బస్వాపూర్ గ్రామంలో వాలీబాల్ పోటీలు ప్రారంభం

వాలీబాల్ పోటీలు ప్రారంభించిన గ్రామ సర్పంచ్ శేఖర్ రెడ్డి…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

 

తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్ గ్రామంలో. వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. ఇట్టి వాలీబాల్ పోటీల కార్యక్రమాన్ని సంక్రాంతి పండుగ పురస్కరించుకొని. తన తాత అయిన పూర్మాని ఎల్లారెడ్డి జ్ఞాపకార్థం వాలీబాల్ పోటీలు నిర్వహించడం జరుగుతుంది అని. ఇట్టి పోటీలను స్థానిక గ్రామ సర్పంచ్ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందని ఈ పోటీలలో 8 జట్లు పాల్గొన్నట్లు పోటీలలో గెలుపొందిన జట్లకు ప్రథమ ద్వితీయ బహుమతులు అందజేసినట్లు పేర్కొంటూ గ్రామ క్రీడల శరీరక దృఢత్వానికి మానసిక ఉల్లాసానికి ఎంతగానో దోహదం చేస్తాయని. క్రీడలు ఆడటం వల్ల యువకులు మంచి ఫిట్నెస్ సాధిస్తారని స్నేహపూరిత వాతావరణంలో క్రీడలు ఆడుకోవాలని గెలుపోటములు సహజమని. గ్రామస్థాయి క్రీడాకారులు ప్రోత్సహించడానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని. ఇట్టి కార్యక్రమానికి హాజరై యువతకు క్రీడాకారులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని ఈ సందర్భంగా స్థానిక బస్వాపూర్ సర్పంచి. సర్పంచులఫోరం మండల అధ్యక్షులు శేఖర్ రెడ్డి తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి గ్రామ యువకులు ప్రజలు నాయకులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

పోలీసుల ఆధ్వర్యంలో అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్…

పోలీసుల ఆధ్వర్యంలో అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

 

తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్ గ్రామంలో. గ్రామ విపిఓ. H.C.1599. పిఎస్ తంగళ్ళపల్లి. మండలం బస్వాపూర్. గ్రామంలో అవేర్నెస్ ప్రోగ్రాం. కండక్టు మరియు సైబర్ నేరాల గురించి మొబైల్ యాప్ గురించి ఉద్దేశించి మాట్లాడడం జరిగిందని మరియు రేపు సిరిసిల్లలోని. పద్మనాయక కల్యాణ మండపంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని. దానిలో భాగంగా. బస్వాపూర్ విలేజ్ నుంచి ఐదుగురు యూత్ పిల్లలు అటెండ్ కావాలని తెలియజేస్తూ. గ్రామంలోని ప్రజలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పోకుండా. ఏమైనా అసాంఘిక సంఘటన జరిగితే క్రమ దృష్టికి తీసుకురావాలని ప్రజలందరూ ఐకమత్యంగా ఉండాలని ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు పద్మనాయక కళ్యాణ మండపంలో జరిగే రక్తదాన శిబిరంలో ప్రత్యేకంగా పాల్గొనాలని ఈ సందర్భంగా తెలియజేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version