తంగళ్ళపల్లి మండలం చిన్న లింగాపూర్ గ్రామంలో గ్రామ శాఖ అధ్యక్షులు గుర్రం రవీందర్ రెడ్డి మాజీ ఎంపిటిసిబై రీ వేణి రాముఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేదల కుటుంబాల వైద్యానికి ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతగానో అండగా ఉంటుందని చిన్న లింగాపూర్ గ్రామంలోని లబ్ధిదారులకు మహిమల రాజయ్యకు 60 వేల రూపాయలు గుర్రం ప్రసాద్ రెడ్డికి 45 వేల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ అందజేశామని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు రావడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి ప్రభుత్వ విప్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కి కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి పీకే మహేందర్ రెడ్డి కి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ కి కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి చెక్కుడు రావడానికి చెక్కులు రావడానికి కృషిచేసిన వారికి నాయకులకు గుర్రం ప్రసాద్ రెడ్డి మహిమల రాజయ్య ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో పాక్స్ డైరెక్టర్ మంద నారాయణ గౌడ్ బోలవే ని అనిల్ రేగుల ఎల్లయ్య పిట్ల పరుశురాములు వంతడుపుల బాలరాజు బోల వేణి హరీష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
తండ్రి జ్ఞాపకార్థం శివాలయ పునర్నిర్మాణానికి కసిరెడ్డి బ్రదర్స్ విరాళం.
చిట్యాల, నేటిధాత్రి :
భక్తి, శక్తి, ముక్తి మానవ జీవితంలో పరమ పద సోపానాల్లాంటివని జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామ వాస్తవ్యులు కసిరెడ్డి కృష్ణారెడ్డి, కసిరెడ్డి రత్నాకర్ రెడ్డిలు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేట గ్రామంలో పురాతన శివాలయం శిథిలావస్థకు చేరడంతో..ఆ శివాలయాన్ని కూల్చివేసి..నూతన శివాలయ పునర్నిర్మాణానికి కసిరెడ్డి బ్రదర్స్ కంకణ బద్దులయ్యారు. గ్రామస్తులనంతా ఏకం చేసి..విరాళాలు సేకరిస్తూ..శివాలయం పునర్నిర్మాణ పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో వారి తండ్రి కీ: శే: కసిరెడ్డి పురుషోత్తం రెడ్డి స్మారకార్థం రూ.1,50,516 రూపాయల విరాళం అందించి వారి భక్తి భావాన్ని ప్రదర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భక్తి భావం వలన ప్రజల మధ్య సాన్నిహిత్యం పెరుగుతుందని, ఈర్ష్య, ద్వేషం, అసూయ లాంటి దుర్గుణాలు తొలగిపోయి, భగవత్ సాహిత్యం వలన మనిషి మనసులో ప్రశాంతత పెరిగి సద్గుణాలు కలుగుతాయని, తద్వారా గ్రామస్తులందరి మధ్యన మంచి సంబంధాలు ఏర్పడతాయన్నారు. ఈ కార్యక్రమంలో శివాలయం అర్చకుడు రఘునందన్, గ్రామ ప్రముఖులు సర్వ శరత్ కుమార్, అనగాని రాజయ్య, మందల రాఘవరెడ్డి, చెక్క నర్సయ్య, కొక్కుల సారంగం తదితరులు పాల్గొన్నారు.
వరంగల్ నగరంలోని దేశాయ్ పేట్ రోడ్ కళ్యాణి నగర్ కాలనీ వాసులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు తమ కాలనీ లోని కుటుంబ సభ్యులంతా ఆరెపల్లి సమీపంలో ఏ ఎన్ ఆర్ గార్డెన్స్ లో కలుసుకొని అట పాటలతో సందడి చేసారు…
Spiritual gathering
ఈ సందర్బంగా కళ్యాణి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గోలి చెన్నారెడ్డి మాట్లాడుతూ ఐకమత్యం తో ఉండడం వాళ్ళ అందరు సంతోషంగా ఉంటారని కాలనీ లో ఆహ్లాదా వాతావరణం ఉంటుందని అన్నారు ఈ కార్యక్రమం లో పాల్గొన్నా కుటుంబ సభ్యులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమం లో కళ్యాణి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు గోలి చెన్న రెడ్డి కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి కోశాధికారి మధు సుధన్..
Spiritual gathering
గౌరవ అధ్యక్షులు హరినాథ్ సలహాదారులు చిర్ల మల్ల రెడ్డి కాలనీ వాసులు కొండల్ రావు సంతోష్. తిరుపతి రెడ్డి వెంకట్ రెడ్డి.రామ సుబ్బారెడ్డి .వెంకట్ గౌడ్.రాంరెడ్డి రాజేందర్ రెడ్డి తుమ్మ ప్రభాకర్ రెడ్డి .సూరం ప్రతాప్ రెడ్డి. శివ కుమార్.వసంత్ కుమార్.చంద్ర శేఖర్ జయ పాల్ రెడ్డి పల్లం కుమారస్వామి తుమ్మ శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు
ప్రపంచ క్షయ దినోత్సవం సందర్బంగా అవగాహన కార్యక్రమం టీ.బీ నియంత్రణలో అందరూ పాలు పంచుకోవాలి జిల్లాలో పటిష్టంగా కార్యాచరణ అమలు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
ప్రపంచ టీ.బీ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి లో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్
సిరిసిల్ల టౌన్ :(నేటి ధాత్రి):
సిరిసిల్ల జిల్లాలో క్షయ (టీ.బీ.) నియంత్రణలో అందరూ పాలు పంచుకోవాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పిలుపు నిచ్చారు. ప్రపంచ టీ.బీ దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ఆవరణలో సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ హాజరై ప్రారంభించారు.
Awareness program
ముందుగా టీబీ నియంత్రణ ప్రతిజ్ఞను ఉద్యోగుల అందరితో చేయించారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు, నర్సింగ్ కళాశాలలో నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో విజేతలకు కలెక్టర్ ప్రశంస పత్రాలను పంపిణీ చేశారు.
Awareness program
ఈ సందర్భంగా ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. టీ.బీ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేశారు. టీ.బీ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు వైద్యులు, సిబ్బంది కృషి చేయాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలు, జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి టీబీ లక్షణాలు ఉన్నవారిని గుర్తించాలని, వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించి వ్యాధి నిర్థారణ పరీక్షలు చేయించాలని పేర్కొన్నారు. టీబీ పేషెంట్ల పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి వైద్యం, మందులు ఇప్పించాలని కలెక్టర్ ఆదేశించారు. టీ.బీ రహిత గ్రామాలుగా శివంగాలపల్లె, అనంతపల్లి, రామన్నపేట, కంచర్లను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని కలెక్టర్ వెల్లడించారు. ఇందుకు కృషి చేసిన వైద్యులు, సిబ్బందిని అభినందించారు. మిగతా వైద్యులు, సిబ్బంది వీరిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని పిలుపు ఇచ్చారు.అంతేకాకుండా ఈ కార్యక్రమంలో డీ.ఎం అండ్ హెచ్. ఓ రజిత, జీ.జీ.హెచ్. సూపరింటెండెంట్ లక్ష్మీనారాయణ, వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
వ్యక్తులు కనిపించడం లేదనే ఫిర్యాదులపై కేసు నమోదు చేసిన పోలీసులు.
జహీరాబాద్. నేటి ధాత్రి:
ఇద్దరు వేర్వేరు వ్యక్తులు కనిపించడం లేదని కచ్చిన పిర్యాదులపై కేసు నమోదు చేసినట్లు జహీరాబాద్ పట్టణ ఎస్సై ఎం. కాఠినార్ యాకర్ తెలిపారు.
ఇంటి నుండి వెళ్లిన భర్త తిరిగి రాలేదని, ఆచూకీ కనుక్కోవాలని మహిళ పిర్యాదు చేసిందని ఎప్ని యం. కాశీనాధ్ యాదవ్ తెలిపారు ఆయన తెలిపిన వివరాల ప్రకారం సంగారెడ్డి జిల్లా బహీరా బాద్ పట్టణం రాంనగర్ నివాసి అయిన హాసిల్యాండ్ మోసిన్ (19), ఆటో డ్రైవర్ ఈ నెల 17న ఉదయం 10 గంటల సమయంలో టీన్ 157637 సంబరు గం లో తీసుకుని అద్దెలో హైదరాబాద్ వెళ్ళాడు.
హైదరాబాద్ కి ఆర్థిలో వెళ్లిన తన భర్త ఇంత వరకు ఇంటికి రాలేదని పాసిల్యాండ్ మోసిన భార్య పాస్ బ్యాండ్ సహారా పాలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసింది.
పిర్యాదు తీసుకున్న ఎసీఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.కూతురు కనిపించడం లేదని తల్లి పిర్యాదు తన రెండవ కూతుడు రాథోడ్ ని రుషా (24) కనిపించ డం లేదని తల్లి రాథోడ్ కవిత భర్త విక్కి బహీరాబాద్ పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేసింది.
జహీరాబాద్ పట్టణం రాంనగర్ లో తాము నివాసం ఉండే ఇంటి నుండి ఈ.నెల 14వతేదీ ఉదయం 10 గంటల 300 మిషముల సమయంలోబయటికి వెళ్లి తిరిగినాలేనని పిర్యాదులో పిర్యాదురాలు పేర్కొన్నది.
కవిత ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుసున్నట్లు జహీరాబాద్ పట్టణ ఎస్ఐ యం కాశీనాధ్ తెలిపాడు.
వరంగల్ జిల్లా నెక్కొండ కు చెందిన ఇంటర్నేషనల్ ఆస్ట్రో ఎక్సలెన్స్ అవార్డు గ్రహీత, జ్యోతిష వాస్తు పండితులు శ్రవణ్ శాస్త్రి బూరుగుపల్లికి ఉగాది పురస్కారం ప్రధానం చేశారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల వాస్తు,జ్యోతిష పండితులతో విశ్వజ్యోతి జ్యోతిష విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో విజయవాడలో ఆదివారం జరిగిన జ్యోతిష సమ్మేళనంలో శ్రవన్ శాస్త్రిని సత్కరించారు.లబ్దప్రతిష్టులైన జ్యోతిష వాస్తు పండితులు, బహు జ్యోతిష గ్రంథ రచయితలు డాక్టర్ పుచ్చా శ్రీనివాసరావు , లక్కావజ్జుల విజయ సుబ్రహ్మణ్య సిద్ధాంతి, ఆదిపూడి శివ సాయిరాం, విశ్వ జ్యోతి జ్యోతిష విజ్ఞాన సంస్థ చైర్మన్ డ్యాగం విశ్వనాథం ,ప్రముఖ న్యూమరాలజిస్ట్ శ్రీకాంత్ శర్మ ల సమక్షంలో జ్యోతిర్మిత్ర అవార్డును, ఉగాది పురస్కారం అందించి శాలువా కప్పి సన్మానించి అభినందించారు.
Vishwajyoti Jyotisha
నెక్కొండ ప్రాంతంలో జ్యోతిష వాస్తు రంగాలలో సేవలు అందిస్తూ ఇప్పటికే ప్రఖ్యాత ఇంటర్నేషనల్ ఆస్ట్రో ఎక్సలెన్స్ అవార్డు, బెస్ట్ సైంటిఫిక్ ఆస్ట్రాలజర్ అవార్డు, జ్యోతిష వాస్తు బ్రహ్మ,, జ్యోతిష పరిహార భాస్కర, బెస్ట్ వేదిక్ ఆస్ట్రాలజర్ అవార్డు లను అందుకున్న శ్రవన్ శాస్త్రి తాజాగా ఉగాది పురస్కారాల్లో సత్కారం పొందారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత శ్రవన్ శాస్త్రి మాట్లాడుతూ ఉగాది పురస్కారాల్లో ప్రముఖ పండితుల సరసన తన సేవలను గుర్తించి సత్కరించడం సంతోష మన్నారు. ఈ పురస్కారం వాస్తు జ్యోతిష రంగాల్లో తన బాధ్యతను మరింత సెంచుతున్నదన్నారు. ఈ సందర్భంగా పలు వాట్స్అప్ గ్రూప్లో లలో శ్రవణ శాస్త్రికి అభినందనలు తెలుపుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నట్లుగా నెక్కొండ ప్రజలు ట్రీట్ చేయడం గమనార్థం.
జహీరాబాద్ నియోజకవర్గ ము.సాహిత్యరంజని సాహితీ సాంసృతిక సంస్థ ఆధ్వర్యంలో ఉగాది కవి సమ్మేళనం ను నిర్వహించారు.
Literature is great.
ప్రతి సంవత్సరం ఉమ్మడి మెదక్ జిల్లా లోని అన్ని మండలాల నుండి కవులను,రచయిత లను ,కళాకారుల ను ఆహ్వానించి తెలుగు భాషను ఉన్నతి కోసం ,తెలుగు భాష రక్షణ కోసం ఒక వేదికగా కవి సమ్మేళనం లను ఏర్పాటు చేసి సమాజంలో లో జరుగుతున్న వివిధ అన్యాయాలను గురించి, తమ తమ కవిత్వం ద్వారా సామాజిక చైతన్యం కలిగిస్తూ ,ఇప్పటి తరం పిల్లల్లో తెలుగు సాహిత్యం, తెలుగు భాష గొప్పతనం గురించి తెలియజెయ్యడం లో కవుల పాత్ర చాలా గొప్పగా ఉంటుంది.
తమ పిల్లలకు ఏ భాష నైనా నేర్పండి కానీ తెలుగును మరవకండి అని ,పుస్తకాలు చదివే అలవాటు చేసుకోవాలని ,వివిధ ప్రాంతాలలో జరిగే పుస్తక ప్రదర్శన తమ పిల్లలకు భాగస్వామ్యం చెయ్యాలని ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకటరమణ చారి తెలియజేసారు.
ఉగాది విశిష్టత చక్కగా వివరించారు.
ఈ కవి సమ్మేళనం లో వివిధ ప్రాంతాల కవులు పాల్గొని తమ తమ కవితలు గానం చేశారు.
జహీరాబాద్ ప్రాంతానికి చెందిన కవులు డా.పెద్దగొల్ల నారాయణ, కె. విట్ఠల్ లు కూడా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కవులకు సన్మానించారు.
ఈ కార్యక్రమంలో సాహిత్య రంజని అధ్యక్షుడు పెంటారెడ్డి, మొహమ్మద్ షరీఫ్,బాబూరావు,తదితరులు పాల్గొన్నారు.
న్యాల్కల్ మండలంలోని కల్బేమల్ గ్రామంలోని దళిత వాడలో శనివారం రాత్రి విద్యుత్ ప్రమాదం చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకులు, కాలనీవాసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత రెండు రోజులుగా ఈదురు గాలులు, ఉరుములు మెరుపులతో కురుస్తున్న వర్షాలతో.. కాలనీలోని మాజీ ఎంపీటీసీ సభ్యుడు మాణిక్, శిరోమణిలకు చెందిన ఇండ్ల సమీపం వద్ద శనివారం రాత్రి 10 గంటల సమయంలో ఉన్నట్టుండి విద్యుత్ తీగలు నేల వారాయి. ఇంటి పైకప్పు కు సమీపంలో ఉన్న ఇనుప కడ్డీలకు ఎర్తింగ్ విద్యుత్ తీగ తగలడంతో ఒక్కసారిగా మంటలు ఏర్పడ్డాయి. దీంతో మాణిక్ స్వగృహంలో పంటలు ఏర్పడ్డాయి. అట్టి సమయంలో మాణిక్ మినహా కుటుంబ సభ్యులందరూ ప్రార్థనలు చేసేందుకు చర్చికి వెళ్లడంతో కుటుంబ సభ్యులందరికీ తృటిలో ప్రాణాపాయం తప్పింది. మంటలు ఆర్పేందుకు అగ్నిమాకపాక యంత్రం సకాలంలో రాకపోవడం, అందుబాటులో లేని కారణంగా తీవ్రంగా నష్టం వాటిల్లిందని బాధితులు మాణిక్, శిరోమణిలు వాపోయారు. ఈ మేరకు బాధితులు స్థానిక హదునూర్ పోలీసులు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఝారసంగం నుండి మేదపల్లి మరియు ఈదులపల్లి మీదుగా నేరుగా జాతీయ రహదారి 65 దిగ్వల్ వరకు రహదారి పరిస్థితి దీనస్థితిలో ఉంది దశాబ్ద కాలం నుండి అధికారులను నాయకులను అడిగిన ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది, ఝారసంగం మరియు మేదపల్లి మద్యలో పరిస్థితి మరి దారుణంగా ఉందని రోడ్లపై గుంతలు పడి ప్రయాణం చేయాలంటే ప్రయాణికుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు, పట్టించుకోవాల్సిన అధికారులు నాయకులు పట్టించుకోక పోవటంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది.
Dangerous
రోడ్డు పూర్తిగా ధ్వంసమై రాత్రి వేళలో గుంతలు కనిపించక పలు ప్రమాదాలు జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఈ రోడ్లపై వెళ్లే వాహనాలు సైతం పాడవుతున్నాయి. దయచేసి ఉన్నతాధికారులు నాయకులు స్పందించి వెంటనే రోడ్లను నిర్మాణం చేయాలని కోరుకుంటున్నాం అని స్థానిక యువ నాయకులు అభిలాష్ రెడ్డి అన్నారు.
నేర్మట గ్రామపంచాయతీ, బస్టాండ్ ముందుమురికి కాలువ సరిగ్గా లేకపోవడంతో మురికి కాల్వ యందు ఈగలు, దోమలు ఉండడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారని, వెంటనే ప్రభుత్వం డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారంచండూరు మండల పరిధిలోనినేర్మట గ్రామంలో సిపిఎం పోరుబాట కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని పలు సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొంతకాలంగా గ్రామంలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ గ్రామాలలో పలు వార్డులలో గతంలో సిసి రోడ్లు వేసినారు గాని ఆ రోడ్లు వర్షం వస్తే గుంతల మయంగా మారుతుందని, మురికి కాల్వల నిర్మాణం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. ఈ గ్రామానికి చుట్టుపక్కల ప్రాంతాలైన పుల్లెంల, గొల్లగూడెం, బంగారిగడ్డ, లెంకలపల్లి, శేరి గూడెం, ఈ గ్రామాలకు లింకు రోడ్లను బీటీ రోడ్లుగా మార్చాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి కోరారు. గ్రామాల్లో నీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా అధికారులు గ్రామాలలో ఇప్పటికప్పుడు సమాచారం తీసుకోని ప్రజల సమస్యలను పరిష్కరించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులుఈరటి వెంకటయ్య, బల్లెం స్వామి, బల్లెం వెంకన్న,ఈరగట్ల నరసింహ, బొమ్మరగోని యాదయ్య, దాసరి రాములు, నారపాక నరసింహ, శంకర్, గ్రామ ప్రజలు బొమ్మరగోని నాగరాజు,సతీష్,బుర్కల నవీన్, బొడిగె నగేష్, బుర్కల సైదులు, రావుల రవి, పగిళ్ల స్వామి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే మాణిక్ రావు గారి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు…
జహీరాబాద్. నేటి ధాత్రి:
రంజాన్ పవిత్ర మాసం పురస్కరించుకుని జహీరాబాద్ ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సంధర్బంగా శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు ,డిసిఎంఎస్ చైర్మన్ శివకుమార్ మాట్లాడుతూ మతాలకతీతంగా ఇఫ్తార్ విందులో పాల్గొనడం సోదరాభావాన్ని పెంచి లౌకిక విలువలను కాపాడుతాయని, ముస్లిం సోదరులు నెలరోజుల పాటు అత్యంత కఠిన నియమాలతో అల్లాను ప్రార్థిస్తారని, అల్లా దయతో ప్రజలందరు సుఖ సంతోషాలతో జీవించాలన్నారు.
అనంతరం ముస్లిం సోదరులకు ఖర్జూరం తినిపించి ఉపవాసన్ని విరమింప చేశారు.
Iftar dinner
ఈ కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ లు గుండప్ప, రామకృష్ణ రెడ్డి ,మాజి ఆత్మ చైర్మన్ లు విజయ్ కుమార్, పెంట రెడ్డి,మాజి మున్సిపల్ చైర్మన్ లు అల్లాడి నర్సింలు, తాంజిమ్,మాజి పట్టణ అధ్యక్షులు మోహి ఉద్దీన్,డి ఆర్ యు సిసి మెంబర్ షేక్ ఫరీద్ , మొగుడంపల్లి మండల అధ్యక్షులు సంజీవ్ రెడ్డి,ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం ,కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సింలు , పాక్స్ చైర్మన్ మచెందర్,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,న్యాల్కల్ మాజి మండల పార్టీ అధ్యక్షులు నర్సింహ రెడ్డి,మాజి ఝరాసంగం మండల పార్టీ అధ్యక్షులు బొగ్గుల సంగమేశ్వర్,బి ఆర్ ఎస్ పార్టీ మైనార్టీ నాయకులు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు,
పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసే ఇఫ్తార్ విందు ఆత్మీయత, మత సామరస్యానికి ప్రతీక అని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. రామకృష్ణాపూర్ పట్టణంలోని ఏ జోన్ మసీదులో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే వివేక్ పాల్గొన్నారు.
Iftar dinner
సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు ఫలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విడిపించారు. మసీద్ లభివృద్ధిపై మత పెద్దలు అందించిన వినతి పత్రాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇఫ్తార్ విందులలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
మసీదుల అభివృద్ధికి, ఆలయాల నిర్మాణాల స్థలాల కొరకు సింగరేణి యాజమాన్యంతో చర్చించి ఎటువంటి అడ్డంకులు లేకుండా చూస్తానని మత పెద్దలకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ముస్లిం మైనారిటీ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, డాక్టర్ సలీం, లాడెన్, పట్టణంలోనీ ముస్లిం మత పెద్దలు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు పల్లె రాజు, గాండ్ల సమ్మయ్య, నాయకులు పాల్గొన్నారు.
పరాయిపాలన నుండి భారతదేశ విముక్తి కోసం యుక్త వయసులోనే ప్రాణాలు త్రుణపాయంగా దేశ విముక్తి కోసం ప్రాణాలను ఇచ్చిన అమరులు సర్దార్ భగత్ సింగ్ రాజ్ గురు , సుఖదేవ్ ల త్యాగాల స్ఫూర్తితో సమ సమాజం కోసం దోపిడీ లేని కులమత రహిత సమాజం కోసం పాటుపడదామని, సమాజాన్ని ముందుకు తీసుకుపోయే యువత ఐక్యం కావాల్సిన అవసరం ఉందని రామకృష్ణాపూర్ సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్, సహాయ కార్యదర్శి నక్క వెంకటస్వామి లు అన్నారు. భగత్ సింగ్ 94వ వర్ధంతి సందర్భంగా అమరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి, బీ జోన్ రాజీవ్ చౌక్ నుండి సూపర్ బజార్ చౌరస్తా వరకు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరుల స్ఫూర్తితో సమ సమాజం కోసం కృషి చేద్దామని నాయకులకు,యువకులకు పిలుపునిచ్చారు.
Mittapalli Srinivas
ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మిట్టపల్లి శ్రీనివాస్, వెంకటస్వామి, వనం సత్యనారాయణ, పౌల్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
· Tamil Nadu is birth place and Andhra Pradesh is mother-in-laws house
· Join in BJP in the year 2008
· Gradually step by step raised to this present level
· As second woman Finance Minister she created record
· First woman full time Finance Minister is also a record
· Balakot strikes held while she was Defence Minister
· Attained place in Forbs world powerful women list
· Under her tenure India raised to fifth world largest economy
HYDERABAD,NETIDHATHRI:
Nirmala Sitharaman (born 18 August 1959) is an Indian economist, politician and a senior leader of the Bharatiya Janata Party (BJP) serving as the Minister of Finance and Minister of Corporate Affairs of the Government of India since 2019. She is a member of the Rajya Sabha, the upper house of the Indian Parliament, representing Karnataka since 2016 and previously represented Andhra Pradesh from 2014 to 2016. Sitharaman previously served as the 28th Defence Minister from 2017 to 2019, thereby becoming India’s second female defence minister and the second female finance minister after Indira Gandhi, and the first full-time female minister to hold each of those portfolios. Sitaraman presented the union budget 8 times, making her second only to Morarji Desai to present the most number of budgets.[2] She served as junior minister in the Modi ministry between 2014 and 2017, holding successive positions, first for her dual appointment as the Minister of State in the Ministry of Finance and the Minister of State in the Ministry of Corporate Affairs from May to November 2014, and then as the Minister of State (Independent Charge) for the Ministry of Commerce and Industry from May 2014 to September 2017, before being elevated to senior posts within the Union Cabinet. Sitharaman featured in the Forbes 2022 list of World’s 100 most powerful women and was ranked 36. In 2023, she was ranked 32nd and in 2024, she was ranked 28th in the Forbes list of World’s 100 most powerful women. Fortune named her the most powerful woman in India. In 2025, she created history by becoming the first person to table the union budget 8 consecutive times. Birth and Education Nirmala Sitharaman was born in a Tamil Iyengar family in Madurai, Tamil Nadu, to Savitri and Narayanan Sitharaman. She had her schooling at Sacred Heart Convent Anglo-Indian School, Villupuram, till primary level and thereafter at Vidyodaya School in Chennai. She then studied at St. Philomena’s School and at Holy Cross School in Tiruchirappalli. Sitharaman obtained a Bachelor of Arts degree in Economics from Seethalakshmi Ramaswami College, Tiruchirapalli, in 1980, and a Master of Arts degree in Economics and M.Phil. From Jawaharlal Nehru University, Delhi, in 1984. She then enrolled in a Ph.D. program in Economics with a focus on Indo-European trade but later left this program and moved to London when her husband secured a scholarship at the London School of Economics because of which she was unable to complete her degree. Political career in BJP Nirmala Sitharaman served as a member of the National Commission for Women from 2003 to 2005. Nirmala Sitharaman joined BJP in 2008. She was a national spokesperson of the party till 2014. In 2014, she was inducted into Narendra Modi’s cabinet as a junior minister and was elected in June of that year as a Rajya Sabha Member from Andhra Pradesh. In May 2016, she was one of the 12 candidates nominated by the BJP to contest the Rajya Sabha elections due on 11 June. She successfully contested her seat from Karnataka. She has served as the Defence Minister of India and headed the Balakot Air Strike carried out by the Indian Air Force in 2019. She is currently serving as the Minister of Finance and Corporate affairs of India and has presented five annual budgets of India (as of 2023). Union Defence Minister Sitharaman as the Union Minister of Defence in New Delhi, 7 September 2017Sitharaman pictured during her tenure as Union Minister of Defence, January 2018 On 3 September 2017, she was appointed as Minister of Defence, being only the second woman after Indira Gandhi to hold the post, but the first full-time female defence minister. Under her tenure, the army conducted the Balakot airstrike in retaliation to the 2019 Pulwama attack. The Indian army claimed that the operation had killed at least 170 JeM terrorists. Union Finance Minister Nirmala Sitharaman being given the customary Curd and Sugar by President Droupadi Murmu before Union Budget presentation on, 1 February 2025. On 31 May 2019, Nirmala Sitharaman was appointed as the finance and corporate affairs minister. She is India’s first full-time female finance minister. She presented her maiden budget in the Indian parliament on 5 July 2019. Sitharaman presented the Union Budget 2020–21 on 1 February 2020. During the COVID-19 pandemic in India she was made in-charge of the COVID-19 Economic Response Task Force. Under her tenure as the finance minister in 2022, India became the Fifth largest Economy in the world, and the GDP of the country was said to have seen massive growth positively with historical context. In February 2024, she presented the Union budget for the record 6th time and matched it with Morarji Desai. She also became the first minister to present the budget in the New Parliament building of India. She was given the same cabinet posts after the Indian general election in June 2024. Prior to politics Nirmala Sitharaman worked as a salesperson at Habitat, a home decor store in London’s Regent Street. She has served as an assistant to Economist in the Agricultural Engineers Association in the UK. During her stay in the UK, she has also served as a Senior Manager (R&D) for PWC and briefly at the BBC World Service. She has also served as a member of National Commission for Women. In 2017, she was one of the founding directors of Pranava in Hyderabad. Awards The Jawaharlal Nehru University conferred her, the Distinguished Alumni Award in 2019. Forbes Magazine has ranked her 34th among the 100 most powerful women in the world in 2019. Nirmala Sitharaman, Union Finance Minister wins the Business Reformer of the year award at The Economic Times Awards for Corporate Excellence 2021. In 2023, ranked at number 32, Sitharaman has made it to the list of Forbes Magazine’s 100 most powerful women in the world for the fifth time in a row. In 2022, the minister was ranked at number 36 in the list, while she was in the 37th spot in 2021 and 41st in 2020 respectively. Personal life Sitharaman met her husband, economist and commentator Parakala Prabhakar, who is from Narsapuram, Andhra Pradesh, while studying at the Jawaharlal Nehru University. While Nirmala leaned towards the BJP, her husband is from a Congress family. They married in 1986, and have a daughter who previously worked for The Hindu and the Mint. Prabhakar served as the communications advisor to the Government of Andhra Pradesh from 2014 to 2018.
ఈమె హయాంలోనే ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరణ
హైదరాబాద్,నేటిధాత్రి:
నిర్మలా సీతారామన్ మనదేశానికి చెందిన ఆర్థికవేత్త, ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్వ్యవహారాలశాఖ మంత్రిగా 2019నుంచి పనిచేస్తున్నారు. 1959 ఆగస్టు 18న జన్మించిన ఈమె ప్రస్తుతం భారతీయ జనతాపార్టీలో ముఖ్య నాయకురాలిగా వున్నారు. ఆమె కర్ణాటక రాష్ట్రం నుంచి రాజ్యసభకు 2016నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014`16 మధ్యకాలంలో ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఆమె రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగారు. 2017`19 మధ్యకాలంలో దేశానికి 28వ రక్షణశాఖ మంత్రిగా పనిచేశారు. ఇందిరాగాంధీ తర్వాత రక్షణశాఖను మరియు ఆర్థికశాఖను నిర్వహించిన రెండో మహిళగా గుర్తింపు పొందారు. అంతేకాదు ఈ రెండు మంత్రిత్వశాఖను పూర్తిస్థాయిలో నిర్వహించిన తొలిమహిళ కూడా సీతారామన్ కావడం విశేషం. దివంగత మాజీ ప్రధాని మురార్జీదేశాయ్ తర్వాత అత్యధికసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత కూడా ఈమెదే. మొత్తం ఎనిమిదిసార్లు నిర్మలమ్మ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 2014`17 మధ్యకాలంలో ఆమె మోదీ ప్రభుత్వంలో జూనియర్ మంత్రిగా పనిచేశారు. 2014 మే నుంచి నవంబర్ మధ్యకాలంలో కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయమంత్రిగా రెండు బాధ్యతలను నిర్వహించారు. 2014 నవంబర్ నుంచి కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా (స్వతంత్ర) 2017 సెప్టెంబర్ వరకు పనిచేశారు. ఆ తర్వాత కేంద్ర మంత్రివర్గంలో సీనియర్ మంత్రిగా ప్రమోట్ అయ్యారు.
ఫోర్బ్స్ జాబితాలో స్థానం
ఫోర్బ్స్ా2022 ప్రపంచంలో శక్తివంతమైన వందమంది మహిళల జాబితాలో నిర్మలా సీతారామన్ చోటు సంపాదదించుకున్నారు. ఈ జాబితాలో ఆమెది 36వ స్థానం. ఇదే సంస్థ విడుదల 2023లో విడుదల చేసిన జాబితాలో 32వ స్థానం, 2024 ఫోర్బ్స్ జాబితాలో 28వ స్థానాన్ని దక్కించుకున్నారు. ఫార్చూన్ సంస్థ భారత్కు చెందిన అత్యంత శక్తివంతమైన మహిళగా ఆమెను పే ర్కొంది. 2025లో కేంద్ర బడ్జెట్ను 8వ సారి ప్రవేశపెట్టిన తర్వాత ఈ ఘనత సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు.
జన్మస్థలం మదురై
సీతారామన్ తమిళనాడులోని మదురైలో అయ్యంగార్ల కుటుంబంలో జన్మించారు. సావిత్రి, నారాయణన్ సీతారామన్లు ఈమె తల్లిదండ్రులు. విల్లుపురంలోని సేక్రెడ్ హార్ట్ కాన్వెంట్ ఆంగ్లో`ఇండియన్ స్కూల్ లో ఆమె తన ప్రాథమిక పాఠశాల విద్యను కొనసాగించారు. అనంతరం చెన్నై లోని విద్యోదయ పాఠశాలలో చదువుకున్నారు. 1980లో ఆమె తిరుచురాపల్లిలోని సీతాలక్ష్మి రామేశ్వరి కళాశాలలో ఎకనామిక్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి, ఢల్లీిలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఇదే విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎం.ఫిల్ పూర్తిచేశారు. ఇండో`యూరో పియన్ ట్రేడ్పై రీసెర్చ్ చేసేందుకు ఇదే విద్యాసంస్థలో తన పేరును నమోదు చేసుకున్నప్పటికీ, ఈ ప్రోగ్రామ్ను మధ్యలో ఆపేసి తన భర్తకు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో స్కాలర్షిప్ రావడంతో లండన్ వెళ్లిపోయారు.
రాజకీయ జీవితం
2003-05 మధ్యకాలంలో నిర్మలా సీతారామన్ జాతీయ మహిళా కమిషన్లో సభ్యురాలిగా పనిచేశారు. తర్వాత 2008లో భారతీయ జనతాపార్టీలో చేరారు. అప్పటినుంచి 2014 వరకు పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. 2014లో ఆమెను మోదీ ప్రభుత్వంలో జూనియర్ మం త్రిగా తీసుకున్నారు. ఇందుకోసం ఆమెకు ఆంధ్రప్రదేశ్నుంచి రాజ్యసభ సభ్యత్వాన్ని ఇప్పించారు. 2016లో రాజ్యసభకు పోటీచేయడానికి పార్టీ నామినేట్ చేసిన 12మంది సభ్యుల్లో నిర్మలా సీతారామన్ కూడా ఒకరు. ఈ ఎన్నికల్లో కర్ణాటక నుంచి ఆమె విజయం సాధించారు. 2019లో బాలాకోట్ దాడులు జరిగినప్పుడు ఆమె రక్షణశాఖ మంత్రిగా వ్యవహరించారు. పుల్వామా ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఈ దాడి జరిపింది. ఈ దాడిలో 170మంది జైషే మహమ్మ ద్ సంస్థకు చెందిన ఉగ్రవాదులను చంపేసినట్టు సైన్యం ప్రకటించింది.
2019 మే 19న నిర్మలమ్మ కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిగా పదవీ బా ధ్యతలు స్వీకరించారు. దేశంలో మొట్టమొదటి పూర్తిస్థాయి తొలి మహిళా ఆర్థికమంత్రిగా చరిత్రసృష్టించారు. ఆమె మధ్యంతర బడ్జెట్ను 2019 జులై నెలలో ప్రవేశపెట్టారు. 2020`21కి సం బంధించిన తొలి పూర్తిస్థాయి బడ్జెట్ను ఫిబ్రవరి 1న లోక్సభ ముందుంచారు. కోవిడ్`19 మ హమ్మారి కాలంలో ‘కోవిడ్`19 ఎకనామిక్ రీసెర్చ్ టాస్క్ ఫోర్స్’ ఇన్చార్జ్గా వ్యవహరించారు. ఆమె ఆర్థికశాఖ మంత్రిగా వున్న 2022లో భారత్ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడమే కాదు దేశ స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) చాలా వేగంగా పెరిగింది. పార్లమెంట్ నూతన భవనంలో బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి మహిళా ఆర్థిక మంత్రి కూడా నిర్మలా సీతా రామనే!
లండన్లో ఉద్యోగాలు
తాను లండన్లో వున్నకాలంలో రీజెంట్ స్ట్రీట్లోని ఒక హోమ్ డెకార్ స్టోర్లో సేల్స్పర్సన్గా తన కెరీర్ను మొదలుపెట్టారు. యు.కె. అగ్రికల్చర్ ఇంజీనీర్స్ అసోసియేషన్కు చెందిన ఒక ఆర్థికవేత్తకు అసిస్టెంట్గా వున్నారు. అక్కడే పి.డబ్ల్యు.సి.కి సీనియర్ మేనేజర్ (ఆర్Êడి)గా, బీబీసీ వరల్డ్ సర్వీస్లో కొద్దికాలం పనిచేశారు.
2017లో మనదేశ జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా వుండటమే కాదు హైదరాబాద్లోని ‘ప్రణవ’కు వ్యవస్థాపక డైరెక్టర్లలో ఆమె కూడా ఒకరు. 2019లో జవహర్లాల్ నెహ్రూ యూని వర్సిటీ ఆమెకు డిస్టింగ్విష్డ్ అలుమిని అవార్డును ప్రదానం చేసింది. 2019లో ఫోర్బ్స్ మ్యాగజై న్ ప్రకటించిన ప్రపంచంలో వందమంది శక్తివంతమైన మహిళల జాబితాలో ఈమెకు 34వ స్థానం దక్కింది. ఎకనామిక్ టైమ్స్ ఇచ్చే కార్పొరేట్ అవార్డ్స్ ఫర్ ఎక్స్లెన్స్కు ఆమె 2024లో ఎంపికయ్యారు. ఆర్థిక మంత్రిగా ఆమె వాణిజ్య సంస్కరణ వేత్తగా ఈ అవార్డు ద్వారా గుర్తింపు లభించింది.
నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ కూడా మంచి ఆర్థికవేత్త మాత్రమే కాదు గొప్ప రాజకీయ వ్యాఖ్యాత కూడా. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో ఇద్దరు ఒకరికొకరు పరిచయమై చివరకు వివాహానికి దారితీసింది. నిర్మలా సీతారామన్ బీజేపీలో చేరగా పరకాల ప్రభాకర్ కుటుంబం కాంగ్రెస్ అనుయాయులు. వీరిది ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం. వీరిద్దరూ 1986లో వివాహం చేసుకోగా, ఈ దంపతులకు ఒక కుమార్తె. ఆమె కొంతకాలం హిందూలో తర్వాత మింట్లో పనిచేశా రు. 2014`18 వరకు పరకాల ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సమాచార సలహాదారుగా వ్యవహరించారు.
`పదేళ్ల కల తీరితే బిఆర్ఎస్ గురించే ప్రజలు ఆలోచించరు
`గత ప్రభుత్వం పదేళ్లలలో డబుల్ బెడ్ రూంలు ఇచ్చింది లేదు
`ఇస్తామని చెప్పి రెండు సార్లు బిఆర్ఎస్ మోసం చేసింది
`అందుకే ప్రజలు బిఆర్ఎస్ ను ఓడిరచింది
`కాంగ్రెస్ మీద ప్రజలకు అపారమైన నమ్మకం వుంది
`గతంలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన అనుభవం కాంగ్రెస్కు వుంది
`పదేళ్ల పాటు అడిగిన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ ఇచ్చింది
`బిఆర్ఎస్ ఇస్తామని చెప్పి, పదేళ్లు మోసం చేసింది
`ఆ ప్రభావం బిఆర్ఎస్ మీద పడడం జరిగింది
`కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే చాలు తిరుగులేని శక్తిగా మారుతుంది
`కూడు, గూడు కల్పిస్తే ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు
`అక్కడక్కడా నిర్మాణాలు చేసి బిఆర్ఎస్ ఓట్లు పొందింది
`ఆ నిర్మాణాలను చూపించారే గాని బిఆర్ఎస్ ఇచ్చింది లేదు
`అప్పుటి నుంచి పేదలు ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారు
`ప్రజా ప్రభుత్వం మీద పేదలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు
`నాలుగేళ్లలో ఇచ్చిన మాట ప్రకారం ఇండ్లు ఇస్తే కాంగ్రెస్ కు తిరుగుండదు
`తెలంగాణ లో ఇతర పార్టీలకు ఆదరణ వుండదు
`ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే కారు వైపు కన్నెత్తి కూడా చూడరు?
హైదరాబాద్,నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు సొంతింటి కల నెరవేరే సమయం వచ్చేసింది. ఉగాదికి ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను పేదలకు అందించే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చట్టనుంది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తుచేస్తోంది. గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ప్రజలకు హమీ ఇచ్చింది. ఆ హమీ అమలు దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత కొంత కాలంగా ఈ కార్యక్రమం అమలు మీద ప్రత్యేక దృష్టిపెట్టారు. ఎన్నికల ముందు ప్రకటించిన విధంగా సుమారు 20లక్షల ఇండ్లు ఈ నాలుగేళ్లకాలంలో పేదలకు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది. అందులో ఈ ఏడాది మొదటి విడుతగా సుమారు 5లక్షల ఇండ్లకు సంబంధించిన విధివిధానాలు ఖరారు చేస్తున్నారు. ఉగాది నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇండ్లు పంచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పట్టుదలతో వున్నారు. అందుకు అవసరమైన ఇండ్ల పంట్టాలను యుద్ద ప్రాతిపదికన తయారు చేస్తున్నారు. ఉగాదికి ఎంతో అట్టహాసంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మంత్రి శ్రీనివాస్ రెడ్డి చొరవతో అధికారులు కూడా చకచకా ఆ పనులు పూర్తి చేస్తున్నారు. అనుకున్న మేరకు ఈ ఏడాది ఎట్టిపరిస్ధితుల్లో 5లక్షల ఇండ్లు పేదలకు పంచి వారి కళ్లలలో ఆనందం చూడాలనుకుంటున్నారు. వారికి ఇచ్చిన హమీని మొదటి దఫాలోనే నెరవేర్చి వారి ఆశలను నెరవేరేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ఎక్కడా రాజీ లేకుండా అర్హులందిరకీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం దిగ్విజయంగా సాగేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీమీద ప్రజలకు అంచెంచలమైన విశ్వాసం. పదేళ్లుగా పేదలు ఇందిరమ్మ ఇండ్లకోసం ఎదురుచూస్తున్నారు. 2005 నుంచి 2014 వరకు 25లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ సర్కారు నాలుగేళ్లలో 20 లక్షల ఇండ్లు ఇస్తామంటోంది. నాలుగేళ్లలో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే కాంగ్రెస్కు తిరుగుండదు. తెలంగాణలో ఇతర పార్టీలు రాజకీయమే వుండదు. రేవంత్ సర్కారు నాలుగేళ్లలో 20లక్షల ఇండ్లు నిర్మాణం చేయనున్నది. ఈ ఏడాది సుమారు 5లక్షల ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. అనుకున్నది అనుకున్నట్లు జరిగితే 5లక్షల ఇండ్లు నిర్మాణమైతే కాంగ్రెస్కు తిరుగుండదు. పల్లెల్లో ఇతర పార్టీల జెండాలే కనిపించవు. ప్రతి వ్యక్తికి సొంత ఇల్లు కల. ఆ కలను ఆది నుంచి నెవరేస్తున్న పార్టీ, ప్రభుత్వం కాంగ్రెస్. ఇందిరా గాంధీ హాయాం నుంచి మొదలు, 2014 వరకు ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలకు ఇండ్లు కట్టించి ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. ముఖ్యంగా ఇందిరాగాంధీ ప్రధానిగా వున్న సమయంలో పెద్దఎత్తున ఎస్సీ, ఎస్టీలకు పక్కా గృహాలు, వ్యవసాయ భూములు, వాటితోపాటు తెట్టెతో నిర్మాణం చేసిన బావులు తవ్వించి, పేదలను ఆర్ధికంగా ఉన్నత స్దితికి తీసుకొచ్చారు. ఒకప్పుడు ఎస్సీ, ఎస్టీలకు సాగు భూములు వుండేవి కాదు. దాంతో ఎస్సీలకు ప్రభుత్వ భూములను అందించారు. ఆ భూములను సాగు యోగ్యం చేసేందుకు సహకారమందించారు. సాగు నీటికి అవసరమైన బావులను పెద్దఎత్తున తవ్వించి ఇచ్చారు. ఇప్పటికీ తెలంగాణలో ప్రతి గ్రామంలో వ్యవసాయ భూముల వద్ద రాతి కట్టడంతో కూడాని తెట్టె నిర్మాణం చేసిన బావులే ఎక్కువగా కనిపిస్తాయి. తర్వాత బిసిలకు బలహీన వర్గాల గృహ సముదాయాల పేరుతో పెద్దఎత్తున ఇండ్ల నిర్మాణాలు చేపట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలే. 2004 ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను పెద్దఎత్తున పేదలకు అందజేసింది. ఉమ్మడిరాష్ట్రంలో సుమారు 45లక్షలకు పైగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేశారు. అప్పుడు ఎస్సీ, ఎస్సీ, బిసి , ఓసి అని తేడాలు లేకుండా ఇండ్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. తెలంగాణలో ఆ పదేళ్ల కాలంలో సుమారు 25లక్షలు పైగా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు. తెలంగాణలో ఏ పల్లెకు వెళ్లినా ఇందిరమ్మ ఇండ్లు కనీసం 500 వరకు వుంటాయి. ఉమ్మడి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లపధకం ద్వారా తెలంగాణ మొత్తం సుమారు 25 లక్షల మంది పేదలు ఇండ్లు నిర్మాణం చేసి ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను ప్రజలకు అందించేందుకు బృహత్తర ప్రణాళిలను రచిస్తోంది. తెలంగాణలో ఇల్లు లేదన్న పేద వారు లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం మొదలైంది. గతంలో ఇల్లు కావాలన్న ప్రతి ఒక్కరికి తెలంగాణలో ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసి ఇచ్చారు. అవి ఇప్పుడు పల్లెల్లో మరో గ్రామంగా, పట్టణాలలో పెద్ద పెద్ద కాలనీగా అవతరించాయి. అంత గొప్పగా ఆ పధకాన్ని అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాలది. తెలంగాణ వచ్చిన తర్వాత రెండు పడకల గదులు ఇండ్ల నిర్మాణం పేరు చెప్పి ప్రజలను వంచించిన ఘనత బిఆర్ఎస్ది. కాంగ్రెస్ పార్టీ అప్పట్లో ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లను ఎద్దేవా చేస్తూ వాటిని అగ్గిపెట్టెలంటూ హేళన చేసి బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఇందిరమ్మ ఇండ్ల స్ధానంలో ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్ ఇంటిని నిర్మించి ఇస్తామని హమీ ఇచ్చి కేసిఆర్ అధికారంలోకి వచ్చాడు. ఒకటి కాదు, రెండుసార్లు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. ఏ ఒక్క తెలంగాణ పల్లెలో ఒక్క ఇల్లు కూడా నిర్మాణం చేయలేదు. పేదలకు ఇవ్వలేదు. అందుకే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించారు. ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదని ప్రజలకు తెలుసు. అందుకే ముఖ్యమంత్రిరేవంత్రెడ్డిని ప్రజలు బలంగా విశ్వసించారు. ఆయన నాయకత్వాన్ని గెలిపించారు. అధికారంలోకి తీసుకొచ్చారు. అందుకే ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హమీ మేరకు ఐదేళ్ల కాలంలో కనీసం 20లక్షల ఇందిరమ్మ డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మాణం చేసి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నది. ఏటా కనీసం 5లక్షల ఇండ్లు నిర్మాణం చేసి ఇవ్వనున్నారు. అందుకు అవసరమైననిధులను కూడా బడ్జెట్లో కేటాయింపులు చేశారు. త్వరలోనే ఇందిరమ్మ నిర్మాణం మొదలు కానున్నది. ప్రజా ప్రభుత్వ విజయోత్సవాలలో భాగంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం మొదలు పెడతామని హమీ ఇచ్చారు. ఆ ప్రజా విజయోత్సవాలలో ఇండ్ల ధరఖాస్తులుకూడా ప్రజల నుంచి స్వీకరిం చారు. వాటి ఆధారంగా ఎంపిక ప్రక్రియలు పూర్తి చేస్తున్నారు. పల్లెల్లో గాని,పట్ణణాలలో గాని స్ధలం వున్న వారికి రూ.5లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. స్థలాలు లేని వారికి ప్రభుత్వ స్ధలాలను గుర్తించి, ఇండ్ల పట్టాలిచ్చి, ఇందిరమ్మ ఇండ్లునిర్మాణం చేసిఇస్తారు. ఇటీవల జరిగిన సమగ్ర సర్వేతో ఆ వివరాలు వెల్లడి కానున్నాయి. దాంతో తెలంగాణ లో ఎంత మందికి ఇండ్లు అవసరపడతాయో తెలుతుంది. అయితే ఇప్పటికే ఈ ఆర్ధిక సంవత్సరానికి గాను సుమారు 5లక్షల ఇండ్లు నిర్మాణం చేసి ఇవ్వడానికి ప్రణాళికలు కూడా సిద్దమయ్యాయి. దానిపై ప్రభుత్వం ఇప్పటికే ఓ ప్రకటన కూడా చేసింది. ముందుగా ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు పైలెట్ ప్రాజెక్టు కింద మంజూరు చేశారు. ఇలా దశల వారిగా ప్రతి నియోజకవర్గంలో ఏటా 3500 ఇండ్లు నిర్మాణంచేసి ఇస్తారు. పట్టణాలలో అర్హులైన వారికి తప్పకుండా ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసి ఇస్తారు. అందుకు అసవరమైన మోడళ్లను కూడా ప్రభుత్వం ప్రకటించింది. దానికి అనుగుణంగా ప్రభుత్వమే పూర్తిగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేసి పేదలకు పంచే కార్యక్రమం మొదలు కాకున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలోపు సుమారు 450000 ఇండ్లు పూర్తి చేసేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్దంగా వుంది. ప్రజా ప్రభుత్వ విజయోత్సవాలలో దానికి అంకురార్పన జరగుతోంది. తెలంగాణలో మళ్లీ ఇందిరమ్మ ఇండ్ల కోసం లక్షలాది ధరఖాస్తులు వచ్చాయి. ఈసారి కూడ ఏడాదికి సుమారు 5లక్షల ఇండ్లు నిర్మాణం చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఇలా ఈ నాలుగేళ్ల కాలంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే వచ్చే ఇవరై ఏళ్ల వరకు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి తిరుగుండదు. కాంగ్రెస్ను కాదని ఏ ఇతర పార్టీని ప్రజలు ఆదరించరు.
జహీరాబాద్ నియోజకవర్గం లో వడగళ్ల కూడిన భారీ వర్షం l
జహీరాబాద్. నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలలో శనివారము నాలుగున్నర గంటల ప్రాంతంలో అప్పటివరకు భానుడి భగభగతో ఉన్న వాతావరణం ఒక్కసారిగా మార్పు చెంది ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది.
Heavy rain
వడగండ్ల వానకు తోడుగా బికర గాలులతో తోడవడంతో ప్రజలు భయాందోళన వచ్చింది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై వర్షపు నీరు వానగాళ్లు తో ప్రజలు ఇక్కట్లు
Heavy rain
పడ్డారు. సాయంత్రం ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడగా..
సాయంత్రం కురిసిన వర్షం తో ప్రజలు కాస్త ఉపశమనం పొందారు. అధిక ఉష్ణోగ్రతలు నమోదైన ఉమ్మడి సంగారెడ్డి జిల్లాలోనే ఈ అకాల వర్షాలు కురిశాయి. ఉరుములు, మెరుపులతో వానగాళ్లు కూడిన భారీ వర్షం పడటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జహీరాబాద్ న్యాల్కల్ కోహీర్ మొగుడంపల్లి ఝరాసంగం మండలాల్లో వడగండ్లు పడ్డాయి. ఝరాసంగం మండలంలో ఈదురుగాలులతో కూడిన వానకురవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోనూ భారీ వర్షం పడింది. భారీ వర్షాలు పడటంతో రైతులకు కొంతమేర నష్టం కలిగింది.
అప్రకటిత ఎమర్జెన్సీ తలపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం… అర్ధరాత్రి విద్యార్థుల నిర్భందఖాండ…
జహీరాబాద్. నేటి ధాత్రి:
జహీరాబాద్ లో బి.ఆర్.ఎస్వీ నాయకుల అక్రమ నిర్బంధం…విద్యార్థుల సమస్యలపై ప్రశ్నించేందుకు అసెంబ్లీ కి బయల్దేరిన బి.ఆర్.ఎస్వీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించిన జహీరాబాద్ పోలీసులు.
జహీరాబాద్ కార్యలయంలో ఎర్పాటు చేసిన సమావేశం లో బీ.ఆర్.ఎస్వీ జహీరాబాద్ నియోజకవర్గ రాకేష్ మాట్లాడుతూ సీ.ఎం రేవంత్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టో లో ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి డుమ్మా కొట్టడమే కాకుండా జాబ్ క్యాలెండర్ ఎగవేసి విద్యార్థులను మోసం చేశాడు అని ద్వజమెత్తారు. అదే విధంగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగ యువతకు మొండి చెయ్యి ఇవ్వడం జరిగింది అని అన్నారు. మహిళా విద్యార్థినిలకు స్కూటీల పేరు చెప్పి ఓట్లు దండుకుని నేడు వారికి బడ్జెట్ లో కనీసం వారీ ప్రస్తావన సైతం తీయలేదని ఎద్దవ చేశారు. మరి ముఖ్యంగా అనగారిన విద్యార్థులు చదువుకునే ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్స్ గురించి బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడమే కాకుండా బడ్జెట్లో ప్రస్తావన లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. విద్యార్థుల హక్కుల కోసం బి.ఆర్.ఎస్వీ ప్రశ్నిస్తే విద్యార్థి నాయకులను అరెస్టు చేసి అర్ధరాత్రి భయబ్రాంతులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యి పట్టున పది రోజులు గడువక ముందే ఇప్పటి అనేక మార్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి నాయకులను రాత్రికి రాత్రే అరెస్టులు చేసి నిర్బంధకాండ సృష్టిస్తున్నారని అన్నారు. ఈలాంటి కాంగ్రెస్ ప్రజాపాలన చూస్తే ఎమర్జెన్సీ పాలనను తలపించే విధంగా సాగుతుందని ఎద్దేవా చేశారు.జహీరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా విద్యార్థి నాయకులను భయబ్రాంతులకు గురి చేసి అక్రమ అరెస్టులు తక్షణమే మానుకోలవని హెచ్చరించారు. ఇప్పటి వరకు విద్యార్థుల జోలికి వొచ్చిన ఏ ముఖ్యమంత్రి కూడా చరిత్రలో నిలిచిన దాఖలు లేవని విధ్యార్థులు జోలికి వొస్తే ఊరుకోబోమని బీ.ఆర్.ఎస్వీ తరపున పోరాటం ఉదృతం చేస్తాం అని ముందస్తు అరెస్టులు ఆపాలని కాంగ్రెస్ ప్రభుత్వన్ని కోరారు. ప్రజా సమస్యలను గాలికి వొదిలేసి విద్యార్థులను అరెస్టు చేయడాలను ఆపాలని హెచ్చరించారు . ఈ సమావేశం లో బీ.ఆర్.ఎస్వీ పట్టణ అధ్యక్షులు ఓంకార్ , బీ.ఆర్.ఎస్వీ న్యాల్కాల్ మండల అధ్యక్షులు జెట్గొండ మారుతి యాదవ్ , సీనియర్ బీ.ఆర్.ఎస్వీ నాయకులు పరశురాం , ఎం.డీ ఫయాజ్ , రఘు తేజ , ఆవేజ్ , అజీమ్ , ఇక్బాల్ , మహేష్ , రజాక్, మరియు తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో తెలంగాణ అసెంబ్లీ ముట్టడి ఉన్న నేపథ్యంలో బిఆర్ఎస్వీ నాయకులను రామకృష్ణాపూర్ పట్టణ పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వి నాయకులు మాట్లాడుతూ… కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయిందని, ఎన్నికల్లో గెలుపు కోసం నిరుద్యోగులకు, విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనే ఉద్దేశంతో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టిన సందర్భంగా ముందస్తు అరెస్టు చేయడం మంచిది కాదని అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తామని తెలిపారు. బీఆర్ఎస్వి జిల్లా అధ్యక్షులు శ్రవణ్, గోనె రాజేందర్, గాజుల చంద్ర కిరణ్, దేవి సాయికృష్ణ, కుర్మ దినేష్, కంది క్రాంతి తదితరులు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.