ఉపాధి హామీ కార్యక్రమంలో భాగంగా రోడ్డు మరమ్మత్తులు….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండల అంకుసాపూర్ గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద రోడ్డు మరమ్మత్తు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామంలోనీ. చంద్రవంక మొదటి కాల్వ నుండి గడ్డం అంజయ్య పొలం వరకు ఉన్న రహదారికి .మొరం పోయడంతోపనులను ప్రారంభించారు. ఈ పనుల ద్వారా గ్రామ ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడo తోపాటు రైతులకు వ్యవసాయ కార్యకలాపాలకు. వచ్చే పోయే వారికి అసౌకర్యం లేకుండా ఉండడంతోపాటు వర్షాకాలంలో ఎదురయ్యే రహదారి సమస్యలకు ఇది శాశ్వత పరిష్కారంగా మారుతుందని. ఇట్టి కార్యక్రమాన్ని .అంకుసాపూర్ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద అభివృద్ధి పనులను ప్రారంభించామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి ప్రారంభోత్సవ కార్యక్రమంలో. గ్రామ సర్పంచ్ అచ్చ శ్రీనివాస్ రెడ్డి. ఉప సర్పంచ్ రాజేశం. గ్రామ సెక్రెటరీ సంతోష్. ఫీల్డ్ అసిస్టెంట్ స్వామి. గ్రామ వార్డు సభ్యులు.సవా వణపల్లిబాలయ్య. కార్యం పరిస.రాములు. తుమ్మల కనకయ్య. రేగులశ్రీనివాస్. రోడ్లమధు. కోడి కనకయ్య. గ్రామ ప్రజలు నాయకులు తదితరులు పాల్గొన్నారు
