కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి…

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి.

#పరిపాలనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలం.

#బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

రెండున్నర ఏండ్ల కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన పూర్తిగా విఫలం అయిందని బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ అన్నారు. మంగళవారం రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంతో మండల పార్టీ ఆధ్వర్యంలో తహసిల్దార్ ముప్పు కృష్ణకు వినతి పత్రం అందజేశారు. ఈ మేరకు వినయ్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలను ఇవ్వడం జరిగింది కానీ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏండ్లు కావస్తున్న ఇప్పటివరకు ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయలేదని. ముఖ్యంగా యువతకు జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, వృద్ధప్య, వితంతు, దివ్యాంగులకు పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, పేదలకు గృహ నిర్మాణ పథకం, రైతులకు రైతు భరోసా, భూ సమస్యల పరిష్కారం వంటి అనేక హామీలు ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటికీ హామీలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు రైతు భరోసా సమయానికి అందకపోవడంతో రైతులు తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని. పంట పెట్టుబడుల కోసం అప్పులపై ఆధార పడవలసిన పరిస్థితి రైతుకు నెలకొందని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర లేచి రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని లేదంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రంగాపురం గ్రామ సర్పంచ్ ఓరుగంటి మాధురి రాజు, జిల్లా కౌన్సిల్ మెంబర్ బొద్దిరెడ్డి ప్రతాపరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి ఈర్ల నాగరాజు, ఉపాధ్యక్షుడు బత్తిని కుమారస్వామి, నాయకులు సింగిరెడ్డి యాదగిరి, ఓదెల అశోక్, మురికి మనోహర్, వల్లే పర్వతాలు, బోట్ల ప్రతాప్, కొండ్లె రమేష్, క్రాంతి కుమార్, నరేష్, అనిల్, మధు, వీరన్న తదితరులు పాల్గొన్నారు.

ఖిల్లా ఘనపూర్ మండల కేంద్రంలో ప్రజా సమస్యలపై ర్యాలీ

ఖిల్లా ఘనపూర్ మండల కేంద్రంలో ప్రజా సమస్యలపై ర్యాలీ
వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి నియోజకవర్గ ఘనపురం మండల కేంద్రంలోప్రజా సమస్యలపై ర్యాలీ నిర్వహించి తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా కొద్దీ సేపు ధర్నా చేశారు

కల్వకుర్తి పురపాలక అధికారుల…

కల్వకుర్తి పురపాలక అధికారుల
మోసాలకు అంతు లేదా…!

కల్వకుర్తి/ నేటి ధాత్రి :

పని చేయని వారికి నెలనెలా జీతాలు… అధికంగా తైబజారు వసూళ్లు…
కల్వకుర్తి పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో పనిచేయని వ్యక్తులకు నెల నెల జీతాలు ఎలా…? అరెకంటి మహేశ్వరి ఆమె అచ్చంపేట వాస్తవ్యురాలు, ఆమె పురపాలక విధుల్లోకి చేరకుండానే కల్వకుర్తి పురపాలక కార్యాలయం ద్వారా ఆమె అకౌంట్లో నెల నెల రూ. 15,600లు గత 8 నెలలుగా ఆమెకు జీతం చెల్లిస్తున్నారు. ఆరెకంటి మహేశ్వరి గారు అదనపు కలెక్టర్ దేవ సహాయం (LBs) కార్యాలయ పరిధిలోని క్వాటర్స్ లో వంట మనిషిగా (అవుట్సోర్సింగ్) పనిచేస్తుంది. అలాంటిది ఆమెకు కల్వకుర్తి పురపాలక సంఘ అధికారుల వారు నేరుగా ఆమె అకౌంట్లో నెల నెల జీతం వేయడం విడ్డూరమని పట్టణవాసులు విడ్డూరంగా చర్చించుకుంటున్నారు.

 

 

ఇటీవలే పట్టణంలోని సామాజిక కార్యకర్త ఈ విషయాన్ని ప్రశ్నించగా, పురపాలక కమిషనర్ వారు అతనిని భయబ్రాంతులకు గురి చేయడమే కాకుండా, వారి యొక్క తాత్కాలిక కట్టడమైన చిన్న రేకుల షెడ్డును కూల్చి వేస్తానని దానికి పర్మిషన్ లేదని, వారికి నోటీసులు ఇవ్వకుండా వారి చిన్న రేకుల షెడ్డు గోడకు నోటిసు అతికించారు. తాత్కాలిక కట్టడాలకు పరిమిషన్లు అవసరం లేదని పురపాలక చట్టం 1965 & 2019 చెబుతుంది. ఆ విషయాలు కూడా తెలియని వారు పురపాలక కమిషనర్ గా పనిచేయడం వృతికే సిగ్గుచేటు అని పలువురు గుసగుసలాడుతున్నారు. అంతేకాకుండా చిరు వ్యాపారులు తైబజార్ పేరిట అధికంగా వసూలు చేస్తున్నారని అధికారులకు ఎంత విన్నవించుకున్న పట్టించుకోవడంలేదని పట్టణ ప్రజలు విచారణ వ్యక్తం చేస్తున్నారు. పది రూపాయలు వసూలు చేయవలసిన వ్యాపారానికి 40 రూపాయలు తైబజార్ వసూలు చేయడం. అలాగే 30 రూపాయలు తైబజారు వసూలు చేయవలసిన టిఫిన్ సెంటర్లకు వంద రూపాయలు తైబజార్ వసూలు చేస్తున్నారు. పుర అధికారులకు ప్రజలు ఎన్నో మార్లు విన్నవించిన పట్టించుకోవడం లేదు. ఈ తైబజార్ కాంట్రాక్టర్లపై చర్య తీసుకోవడం లేదని అధిక వసూలులో పురపాలక కమిషనర్ యొక్క పాత్ర ఎంతైనా ఉందని, అందుకే పట్టించుకోవడంలేదని ప్రజలు వాపోతున్నారు. ప్రతిరోజు వసూలు చేసిన డబ్బులను అవుట్సోర్సింగ్ లేక పర్మినెంట్ ఉద్యోగులు మేనేజర్ గారికి లెక్క కట్టి జమ చేయాలి, అలా జమ చేయకుండా రెండు నెలలు తన సొంత ఆసరాలకు వాడుకున్నందుకు దేవర్ల శ్రీనివాసును అప్పటి ఇప్పటి మేనేజర్ అయిన ఫాని రాజాకుమారి నూరీ గారు అతనిని సస్పెండ్ చేయించి, ఒక ఇంక్రిమెంట్ కట్ చేసి కొల్లాపూర్ కు ట్రాన్స్ఫర్ చేయించినారు. 68 లక్షల ఒక సంవత్సరం పాటు వాడుకొని అరకొర జమ చేసిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలో మేనేజర్ ఫణి రాజకుమారి నూరి గారు ఆత్మ పరిశీలన చేసుకోవాలని పట్టణ ప్రజలు వాపోతున్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version