సమస్యల వలయంలో నర్సంపేట పట్టణం

సమస్యల వలయంలో నర్సంపేట పట్టణం

పారిశుద్ధ్య పనులను తక్షణమే చేపట్టాలి

మున్సిపాలిటిలో ఎం సిపిఐ(యు) వినతిపత్రం

నర్సంపేట,నేటిధాత్రి:

 

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణం సమస్యల వలయంలో చిక్కుకున్నది.పట్టణ పరిష్కారం కోసం ఎం సిపిఐ(యు) ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ సంపత్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర నాయకురాలు వంగల రాగ సుధా,డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి మాట్లాడుతూ నర్సంపేట పట్టణంలో డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని,కాలువల్లో పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు తీయకపోవడం మూలంగా వర్షపునీరు పొంగి ఇళ్లలోకి చేరుతుందని ఆరోపించారు.ప్రధానంగా కార్ల్ మార్క్స్ కాలనీ,జ్యోతిబసు నగర్ లలో డ్రైనేజీ సమస్యతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.వర్షం పడిందంటే వరద నీరు ఇళ్లలోకిచేరి చెత్తాచెదారంతో దుర్వాసనతో అనేక రకాల వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందన్నారు.మార్క్స్ కాలనీలో మిషన్ భగీరథ పైప్ లైన్లు వేసి కనెక్షన్ ఇవ్వకుండా వదిలేయడంతో మరదమయంగా మారుతుందని తెలిపారు.పట్టణంలో కుక్కల కోతుల,బెడదల మూలంగా పట్టణవాసులు బయటికి రావాలంటేనే జంకుతున్నారని ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పార్టీ చెన్నారావుపేట మండల కన్వీనర్ జన్ను రమేష్ ,టౌన్ కమిటీ సభ్యులు కల్లెపెల్లి రాకేష్ ,విద్యార్థి నాయకుడు అజయ్ తదితరులు పాల్గొన్నారు.

మాదన్నపేట వాగుపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించాలి…

మాదన్నపేట వాగుపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించాలి

మాదన్నపేట రోడ్డుపై ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో రాస్తారోకో నిరసన

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట నుంచి మాదన్నపేటకు వెళ్లే రహదారిని పునర్నిర్మానం చేసి మాదన్నపేట వాగుపై శాశ్వత హై లెవెల్ వంతెనను నిర్మించాలని నిర్మించి తుఫానుతో నష్టపోయిన బాధిత ప్రజలను తక్షణమే ఆదుకోవాలని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కమిటి సభ్యురాలు వంగాల రాగసుధ డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి డిమాండ్ చేశారు. ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలోని మాదన్నపేట రోడ్డులో గుంతలు పడి ప్రయాణికులకు ఇబ్బందిగా మారిన ప్రధానదారిపై రాస్తారోకో నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గం రోడ్ల నిర్మాణానికి అభివృద్ధికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని ప్రచార ఆర్బాటాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.నర్సంపేట నుంచి మాదన్నపేటకు వైపు వెళ్లే ప్రధాన రహదారి నిర్వీర్యమై ప్రయాణికులకు ఇబ్బందిగా మారిందన్నారు. ఈ రోడ్డుపై నిత్యం మాదన్నపేట,నాగూర్లపల్లె, బాజీపేట చంద్రయ్యపల్లె నల్లబెల్లి వరకు అలాగే సుమారు 10 తండాల ప్రజలు నిత్యం ప్రయాణం చేస్తుంటారని పేర్కొన్నారు.రోడ్డు వెడల్పు పేరుతో ప్రస్తుతం ఉన్న దారిని చెడగొట్టి రోడ్డు వేస్తామని తారు తీసివేసి అనేక నెలలు గడుస్తున్నా నేటికీ పునర్నిర్మాణం చేయకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం అని ఆరోపించారు.గత రెండు రోజులుగా కురిసిన తుఫానుతో పంటలు కోల్పోయి నిరాశ్రయులైన ప్రజలకు రైతులను ఆదుకునే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాదన్నపేట మాజీ సర్పంచ్ కర్నే సాంబయ్య పార్టీ పట్టణ నాయకులు గజవెల్లి జగపతి , జన్ను అనిల్,గణిపాక బాబు,పద్మ, విజయ,అరుణ, కోమల,అజయ్,
రామకృష్ణ ఆటో యూనియన్ అధ్యక్షులు మేకల లక్ష్మణ్,
ఉపాధ్యక్షులు తనుగుల అంజి, కార్యదర్శి ఆరేల్లి శివ,రమేష్,ప్రభాకర్ అఫ్జల్,జంపయ్య తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version