`ధరణి దారిద్య్రం పారదోలారు.
`భూ భారతి ఒక నూతన విప్లవం.
`రైతుల కళ్లలో నిండుతున్న సంతోషం.
`రైతులకు భోరోసా నింపుతున్న గొప్ప నూతన ఆవిష్కారం.
`ఆరేళ్ల రైతు గోసకు చరమగీతం.
`భూ భారతి తెచ్చి రైతులకు సంజీవని చేశారు.
`ధరణిలో ఎదురైన 15 సమస్యలకు భూ భారతిలో పరిష్కారం చూపారు.
`ఆరేళ్లుగా రైతులు ఎదుర్కొంటున్న అవస్థలను తొలగిస్తున్నారు.
`ఆన్ లైన్ మోసాలకు అడ్డుకట్ట వేస్తున్నారు.
`ప్రతి తహసీల్దారు కార్యాలయంలో నలుగురు ప్రత్యేక సిబ్బందితో జాప్యం లేకుండా చూస్తున్నారు.
`కాలయాపన లేని శీఘ్రతర పరిష్కారం కనుగొన్నారు.
`వేలాది మంది రైతుల సమస్యలు తీర్చుతున్నారు.
`పచ్చని పల్లెలో పెట్టిన ధరణి చిచ్చును ఆర్పుతున్నారు.
`రైతుల మధ్య ధరణి పెంచిన వైషమ్యాలను చెక్ పెడుతున్నారు.
`భూ భారతి తెచ్చి రైతుల జీవితాలలో వెలుగులు నింపుతున్నారు.
`మళ్ళీ పల్లెల్లో ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తున్నారు.
`రైతుల మధ్య వైషమ్యాలు లేకుండా ఆగోగ్యకరమైన సుహృద్భావం ఏర్పరుస్తున్నారు.
`పరిష్కారం కావని తెల్లబోయిన రైతుల సమస్యలు చిటికెలో నెరవేర్చుతున్నారు.
`పైలెట్ ప్రాజెక్టులోనే అద్భుతమైన ఫలితాలు చూస్తున్నారు.
`రాష్ట్ర వ్యాప్త అమలుతో రైతులు వేడుకలు చేసుకోనున్నారు.
`ధరణి దుర్మార్గం నుంచి బైడపడి ఊపిరిపీల్చుకుంటున్నారు.
`జీవితకాలం శిక్షలా మారిన ధరణి దరిద్రం పోయినందుకు సంబరపడుతున్నారు.
`దటీజ్ ‘‘పొంగులేటి’’ అని రైతులు కొనియాడుతున్నారు.
హైదరాబాద్,నేటిధాత్రి:
పట్టుదలకు మారు పేరు రెవిన్యూ, రిజిస్ట్రేషన్ల్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి. అది రాజకీయంగానైనా, పాలనా పరంగానైనా తన చిత్త శుద్ది ఎంత గొప్పదో అనేక సార్లు నిరూపించుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత రాష్ట్రంలో ఎక్కువగా కష్టపడుతున్నమంత్రి ఎవరు అనే ప్రశ్నకు ఒకటే సమాధానం మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి. ఆయన వున్నంత ఆక్టివ్గా మరే మంత్రి కూడా లేరన్న వార్తలున్నాయి. రాజకీయంగా ఆయన ఎప్పుడూ ఎంత ఆక్టివ్గా వుంటారో..మంత్రిగా పాలనా పరంగా కూడా అంతకు మించి దూకుడుగా వుంటున్నారు. ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ప్రభుత్వం తన పని తీరును ప్రజలు హర్షించేలా చూసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి పేరు తెస్తున్నారు. ముఖ్యంగా ధరణి విషయంలో ఆయన చూపిన శ్రద్ద అంతా ఇంతా కాదు. అంతే కాదు ఇంత తొందరగా భూభారతి అమలులోకి వచ్చిందటే మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి చూపిన చొరవ హర్షనీయమనే చెప్పాలి. అటు అధికారులను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ, భూభారతి డెవలప్ మెంటుపై చర్చలు పెట్టారు. సమీక్షలు చేపట్టారు. దానిపై విసృతమైన చర్చ జరిగేలా చూశారు. అందరి సూచనలు, సలహాలు తీసుకున్నారు. రైతుల సమస్యలపై అధ్యయనం చేయించారు. అందిరకీ ఆమోదయోగ్యమైన కార్యక్రమంగా భూ భారతి రూపు దిద్దేలా చేశారు. భూ పరిపాలనలో తనదైన ముద్ర వేశారు. రాజకీయంగా కూడా అంతే ..ఆయన తలపెట్టిన ఏ కార్యక్రమమైనా సరే దిగ్విజయంకోసం పని చేసే విధానం అందిరకీ నచ్చేలా వుంటుంది. తన ప్రజలకు సేవ చేయాలన్న ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చిన శ్రీనివాస్రెడ్డి తన దారిలో అడ్డంకులు ఎదుర్కొన్నారు. తన దారికి అడ్డు పడిన పుల్లలను పూచిక పుల్లలుగా తొక్కుకుంటూ పైకొచ్చారు. నాయకుడికి ధైర్యం కూడా ఎంతో ముఖ్యమనేది శ్రీనివాస్రెడ్డి నిరూపించారు. తొలుత ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎదురులేని నాయకుడిగా వచ్చారు. కాని కొందరి మాటలు నమ్మి తన అడుగులకు ఆయన ముందర కాళ్లకు బంధం వేసుకున్నారు. అది తొందరగానే గ్రహించారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎవరి పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి రాలేదు. వ్యక్తిగత ప్రతిష్టతో ఆయన రాజకీయాల్లోకి వచ్చారు. ప్రజా సేవలో ఎవరూ చేయలేనంత సేవ చేసి ప్రజల మన్నననలు పొందారు. నాయకుడికన్నా, ముందుకు ప్రజా సేవకుడిగా ఆయన చేసిన సేవలు ప్రజల గుండెల్లో పెట్టుకున్నారు. ఆయనను రాజకీయంగా ఆదరించారు. రాజకీయాల్లోకి వస్తూ వస్తూనే ఆయనతోపాటు ఎంతో మందిని నాయకులను చేశారు. ఎంతో మంది నాయకులకు రాజకీయ జీవితం ఇచ్చారు. తనతో పాటు సమానమైన హోదా కల్గిన ప్రజా ప్రతినిధులుగా తయారు చేశారు. అలాంటి నాయకుడికి కూడా అడ్డంకులు ఏర్పరిచారు. నమ్మిన వాళ్లే ఆయనను వెన్ను పోటు పొడిచారు. అయినా ఆయన కుంగిపోలేదు. లక్ష్య సాధనలో వెనుకంజ వేయలేదు. ప్రజా సేవలో ఆయన మడమ తిప్పలేదు. ప్రజలకు సేవ చేయడంలో ఆయన వెనుదిగిరి చూడలేదు. అందుకే ఆయన రాజకీయాలను శాసించే స్ధాయికి ఎదిగారు. తన సొంత జిల్లాలో రాజకీయాలను తన కనుసైగలతో శాసించే స్ధాయికి ఎదిగారు. అదీ ఒక నిబద్దత వున్న నాయకుడి అంకితభావం అని నిరూపించారు. ఖమ్మం అంటే పొంగులేటి అంటే ఖమ్మం అనేంతగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఖమ్మం జిల్లా రాజకీయాలకు పెద్దదిక్కుగా మారారు. ఉమ్మడి ఖమ్మం ప్రజలకు పెద్దన్నగా సేవలు చేస్తున్నారు. అందుకే ఆయన ఖమ్మం జిల్లా ప్రజలకు ఏది చెబితే అది, ఎంతచెబితే అంత అన్నట్లు రాజకీయాలను శాసించగలుగుతున్నారు. గతంలో ఎంత పెద్ద నాయకుడు కూడా చేయలేని సాహసాలు చేశారు. రాజకీయంగా సవాళ్లు విసిరారు. ఎదరులేదనుకున్న బిఆర్ఎస్ను మట్టికరిపించారు. తాను చేసిన శపధాన్ని నిలబెట్టుకున్నారు. అలా శపథం చేసి నిలబెట్టుకున్న నాయకులు చరిత్రలో ఒక్క పొంగులేటి తప్ప మరే నాయకుడు లేదు. విజయం సాధించిన నాయకుడు శ్రీనివాస్ రెడ్డికి తప్ప మరెవరికీ సాధ్యం కాలేదు. అలాంటి నాయకుడు పాలనలో భాగస్వామి అయితే ఎలా వుంటుందో కూడా చూపిస్తున్నారు. తన శాఖకు వన్నె తెస్తున్నారు. గత ప్రభుత్వం ధరణి పోర్టల్ తేవడం వల్ల కొన్ని లక్షల మంది రైతులు ఆగమయ్యారు. తాతల తరాల నుంచి లేని ఇబ్బందులు గత ప్రభుత్వం ధరణి తెచ్చి రైతుల నెత్తిన పిడుగులు వేశారు. నిజాం కాలం తర్వాత అత్యుత్తమైన భూ విధానం తీసుకొస్తామని చెప్పి, చిల్లం చిల్లంచేశారు. ప్రశాంతంగా వున్న పల్లెల్లో లేని పోని సమస్య సృష్టించారు. ఎవరి భూములు ఎటు వెళ్లాయో తెలియకుండాపోయాయి. రైతుల మధ్య కలతలు చెలరేగాయి. భూ వివాదాలు మళ్లీ మొదటికొచ్చాయి. ఎంతో మంది అన్నదమ్ముల మధ్య కొట్లాటలు తెచ్చాయి. కుటుంబాలలో పగలు రగించాయి. అయినా అంతా బాగుందంటూ గత ప్రభుత్వ మసి బూసి మారేడు కాయ చేయడానికే ప్రయత్నం చేసింది. దాంతో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకున్నది. రైతులు తమ భూములను తామవే అని చెప్పుకోవడానికి కూడా ఆరేళ్లపాటు నరకం చూశారు. లక్షలు ఖర్చు చేసుకున్నారు. అప్పుల పాలై ఆగమాయ్యారు. తమ భూములు తమకు కాకుండా చేసిన గత ప్రభుత్వాన్ని దింపేశారు. ప్రజా ప్రభుత్వాన్ని ప్రజలు తెచ్చుకున్నారు. ఎన్నికల ముందు ప్రజలకు హమీ ఇచ్చినట్లే కాంగ్రెస్ ప్రభుత్వం తక్కువ సమయంలోనే భూ భారతిని తెచ్చింది. భూ భారతి కోసం మంత్రి పొంగులేటి పడిన శ్రమ అంతా ఇంతా కాదు. ప్రజలకు వీలైనంత తొందరగా మేలైన పనులు చేయాలని, వారికి ఊరట కల్గించాలని, భరోసా కల్పించాలని మంత్రి పొంగులేటి దగ్గరుండి భూ భారతి రూపకల్పన చేయించారు. రైతుల కళ్లలో ఆనందం నింపారు. ఆరేళ్లపాటు పడరాని పాట్లు పడిన రైతులు ఇప్పుడు భూ భారతి వల్ల ఎంతో మేలు పొందుతున్నారు. చిన్న చిన్న సమస్యలు కూడా చిటికెలో పరిష్కారమయ్యేలా పోర్టర్ రూపొందించారు. రైతులకు కొత్త లోకాన్ని ఆవిష్కరించారు. తమ భూములపై రైతులకు కొండంత ధైర్యం భూ భారతితో నింపారు. అందుకు ప్రజలు కూడా మంత్రి పొంగులేటి కృషిని ప్రశంసిస్తున్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలలో ప్రముఖంగా ఆన్లైన్ పట్టాలున్నా రైతులకు కొత్త పాసు పుస్తకాలు ఇవ్వలేదు. దాంతో ఎంతో మంది రైతుల పాసు పుస్తకాల కోసం నిత్యం తహసిల్ధార్, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగేవారు. ఇక భూదాన్, వక్ఫ్, దేవాదాయ భూములంటూ పట్టా లాండ్స్ను కూడా పివోబిలో నమోదు చేయడం వల్ల ఎంతో మంది ఇబ్బందులు పడ్డారు. ధరణిలో రైతుల పేరిట వుండాల్సిన భూముల కంటే తక్కువ విస్తీర్ణం చూపించిన సందర్బాలు అనేకం వున్నాయి. వీటిపై ఎన్ని పిర్యాధులు వచ్చినా అప్పటి పాలకులు స్పందించలేదు. సర్వేనెంబర్లు మిస్ చేశారు. సాదాబైనామాలు కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి పదేళ్లు కాలయాపన చేశారు. ఆ భూములకు కూడా లేని పోని సమస్యలు సృష్టించారు. ఇలా ధరణిపోర్టలో 15 రకాల సమస్యలు సృష్టించినట్లు గుర్తించారు. ఇక రైతులు అందరూ ఆన్లైన్లో ధరకాస్తు చేసుకోవాలనడం సాద్యం కాని పని. రైతులు ఎలాంటి కాగితం మీద పిర్యాదు ఇచ్చినా తీసుకునేలా భూ భారతికి వెసులుబాటు కల్పించారు. ప్రతి తహసిల్ధార్ కార్యాలయంలో కనీసం నలుగురు సపోర్టింగ్ టీమ్ ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే కొన్ని సంవత్సరాలుగా రైతులు పడరాన్ని పాట్లు పడుతున్నారు. వాటి నుంచి సత్వర విముక్తి కావాలని ప్రభుత్వం ఎంతో దూరదృష్టితో ఆలోచిస్తోంది. అంతే కాకుండా భూ భారతిలో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. గ్రామాల్లోనే సదస్సులు ఏర్పాటు చేసి, రైతుల నుంచి పిర్యాధులు స్వీకరించాలి. అప్పుడు పొరపాట్లు జరగడానికి ఒక్క శాతం కూడా ఆస్కారం వుండదు. ప్రజలందరి ముందు రైతులు తప్పుడు పిర్యాధులు చేసుకునేందుకు కూడా వీలుండదు. ఎందుకంటే గ్రామాలల్లో ఏ రైతు భూమి ఏమిటన్నది దాదాపు అందరికీ అవగాహన వుంటుంది. ఒక వేళ ఎవరైనా తప్పుడు పిర్యాదులు చేయాలని చూసినా వెంటనే తెలిసిపోతుంది. పైగా రైతులకు సులభమైన రీతిలో అర్ధమయ్యేలా ఫార్మేట్ రూపొందించారు. ఇలా రైతులకు అన్ని రకాలుగా వెసులుబాటు కల్పించేలా చట్టం రూపకల్పన జరిగింది. రైతులకు ఎంతో మేలు చేసేలా రూపకల్పన జరిగింది. లేని పోని గొప్పలకు పోయి, గత ప్రభుత్వం తెచ్చిన ధరణి మూలంగా ఎంతో మందిరైతులు మానసిక వేధనకు గురయ్యారు. తట్టుకోలేని ఎంతోమంది చనిపోయారు. ఎన్నో రైతు కుటుంబాలు సమస్యలు ఎదుర్కొన్నాయి. వాటన్నింటికీ ఒక్కటే పరిష్కారం భూ భారతి. రైతుల కలలు నెరవేరుస్తోంది. అది శ్రీనివాస్ రెడ్డి నిబద్దతను నిరూపిస్తోంది.