ఇంటర్ ఫలితాలలో ప్రభుత్వ కళాశాల విద్యార్థుల ప్రభంజనం.

ఇంటర్ ఫలితాలలో ప్రభుత్వ కళాశాల విద్యార్థుల ప్రభంజనం

చిట్యాల, నేటి ధాత్రి :

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు మంగళవారం రోజున వెలువడిన ఇంటర్మీడియట్ ఫలితాలలో మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్మీడియట్ సెకండియర్ లో 90%, ఫస్ట్ ఇయర్లో 62% ఉత్తీర్ణతతో మంచి ప్రదర్శన కనబరిచారని కళాశాల ప్రిన్సిపాల్ బి శ్రీదేవి తెలియజేశారు.ఎంపీసీ సెకండ్ ఇయర్ లో జి అనిల్ 969/1000, ఎన్ సౌమ్య 924/1000, ఏ నవ్య 900/1000,
బైపిసి సెకండియర్ లో ఏం శ్రీవాణి 900/1000, ఎన్ ప్రియాంక 880/1000, బి అజయ్ 880/1000, సీఇసి సెకండ్ ఇయర్ లో ఏ శివ 608/1000, హెచ్ ఈ సి సెకండ్ ఇయర్ లో పి చందు 632/1000,
ఎంపీసీ ఫస్ట్ ఇయర్ ఎన్ అంజలి 457/470, జి మానసి 446/470, ఏం అంజలి 432/470, ఏం శరణ్య 427/470,
బైపిసి ఫస్ట్ ఇయర్ ఎం హర్షిత 405/440, ఏ వైష్ణవి 393/440,
ఫస్ట్ ఇయర్ ఇ రాహుల్ 362/500, ఓ సమత 354/500 మార్కులు సాధించారని ప్రిన్సిపల్ బి శ్రీదేవి తెలియజేశారు. ఈ సందర్భంగా ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను, లెక్చరర్లను ప్రిన్సిపాల్ శ్రీదేవి అభినందించారు.

విద్యార్థులు ఇష్టపడి చదవాలి పాఠశాల.!

విద్యార్థులు ఇష్టపడి చదవాలి పాఠశాల వార్షికోత్సవంలో ఎమ్మెల్యే జీఎస్సార్

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండలంలో ఈరోజు మంగళవారం భూపాలపల్లి నియోజకవర్గం గణపురం మండలం చెల్పూర్ గ్రామంలో ప్రాథమికొన్నత పాఠశాల, గణపురం మండలంకేంద్రంలోని మోడల్ స్కూల్
ప్రాథమికోన్నత పాఠశాలలో జరిగిన పాఠశాలల వార్షికోత్సవ వేడుకల్లో భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు.విద్యార్థుల నృత్యాలు, కోలాటాలు చాలా ఆకర్షించాయి. ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతీ ఏడాది పాఠశాలల్లో నిర్వహించే వార్షికోత్సవాలు బడి పట్ల విద్యార్థుల్లో నమ్మకం, విశ్వాసాన్ని నింపుతాయన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రులతోడ్పాటు ఉంటే అద్భుతాలను సృష్టిస్తారన్నారు.

 

MLA

తల్లిదండ్రులు పిల్లలకు ప్రతీ రోజు కొంత సమయం కేటాయించి, వారితో విద్యాపరమైన సామాజిక అంశాలపై చర్చించడం ద్వారా వారిలో భయం పోతోందన్నారు. చదవుతో పాటు ఆటపాటలు కూడా చాలా అవసరం అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు అన్నారు. ప్రతి విద్యార్థి తమ లక్ష్యాలను ఎంచుకొని ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరారు.విద్యార్థుల కళా ప్రదర్శన అద్భుతంగా ఉందని అన్నారు.చెల్పూర్ పాఠశాలలో వాష్ రూమ్స్ పాఠశాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తాను అన్నారు.పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు టెంకాయ కొట్టి ఇట్టి నిర్మాణ పనులను ప్రారంభించాలని చెప్పారు. గణపురం మండలం మోడల్ పాఠశాలలో డైనింగ్ హాల్, సైన్స్ ల్యాబ్ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు.అనంతరం పోటీ పరీక్షలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉపాధ్యాయులను శాలువాతో సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ శ్రీమతి విజయలక్ష్మి , జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్ , మండల ఎంపిడిఓ ఎల్ భాస్కర్ ,ఉపాధ్యాయులు , విద్యార్థులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలలో ఉత్తీర్ణత.!

ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని,విద్యార్థులకు శుభాకాంక్షలు

కొత్తగూడ, నేటిధాత్రి:

 

మల్లెల రణధీర్
(మాజీ సర్పంచ్ కొత్తగూడ)

కొత్తగూడ మండలం లోని విద్యార్థులు
నేడు ఇంటర్ పరీక్ష ఉత్తిర్ణత సాధించడం చాలా గొప్ప విషయం..
విద్యార్థులు ఉన్నత చదువులతో ముందుకుసాగాలి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకునే అవకాశం సద్వినియోగం చేసుకోవాలి
ఉజ్వల భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసుకునేవిధంగా నడవాలి
క్షణికావేశంలో ఫెయిల్ అయినా మనే బాధతో తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మరొక అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకు సాగాలని కోరుకుంటునన్నాను..
ఈరోజు తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల ఫలితాల ను ఉద్దేశించి
మల్లెల రణధీర్
.గారు మాట్లాడుతూ,,
ఈరోజు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థిని-విద్యార్థులు అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.అలాగే,ఓటమి-గెలుపులు అనేటివి సాధారణమే అని,ఉత్తీర్ణత రాని వారు ఎటువంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా,మరో అవకాశాన్ని సద్వినియోగించుకుని,గెలుపును చవిచూడాలన్నారు.ఉత్తీర్ణత సాధించిన వారికి దీనిని వారధిగా నిలుపుకుని,మరో మెట్టు ఎక్కుతూ,అత్యున్నత శీకరాగ్ర స్థానన్ని సంపాదించుకుని,మంచి మంచి అవకాశాలను అధిరోహించాలని,తల్లిదండ్రులను సంతోషపరుస్తూ,తమదైన శైలిలో గొప్ప స్థాయికి చేరుకోవాలని కోరుకుంటున్నాము అన్నారు.…

గురుకుల పాఠశాల విద్యార్థులను.!

గురుకుల పాఠశాల విద్యార్థులను పరామర్శించిన కూన గోవర్ధన్
మెట్ పల్లి ఏప్రిల్ 16

నేటి ధాత్రి

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల (బాలుర) పాఠశాల విద్యార్థులను పారమర్శించిన మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్
కొంతమంది చిన్నారులు అస్వస్థతకు గురైన విద్యార్ధులను వేసవిలో వడదెబ్బ తగలకుండా తీసుకునే జాగ్రత్తల గురించి వివరించారు. వీలైనంత ఎక్కువగా మంచినీటిని తాగాలని సూచించారు. అనంతరం హాస్పిటల్ ను సందర్శించి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో మెట్ పల్లి కాంగ్రెస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు ఖుతుబ్ పాషా, కాంగ్రెస్ సేవాదళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందె మారుతీ,కోరుట్ల పట్టణ ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు షైక్ అమీర్,కోరుట్ల పట్టణ మైనర్టీ ప్రధాన కార్యదర్శి యండి ఫైసల్ తదితరులు పాల్గొన్నారు.

5వ తరగతి విద్యార్థులకు ఆత్మీయ వీడ్కోలు.

5వ తరగతి విద్యార్థులకు ఆత్మీయ వీడ్కోలు

కేసముద్రం/ నేటి ధాత్రి

 

 

ఎమ్. పి.పి.ఎస్ కల్వల పాఠశాల లో ఈరోజు 5వ తరగతి విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం పాఠశాల ప్రధానోపాధ్యాయులు కళ్లెం వీరారెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి కాలేరు యాదగిరి, గౌరవ అతిథిగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బండారు నరేందర్ విచ్చేయడం జరిగింది. ఈ సమావేశంలో విద్యాశాఖ అధికారి కాలేరు యాదగిరి విద్యార్థులను మంచి విద్యావంతులు గా మార్చి, భావి భారత పౌరులు గా తీర్చి దిద్దడంలో ఉపాధ్యాయుల కృషి వెలకట్టలేనిది. ఈనాడు ప్రభుత్వ పాఠశాల లో చదువు కున్న వారే నేడు గొప్ప స్థానంలో వున్నారు. పిల్లలను ప్రభుత్వ పాఠశాల లో చదివించాలని పిలుపునిచ్చారు. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బండారు నరేందర్ మాట్లాడుతూ విద్యార్థులను అన్ని రంగాలలో సర్వతోముఖ అభివృద్ధికి పాటు పడటం కేవలంప్రభుత్వ పాఠశాల తోనే సాధ్యం అని, ప్రభుత్వ విద్యా రంగం ను బలోపేతం చేయాలని అన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కళ్లెం వీరారెడ్డి మాట్లాడుతూ ఇంగ్లీష్ భాషను ఒక భాష లాగే చూడాలని, సబ్జెక్టు కు ఆపాదించవద్దని, మాతృభాష లోనే ఎక్కువ విషయావగాహనను, జ్ఞానాన్ని పొందదగలరని అన్నారు. ఇంగ్లీష్ మీడియం విద్య అని విద్యార్థులను ఏ భాష సరిగా రాకుండాచేస్తున్నారని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయినిీ ఉపాధ్యాయులైన గోపి, స్వరూప, హరిక్రిష్ణ, క్రిష్ణ,శ్రీదేవి, మోహనకృష్ణ, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తలిదండ్రులు ,విద్యార్థులు పాల్గొన్నారు.

మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు భోజనం లేదని ఆవేదన..

మధ్యాహ్న భోజన పథకంలో విద్యార్థులకు భోజనం లేదని ఆవేదన..

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి

 

 

ఓదెల మండలంలోని పొత్కపల్లి జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజనం పథకంలో విద్యార్థులకు భోజనం పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలలో సుమారు 50 కి పైగా విద్యార్థులు హాజరు కాగా కేవలం 20 మందికి వంట చేశారని మిగతా 30 మందికి అన్నం లేక ప్లేట్లు పట్టుకొని నిలబడ్డారని తెలిపారు. వాళ్లకు సందర్భంగా హెచ్ఎం వంట మనుషులను అడగగా అందరికీ పెట్టామని సమాధానం బదులిచ్చారు.కానీ విద్యార్థులు మాకు పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు.దీనిపై స్పందించి అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు.

విద్యార్థులపై లాఠీ ఛార్జ్ పై విన్నుత్న నిరసన. 

విద్యార్థులపై లాఠీ ఛార్జ్ పై విన్నుత్న నిరసన. 

సిరిసిల్ల చేనేత చౌక్ వద్ద మోకాళ్లపై కూర్చొని సంకెళ్లతో నిరసన

సిరిసిల్ల టౌన్: (నేటి ధాత్రి)

 

సిరిసిల్ల పట్టణంలోని చేనేత చౌక్ లో
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేయడానికి నిరాసిస్తూ ఈరోజు సిరిసిల్ల చేనేత చౌక్ లో కూర్చొని సంకెళ్లతో నిరసన తెలపడం జరిగింది.ఈ సందర్భంగా కంచర్ల రవి గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలిపితే వారిపై లాఠీచార్జ్ చేయడం సిగ్గుచేటు ఈ సందర్భంగా అన్నారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 400 ఎకరాల భూమిని చెట్లను నరికి వేసుకుంటే అక్కడ యూనివర్సిటీ విద్యార్థులు శాంతియుతంగా ఆందోళన చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులచే లాఠీచార్జి చేయించడం చాలా దురదృష్టమై అన్నారు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను ఇబ్బందులు పెడుతుంటే ఇదేనా మీ ప్రజా పాలన ఇదేనా ఇంద్రమ్మ రాజ్యం అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విద్యార్థులతో పెట్టుకున్న ప్రభుత్వం చరిత్రలో ఎక్కడ ఉండలేదని అన్నారు విద్యార్థి లోకానికి వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు విద్యార్థులకు ఇక్కడ అన్యాయం జరిగిన బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు చెట్లను కొట్టేస్తే అక్కడ ఉన్న మూగ జీవాలు తల్లఢిల్లుతున్నాయి అని గుర్తు చేశారు మేధావులారా ఇంత జరిగినా ఎందుకు మౌనంగా ఉంటుందని ప్రశ్నించారు విద్యార్థులతో పాట ప్రొఫెసర్ల చూడకుండా చిట్కబడడం చాలా దురదృష్టమని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల లాక్కోవడం మానేయాలని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మట్ట శ్రీనివాస్ ముద్దం అనిల్ కాసర్ల వినయ్ దేవరాజ్ ముజ్జు నవీ గణేష్ రాజు వినయ్ నరేష్ వేణు మోహన్ పరమేష్ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు…..

విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం సరి కాదు..

విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం సరి కాదు..

జహీరాబాద్. నేటి ధాత్రి:

 

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం లాఠీ ఛార్జ్ చేయడానికి భారతీయ జనతా యువమోర్చా(బిజేవైఎం) వ్యతిరేకించడం జరుగుతుంది. విశ్వవిద్యాలయం భూములను కాపాడుకోవాలి అదేవిధంగా పర్యావరణాన్ని మూగజీవాలను కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్న అమాయక విద్యార్థులపై లాఠీ చార్జ్ చేయడం పట్ల బాధ్యత వహిస్తూ ఈరోజు జహీరాబాద్ పట్టణం లో బిజేవైఎం అధ్యారంలో దిష్టి బొమ్మ దహనం చేయడానికి వెళ్తున్న బిజేవైఎం నాయకులను ముందస్తుగా అక్రమ అరెస్ట్ చేయడం జరిగింది ఈకార్యక్రంలో సోమా అనిల్. నరేష్ పాటిల్ రూషబ్. నిఖిల్ యాదవ్ పాల్గొన్నారు రేవంత్ రెడ్డి తక్షణమే బహిర్గత క్షమాపణ చెప్పాలి అని బిజేవైఎం డిమాండ్ చేసింది.

బాలాజీ టెక్నో స్కూల్ విద్యార్థులు.!

ఐదు నవోదయ సీట్లుసాధించిన బాలాజీ టెక్నో స్కూల్ విద్యార్థులు

నర్సంపేట,నేటిధాత్రి:

 

ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలో చదివించుకునే ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటుగా నవోదయ కోచింగ్ సెంటర్లలో చదివించుకుంటారు.కానీ మా పాఠశాలలో చదివే విద్యార్థులకు మా ఉపాధ్యాయులు ఇచ్చే కోచింగ్ ద్వారా ప్రతి సంవత్సరం నవోదయలో సీట్లు సాధిస్తున్నారని, అందుకు తమకు ఎంతో గర్వంగా ఉందని బాలాజీ విద్యాసంస్థల అధినేత డాక్టర్ అండ్ రాజేంద్ర ప్రసాద్ రెడ్డి అన్నారు.నర్సంపేట మండలంలోని లక్నేపల్లి బాలాజీ టెక్నో స్కూల్లో నవోదయలో సీట్లు సాధించిన ఐదుగురు విద్యార్థులు వి.నిఖిత, ఇ. వర్షిత్, ఎ. సంజిత్, ఎ.రేవంత్,కె. దీక్షిత్ లను వారు అభినందించారు.వీరి విజయానికి తోడ్పడిన ఉపాధ్యాయులను,విద్యార్థుల తల్లిదండ్రులను ఈ సందర్భంగా వారు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో బాలాజీ టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ పెరుమాండ్ల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ చిన్నతనం నుండి ఇష్టంతో కష్టపడి పని చేయడం అలవాటు చేసుకుని, ఒక క్రమ పద్ధతిలో చదువుకుంటే ఏదైనా సాధించవచ్చన్నారు. ఈ చిన్నారులను ప్రేరణగా తీసుకొని ప్రతి విద్యార్థి చదువుకొని భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, నవోదయ సీట్లు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులు హాజరయ్యారు.

అర్ధరాత్రి విద్యార్థుల నిర్భందఖాండ.

అప్రకటిత ఎమర్జెన్సీ తలపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం… అర్ధరాత్రి విద్యార్థుల నిర్భందఖాండ…

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్ లో బి.ఆర్.ఎస్వీ నాయకుల అక్రమ నిర్బంధం…విద్యార్థుల సమస్యలపై ప్రశ్నించేందుకు అసెంబ్లీ కి బయల్దేరిన బి.ఆర్.ఎస్వీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన జహీరాబాద్ పోలీసులు.

విద్యార్థుల జీవితాలతో చెలగాటం తగదు..
బీ.ఆర్.ఎస్వీ జహీరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి రాకేష్…

Student

జహీరాబాద్ కార్యలయంలో ఎర్పాటు చేసిన సమావేశం లో బీ.ఆర్.ఎస్వీ జహీరాబాద్ నియోజకవర్గ రాకేష్ మాట్లాడుతూ సీ.ఎం రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టో లో ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి డుమ్మా కొట్టడమే కాకుండా జాబ్ క్యాలెండర్ ఎగవేసి విద్యార్థులను మోసం చేశాడు అని ద్వజమెత్తారు. అదే విధంగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగ యువతకు మొండి చెయ్యి ఇవ్వడం జరిగింది అని అన్నారు. మహిళా విద్యార్థినిలకు స్కూటీల పేరు చెప్పి ఓట్లు దండుకుని నేడు వారికి బడ్జెట్ లో కనీసం వారీ ప్రస్తావన సైతం తీయలేదని ఎద్దవ చేశారు. మరి ముఖ్యంగా అనగారిన విద్యార్థులు చదువుకునే ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్స్ గురించి బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడమే కాకుండా బడ్జెట్లో ప్రస్తావన లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. విద్యార్థుల హక్కుల కోసం బి.ఆర్.ఎస్వీ ప్రశ్నిస్తే విద్యార్థి నాయకులను అరెస్టు చేసి అర్ధరాత్రి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యి పట్టున పది రోజులు గడువక ముందే ఇప్పటి అనేక మార్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి నాయకులను రాత్రికి రాత్రే అరెస్టులు చేసి నిర్బంధకాండ సృష్టిస్తున్నారని అన్నారు. ఈలాంటి కాంగ్రెస్ ప్రజాపాలన చూస్తే ఎమర్జెన్సీ పాలనను తలపించే విధంగా సాగుతుందని ఎద్దేవా చేశారు.జహీరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా విద్యార్థి నాయకులను భయబ్రాంతులకు గురి చేసి అక్రమ అరెస్టులు తక్షణమే మానుకోలవని హెచ్చరించారు. ఇప్పటి వరకు విద్యార్థుల జోలికి వొచ్చిన ఏ ముఖ్యమంత్రి కూడా చరిత్రలో నిలిచిన దాఖలు లేవని విధ్యార్థులు జోలికి వొస్తే ఊరుకోబోమని బీ.ఆర్.ఎస్వీ తరపున పోరాటం ఉదృతం చేస్తాం అని ముందస్తు అరెస్టులు ఆపాలని కాంగ్రెస్ ప్రభుత్వన్ని కోరారు. ప్రజా సమస్యలను గాలికి వొదిలేసి విద్యార్థులను అరెస్టు చేయడాలను ఆపాలని హెచ్చరించారు . ఈ సమావేశం లో బీ.ఆర్.ఎస్వీ పట్టణ అధ్యక్షులు ఓంకార్ , బీ.ఆర్.ఎస్వీ న్యాల్కాల్ మండల అధ్యక్షులు జెట్గొండ మారుతి యాదవ్ , సీనియర్ బీ.ఆర్.ఎస్వీ నాయకులు పరశురాం , ఎం.డీ ఫయాజ్ , రఘు తేజ , ఆవేజ్ , అజీమ్ , ఇక్బాల్ , మహేష్ , రజాక్, మరియు తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ.

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

నిజాంపేట, నేటిధాత్రి

 

నిజాంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో శనివారం స్వయం పరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి అన్ని తరగతుల్లో విద్యాబోధన అందించారు.వీరిలో ప్రధానోపాధ్యాయులుగా సింధు,
డీఈవోగా నవదీప్ గౌడ్, ఎంఈఓ గా సాత్విక్,లు ఉన్నారు. పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి విద్యార్థులకు చక్కటి విద్యను అందించారని ఇందులో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందించామన్నారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్చార్జ్ ప్రధానోపాధ్యాయురాలు అరుణ, ఉపాధ్యాయులు వినోద్, శ్రీలత, రాజేందర్, శ్రీకాంత్ గౌడ్, శ్రీనివాస్,ఇంతియాజ్ భాను, బాల్ లక్ష్మి,ప్రమీల,తదితరులు పాల్గొన్నారు.

వికాస్ డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రభంజనం..

వికాస్ డిగ్రీ కళాశాల విద్యార్థుల ప్రభంజనం

సిరిసిల్ల (నేటి ధాత్రి):

శాతవాహన విశ్వవిద్యాలయం గురువారం 20.3.2025 రోజున ప్రకటించిన 1, 3, 5 సెమిస్టర్ ఫలితాలలో సిరిసిల్ల జిల్లాలోని వికాస్ డిగ్రీ మరియు పీజీ కాలేజ్ విద్యార్థులు జిల్లా మరియు యూనివర్సిటీ స్థాయిలో అత్యుత్తమ ఫలితాలు సాధించి ప్రభంజనం సృష్టించారు. ఇందుకుగాను సిరిసిల్ల జిల్లా ఎస్. పి మహేష్ బి. గితే కళాశాల విద్యార్థులను శాలువా, మెమెంటో తో సత్కరించారు.
అదేవిధంగా కళాశాల ప్రిన్సిపాల్ గుగ్గిళ్ళ జగన్ గౌడ్, కళాశాల అధ్యాపకులు విద్యార్థులను అభినందించారని తెలిపారు. ఈ ఫలితాలలో 9 జి. పి. ఏ మరియు ఆ పైన జి. పి. ఏ సాధించిన మా కళాశాల విద్యార్థులు
1. బి దినేష్ నాయక్ 9.4 జి.పీ. ఏ ( ఫుడ్ సైన్స్)
2. కే అక్షిత 9.24 జి.పీ.ఏ(బీ కాం)
3. కే శ్రావణి 9.19 జి.పీ.ఏ(బీ కాం)
4. ఈ భవాని 9.11 జి.పీ.ఏ(బీ కాం)
5. టీ.మేఘన 9.20 జి.పీ.ఏ(బీ కాం)
6. జి సుప్రియ 9.12 జి.పీ.ఏ( ఫుడ్ సైన్స్)
7. వి నవ్య 9.04 జి.పీ.ఏ(బీ కాం)
8. వి .సుప్రియ 9 జి.పీ.ఏ( డేటా సైన్స్)
9. జ.వైష్ణవి 9 జి.పీ.ఏ(ఫుడ్ సైన్స్)
10. అబ్దుల్ అఖిబ్ 9 జి.పీ.ఏ( ఫుడ్ సైన్స్)
11. నల్ల శ్రేయ 9 జి.పీ.ఏ( ఏం.పీ. సీఎస్)

ఏబిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్స్.!

ఏ బి ఎస్ ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్యాడ్స్
పెన్నులుపంపిణీ.

చిట్యాల, నేటిధాత్రి :

చిట్యాల మండల కేంద్రంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్ష పాడ్స్ పెన్నులు పంపిణి చేయడం జరిగింది, 10వ తరగతి పరీక్ష అనేది విద్యార్ధి ఉన్నత చదువులకి మొదటి మెట్టు లాంటిది కాబట్టి విద్యార్థులు బాగా చదివి అందరు ఉత్తిర్ణత సాదించాలి, మనం ఏదైనా సాదించాలి అనుకుంటే అది కేవలం విద్య తోనే సాధ్యం అవ్వుద్ది కనుక ఎగ్జామ్స్ బాగా రాయాలని జిల్లాలో వంద శాతం ఉత్తిర్ణత రావాలని గురువారం పరిక్ష పాడ్స్, పెన్నులు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రంలో వంశీకృష్ణ , సందీప్, రాకేష్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుక.

10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుక.

నేటి ధాత్రి భద్రాద్రి జిల్లా

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో బుధవారం 10వ తరగతి విద్యార్థుల వీడ్కోలు వేడుక ప్రధానోపాధ్యాయులు రవిలాదేవి అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు రవిలాదేవి మాట్లాడుతూ విద్యార్థులు ముందుగా ఉపాధ్యాయులు నిర్దేశించినటువంటి మార్గదర్శకాలను చక్కగా పాటించాలని, చెడు అలవాట్లు కలిగి ఉండకూడదు అని, లక్ష్యాలు సాధించే విదంగా శ్రమించాలని, తరగతి గదుల్లో భోదించిన విషయాలు విద్యార్థుల జీవితాలపై చాలా ప్రభావం చూపుతాయి అని, వారి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తాయని చెప్పారు. అనంతరం విద్యార్దులను ఉద్దేశించి గణిత ఉపాధ్యాయుడు నాగేశ్వరావు మాట్లాడుతూ విద్యార్థుల “భవిష్యత్తు” బాటకు తొలిమెట్టు పదవతరగతి అని, అత్యుత్తమ మార్కులను సాధించి తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాలని కోరారు. ఉత్తమ ఫలితం అన్ని సబ్జెక్టులలో 80 శాతం మార్కులు సాధించిన ప్రతి విద్యార్థికి ఉన్నత చదువుల నిమిత్తం ఐదువేల రూపాయల నగదును బహుమానంగా అందిస్తానని ఆయన వీడ్కోలు సభలో తెలిపారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించన తర్వాత విద్యార్థులకు హల్ టికెట్లతో పాటు పరీక్షా ఫ్యాడ్లు, పెన్నులు అందించారు. వీడ్కోలు సభలో విద్యార్థులు ఆట, పాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రవిలాదేవి, పిడి విద్యాసాగర్, ఉపాధ్యాయులు ఉమామహేశ్వరరావు, శంకర్, రామకృష్ణ, నాగేశ్వరావు, రత్నకుమారి పలువురు ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు,పెన్నుల పంపిణీ..

నాగారం జడ్పీహెచ్ఎస్ విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు,పెన్నుల పంపిణీ

మెరిట్ మార్కులు సాధించి పాఠశాలకు,తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకురావాలి

పరకాల నేటిధాత్రి

మండలంలోని నాగారం గ్రామంలో జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివే విద్యార్థులకుటిఆర్ఎస్వి పరకాల మండల అధ్యక్షులు గొట్టే అజయ్ ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు రాయబోయే పరీక్షలలో మెరిట్ మార్క్స్ సాధించి పాఠశాలకు మరియు తల్లిదండ్రులకు గొప్ప పేరు తీసుకురావాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో పోతరాజు మనోజ్,అల్లే రాజ్ కుమార్ (మైఖేల్),బండారి రవికుమార్ మరియు పాఠశాల ఉపాధ్యాయురాళ్లు,ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ.

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

 

నడికూడ,నేటిధాత్రి:

మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్ ఆధ్వర్యంలో నిర్వహించగా విద్యార్థులు ఉపాధ్యాయులు గా మారి తరగతి గదులలో విద్యాబోధన చేశారు. అనంతరం ఉపాధ్యాయులుగా ఉన్న విద్యార్థులు సమావేశంలో మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి అనేది సమాజంలో విలువలతో కూడుకొని ఉన్నదని,ఉన్నత మైనదని అన్నారు.గురువు లేని విద్య గుడ్డి విద్య అని కూడా అన్నారు.ఒక డాక్టర్, లాయరు,పోలీస్,కలెక్టర్, రాజకీయ నాయకులు, తయారు కావాలంటే గురువు దగ్గర చదువు తీసుకోవాల్సిందే అని అన్నారు.మేము ఒకరోజు ఉపాధ్యాయులుగా పని చేయడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు.ఈ కార్యక్రమంలో స్వయం పరిపాలన దినోత్సవం లో ప్రధానోపాధ్యాయులుగా ముష్కే గగన్ వాల్మీకి, ఉపాధ్యాయులుగా సురుగుల నవ్య శ్రీ, శనిగరం చరణ్,కట్ల హిమాన్షు రెడ్డి,మామిడాల విశ్వతేజ రెడ్డి,దుబ్బాకుల వశిష్ట భార్గవ,తోకల నవనీత్ రెడ్డి,గోగుల జస్వంత్ రెడ్డి, కందికట్ల హర్షిత్,సోలంకి జస్మిత,గరిడే శ్రీనిత,తాళ్లపల్లి శ్రీనిధి,పూసాల అభిజ్ఞ, తాళ్లపల్లి శరణ్య, వ్యవహరించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు లకావత్ దేవా,మేకల సత్యపాల్ రెడ్డి, అంగన్వాడీ టీచర్స్ బీముడి లక్ష్మీ,నందిపాటి సంధ్య ఐఆర్పి రమేష్ పాల్గొన్నారు.

సునీత విలియమ్స్ కు ప్లైకార్డులతో స్వాగతం.!

సునీత విలియమ్స్ కు ప్లైకార్డులతో స్వాగతం పలికిన విద్యార్థులు

వరంగల్/నర్సంపేట,నేటిధాత్రి:

Students

భారతీయ సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ సురక్షితంగా భూమిమీదకు చేరిన సందర్భంగా వరంగల్ జిల్లా గీసుగొండ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ విద్యార్ధులు ప్లైకార్డ్స్ తో స్వాగతం పలికారు.ఈకార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులతో పాటు పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు ఎం.పట్టాభి, ఉపాద్యాయలు విటోభా,పద్మ, అరుణశ్రీ, వెంకట్రావు, శ్రీనివాస్, జ్యోత్స్నప్రభ,రవిచందర్, సబిత, ప్రవళిక , బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. ఈసందర్భంగా పాఠశాల హెడ్మాస్టర్ పట్టాభి మాట్లాడుతూ 9 నెలల 288 రోజుల సుధీర్ఘ కాలం వివిధ పరిశోధనల నిమిత్తం అంతరిక్షంలో ఉండి, దిగ్విజయవంతంగా తిరిగి భూమిపైకి చేరుకున్న సునీత విలియమ్స్ మన భారత సంతతికి చెందినవారు కావడం మనందరి గర్వకారణం అని పేర్కొన్నారు. ఆమె స్ఫూర్తితో తమ పాఠశాల విద్యార్థులు ఉన్నత చదువులు చదువుకొని ప్రపంచ స్థాయి గుర్తింపు పొందాలని పిలుపునిచ్చారు.

Students

పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ కిట్ అందజేసిన వర్ధిని ఫౌండేషన్.

పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ కిట్ అందజేసిన వర్ధిని ఫౌండేషన్

చిల్పూర్(జనగామ)నేటి ధాత్రి:

ఈనెల జరగబోయే పదవ తరగతి పరీక్షలు రాసి మంచి ఫలితాలు సాధించాలని వర్ధిని ఫౌండేషన్ నిర్వాహకులు పేర్కొన్నారు. ఇందులో భాగంగా వర్థిని ఫౌండేషన్ వారి సహకారంతో చిల్పూర్ మండలంలోని చిన్నపెండ్యాల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో
పదవ తరగతి విద్యార్థులకు జరగబోయే పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్ ప్యాడ్ కిట్టును స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇల్లందుల విజయ్ ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమంలో చిల్పూర్ సబ్ ఇన్స్పెక్టర్ సిరిపురం నవీన్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ఎగ్జామ్ ప్యాడ్ కిట్టులను పదవ తరగతి విద్యార్థులకు అందజేశారు.
ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ నవీన్ మాట్లాడుతూ చాలా గొప్ప కార్యక్రమం చేపడుతున్నారని కార్యక్రమం నిర్వహిస్తున్న ఫౌండేషన్ ప్రశంసించారు,
పరీక్ష రాయనున్న విద్యార్దులు అందరూ పరీక్షలు బాగా రాసి మెరుగైన ఫలితాలు సాధించి జీవితంలో ఉన్నతమైన స్థానంలో వుండాలని పదవ తరగతి విద్యార్థులకు ఈ పరీక్షలు జీవితంలో ఉన్నత స్థానం ఎంచుకోవడానికి సరైన మార్గం అని అన్నారు.విద్యార్థులందరికీ ఈ సందర్భంగా ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు..
ఈ కార్యక్రమంలో వర్ధిని
ఫౌండేషన్ సభ్యులు తన్నీరు రమేష్ , ఎండి.హఫీజ్, సౌదర పల్లి సంపత్ రాజ్ ,కొర్ర వెంకటేష్ నాయక్,ఇల్లందుల రాజు మరియు కాంగ్రెస్ యూత్ నాయకులు ఐలపాక శ్రీనివాస్,పొన్న రాజేష్ తోపాటు పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం.

పదవ తరగతి విద్యార్థుల వీడ్కోలు సమావేశం

ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి మంచి విజయాలు సాధించాలి… ప్రధానోపాధ్యాయులు బద్రి నారాయణ

మహబూబాబాద్/ నేటి ధాత్రి:

మండలంలోని మాధవాపురం ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంకా బద్రి నారాయణ మాట్లాడుతూ ,”విద్యార్థులు స్వీయ క్రమశిక్షణ ను అలవర్చుకోవాలని, తమ భవిష్యత్తు తమ నడవడికపై ఆధారపడి ఉందని, మంచి లక్ష్యాన్ని ఏర్పరచుకొని దానికి అనుగుణంగా సరైన ప్రణాళికతో తమ లక్ష్యాన్ని చేరుకోవాలని అభిలాషించారు. పదవ తరగతి పరీక్షలను ఎలాంటి భయము, బెరుకు లేకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు మరియు 10వ తరగతిలో 500 మార్కులు దాటిన విద్యార్థులకు ఐదువేల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు”.
ఈ కార్యక్రమంలో 10వ తరగతి విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో పాల్గొని రాబోయే కామన్ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తామని ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు మరియు తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ఇతర ఉపాధ్యాయ బృందం స్నేహలత, నాగయ్య, రమాదేవి, పరమాత్మ చారి బాబురెడ్డి, సుజాత, సౌభాగ్య, హైమావతి, మమత పాల్గొని విద్యార్థులు మంచి ఫలితాలను సాధించాలని ఆకాంక్షించారు.

ఎన్ సిసి విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు

ఎన్ సిసి విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు*

బాలాజీ టెక్నో స్కూల్ లో ఎన్.సి.సి. విద్యార్థుల ఎంపిక

నర్సంపేట,నేటిధాత్రి:

ఎన్.సి.సి విద్యార్థులకు క్రమశిక్షణ, దేశభక్తి అలవడుతుందనీ, అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కూడా ఉంటాయని బాలాజీ టెక్నో స్కూల్ ప్రిన్సిపల్ పెరుమాండ్ల రాజేంద్రప్రసాద్ అన్నారు.నర్సంపేట మండలంలోని లక్నేపల్లి శివారులోని బాలాజీ టెక్నో స్కూల్ లో గురువారం జరిగిన 2025 – 26 విద్యా సంవత్సరానికి గాను ఎన్.సి‌.సి సెలక్షన్స్ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.ఈ కార్యక్రమానికి ఎన్ సిసి టెన్త్ బటాలియన్ ఆఫీసర్స్ హవల్దార్ విజయ్, దీపక్ లు మరియు బాలాజీ టెక్నో స్కూల్ ఎన్ సిసి థర్డ్ఆఫీసర్ ఎం.డి. రియాజుద్దీన్ ఆధ్వర్యంలో బాలాజీ టెక్నో స్కూల్ విద్యార్థులకు సెలక్షన్స్ నిర్వహించారు. 185 మంది విద్యార్థులు పాల్గొనగా అందులో నుండి 49 మంది విద్యార్థులను ఎన్.సి.సి. అధికారులు అర్హులుగా ఎంపిక చేసినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు భవానీ చంద్, పార్వతి, వినోద్,ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version