సీక్వెల్ రాబోతోంది
యూత్ను విపరీతంగా ఆకట్టుకున్న సినిమాల్లో ఈ నగరానికి ఏమైంది ఒకటి. విశ్వక్ సేన్ కథానాయకుడిగా తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో 2018లో విడుదలైన ఈ…
యూత్ను విపరీతంగా ఆకట్టుకున్న సినిమాల్లో ‘ఈ నగరానికి ఏమైంది’ ఒకటి. విశ్వక్ సేన్ కథానాయకుడిగా తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో 2018లో విడుదలైన ఈ చిత్రానికి కొనసాగింపు భాగం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఆదివారం ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుందని ప్రకటించారు మేకర్స్. ‘ఈఎన్ఈ రిపీట్’ అనేది టైటిల్. ‘ఏలినాటి శనిపోయింది. కన్యారాశి టైమ్ వచ్చింది’ అనేది ట్యాగ్లైన్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉందీ చిత్రం. మొదటి పార్ట్కు పనిచేసిన చిత్రబృందమే ఈ సీక్వెల్లోనూ భాగమవుతున్నారు. తరుణ్భాస్కర్ దాస్యం దర్శకత్వంలో డి.సురేశ్బాబు, సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మించనున్నారు. విశ్వక్ సేన్, సాయి సుశాంత్ రెడ్డి, అభినవ్ గోమతం, వెంకటేశ్ కాకుమాను ప్రధాన పాత్రలు పోషించనున్నారు.