ఓట్లు సీట్లపై ఉన్నయావ ప్రజా సమస్యలపై లేదు…

ఓట్లు సీట్లపై ఉన్నయావ ప్రజా సమస్యలపై లేదు

ఎన్నికల హామీలను విస్మరించిన పార్టీలను మట్టి కరిపించాలి

ఎంసిపిఐ(యు) రాష్ట్ర కమిటీ సభ్యురాలు వంగల రాగసుధ

నర్సంపేట,నేటిధాత్రి:

 

ఓట్లు, సీట్లు అధికారం కోసం ప్రజలను మభ్యపెట్టడం తప్ప పట్టణ సమస్యలపై పాలకపార్టీకి కనీస చిత్తశుద్ధిలేదని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కమిటీ సభ్యురాలు వంగల రాగసుధ డివిజన్, సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి ఆరోపించారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించిన పాలక పార్టీలను ఓడించాలని ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. ఎంసీపీఐ(యు) పార్టీ పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కామ్రేడ్ కేశెట్టి సదానందం అధ్యక్షతన నర్సంపేట ఓంకార్ భవన్ లో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనాభాపరంగా పట్టణ విస్తృతి పెరిగిన అభివృద్ధి పరంగా అందుకు తగిన విధంగా లేదని ప్రధాన కారణం పాలకుల నిర్లక్ష్యమేనన్నారు. నర్సంపేట పట్టణ మౌలిక సదుపాయాల కల్పన కోసం కోట్లాది రూపాయలను ఖర్చు చేస్తున్నామని ప్రచారఆర్భాటం చేస్తున్నప్పటికి ఆచరణలో పట్టణ అవసరాలకనుగుణంగా ప్రణాళిక రూపొందించడంలో వైఫల్యం చెందారని ఎద్దేవా చేశారు.వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు చిత్తశుద్ధితో అభివృద్ధికి బాటలు వేసే విధంగా నీతిగా నిజాయితీగా పట్టుదలతో పనిచేసే అభ్యర్థులను ఆదరించాలని, డబ్బులు మద్యం ఇతర ప్రలోభాలతో ఓట్లను కొనుగోలు చేసి గెలిచి దోచుకోవాలనే అభ్యర్థులను మట్టికరిపించాలని కోరారు.నీతిగా నిజాయితీగా సమస్యల పరిష్కారానికి పట్టణాభివృద్ధికి తోడ్పడే ఎంసిపిఐ(యు) అభ్యర్థులను ఓట్లు వేసి గెలిపించాలని కార్యకర్తలు అందుకు అనుగుణంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో ఏఐసిటియు జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ మాషుక్, పార్టీ పట్టణ నాయకులు మోటం సురేష్, అనుమల రమేష్, బండారి మల్లేష్, సాంబన్న,రవి,రథం తదితరులు పాల్గొన్నారు.

“మాజీ ఎమ్మెల్యే పెద్దిని విమర్శించే స్థాయా మీదీ..

“మాజీ ఎమ్మెల్యే పెద్దిని విమర్శించే స్థాయా మీదీ..*

*నర్సంపేటను అభివృద్ధి చేసింది పెద్ది సుదర్శన్ రెడ్డి

నియోజకవర్గలో విధ్వంసం సృష్టించిన కాంగ్రెస్ నాయకులు

విద్య ,వైద్య,సాగు,త్రాగు అన్ని రంగాలలో అభివృద్ధి పరిచిన పెద్ది

నర్సంపేట,నేటిధాత్రి:

 

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాలలోనే నర్సంపేట నియోజకవర్గలో విధ్వంసం సృష్టించి ఇక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వారిని ప్రజలు గమనిస్తున్నారని టిఆర్ఎస్ నర్సంపేట పట్టణ అధ్యక్షుడు నాగేల్లి వెంకటనారాయణ గౌడ్, ఎంపీపీ, మాజీ సర్పంచ్ నల్ల మనోహర్ రెడ్డి ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఆసాధనకై అనేక ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణలో నర్సంపేట శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారని పేర్కొన్నారు.నిరంతరం నియోజకవర్గ అభివృద్ధినీ ఆకాంక్షించే వ్యక్తి పెద్ది సుదర్శన్ రెడ్డి ని ఖబర్దార్ అంటే..సామాన్య ప్రజల పరిస్థితి ఏంటో తెలపాలన్నారు.పాకాల సరస్సు, రంగయచెరువు, మాదన్నపేట చెరువులకు గోదావరి జలాలను తీసుకొచ్చి ఎన్నో దశాబ్దాల నాటి కలను సహకారం చేసిన జలసాధకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అని అభిప్రాయం వ్యక్తం చేశారు.నర్సంపేట పట్టణ అభివృద్ధికై రూ. 42 కోట్ల టియుఎఫ్ఐయు డబ్ల్యూ నిధులు తెచ్చి పట్టణ అభివృద్ధికై పట్టం కట్టారని తెలిపారు.నర్సంపేట నియోజకవర్గానికి మెడికల్ కాలేజ్ , నర్సింగ్ కళాశాల, జిల్లా ఆస్పత్రిని తీసుకొచ్చి నియోజకవర్గాన్ని విద్యా,వైద్య హబ్ గా తీర్చిదిద్దిన ఘనుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అని కొరియాడారు.నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో 10 కిలోమీటర్ల మేర సెంట్రల్ లైటింగ్ పనులు,9 కిలోమీటర్ల మేర అంతర్గత బిటి రోడ్ల నిర్మాణ పనులు పూర్తి చేసుకోవడం జరిగిందన్నారు.నర్సంపేట పట్టణానికి పాకాల ఆడిటోరియం,మోడల్ వెజిటేబుల్ మార్కెట్,మినీ స్టేడియం,పట్టణ పకృతి వనం,పట్టణ ప్రజల తాగునీటి కష్టాలను తీర్చేందుకు 5 లక్షల లీటర్ల సామర్థ్యం గల వాటర్ ట్యాంకుల నిర్మించారని తెలిపారు.
ఖానాపురం మండలంలో గల అశోక్ నగర్ గ్రామానికి సైనిక్ స్కూల్ తెచ్చిన ఘనత పెద్దిదే అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నర్సంపేట నియోజకవర్గానికి నయా పైసా కూడా తీసుకురాని మీరు నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునే ప్రసక్తి లేదని కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు.
ప్రస్తుతం నర్సంపేట నియోజకవర్గం లో ఆ పార్టీ నాయకులు చేస్తున్న అభివృద్ధి పనులు పెద్ది సుదర్శన్ రెడ్డి తెచ్చిన నిధులే అని ఎద్దేవా చేశారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ సాధించిన విజయాన్ని చూసి ఓర్చుకోలేని కాంగ్రెస్ పార్టీ నాయకులు.. ఫ్రస్టేషన్ తో మాట్లాడుతున్నారని చెప్పారు.శాసనసభ ఎన్నికల సమయంలో 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ నాయకుల్ని మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వస్తే ప్రజలే తరిమి కొడతారని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ నాయకులను హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బిఆర్టియు జిల్లా అధ్యక్షులు గోనే యువరాజ్,పట్టణ ప్రచార కార్యదర్శి మండల శ్రీనివాస్,మాజీ మున్సిపల్ కౌన్సిలర్స్ నాగిశెట్టి ప్రసాద్,దేవోజు సదానందం,రాయిడి దుష్యంత్ రెడ్డి, పెండం వెంకటేశ్వర్లు, పుల్లూరు స్వామి,వార్డు అధ్యక్షులు రావుల సతీష్,బీరం నాగిరెడ్డి,సంపంగి సాలయ్య, ఐలోని శ్రీనివాస్, నాయిని వేణు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు అప్పల సుదర్శన్,రాంప్రసాద్,కడారి కుమారస్వామి, మద్దెల సాంబయ్య,మంద ప్రసాద్, ఆంబోతు రాజు,తోటకూరి సదానందం, గిరగాని సాంబయ్య, పైసా ప్రవీణ్,ముచిక రాజు,బుస రాజు ,చేరాల గోవర్ధన్, గోనెల కరుణాకర్, మాదాసి శ్రీనివాస్, మాదాసి ప్రవీణ్, దేవోజు హేమంత్ తదితరులు పాల్గొన్నారు.

రౌడీరాజకీయం చేస్తున్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి..

రౌడీరాజకీయం చేస్తున్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

కోడ్ ఉల్లంఘిస్తూ ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే

ఓడిపోతామనే భయంతో బీఆర్ఎస్ నాయకులపై దాడులు

దాడిపట్ల మాజీ ఎమ్మెల్యే పెద్ది ఆగ్రహం..బాధితులను పరామర్శ

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

స్థానిక సంస్థల ఎన్నికలలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రజలను భయాందోళనకు గురిచేస్తూ రౌడీ రాజకీయం చేస్తున్నారని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ గ్రామాలలో ప్రచారం నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే దొంతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బి ఆర్.ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ పార్టీ నాయకుల దాడిని ఖండిస్తునట్లు తెలిపారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం చెరువుకొమ్ము తండాలో సోమవారం అర్ధరాత్రి కాంగ్రెస్ పార్టీ నాయకులు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై దాడిచేశారు.తీవ్రంగా గాయపడిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నర్సంపేట పట్టణంలోని జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మాజీ ఎమ్మెల్యే పెద్ది పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గంలోని జరుగుతున్న గ్రామ పంచాయితీ ఎన్నికల్లో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రౌడీ రాజకీయం చేస్తున్నారని అలాగే ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తూ ఇప్పటికి పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే దొంతి ఎన్ని ప్రచారం నిర్వహిస్తున్నారని ఆరోపించారు.ఎన్నికల ప్రచారాల్లో ఇందిరమ్మ ఇళ్ల ముచ్చట తప్పా అభివృద్ధిపై ఎమ్మెల్యే ఊసెత్తడంలేదన్నారు.ఎన్నికల ప్రచారంలో గిరిజనలకు ఏం అభివృద్ధి చేశారని కాంగ్రెస్ నాయకులను నిలదీయడంతో దాడులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.

ప్రశ్నించిన గ్రామస్తులపై రౌడిషీట్లు నమోదు చేయాలని పోలీసులకు హుకుంలు జారి చేస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు సోమవారం రాత్రి దాడి జరిగితే ఇప్పటివరకు ఏ ఒక్క పోలీస్ అధికారి కూడా వెళ్ళలేదని,ఫిర్యాదు ఇస్తేనే పోలీసులు స్పందిస్తారని అని ప్రశ్నించారు.ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నర్సంపేట రూరల్ మండలంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించి
ప్రచారం చేస్తున్నారని అందుకుగాను పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయగా నాపైనే కేసు నమోదు చేస్తా అంటున్నారని మండిపడ్డారు.ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోతున్నామనే భయంతోనే బీఆర్ఎస్ నాయకులపై దాడులకు పాల్పడుతున్నారని ఇప్పటికే జరిగిన దుగ్గొండి నల్లబెల్లి ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పారని ఎద్దేవా చేశారు.చెరువుకొమ్ముతండాలో జరిగిన దాడిలో ఐదుగురు బీఆర్ఎస్ కార్యకర్తలు గాయపడ్డారని ఘటనపై రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఒడిసిఎంఎస్ చైర్మెన్ రామస్వామి నాయక్,చెన్నారావుపేట మాజీ ఎంపీపీ,మండల పార్టీ అధ్యక్షులు బాల్నే వెంకన్న గౌడ్, నర్సంపేట పట్టణ పార్టీ అధ్యక్షులు నాగెల్లి వెంకటనారాయణ గౌడ్,మాజీ కౌన్సిలర్లు, వార్డు అధ్యక్షులు,పట్టణ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version