మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం, నిత్యావసరాలు అందజేత

చనిపోయిన కుటుంబానికి బియ్యంతో పాటు ఆర్థిక సహాయం అందజేసిన నాయకులు…..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

 

తంగళ్ళపల్లి మండలo లొ బదనపల్లి టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీకి చెందిన బూర్ల లక్ష్మీనారాయణ అనారోగ్యంతో మృతి చెందగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్చార్జి కలెక్టర్ గరీమ అగ్రవాల్ స్పందించి వారి కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని ఆదేశించగా.వారి కుటుంబానికి పరామర్శించి. తక్షణ సహాయం కింద బియ్యంతో పాటు ఇతర నిత్యవసర వస్తువులు సరుకులు అందజేసిన అధికారులు. అలాగే ప్రభుత్వపరంగా లక్ష్మీనారాయణ కుటుంబాన్ని ఆదుకుంటామని అధికారులు వెల్లడించారు.ఇట్టి విషయమై మృతుడు లక్ష్మీనారాయణ కుటుంబ పరిస్థితి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కేకే .మహేందర్రెడ్డి ల దృష్టికి తీసుకువెళ్లి. వారి కుటుంబానికి ప్రభుత్వపరంగా సహాయ సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా ఇందిరమ్మ కాలనీ సర్పంచ్ గడ్డం రచన మధుకర్ తెలిపారు. మృతి పై స్పందించి లక్ష్మీనారాయణ మృతి చెందగా వారి కుటుంబానికి కుటుంబానికి. బూర్ల లక్ష్మీనారాయణ కుటుంబాన్ని పరామర్శించి తన వంతు సహాయంగా ఇందిరమ్మ కాలనీ మాజీ ఉపసర్పంచ్.అల్వాల సాయిరాం .స్పందించి లక్ష్మీనారాయణ కుటుంబానికి ఆర్థిక సాయం చేశారు అలాగే. కష్ట సమయంలో ప్రజల కు ఆపద సమయంలో వారి వారి కుటుంబాలకు.అండగా నిలవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఇందిరమ్మ కాలనీ మాజీ ఉపసర్పంచ్ సాయిరాం తెలిపారు ఇట్టి కార్యక్రమంలో. వేముల నరేష్. కిషన్. ప్రశాంత్. నరసయ్య. రాకేష్ నాయకులు గ్రామ ప్రజలు పార్టీలకతీతంగా గ్రామంలో ప్రజలందరూ పాల్గొని పరామర్శించారు

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version