పత్రం.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-25T154148.715-1.wav?_=7

 

ములుగు మండల సమస్యలపై తహశీల్దార్ కు బిజెపి నాయకుల వినతి పత్రం

ములుగు టౌన్ నేటి ధాత్రి

 

ములుగు మండలంలోని పలు సమస్యలపై బిజెపి నాయకులు తహశీల్దార్ గారికి వినతి పత్రం సమర్పించారు. ఈ రోజు మండల అధ్యక్షులు రాయంచు నాగరాజు గారి ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వగా, ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు సిరికొండ బలరాం గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
మండలంలోని గ్రామాల్లో ఎక్కడా వీధి దీపాలు వెలగడం లేదని
డ్రైనేజీ సక్రమంగా లేకపోవడం వలన నీరు నిలిచి, పారిశుద్ధ్యం లోపించి, డెంగ్యూ, మలేరియా వంటి జ్వరాలు వ్యాపిస్తున్నాయని
గ్రామాలలో తాగునీరు, విద్యుత్ సమస్యలు, గుంతల రహదారులు కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని
ములుగు పట్టణంలోని 200 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సిబ్బంది, సౌకర్యాలు లేకపోవడం వలన రోగులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు
అదేవిధంగా, పట్టణంలోని పలు వీధుల్లో సిమెంట్ రోడ్లు, డ్రైనేజీలు లేకపోవడం వలన రవాణా కష్టాలు ఏర్పడుతున్నాయని, ములుగు పట్టణానికి వచ్చే ప్రజలకు విశ్రాంతి కోసం పబ్లిక్ గార్డెన్ ఏర్పాటు చేయాలని సూచించారు
తద్వారా ఆయన ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు రాజీవ్ యువ వికాస్ కింద లోన్లు,
గృహలక్ష్మి పథకం కింద ప్రతి గృహిణికి ₹2500,
ఆరు గ్యారెంటీలు, 420 హామీలు —
తప్పనిసరిగా అమలు చేయాలని, లేకుంటే బిజెపి మండల & జిల్లా ఆధ్వర్యంలో భారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతలపూడి భాస్కర్ రెడ్డి, రాష్ట్ర ఎస్టీ మోర్చా ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, రాష్ట్ర ప్రతినిధి స్వరూప, జిల్లా ప్రధాన కార్యదర్శి శీలమంతుల రవీంద్రాచారి, ఉపాధ్యక్షులు జినుకల కృష్ణారావు, జిల్లా ప్రతినిధి సూర్యదేవర విశ్వనాథ్, కోశాధికారి గంగిశెట్టి రాజ్ కుమార్, కార్యాలయ కార్యదర్శి దొంతి రవి రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు ఇమ్మడి రాకేష్ యాదవ్, జిల్లా నాయకులు లవన్ కుమార్, నగరపు రమేష్, ఎలుకతుర్తి శ్రీహరి, యాద సంపత్, ప్రమోద్, మండల ప్రధాన కార్యదర్శులు లకావత్ రాజ్ కుమార్, కుక్కల పవన్, ఉపాధ్యక్షుడు ఏరువ పాపిరెడ్డి, నాయకులు ఒజ్జల కిరణ్, ఆకుల రాజేందర్, బండి రవీందర్ తదితరులు పాల్గొన్నారు

మరిపెడలో గణేష్ మండపాలకు ఆన్లైన్ అనుమతులు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-85.wav?_=8

శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రులు జరుపుకోవాలి

తొర్రూరు డిఎస్పి కృష్ణ కిషోర్

భద్రత,బందోబస్తు కొరకే గణేష్ ఆన్లైన్ నమోదు విధానం

సి ఐ రాజ్ కుమార్ గౌడ్,ఎస్సై సతీష్ గౌడ్

మరిపెడ నేటిధాత్రి

మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణం మరియు మండలంలో గణేష్ మండపాల ఏర్పాటు,నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు తెలంగాణ పోలీసు శాఖ వారు రూపొందించిన పోర్టల్ పోలీస్ పోట్రల్.టిఎస్ పోలీస్.గౌట్.ఇన్ (https://policeportal.tspolice.gov.in/)నందు ధరఖాస్తు చేసుకోవాలని తొర్రూరు డిఎస్పి కృష్ణ కిషోర్ సీఐ.రాజ్ కుమార్ గౌడ్, ఎస్సై సతీష్ గౌడ్, తెలిపారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆన్లైన్ నందు అనుమతులు తీసుకోవడం వల్ల మండపాల ఎక్కడ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారనే పూర్తి సమాచారం పోలీసు శాఖ వద్ద ఉంటుందని నవరాత్రి ఉత్సవాలు ముగిసే వరకు పోలీసు భద్రత కల్పించడం సులభంగా ఉంటుందన్నారు.మండపం నిర్వహణ,మండపంనకు సంబంధించిన సమాచారం సులభతరం అవుతుందని తద్వారా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత మరియు బందోబస్తు ఏర్పాటు చేయడానికి పోలీసులకు సులువుగా ఉంటుందన్నారు.పోలీస్ శాఖ ఆన్లైన్ ద్వారానే అనుమతి మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దయనంద్, తాసిల్దార్ కృష్ణవేణి, మండలంలోని పలు గ్రామాల్లో నీ మండపాల నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

మల్లక్కపేట గ్రామంలో బిఆర్ఎస్ గ్రామ సన్నాహక సమావేశం.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-25T153331.404.wav?_=9

 

మల్లక్కపేట గ్రామంలో బిఆర్ఎస్ గ్రామ సన్నాహక సమావేశం

పరకాల నేటిధాత్రి

 

స్థానిక ఎన్నికల్లో బిఆర్ఎస్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి అన్నారు.సోమవారం బిఆర్ఎస్ గ్రామ సన్నాహక సమావేశం మండల అధ్యక్షులు చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని మల్లక్కపేట గ్రామంలో బిఆర్ఎస్ సమన్వయ కమిటీ నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో అయన మాట్లాడుతూ రాబోయే స్థానిక ఎన్నికలలో బిఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.ప్రజలలో బిఆర్ఎస్ కున్న అభిమానాన్ని ప్రతి ఒక్కరు గుర్తించి మనలో మనకు పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకొని అతడికి ప్రతి ఒక్కరం సహకరించాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పరకాల పిఎసిఎస్ చైర్మన్ నాగయ్య,సమన్వయ కమిటీ సభ్యులు ఆముదలపెల్లి అశోక్,కోరే రమేష్,మండల యూత్ అధ్యక్షులు శాతరాశి సనత్ పటేల్,గ్రామ నాయకులు,యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

కేసముద్రంలో ప్రమాదకర కరెంటు స్తంభాలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-84.wav?_=10

ప్రమాదకరంగా కరెంటు స్తంభాలు

గట్టిగా గాలి వీస్తే…! నేల కూలెన్…?

ఎవరిని బలికొంటాయో…? ఈ విద్యుత్ స్తంభాలు

విద్యుత్ అధికారులు దృష్టి సారించాలంటున్న ప్రజలు

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మున్సిపల్ పరిధిలోని కేసముద్రం విలేజ్ లో అనేక వీధులలో విద్యుత్ స్తంభాలు శిథిలావస్థలో నెలకొని ఉన్నాయి, ఎన్నో సంవత్సరాల క్రితం విద్యుత్ స్తంభాలు నిర్మాణం జరిగిందని అప్పటినుంచి నేటి వరకు విద్యుత్ స్తంభాల నిర్మాణం చేపట్టకపోవడంతో, ఏళ్ల తరబడి తీగల బరువు భరిస్తున్న విద్యుత్ స్తంభాలు ఇక మేము భరించలేమంటున్నట్టు దృశ్యం కనబడుతుందని ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.స్తంభం మొదలులో సిమెంట్ కాంక్రీట్ పూర్తిగా దెబ్బతిని ఇనుప చూవలు బయటకు తేలి తుప్పు పట్టి ప్రమాదకరస్థాయిలో ప్రజలకు హెచ్చరిస్తున్నట్టు ప్రతిబింబిస్తున్నాయి, అసలే వర్షాకాలం గట్టిగా గాలివాన వేస్తే ఎవరి ఇంటి మీద పడతాయో ఎవరి ప్రాణాలు బలి కొంటాయో అని సమీపంలోని నివాస ప్రజలు ఆందోళన చెందుతున్నారు.ఒకటి రెండు కాదు రజక బజార్ మున్నూరు కాపు బజార్ లలో కరెంటు స్తంభాల పరిస్థితి ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని ప్రజలు వాపోతున్నారు.

Dangerous Power Poles

దీనికి తోడు సిటీ కేబుల్ యజమానులు ఇష్టా రీతిగా కేబుల్ వైర్లను స్తంభాలకు బిగించి లాగడంతో ఎటు విద్యుత్ సరఫరా వైర్లు అటు కేబుల్ టీవీ ఇంటర్నెట్ వైర్లు భారం పడడంతో విద్యుత్ స్తంభాలు పూర్తిగా వంగి ప్రమాదకరంగా కనబడుతున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్ అధికారులు దృష్టి సారించి ప్రమాదకరంగా ఉన్నటువంటి విద్యుత్ స్తంభాలను తొలగించి అదే స్థానంలో కొత్త కరెంటు పోల్స్ ను నెలకొల్పాలని కేసముద్రం రజక బజార్, మున్నూరు కాపు బజార్ ప్రజలు కోరుకుంటున్నారు.

నేషనల్ హైవే అథారిటీ అధికారులతో కలిసి స్థల పరిశీలన.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-25T152634.590.wav?_=11

 

నేషనల్ హైవే అథారిటీ అధికారులతో కలిసి స్థల పరిశీలన

జహీరాబాద్ నేటి ధాత్రి;

 

హైదరాబాద్ – నాందేడ్ నేషనల్ హైవేపై అండర్‌పాస్‌ల, ఫ్లై‌ఓవర్ల నిర్మాణం కోసం,నేషనల్ హైవే అథారిటీ అధికారులతో కలిసి స్థల పరిశీలన చేసిన ఆరోగ్యశాఖ మంత్రివర్యులు దామోదర్ రాజనర్సింహ మరియు జహీరాబాద్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి పాల్గొన్నారు,

ప్రజావాణిలో సమస్యల పరిష్కార హామీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-83-1.wav?_=12

ప్రజావాణిలో ఐదుగురి సమస్యలు, తహసిల్దార్ హామీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

ప్రతీ సోమవారం ఝరాసంగం మండల కేంద్రంలోని తహసీల్దార్‌ లేదా ఎంపీడీవో కార్యాలయాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని అధికారులు నిర్వహిస్తున్నారు. తహసిల్దార్ కార్యాలయం ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో కార్యక్రమంలో ఐదుగురు తమ సమస్యలను విన్నవించారు. వాటిని వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తహసిల్దార్ తిరుమల రావు హామీ ఇచ్చారు.అధికారులు
ఎంపిడిఓ మంజుల డిప్యూటీ ఎమ్మార్వో కరుణాకర్ రావు వ్యవసాయ అధికారి వెంకటేశం, ఆర్ఐ రామారావు, స్పెషల్ ఆఫీసర్, పశు వైద్యాధికారి హర్షవర్ధన్ రెడ్డి, హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మాస్ సంస్థ బిద్దు విద్యార్థికి ఆర్థిక సాయం అందించింది.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-25T151832.193-1.wav?_=13

 

దళిత బిడ్డల అభ్యున్నతికి మరియు చదువులో ఉన్నత స్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతో కృషి చేస్తున్న సంస్థ మాస్…

వర్దన్నపేట (నేటిధాత్రి ):

 

వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామానికి చెందిన బరిగెల కావేరి వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాల లో బీటెక్ రెండోవ సంవత్సరం చదువుతుంది.చదువులో ఎంతో ప్రతిభ ఉన్న ఆర్ధికంగా వెనకబడి ఉన్న కుటుంభం తండ్రి లేక ఇద్దరి అమ్మాయిలను చదివిస్తున్న తల్లి.వీరి కుటుంభం నేపథ్యం తెలుసుకున్న డా”విక్రమ్ కుమార్ మహా ఆది సేవ సంస్థ సభ్యులకు తెలియజేయగా ఈ రోజు సంస్థ నుండి విద్యార్థికి కళాశాల ఫీజు మరియు పుస్తకాల అవసరానికి సంస్థ నుండి 10,000 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా డా’ విజయ్ కుమార్ మాట్లాడుతూ డా బి.ఆర్ అంబేద్కర్ గారి పిలుపైన “పే బ్యాక్ టు థి సొసైటీ” అనే సిద్ధాంతం మీద మాస్ గత 5 సంవత్సరాలుగా దాదాపు 205 మంది మాదిగ జాతి బిడ్డలైన పేద విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని అలువాల విజయకుమార్ తెలిపారు.ఈ కార్యక్రమంలో మాస్ సంస్థ సభ్యులు డా”విజయకుమార్,డా సీనపల్లి విక్రమ్ కుమార్,డా”శివ శంకర్,సాఫ్ట్వేర్ సీనపెల్లి హరీష్,గాయాల సుమన్,జోగుల సంపత్,వేల్పుల కార్తీక్ తదితరులు పాల్గొన్నారు…

సామాజిక న్యాయానికి మండల్ కమిషన్…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-81-1.wav?_=14

మండల్ కమిషన్ సిఫారసుల అమలుతోనే సామాజిక న్యాయం

*నేటి ధాత్రి.

కేయూ క్యాంపస్*
మండల్ కమిషన్ సిఫారసులతోనే ఇతర వెనకబడిన తరగతులకు కేంద్ర విద్యా ఉద్యోగాలలో 27 శాతం రిజర్వేషన్లు అమలులోకి వచ్చాయని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపల్ సుంకర జ్యోతి అభిప్రాయపడినారు, డాక్టర్ తిరునహరి శేషు ఆధ్వర్యంలో యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జరిగిన బీపీ మండల్ 107వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ప్రొఫెసర్ జ్యోతి మాట్లాడుతూ రెండవ వెనుకబడిన తరగతుల చైర్మన్ గా మండల్ కమిషన్ సిఫారసుల మేరకే ఓబీసీ లకి కేంద్ర విద్యా ఉద్యోగాలలో రిజర్వేషన్లు సాధ్యమైనాయని అభిప్రాయపడినారు. మండల్ కమిషన్ సిఫారసుల ప్రకారంగా కేంద్ర విద్యా ఉద్యోగాలలో 27 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి కానీ కేంద్ర విద్యా ఉద్యోగల లో ఓబీసీలకు రిజర్వేషన్లు 22 శాతానికి మించి దక్కటం లేదని అభిప్రాయపడినారు. బీసీ నాయకులు డాక్టర్ తండు నాగయ్య మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన ఈ ఏడు దశాబ్దాల కాలంలో కాక కలేల్కర్ కమిషన్ రిపోర్ట్ కానీ మండల్ కమిషన్ రిపోర్ట్ కానీ జస్టిస్ రోహిణి కమిషన్ రిపోర్ట్ లను అమలు చేయటానికి ప్రభుత్వాలు ముందుకు రాకపోవడం వలన ఓబీసీలకు అన్యాయం జరుగుతుందని అభిప్రాయబడినారు. మండల్ కమిషన్ నివేదికని పూర్తిస్థాయిలో అమలుపరచినప్పుడే దేశంలో సామాజిక న్యాయం సాధించబడుతుందని అభిప్రాయపడినారు. బిసి నాయకులు డాక్టర్ ఎర్రబొజ్జు రమేష్ మాట్లాడుతూ జనగణలో భాగంగా జాతి ఆధారిత కుల గణన జరగాలని కాక ఖలేల్కర్ కమిషన్ మండల్ కమిషన్లు సిఫారసు చేసినా ఆ దిశగా నిర్ణయాలు తీసుకోవటానికి ప్రభుత్వలకు ఏడు దశాబ్దాల సమయం పట్టిందంటే ఓబీసీల అభివృద్ధి సంక్షేమం పట్ల ప్రభుత్వాల వైఖరి తేటతెల్లమవుతుందని విమర్శించినారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కరుణాకర్ డాక్టర్ ఫిరోజ్ డాక్టర్ వెన్నంపల్లి విజయకుమార్ డాక్టర్ లక్ష్మీనారాయణ డాక్టర్ దాసు డాక్టర్ శ్రీలత డాక్టర్ రమేష్ డాక్టర్ స్వామి డాక్టర్ జయప్రకాశ్ డాక్టర్ తాళ్లపల్లి సంజీవ్ డాక్టర్ సదానందం డాక్టర్ కొమురయ్య, కళాశాల విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ వద్దిరాజుకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సిబ్బంది.

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-25T150954.169-1.wav?_=15

 

ఎంపీ వద్దిరాజుకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సిబ్బంది
Date 25/08/2025

బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్రకు ఆయన సిబ్బంది వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.వినాయక చవితి సందర్భంగా ఎంపీ రవిచంద్ర వ్యక్తిగత సిబ్బంది బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని ఆయన నివాసం వద్ద నవరాత్రోత్సవాలు ఘనంగా జరపాలని నిర్ణయించారు.ఈ సందర్భంగా వీఆర్సీ యూత్ అసోసియేషన్, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ముకుంద అనిల్ పటేల్,మల్యాల శేఖర్,ముడ్డంగుల కృష్ణ,గుగులోతు నవీన్,యరగాని పృథ్వీ,అనంతుల శ్రీనివాస్,ధూదిగామ సాత్విక్ తదితరులు ఎంపీ రవిచంద్రను సోమవారం కలిశారు.ఈ ఉత్సవాల ప్రారంభం సందర్భంగా గణనాథునికి జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమానికి కుటుంబ సభ్యులతో కలిసి హాజరు కావలసిందిగా కోరుతూ ఎంపీ రవిచంద్రను వారు ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎంపీ వద్దిరాజు వారికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

కబడ్డీ, రెజ్లింగ్ క్రీడాకారులకు హెల్త్ క్యాంపు..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-80-1.wav?_=16

కబడ్డీ,రెజ్లింగ్ క్రీడాకారులకు హెల్త్ క్యాంపు

నర్సంపేట,నేటిధాత్రి:

జాతీయ క్రీడా దినోత్సవం ఉత్సవాలలో భాగంగా కలెక్టర్,క్రీడాశాఖ ఆదేశాల మేరకు వరంగల్ జిల్లా యువజన క్రీడల అధికారిని టీవీఏల్ సత్యవాణి ఆధ్వర్యంలో నర్సంపేట మిని స్టేడియం లో సోమవారం కబడ్డీ రెజ్లింగ్ క్రీడాకారులకు హెల్త్ క్యాంపు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్జిఎఫ్ఐ సెక్రెటరీ సోనబోయిన సారంగపాణి,రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్, నర్సంపేట జోన్ కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గండి నర్సయ్య గౌడ్,సీనియర్ కబడ్డీ క్రీడాకారుడు నర్సంపేట మండల కబడ్డీ అసోసియేషన్ ఉపాధ్యక్షులు పుల్లూరి స్వామి గౌడ్,డాక్టర్ సాదిక్, కబడ్డీ ఇంచార్జ్ కోచ్ యాట రవికుమార్, రెజ్లింగ్ ఇంచార్జ్ కోచ్ సిరపురపు మహేష్ క్రీడాకారులు పాల్గొన్నారు.

రైతులకు షరతులు లేకుండా యూరియా – బీఆర్ఎస్ డిమాండ్..

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-79-1.wav?_=17

షరతులు లేకుండా రైతులకు యూరియా అందించాలి

రైతుల పక్షాన నిరసన తెలిపిన బీఆర్ఎస్ నాయకులు

వ్యవసాయ ఆధికారికి వినతి పత్రం అందజేత

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.నేటిధాత్రి…

రైతులు పండించే పంటలకు షరతులు లేకుండా యూరియా అందించాలని బిఆర్ఎస్ పార్టీ
పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య అన్నారు సోమవారం
మండల కేంద్రంలో రైతులతో కలిసి ప్రధాన రహదారి పై నిరసన తెలిపారు.ఈ సందర్భంగా విలేకరుల సమావేశంతో రావుల సోమయ్య మాట్లాడుతూ.తప్పుడు హామీలతో గద్దినెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచిన రైతులను పట్టించుకునే పరిస్థితి లేదని ఆవేదం వ్యక్తం చేశారు.రైతులు పండించే పంటలకు సకాలంలో యూరియా కూడా సరఫరా చేయలేని దినస్థితిలో ఈ ప్రభుత్వం కళ్ల మూచుకొనీ ఉందన్నారు.అనంతరం రైతుల సమస్యలను పరిష్కరించి,సకాలంలో ఎరువులు అందించాలని రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు వ్యవసాయ అధికారికి వినతి పత్రం అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు,రైతులు తదితరులు పాల్గొన్నారు.

ఝరాసంగం నుండి మేదపల్లి వెళ్ళే రోడ్ బాగు చేయాలి…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-25T135945.326-1.wav?_=18

 

ఝరాసంగం నుండి మేదపల్లి వెళ్ళే రోడ్ బాగు చేయాలి

◆:- సిఐటియు ఆధ్వర్యంలో ఆర్డిఓ ఆఫీస్ ఏవో కి వినతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ నియోజక వర్గం ఝరాసంగం నుండి మెదవల్లి వెళ్లే రోడ్డు వూర్తిగా గుంతల మయంగా మారిందని, తక్షణమే కొత్త రోడ్డు వేయాలని, సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్.మహిపాల్ డిమాండ్ చేశారు. ఈ సమస్య పరిష్కారం చేయాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆర్డిఓ కార్యాలయం ఏవో కి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మహిపాల్ మాట్లాడుతూ గత అనేక సంవత్సరాలుగా ఈ రోడ్డును కనీసం పట్టించుకున్న నాధుడు లేకపోవడం, అధికారులు ప్రజావ్రతినిధులు ఈ రోడ్డును ఎందుకు వట్టించుకోవడం లేదో సమాధానం ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఇబ్బందులు జరుగుతున్నా వట్టించుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు ఝరాసంగం మండల నాయకులు సురేష్, ఇతరులు నరేష్, శ్రీకాంత్, బాల్ రాజ్, నజీర్, సాయి కిరణ్ గౌడ్, తదితరులున్నారు.

రేషన్ డీలర్ల బంద్ పిలుపు – వనపర్తి వినతి…

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-78-1.wav?_=19

వనపర్తి జిల్లా లోని బందుకు వచ్చే నెల 5 న పిలుపు నిచ్చిన రేషన్ డీలర్ల

వనపర్తి నేటిదాత్రి .
ఏప్రిల్ నెల నుండి 5 నెలలుగా ప్రభుత్వం రేషన్ డీలర్లకు కమీషన్ చెల్లించ నందుకు రేషన్ డీలర్లు వచ్చే నెల 5 న బంధు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు నిచ్చారని వనపర్తి జిల్లా లో కూడా రేషన్ డీలర్లు బందు పాటించాలని తహశీల్దార్ కు
వినతిపత్రం అందజేశారు
ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో రేషన్ డీలర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరారు
ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా రేషన్ డీలర్ల సంఘము అధ్యక్షులు బచ్చు రాం డీలర్ల నరేష్ వెంకట్ రెడ్డి ప్రవీణ్ రాఘవేంద్ర నరసింహారెడ్డి సత్య రెడ్డి పాల్గొన్నారు

వసతి గృహాల మరమత్తులకు రూ. 3.30 కోట్లు..

 

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-2025-08-25T135311.419.wav?_=20

వసతి గృహాల మరమత్తులకు రూ. 3.30 కోట్లు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లాలోని 33 సాంఘిక సంక్షేమ వసతి గృహాల మరమ్మత్తుల కోసం రూ.3.30 కోట్ల నిధులు మంజూరు అయినట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి తెలిపారు. ఒక్కో వసతి గృహానికి రూ.10 లక్షల చొప్పున కేటాయించిన ఈ నిధులతో సివిల్ పనులు, ఎలక్ట్రికల్ పనులు, ప్రహరీ గోడల నిర్మాణం, బాత్రూమ్, టాయిలెట్ రిపేరింగ్, పెయింటింగ్ వంటి పనులు చేపడతామని ఆయన వివరించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version