ఉచిత కంటి వైద్య శిబిరం, ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రారంభం
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పర్యటన సందర్భంగా, శుక్రవారం ఉదయం విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పట్టణ ఎస్ఐ వినయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఆదర్శ్ నగర్, పస్తుపూర్ జంక్షన్లలో ట్రాఫిక్ సిగ్నల్స్ ప్రారంభించారు. అలాగే, ఎస్వీ ఫంక్షన్ హాల్లో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేసి, దృష్టి లోపం ఉన్నవారికి ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కవర్ చేయాలని పోలీస్ శాఖ విజ్ఞప్తి చేసింది.
