క్రీడాకారులకు టి-షర్ట్ లను పంపిణి….

క్రీడాకారులకు టి-షర్ట్ లను పంపిణి

భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పోలుసాని లక్ష్మీ నరసింహారావు

గణపురం నేటి ధాత్రి

 

గణపురం మండల కేంద్రంలో సంక్రాంతి సందర్బంగా ములుగు జిల్లా కొత్తూరు లో జరిగే క్రికెట్ టోర్నమెంట్ కోసం గణపురం క్రికెట్ క్రీడాకారులకు టి-షర్ట్ లను పంపిణి చేసిన భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పోలుసాని లక్ష్మీ నరసింహ రావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూక్రీడలు శారీరక, దృఢత్వమే కాకుండా మానసిక ఉల్లాసానిస్తాయన్నారు
క్రీడా కార్యక్రమాలు యువతను చెడు అలవాట్ల నుండి దూరంగా ఉంచి, శారీరకంగా మానసికంగా బలంగా తీర్చిదిద్దుతాయి.
క్రీడలు గెలుపోటములు తట్టుకునే మానసిక ధైర్యాన్ని ఇస్తాయాన్నారు
క్రీడలు కేవలం వినోదం మాత్రమే కాదు,క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, జట్టు భావన వంటి విలువలను పెంపొందిస్తాయి.
అలాగే యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడంలో ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్‌లు కీలక పాత్ర పోషిస్తాయి అన్నారు
భవిష్యత్తులో కూడా
ఇలాంటి క్రీడా కార్యక్రమాలకు తన పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.అలాగే ఎమ్మెల్యే ని పలు మార్లు క్రీడా మైదానం క్రీడాకారులను గురించి కలవడం జరిగింది ఈ సందర్బంగా గణపురం లో ఒక క్రీడా మైదాన్నన్ని ఏర్పాటు చేయాలనీ క్రీడకారుల తరపున కోరడం జరిగింది ఈ సందర్బంగా క్రీడాకారులు లక్ష్మీ నరసింహారావు ని శాలువాతో సన్మానించడం జరిగింది
ఈ కార్యక్రమంలో గణపురం బి ఆర్ ఎస్ టౌన్ అధ్యక్షులు హఫీజ్, క్రీడాకారులు నిమ్మ సురేందర్, తాళ్లపెల్లి సాయి వర్ధన్, వాజిత్, ఇమ్రాన్,పూజారి రాకేష్, ముజ్జు,తాళ్లపెల్లి హర్ష,రమేష్, వహీద్, రోహన్, సాజిత్,మండ రాజు, అభి,షఫీ, వెంకటేష్, కృష్ణ, సోన్ను,బన్నీ, సర్వర్ పాషా తదితరులు పాల్గొన్నారు

మీషన్ మగ్దంపురం ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీ షర్ట్ పంపిణీ..

మీషన్ మగ్దంపురం ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీ షర్ట్ పంపిణీ

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మండలంలోని ముగ్దంపురం గ్రామంలోని చందు బంజారా యూత్ అసోసియేషన్ సభ్యులకు మీషన్ ముగ్దంపురం ఫౌండేషన్ వ్యవస్థాపకులు మండ కార్తీక్ గౌడ్ జెర్సీ(టీ షర్ట్) లను ప్రోత్సాహకంగా అందించారు. మండ కార్తీక్ గౌడ్ మట్లాడుతూ గ్రామంలోని యువత క్రీడ స్ఫూర్తిని పెంపొందించాలని ఉద్దేశంతో జెర్సీలను అందించడం జరిగిందన్నారు.అదే విధంగా వచ్చే సంక్రాంతి పండుగకు నర్సంపేట డివిజన్ పరిధిలో ఉన్న యువకులకు షటిల్ టోర్నమెంట్ ను ,మహిళలకు ముగ్గుల పోటీలను చందు బంజారా యూత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు సురేష్,సంతోష్,అంజన్ ,లక్కీ, విజయ్, తిరుపతి,శ్రీహరి, శ్రీను, దుర్గా, మురళి తదితరులు పాల్గొన్నారు.

క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తేవాలి….

క్రీడాకారులు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తేవాలి

మండల పరిషత్ అభివృద్ధి అధికారి పెద్ది ఆంజనేయులు

పరకాల,నేటిధాత్రి

 

స్కూల్ గేమ్స్ పెడరేషన్ ఆఫ్ ఇండియా 2025 లో భాగంగా 14 నుండి 17 సంవత్సరాల వయస్సు గల బాల బాలికలు మండల స్థాయి నుండి జిల్లా స్థాయి కబడ్డీ కోఖో క్రీడలకు ఎంపిక అయిన క్రీడాకారులకు టీ షర్టులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో యంపీడీఓ ఆంజనేయులు మాట్లాడుతూ నేటి కాలమాన పరిస్థితులలో విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు ఇతర రంగాలలో కూడా రాణించాలని రాష్ట్ర దేశ స్థాయిలో ఉత్తమ క్రీడాకారులకు ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్లు ఉంటాయని కాబట్టి పరకాల మండలానికి ఎక్కువ సంఖ్యలో అవార్డులు తీసుకురావాలని కోరారు.ఈ కార్యక్రమంలో స్కూల్ గేమ్స్ పెడరేషన్ పరకాల మండల కార్యదర్శి సంది కరిత ఆర్గనైజింగ్ కార్యదర్శి బి సాంబయ్య నోడల్ అధికారి నామానిసాంబయ్య,ప్రదానోపాద్యాయులు బాస్కర్,పీడీలు శ్యాం, రజిత,వినయ్,సుదీర్, రాజు,శ్రీకాంత్,సురేష్ మండల పరిధిలోని ప్రబుత్వ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు పీఈటీలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version