నర్సంపేటలో నిజమైన ప్రత్యామ్నాయం బీజేపీయే

నర్సంపేటలో నిజమైన ప్రత్యామ్నాయం బీజేపీయే.

జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్

రాణా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో భాజపాలో చేరికలు.

నర్సంపేట,నేటిధాత్రి:

రాబోయే రోజుల్లో రాజకీయంగా నర్సంపేటలో నిజమైన ప్రత్యామ్నాయం బీజేపీయే అని వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ అన్నారు.త్వరలో జరగబోయే మున్సిపాలిటీ ఎన్నిక నేపథ్యంలో నర్సంపేట నియోజకవర్గ ఎన్నికల వార్డు ఇన్చార్జుల పోటీకి సిద్ధమైన అభ్యర్థుల విజయ సంకల్ప సభ బిజెపి పట్టణ కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్,నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి శ్రీమతి రావు పద్మ, జిల్లా ఎన్నికల కో కన్వీనర్ కంభంపాటి పుల్లారావు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.అనంతరం జిల్లా పార్టీ అధ్యక్షులు రవికుమార్ మాట్లాడుతూ నర్సంపేట మున్సిపాలిటీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని తెలుపుతూ నాయకులకు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయడం జరిగిందన్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ప్రవేశపెట్టిన ప్రతి పథకానికి ప్రతి ఇంటికి చేరవేసేలా ప్రతి కార్యకర్త కంకణబద్ధంగా పనిచేయాలని సూచించారు. బిజెపికి 60 శాతం ఓట్లు వేయించే విధంగా ప్రణాళిక చేసుకోవాలని కోరారు. గతంలో బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ అభివృద్ధికి చేసిన ఉద్యమాలు ప్రజలకు ఒక్కసారి గుర్తుచేసి ఓటు అడగాలని అన్నారు. రాబోవు ఎన్నికలకు సంబంధించిన కార్యాచరణపై స్థానిక నాయకులతో కలసి చర్చించారు.

బీజేపీ పార్టీలో భారీగా చేరికలు..

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని సర్వపురం 5వ,6వ వార్డులలో కాంగ్రెస్,బిఆర్ఎస్ పార్టీల నుండి యువనాయకుడు అంజపెల్లి రాజు అద్వర్యలో జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి నాయకత్వంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్ అధ్యక్షతన పార్టీలో చేరగా జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్, నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి రావు పద్మ, జిల్లా ఎన్నికల కో కన్వీనర్ కంభంపాటి పుల్లారావులు పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు.మున్సిపాలిటీలో కాషాయం జెండా ఎగరడం ఖాయం అని అత్యధిక స్థానాల్లో బీజేపీ విజయం ఖాయమని జిల్లా పార్టీ అధ్యక్షులు గంట రవికుమార్ ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎన్నికల కో కన్వీనర్ వడ్డేపల్లి నరసింహులు, జిల్లా ప్రధాన కార్యదర్శి బాకం హరిశంకర్, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ తాబేటి వెంకట్ గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్, గడల కుమార్, కందిమల్ల మహేష్, బాల్నే జగన్,జిల్లా కార్యదర్శులు గుడుపూడి రాధాకృష్ణ, గోకే వెంకటేష్, మంద శ్రీనివాస్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు పోలేపాక మార్టిన్ లూథర్, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు ఎర్రగోల్ల భరత్ వీర్, మండల అధ్యక్షులు గూడూరు సందీప్, జిల్లా నాయకులు బండి సాంబయ్య యాదవ్, కనుకుంట్ల రంజిత్ కుమార్, ఎరుకల రఘునారెడ్డి పొట్టి శ్రీనివాస్ గుప్తా, నియోజకవర్గ నాయకులు శీలం సత్యనారాయణ, జుర్రు రాజు, కొనుముల పృధ్వీరాజ్, పంజర్ల రామ్, పొదిళ్ళ రామచందర్ మరియు మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

“నర్సంపేటలో వైభవమైన పల్లివేట”

వైభవంగా అయ్యప్పస్వామి పల్లీవేట కార్యక్రమం

పల్లివేట దాతగా డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి

అయ్యప్పస్వామి నామస్మరణతో మారుమ్రోగిన నర్సంపేట

కార్యక్రమం నిర్వహణ శబరిమలై దేవాలయ మేల్ శాంతి,తాంత్రికవేత్త శంకరన్ నంబూద్రి

నర్సంపేట, నేటిధాత్రి:

 

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని శ్రీధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం సిల్వర్ జూబ్లీ మండల పూజల మహోత్సవాల్లో భాగంగా సోమవారం అయ్యప్ప స్వామి పల్లి వేట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. పల్లివేట,మహా అన్నదానదాతగా భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి వ్యవహరించగా అయ్యప్ప స్వామి సర్వ సైన్యాధ్యక్షునిగా రాణా ప్రతాప్ రెడ్డి శిష్యుడు బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్ వ్యవహరించారు. నర్సంపేట శ్రీ ధర్మశాస్త అయ్యప్పదేవాలయ సేవా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సింగరికొండ మాధవ శంకర్, అధ్యక్షులు సైఫా సురేష్,ప్రధాన కార్యదర్శి చింతల కమలాకర్ రెడ్డి,కోశాధికారి దొడ్డ రవీందర్ గుప్తా

ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి పల్లివేట కార్యక్రమం నిర్వహించగా కార్యక్రమ నిర్వహణ శబరిమలై దేవాలయ మేల్ శాంతి,తాంత్రికవేత్త శ్రీమాన్ బ్రహ్మశ్రీ, శంకరన్ నంబూద్రి, హైదరాబాద్ మహా శాస్త్ర సేవ సంఘం ట్రస్ట్ బాధ్యులు,గురుస్వామి డాక్టర్ సుధగాని రాజుగౌడ్, నర్సంపేట దేవాలయ ప్రధాన అర్చకులు దేవేశ్ మిశ్రా వేదమంత్రాలతో చేశారు. ముందుగా దేవా ట్రస్టు ఆధ్వర్యంలో గణపతి హోమం తోపాటు పలు ప్రత్యేక పూజలను నిర్వహించారు.ముఖ్య అతిథిగా జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ నాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం రాణా ప్రతాప్ రెడ్డి అనుచరుడు బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి అచ్చ దయాకర్ అయ్యప్ప స్వామి విగ్రహాన్ని తలపై ఎత్తుకొని అలంకరణ చేసిన ఊరేగింపు ప్రత్యేక వాహనాల్లో కూర్చోబెట్టారు. ఈ సందర్భంగా శబరిమలై నుండి హాజరైన వాయిద్య కళాకారులు, మనిషి వివిధ వేషాదారణలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

అయ్యప్పస్వామి ఊరేగింపుగా పట్టణంలోని మున్సిపాలిటీ ఆదరణ పార్క్ వద్ద పూంగివనంలో తాంత్రిక వేత్త మేల్ శాంతి శంకరన్ నంబూత్రి ప్రత్యేక పూజలు చేశారు. అయ్యప్ప స్వామి పల్లివేటలో భాగంగా మున్సిపాలిటీ ప్రాంగణం ఏర్పాటుచేసిన ప్రత్యేక సెట్టులో అచ్చ దయాకర్ అయ్యప్ప విగ్రహాన్ని తలపై ఎత్తుకొని వేటకు వెళ్లే విధానాన్ని ప్రదర్శించారు.నర్సంపేట పట్టణంలో ఎక్కడ చూసినా కాషాయ జెండాలే ఆగుపడ్డాయి.ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి మాలదారులు భక్తులు చేపట్టిన అయ్యప్పస్వామి శరణు ఘోషతో పట్టణం మారుమ్రోగింది.

 

డాక్టర్ గోగుల రాణా ప్రతాపరెడ్డి మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గం ప్రజలు రైతులు అన్ని వర్గాలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నట్లు తెలిపారు. ధర్మాన్ని కాపాడడం వల్ల అదే ధర్మం మనల్ని కాపాడుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కమిషనర్ కాట భాస్కర్, పలువురు అధికారులు,రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నరసింహ రాములు , జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్ ,పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రామచంద్ర రెడ్డి,రాష్ట్ర ఓబిసి మోర్చ అధికార ప్రతినిధి గడ్డం ఆంజనేయులు,ములుగు జిల్లా నాయకులు కృష్ణవేణి,మండలాల అధ్యక్షులు, జిల్లా కౌన్సిల్ మెంబర్స్,ప్రధాన కార్యదర్శులు,ఉపాధ్యక్షులు, యువ మోర్చ జిల్లా,నియోజకవర్గ నాయకులు , దేవాలయ గురు స్వాములు,ట్రస్ట్ సభ్యులు, అయ్యప్ప మాలదారులు, భక్తులు, పాల్గొన్నారు.

బిఆర్ఎస్ నాయకుడు బీజేపీలో చేరిక

బిఆర్ఎస్ నుండి బీజేపీలో చేరిక.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

 

మండలంలోని ఆసరవెల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ గ్రామ పార్టీ ఉపాధ్యక్షుడు గుండబోయిన తిరుపతి మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ ఆధ్వర్యంలో గురువారం జిల్లా ప్రధాన కార్యదర్శి డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీలో చేరగా పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు..ఈ సందర్బంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బిజెపి పార్టీ నిధులతోనే గ్రామ అభివృద్ధి సాధ్యమని గ్రహించి బిజెపి పార్టీలో చేరుతున్నారన్నారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో బిజెపి పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే గ్రామలు మరింత అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి యాదగిరి,నాయకులు ఊటుకూరి చిరంజీవి గౌడ్, హుసేన్,కిషన్,సుమన్,వీరన్న,స్వామి,రాజకుమార్,నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version