పరాటా చేయడం నేర్చుకున్నా…

పరాటా చేయడం నేర్చుకున్నా

విజయ్‌ సేతుపతి, నిత్యా మీనన్‌ జంటగా పాండిరాజ్‌ తెరకెక్కించిన చిత్రం ‘సార్‌ మేడమ్‌’. సెంథిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌ నిర్మించారు. ఇటీవలె తమిళ్‌లో..

విజయ్‌ సేతుపతి, నిత్యా మీనన్‌ జంటగా పాండిరాజ్‌ తెరకెక్కించిన చిత్రం ‘సార్‌ మేడమ్‌’. సెంథిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌ నిర్మించారు. ఇటీవలె తమిళ్‌లో విడుదలైందీ చిత్రం. ఈ శుక్రవారం తెలుగులో విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్‌ వేడుకలో విజయ్‌ సేతుపతి మాట్లాడుతూ ‘‘ఈ సినిమాకు తమిళ్‌లో మంచి విజయం దక్కింది. తెలుగులోనూ పెద్ద విజయం సాధిస్తుందని నమ్మకముంది. ఈ సినిమా కోసం పరాటా చేయడం నేర్చుకున్నాను. కథను నమ్మి చేసిన చిత్రమిది’’ అని అన్నారు. ‘‘ఇది యూనివర్సల్‌ సబ్జెక్ట్‌. అందరూ రిలేట్‌ చేసుకుంటారు’’ అని నిర్మాత త్యాగరాజన్‌ చెప్పారు. ‘‘ఇది ప్రేక్షకులకు మంచి హోమ్‌ ఫుడ్‌ లాంటి సినిమా’’ అని దర్శకురాలు నందినీ రెడ్డి తెలిపారు. ‘‘భార్యాభర్తల మధ్య జరిగే అందమైన ప్రేమకథ ఈ చిత్రం’’ అని పాండిరాజ్‌ అన్నారు.

సామ్రాజ్య టైటిల్‌తో..

సామ్రాజ్య టైటిల్‌తో

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ‘కింగ్‌డమ్‌’ చిత్రం ఈ నెల 31న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న విషయం తెలిసిందే…

విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ‘కింగ్‌డమ్‌’ చిత్రం ఈ నెల 31న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న విషయం తెలిసిందే. శనివారం చిత్రబృందం హిందీ టైటిల్‌ను ప్రకటించింది. అక్కడ ఈ చిత్రాన్ని ‘సామ్రాజ్య’ పేరుతో హిందీలో విడుదల చేస్తున్నారు. ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ను గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. సంగీతం: అనిరుధ్‌

ట్రిప్తి డిమ్రి, సిద్ధార్థ్ చతుర్వేది జోడిగా ‘ధడక్ 2’.

ట్రిప్తి డిమ్రి, సిద్ధార్థ్ చతుర్వేది జోడిగా ‘ధడక్ 2’ ట్రైలర్ విడుదల!

సిద్దార్థ్ చ‌తుర్వేది, ట్రిప్తి డిమ్రి జంట‌గా ద‌డ్క‌న్ 2 సినిమా ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించేందుకు రెడీ అయింది.

బాలీవుడ్‌లో మ‌రో ఆస‌క్తిక‌ర సినిమా రెడీ అవుతోంది. 2018లో జాన్వీ, ఇషార్ క‌ట్ట‌ర్ జంట‌గా వ‌చ్చిన‌ ద‌శాబ్దాల ద‌డ‌క్‌ (DHADAK) చిత్రానికి సీక్వెల్‌గా ఓ కొత్త క‌థ‌తో ఇప్పుడు ద‌డ‌క్‌ 2 (DHADAK 2) అనే సినిమా త‌యార‌వుతోంది. గ‌ల్లీబాయ్ చిత్రంతో ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్న సిద్దార్థ్ చ‌తుర్వేది (Siddhant Chaturvedi) హీరోగా న‌టించ‌గా ప్ర‌స్తుత నేష‌న్ సెన్షేష‌న్ ట్రిప్తి డిమ్రి (Triptii Dimri) క‌థానాయిక‌గా చేసింది.

ఈ చిత్రం ఈగ‌స్ట్ 1న థియేట‌ర్ల‌కు రానుంది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ తాజాగా ఈ మూవీ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. జియో స్టూడియో (Zee Studios), క‌ర‌ణ్ జోహ‌ర్ ధ‌ర్మ ప్రోడ‌క్ష‌న్స్ (Dharma Productions) సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించ‌గా షాజియా ఇక్బాల్ (Shazia Iqbal) ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version