కార్మిక హక్కులపై ‘కోడ్’ దెబ్బ: శేరిలింగంపల్లి లో మిన్నంటిన నిరసన..

కార్మిక హక్కులపై ‘కోడ్’ దెబ్బ: శేరిలింగంపల్లి లో మిన్నంటిన నిరసన

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-

 

 

దేశవ్యాప్త సమ్మె పిలుపులో భాగంగా గురువారం శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ సర్కిల్ పరిధిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద కార్మిక సంఘాలు భారీ నిరసన ప్రదర్శన చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త లేబర్ కోడ్‌లను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మికులు నినదించారు.
​ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ,ఏఐసీటీయూ,నాయకులు కొంగర కృష్ణ, చందు యాదవ్, సంజీవరెడ్డి, దానయ్య మాట్లాడుతూ, బిజెపి ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని తుంగలో తొక్కి, 29 కార్మిక చట్టాలను నాలుగు కోడ్‌లుగా మార్చడం దుర్మార్గమని నాయకులు మండిపడ్డారు. ఈ కొత్త చట్టాల వల్ల:
​సమాన పనికి సమాన వేతనం అందే అవకాశం లేకుండా పోతుంది.
​ఎనిమిది గంటల పని విధానాన్ని మార్చి, 12 నుండి 13 గంటల వరకు పని చేయించుకునేలా యాజమాన్యాలకు వెసులుబాటు కల్పించారు.
​కార్మికులు తమ హక్కుల కోసం యూనియన్లు పెట్టుకునే స్వేచ్ఛను హరిస్తున్నారు.కార్మికులందరికీ నెలకు కనీస వేతనం ₹26,000 అందించాలి.
​ఈఎస్ఐ, పీఎఫ్, సౌకర్యాలతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలి.
​విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల కుటుంబాలకు ₹25 లక్షల నష్టపరిహారం చెల్లించాలి, ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, మున్సిపల్, వాటర్ బోర్డ్ మరియు ఎలక్ట్రిసిటీ విభాగాలకు చెందిన కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నాయకులు మోహన్ రెడ్డి, శ్రీదేవి, జయ, ఏఐటీయూసీ జిల్లా నాయకులు పర్వతాలు, రామకృష్ణ, శీను, రాములు, సీఐటీయూ జిల్లా నాయకులు మాణిక్యం, శ్రీను, పరమేష్, శాంతయ్య, ఏఐసీటీయూ నాయకులు నారాయణ, సుల్తానా బేగం మరియు రైతు సంఘం నాయకులు తుకారాం నాయక్ తదితరులు పాల్గొని తమ మద్దతు తెలిపారు.

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఉపాధి హామీ కార్మికులతో నిరసన….

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఉపాధి హామీ కార్మికులతో నిరసన….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…..

 

తంగళ్ళపల్లి మండల కేంద్రంలో ఉపాధి హామీ కార్మికులతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తూ. దేశవ్యాప్త సార్వత్రికసమ్మెలో భాగంగా తంగళ్ళపల్లి మండల కేంద్రంతోపాటు మండల జిల్లెల్ల గ్రామంలో ఉపాధి హామీ కార్మికులతో నిరసన కార్యక్రమం చేయడం జరిగిందని. ఈ సందర్భంగా ప్రభుత్వాలు ఉపాధి హామీని వెంటనే కొనసాగించాలని. ఉద్యోగ ఉపాధి భద్రత కల్పించాలని. రైతు పండించిన పంటలకు మద్దతు ధర ఇవ్వాలని. 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని.2025.వ. విద్యుత్ సవరణ .బిల్లురద్దుకై. ప్రభుత్వ రంగ పరిశ్రమల .పరిరక్షణకై కనీసవేతనాల .పెంపుకై. మతోన్మాద. కార్పోరేట్ రాజకీయాలకు .వ్యతిరేకంగా అమాలి కార్మికుల సంక్షేమం బోర్డు ఏర్పాటు చేయాలని. మధ్యాహ్నం భోజనం పథకాన్ని ప్రైవేటుపరం చేయకుండా ఉండాలని. ప్రధానంగా. ఉపాధి హామీ పథకంలో. దేశవ్యాప్తంగా 12 కోట్లమంది.పనిచేసుకునే. జీవనోపాధి .పొందుతున్నారని. మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో 90 వేల మంది ఉపాధి కార్మికులు జీవనోపాధి పొందుతున్నారని.2005లో వామపక్షాలు కాంగ్రెస్ ప్రవేశపెట్టగా. గ్రామీణ ప్రాంతంలో వలస నివారణకు పట్టెడు అన్నం దొరికే అవకాశం ఉన్న పథకం ఉపాధి హామీ పథకం అని. ఈ పథకంలో .12 కోట్లమంది. పనిచేయగా. ఈ పథకాన్ని బిజెపి ప్రభుత్వం నిర్వీవరం. చేయడానికి ఈ పథకానికి 1,50,000 కోట్ల బడ్జెట్ అవసరం ఉండగా కేవలం 85 కోట్ల బడ్జెట్తో కొనసాగించడం మూలంగా ఉపాధి హామీ కార్మికులకు సరైన వేతనాలులేక సమయానికి బకాయిలు పెండింగ్ ఉండడం మూలంగా ఉపాధి హామీ కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందని. సంవత్సరంలో 200 రోజుల పరిధిలో కల్పించాలని రోజుకు 600 రూపాయలు ఇవ్వాలని. తెలియజేస్తూ .బిజెపి ప్రభుత్వం .ఈజిఎస్.పథకాన్ని రద్దుచేసి. కార్పొరేట్ శక్తులకు ఉపయోగ పడే విధంగా చట్టాన్ని .తీసుకువచ్చిందని. ఈ సంవత్సరంలో 125. రోజుల పని కల్పిస్తామని బిజెపి ప్రభుత్వం డొల్లమాటలు చెబుతుందని. ఒక 100. 25 రోజుల. పని కల్పిస్తామని చెబుతుందని. పని కల్పిస్తే 3 లక్షల కోట్ల బడ్జెట్ అవసరం అవుతుందని సంవత్సరంలో 100 రోజులు ఆ పని కల్పిస్తే 1.50.000. కోట్ల బడ్జెట్ పెట్టండి. బీజేపీ ప్రభుత్వం మరియు 125 రోజుల పని దినాలను ఎట్లా .కూర్చుతుందో ఆ బిజెపి మాటలు .డొల్లతనం అని .తెలియజేస్తుందని. కేంద్ర ప్రభుత్వము 90 శాతం నిధులు తోటి ఈజీఎస్ పథకం పూర్తిస్థాయిలో అమలు చేయాల్సి ఉంది కానీ. బిజెపి ప్రభుత్వం కొత్త చట్టంలో 60 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని దుర్మార్గమైన నిర్ణయం చేస్తుందని. ఉపాధి హామీ చట్టాన్ని .నిర్వీరం చేయడానికి తెలుగు రాష్ట్రాల పైన 2900. కోట్ల భారం పడి ఇప్పటికే ఆర్థిక భారంతో కొట్టు ముట్టాడుతున్న. రాష్ట్రాల పైన మరొక భారం పడడం. ఇది తక్షణమే. వి.పి.జి. రద్దు చేయాలి. ఉపాధి హామీ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలని. తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర నాయకులు గుంటి వేణు. మధ్యాహ్న భోజన పథకం జిల్లా కార్యదర్శి మీసం లక్ష్మణ్. సిపిఐ మండల నాయకులు బచ్చపల్లి శంకర్. రాజేందర్. బాలయ్య. రాములు. మల్లయ్య. శంకర్. ఆనందు. రవి. నరసయ్య. గోవిందు. తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version