మాదన్నపేట వాగుపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించాలి…

మాదన్నపేట వాగుపై హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మించాలి

మాదన్నపేట రోడ్డుపై ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో రాస్తారోకో నిరసన

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట నుంచి మాదన్నపేటకు వెళ్లే రహదారిని పునర్నిర్మానం చేసి మాదన్నపేట వాగుపై శాశ్వత హై లెవెల్ వంతెనను నిర్మించాలని నిర్మించి తుఫానుతో నష్టపోయిన బాధిత ప్రజలను తక్షణమే ఆదుకోవాలని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కమిటి సభ్యురాలు వంగాల రాగసుధ డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి డిమాండ్ చేశారు. ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలోని మాదన్నపేట రోడ్డులో గుంతలు పడి ప్రయాణికులకు ఇబ్బందిగా మారిన ప్రధానదారిపై రాస్తారోకో నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గం రోడ్ల నిర్మాణానికి అభివృద్ధికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నామని ప్రచార ఆర్బాటాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.నర్సంపేట నుంచి మాదన్నపేటకు వైపు వెళ్లే ప్రధాన రహదారి నిర్వీర్యమై ప్రయాణికులకు ఇబ్బందిగా మారిందన్నారు. ఈ రోడ్డుపై నిత్యం మాదన్నపేట,నాగూర్లపల్లె, బాజీపేట చంద్రయ్యపల్లె నల్లబెల్లి వరకు అలాగే సుమారు 10 తండాల ప్రజలు నిత్యం ప్రయాణం చేస్తుంటారని పేర్కొన్నారు.రోడ్డు వెడల్పు పేరుతో ప్రస్తుతం ఉన్న దారిని చెడగొట్టి రోడ్డు వేస్తామని తారు తీసివేసి అనేక నెలలు గడుస్తున్నా నేటికీ పునర్నిర్మాణం చేయకపోవడం వారి నిర్లక్ష్యానికి నిదర్శనం అని ఆరోపించారు.గత రెండు రోజులుగా కురిసిన తుఫానుతో పంటలు కోల్పోయి నిరాశ్రయులైన ప్రజలకు రైతులను ఆదుకునే విధంగా తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాదన్నపేట మాజీ సర్పంచ్ కర్నే సాంబయ్య పార్టీ పట్టణ నాయకులు గజవెల్లి జగపతి , జన్ను అనిల్,గణిపాక బాబు,పద్మ, విజయ,అరుణ, కోమల,అజయ్,
రామకృష్ణ ఆటో యూనియన్ అధ్యక్షులు మేకల లక్ష్మణ్,
ఉపాధ్యక్షులు తనుగుల అంజి, కార్యదర్శి ఆరేల్లి శివ,రమేష్,ప్రభాకర్ అఫ్జల్,జంపయ్య తదితరులు పాల్గొన్నారు.

రైతులకు అండగా ఉంటాము…

 

రైతులకు అండగా ఉంటాము

ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు, ములుగు నియోజకవర్గ ఇంచార్జ్ బడే నాగజ్యోతి

వడగళ్ళ వానతో పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం వెంటనే చెల్లించాలి

ఇటీవలే కురిసిన వడగళ్ళ భారీ వర్షనికి నష్టపోయిన రైతులకు వెంటనే నష్ట పరిహారం అందించాలి

మంగపేట నేటిధాత్రి

 

 

మంగపేట మండలం మల్లూర్ మెయిన్ రోడ్డు దగ్గర రైతులకు అండగా
రైతుల పక్షణ ధర్నా లో
ములుగు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు, ములుగు నియోజకవర్గ ఇంచార్జ్ బడే నాగజ్యోతి పాల్గొని కార్యక్రమంలో ఇరువురు మాట్లాడుతూ ఇటీవలే కురిసిన భారీ వర్షలకు నష్టపోయిన రైతులకు ఇంత వరకు నష్టపరిహారం అందించలేకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం, వడగళ్ళ వానతో నష్టపోయిన రైతులకు వెంటనే నష్ట పరిహారం అందించాలి, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారింది, టిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతును రాజుల తీర్చిదిద్దిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ కి దక్కుతుందన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను హరిగోశ పెడుతుందని అన్నారు,రైతులకు 24గంటల కరెంట్ అందించాలి,రైతులు రాత్రిపూట పొలాల్లో పడుకునే దుస్థితి నుండి కాపాడాలి, రైతులకు సకాలంలో యూరియా అందించే విధంగా చూడాలి యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బంది కాంగ్రెస్ ప్రభుత్వానికి కానడడం లేదా అని అన్నారు, ఈ కార్యక్రమంలో మంగపేట మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మి నారాయణ, పి ఏ సీ ఎస్ చైర్మన్ తోట రమేష్,గ్రంథాలయ మాజీ చైర్మన్ పోరిక గోవిందానాయక్, జిల్లా నాయకులు, కాకులమర్రి ప్రదీప్ రావు తాటి కృష్ణ ,తుమ్మ మల్లారెడ్డి, ,భూక్యా జంపన్న,యడ్లపల్లి నర్సింహా రావు, చిట్టీమల్ల సమ్మయ్య, కూర్బన్, చిలకమర్రి రాజేందర్,జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి బడిశా నాగరమేష్, PACS చైర్మన్ కునుర్ అశోక్,మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, పి ఏ సీ ఎస్ వైస్ చైర్మన్ కడబోయిన నరేందర్, మల్లూర్ దేవస్థాన మాజీ చైర్మన్ నూతిలకంటి ముకుందం, జిల్లా మహిళా నాయకురాలు కొమరం ధనలక్ష్మి, పార్టీ నాయకులు బుట్టో, గాదె శ్రీనివాస్ చారి, పూజారి శ్రీనివాస్ ,మండల యూత్ అధ్యక్షులు గుమ్మలా వీరాస్వామి, అన్ని గ్రామ కమిటీ అధ్యక్షులు,మహిళలు,సోషల్ మీడియా వారియర్స్, యూత్ నాయకులు, రైతులు, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ,

రిలే నిరాహారదీక్ష కు టీడీపీ సంపూర్ణ మద్దుతు…

 

రిలే నిరాహారదీక్ష కు టీడీపీ సంపూర్ణ మద్దుతు

ఎమ్మెల్యే,జీఎం స్పందించాలి టీడీపీ డిమాండ్

తాండూరు( మంచిర్యాల) నేటి ధాత్రి :

 

 

మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలోని నర్సపూర్ గ్రామ పంచాయతీలో నెలకొన్న ప్రధాన సమస్యలను పరిష్కరించాలని గత ఆరు రోజులుగా తహసీల్దార్ కార్యాలయం ముందు ఆదివాసులు చేస్తున్న రిలే నిరాహారదీక్షలకు శనివారం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు దాసరి శ్రీనివాస్ దీక్ష శిబిరాన్ని సందర్శించి వారికి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సపూర్ చెక్ పోస్ట్ వద్ద హై లెవల్ బ్రిడ్జి, లచ్చుగుడెం దారిలో నూతన కల్వర్టు నిర్మాణం అలాగే నర్సపూర్ నుండి బెజ్జల రోడ్డుకు అటవీశాఖ అనుమతి ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలోతాండూర్ మండల తుడుం దెబ్బ అధ్యక్షులు కుర్సెంగ బాబురావు, సోయం సురేష్, ఆత్రం బాదిరావు, సోయం వంశీకృష్ణ,ఆత్రం సురేష్ తదితరలు గ్రామస్తులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version