బెస్ట్ అవైలబుల్ నోటిఫికేషన్ విడుదల చేయాలి.
ఏబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్
నర్సంపేట నేటిధాత్రి:
రాష్ట్రవ్యాప్తంగా 2025,2027 విద్య సంవత్సరం కోసం ప్రైవేట్,కార్పొరేట్ స్కూళ్లలో, షెడ్యూల్ క్యాస్ట్, గిరిజన సంక్షేమ, శాఖ ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ద్వారా షెడ్యూల్ కులాల, గిరిజన ఒకటవ తరగతి, ఐదో తరగతి విద్యార్థుల కోసం, నోటిఫికేషన్ విడుదల చేసి, అర్హులైన విద్యార్థులను లక్కీ డ్రా ఎంపిక చేయాలని ఏబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్ అన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా సంవత్సరం ముగుస్తున్న తరుణంలో నేటి వరకు బెస్ట్ అవైలబుల్ స్కీం నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం అర్హులైన ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఆందోళన చెందుతున్నారన్నారు.ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి నోటిఫికేషన్ విడుదల చేసి విద్యార్థిను ఆదుకోవాల్సిందిగా అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో వినయ్, భాస్కర్, సతీష్, కుమార్,అరవింద తదితరులు పాల్గొన్నారు.