శాయంపేట మండలం వసం తాపూర్ గ్రామంలో పేకాట స్థావరంపై పోలీసుల దాడులు నిర్వహించగా పదిమంది పేకాట రాయులను అరెస్టు చేసినట్లు ఎస్సై జక్కుల పర మేష్ తెలిపారు.
Arrested
ఈ మేరకు పోలీస్ సిబ్బంది శిబిరంపై దాడులు చేసి పదిమంది పెట్టుకున్నట్లు తెలిపారు.వారి నుండి 22 వేల రూపాయల నగదు ,7 బైకులు, 10 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
ప్రజలారా కథం కథం తొక్కి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేద్దాం
-మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలంలోని పలు గ్రామాల్లో ఛలో వరంగల్ సభను విజయవంతం కొరకు పలు గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పర్య టిస్తున్నారు.ఈ నెల 27న జరగనున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలను జయ ప్రదం చేసే దిశగా ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సన్నాహక సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ 2001 ఏప్రిల్ 27 నాడు కెసిఆర్ ఆ రోజు తన పదవికి రాజీనామా చేసి సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను చూసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కలిసి ఉంటే లాభం లేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే ఈ ప్రాంతానికి న్యాయం జరుగుతున్నటు వంటి ఒక లక్ష్యం తోటి కేసిఆర్ పార్టీ పెట్టడం జరిగింది. పార్టీ పెట్టి 24 సంవత్సరాలు పూర్త యి 25వ సంవత్సరాల్లో అడు గుపెడుతున్న సందర్భంగా పార్టీ రజతోత్సవ సభను నిర్వ హించాలని చెప్పి నిర్ణయం చేసి, అది కూడా మనం నా భూతో నా భవిష్యత్ అనేలా పెద్ద సభను నిర్వహిస్తున్నాం.
BRS party’s
భవిష్యత్ లో ఇంత పెద్ద మొత్తంలో ఎవరూ నిర్వహించ లేరు. మరి ప్రజలు కూడా ఆవిర్బవాసభకు రావడానికి ఉత్సాహంగా ఉన్నారు. ఇంత తక్కువ సమయంలో ఇంత వ్యతిరేకతను చవిచూసినటు వంటి ప్రభుత్వాలు ఉండవు, దానికి కారణమేంటంటే అమ లు కానీ హామీలు ఇచ్చి, హామీలను తుంగలో తొక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తున్నటు వంటి తీరు ప్రజలలో అసహనానికి గురిచేస్తుంది.కేసిఆర్ అధికా రంలో ఉన్నప్పుడు ఏ స్కీమ్స్ అయితే అమలు అయినవో వాటినే అమలు చేస్తున్నారు. ఎట్లా ఉన్నది పరిపాలన అంటే మరి అనుభవం లేని పరిపా లన, అసమర్ధ పరిపాలన, చేత గాని వ్యవహారం ఇవన్నీ చేసు కుంటుప్రజల దగ్గరికి వస్తే అర్థం చేసుకున్నారు.ప్రజలు కేసీఆర్ ఉన్నప్పుడు ఏ రకంగా మా యొక్క జీవితాలు అద్భుతంగా ఉన్నాయి.
ఏ రకమైనటువంటి అభివృద్ధి జరిగింది అని నేడు పునరాలోచించుకుంటున్నారు. ఎప్పుడైనా సామెత ఉంటాది పాలు ఇచ్చే గేదెను కాదని దున్నపోతును తెచ్చుకున్నట్టు ఉంది అన్న చందనంగా ప్రజలు చర్చించుకుంటున్నారు.రేపు ఎన్నిక ఏదైనా ఎగిరేది బిఆర్ ఎస్ జెండానే గెలిచేది బిఆర్ ఎస్ అభ్యర్దులే.
ఈ ఏప్రిల్ 27న జరగబోయే మన సభా తెలం గాణ రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయి. కాబట్టి మిత్రులారా కథం కథం తొక్కి బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయ వంతం చేయాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల బీఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు ప్రజలు పాల్గొన్నారు.
బస్టాండ్ లో ప్రజలకు అవగాహన కోసం ఫైర్ డెమో ప్రదర్శన
ప్రజలు,వ్యాపారస్థులు అప్రమత్తంగా ఉండాలి
ఫైర్ అధికారి వక్కల భద్రయ్య
పరకాల నేటిధాత్రి
పరకాల బస్టాండ్ లో మంగళవారం ఫైర్ అధికారి వక్కల భద్రయ్య అధ్వర్యంలో 2వరోజు వారోత్సవాలు నిర్వహించారు.పట్టణ కేంద్రంలోని బస్టాండ్ లో ప్రయానికులకు,స్థానికులకు అవగాహన కల్పించేందుకు ఫైర్ డెమో ప్రదర్మించారు.ఈ సందర్బంగా భద్రయ్య మాట్లాడుతూ పట్టణ కేంద్రంలోని వ్యాపారస్తులు అగ్నిప్రమాదం సంభవించినపుడు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై కరపత్రాలు పంపణీ చేశారు.బస్టాండ్ ఆవరణలోని పలుచోట్ల వారోత్సవాల పోస్టర్ ఏర్పాటు చేశారు.అగ్నిపమాదం నివారించేందుకు పాటించాల్సిన జాగత్త చర్యలపై అవగాహగా లేక నిర్లక్ష కారణాల వల్లే అగ్నిప్రమాదాలు సంభవిస్తాయన్నారు.అగ్ని ప్రమాదం జరిగితే అపుడు మనదేశ సంపదను కోల్పోయిన వారిగా మిగిలిపోతామున్నారు.ఇప్పటికైనా వ్యాపారాస్తులు అగ్నిమాపక సిబ్బండి సూచనలు పాటిస్తూ,తమ అస్తులను పరిరక్షించుకోవాలన్నారు.వ్యాపారస్థులు ఫైర్ సేఫ్టీ ఏర్పాటు చేసుకోవాల్సన అవసరం ఉందని గుర్తుచేశారు.వారి వెంట పరకాల అగ్నిమాపకశాఖ కార్యాలయం సిబ్బంది ఎల్ఎఫ్ కృష్ణకుమార్, డ్రైవర్ సత్తయ్య, అన్నిమాపకులు సత్యం,దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
చలో వరంగల్ బిఆర్ఎస్ రజతోత్సవ సభకు వాల్ రైటింగ్ కార్యక్రమం ప్రారంభం
జహీరాబాద్ . నేటి ధాత్రి:
27న వరంగల్లో జరగనున్న బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయడంలో భాగంగా వాల్ రైటింగ్ కార్యక్రమాన్ని శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు ప్రారంభించారు. సభకు పూర్వాహ్నం నుంచి ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం చేపట్టబడింది అని.
MLA Manikrao
వాల్ రైటింగ్ ప్రారంభోత్సవం సందర్భంగా జహీరాబాద్ పట్టణ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి కౌన్సిలర్ అబ్దుల్లా ,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్, మొహీ ఉద్దీన్,తులసి దాస్ గుప్తా,యువ నాయకులు మిథున్ రాజ్ ,ప్రభు , ఇతర బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ విజయ రథాన్ని ముందుకు నడిపేందుకు ప్రతి కార్యకర్త ఈ రజతోత్సవ సభను విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మల్యే మాణిక్ రావు గారు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో స్థానిక పోలీస్ స్టేషన్లో బాధ్యతలు చేపట్టిన ఎస్సై రాజేష్ ను బిజెపి నాయకులు మంగళవారం రోజున మర్యాదపూర్వకంగా కలిసి ఆయనను శాలువాతో సన్మానించారు ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మండలంలో ప్రతి ఒక్కరు శాంతి భద్రతలకు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు తీగల శ్రీనివాస్ గౌడ్ , టెలికం బోర్డు మెంబర్ ఆకుల రమేష్, అభిషేక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు
గ్రామీణ ప్రాంత నిరుపేదల ఆరోగ్యం కోసమే ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఐఆర్ సిఎస్ లయన్ డా,, ఏలేటి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం రోజున మండల కేంద్రంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మెదక్ శాఖ, వీఎస్టి పరిశ్రమ తూప్రాన్ సహకారంతో నిర్వహిస్తున్న ఉచిత వైద్య శిబిరాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీపీ, షుగర్ పరీక్షలు, కంటి, చెవి ముక్కు, గొంతు, వరిబీజము, బీజకుట్టు గడ్డలు, థైరాయిడ్ గడ్డలు, గర్భసంచికి సంబంధించిన సమస్యలు, అలాగే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు, చర్మ సమస్యలు, మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, ఊపిరితిత్తుల సమస్యలపై మల్లారెడ్డి హాస్పిటల్ (సూరారం) వైద్యులచే ఉదయం 9:30 నుండి చికిత్సలు నిర్వహించి ఉచిత మందులు పంపిణీ జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యులు, కాంగ్రెస్ కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
జహీరాబాద్ పట్టణ పరిధిలో రహదారిపై నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రారంభానికి ముహూర్తం కుదరడం లేదు. అన్ని పనులు పూర్తి చేసుకుని ప్రయాణికులకు అందుబాటులోకి తేవడానికి సిద్ధంగా ఉన్నా, నిర్లక్ష్య వైఖరితో అందుబాటులోకి తేవడం లేదు. పనులు పూర్తై నెలలు గడుస్తున్నా, రాకపోకలకు అడ్డంకులు తొలగడం లేదు. సరైన ముహూర్తం కుదరకనా, లేక కాంట్రాక్టర్ కు ఉన్న ఆర్థిక ఇబ్బందులో కానీ, ఏడేండ్లుగా ప్రయాణికుల నిరీక్షణకు మాత్రం తెర పడడం లేదు. ప్రజా ప్రతినిధులు, అధికారుల తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రయాణికులు ఇంకా ఊరిస్తూనే ఉంది. అన్ని పనులు పూర్తి చేసుకుని ముస్తాబైనా ప్రారంభానికి మాత్రం నోచుకోవడం లేదు. పనులు పూర్తై నెలలు గడుస్తున్నా రాక పోకలకున్న అడంకులు మాత్రం తొలగడం లేదు. సరైన ముహూర్తం కుదర కానా, లేక కాంట్రాక్టర్ కు ఉన్న ఆర్థిక ఇబ్బందులో కానీ ఏడేండ్లుగా ప్రయాణికుల నిరీక్షణకు మాత్రం తెర పడడం లేదు. దీంతో రాకపోకల సందర్భంగా రైల్వే గేటు వల్ల ఇబ్బందులు ఎదురైన ప్రతిసారి ప్రయాణికులు పరస్పరం ప్రభుత్వ ప్రతినిధులు, అధికార గణాల తీరుపై తమ అసహనం వ్యక్తం చేయడం కనిపిస్తోంది.
ఏడేండ్ల క్రితం శంకుస్థాపన..
రైల్వే గేటు వల్ల ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బం దుల పరిష్కారానికి అప్పటి ప్రభుత్వం రైల్వే ఓవర్ బ్రిడ్జి(ఆర్వోబీ)ను మంజూరు చేశారు. 2018 ఆగస్టు 30న రూ.90 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. వెంటనే రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టారు. అప్పటి నుంచి అగుతూ సాగుతూ నేటివరకు పసులు కొనసాగుతూనే ఉన్నాయి. జహీరాబాద్ నుంచి మొగుడంపల్లి క్రాస్ రోడ్డులో గల రైల్వేలెవల్ క్రాసింగ్ వద్ద ప్రయాణికుల రాకపోకల కోసం ఏడేళ్ల క్రితం డబుల్ లైన్ ఆర్వోబీ పనులు చేపట్టారు. నిధుల కొరత తదితర కారణాలతో ఎప్పటికప్పుడు పనులు తరచూ వాయిదా పడుతూ, కొనసాగుతున్నాయి.
ముస్తాబైన ముహూర్తం మెప్పుడో..?
జహీరాబాద్ పట్టణ పరిధిలో రహదారిపై నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. అన్ని విధాలుగా ముస్తాబై నెలలు గడుస్తున్నా ముహూర్తం మాత్రం కుదరడం లేదు. అందుకే రాక పోకలకు ముహూర్తం అడ్డంకులు తొలగడం లేదని బహటంగానే ప్రయాణికులు చర్చించుకుంటున్నారు. స్థానిక లెవల్ క్రాసింగ్ మీదుగా హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి నాందేడ్, పూర్ణ, షిరిడీకి, బెంగళూరు. తిరుపతి, కాకినాడ పట్టణాలకు ఎక్స్ ప్రెస్, ప్యాసింజర్, రైళ్ల రాకపోకలు సాగిస్తుంటాయి. అంతే కాకుండా గూడ్స్ రైళ్ల కూడా ఎక్కువ సంఖ్యలోనే వచ్చిపోతుంటాయి. నిత్యం ఎంతో రద్దీగా ఉండే ఈ మార్గంలో రైలు వచ్చిన ప్రతీసారి గేట్లు మూసేయడంతో ప్రయాణికులు అష్టకష్టాలు పడుతున్నారు. స్థానికులతో పాటు అంతర్రాష్ట్ర రాకపోకలు సాగించే ప్రయాణికులు రైలొచ్చిన ప్రతిసారి అత్యధికంగా అరగంట పాటు గేటు వద్ద ఆగాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు.
స్థానికులకు.. ప్రయోజనమే.
Bridge work completed
ఈ రహదారి గుండా రాకపోకలు సాగించే మొగు డంపల్లి, జహీరాబాద్ మండలంలోని పలు గ్రామాల ప్రయాణికులతో పాటు కర్ణాటకలోని చించోళీ, గుల్బర్గా, బసవకల్యాణ్, బీదర్ ప్రయాణికులతో సహా పట్టణ శివారులోని డ్రీమ్ ఇండియా, బందే అలీ, బాబూమోహన్ కాలనీ, మహీంద్రా, ఎంజీ, ముంగి, బూచినెల్లి పారిశ్రామిక వాడలకు రాకపోకలు సాగించే వారికి ఎంతో మేలు జరుగునుంది. బ్రిడ్జి నిర్మాణం పనులు చేపట్టిన కాంట్రాక్టర్ కు ప్రభుత్వం చెల్లించాల్సిన బిల్లుల్లో జాప్యంతోనే పనులు సకాలంలో పూర్తి లేదనేది వాస్తవ సత్యం. ఫైనాన్షియల్ అడ్డంకులు తొలిగి బ్రిడ్జి పనులతో పాటు రోడ్ వైడ్నింగ్, డివైడర్,సర్వీస్ రోడ్లు. వాటికి రంగులు వేయడం తదితర పనులన్నీ పూర్తిచేశారు. వెంటనే ప్రారంభానికి అవస రమైన చర్యలు తీసుకోవాలని ఇందుకు అధికారులు, ప్రజా ప్రతినిధులు చొరవ చూపాలని స్థానిక, ప్రయాణికులు కోరుతున్నారు.
శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు రేపటి నుంచి మ్రోగనున్న పెళ్లి భాజాలు…
జహీరాబాద్. నేటి ధాత్రి:
“శ్రీరస్తు శుభమస్తు కళ్యాణమస్తు” అనే శుభాశయాలతో ఈ ఏడాది పెళ్లిళ్ల హంగామా ప్రారంభం కానుంది. జీవన పయనంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతూ, వధూవరుల కలలు నెరవేరే కాలం వస్తోంది.
Wedding
రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేసవి తిండి తినిపించే వేళ పెళ్లిళ్ల సందడి మొదలుకానుంది. హిందూ సంప్రదాయాల్లో పెళ్లి అనేది కేవలం వ్యక్తిగత వ్యవహారమే కాకుండా, రెండు కుటుంబాలను కలిపే పవిత్ర బంధంగా భావిస్తారు. అందుకే వివాహానికి సంబంధించి మంచి ముహూర్తాల కోసం పెద్దలు, కుటుంబ సభ్యులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.
గ్రహ నక్షత్ర అనుకూలతతో పెళ్లిళ్ల పండుగ: పురోహితులు చెబుతున్న వివరాల ప్రకారం, రేపటి నుంచి జూన్ 8 వరకు వివాహ ముహూర్తాలు శుభంగా ఉండబోతున్నాయి. ఈ సమయంలో అనేక కుటుంబాలు తమ పిల్లల వివాహాలను జరిపేందుకు ముందుకెళ్తున్నారు. జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాల స్థితి అనుకూలంగా ఉండటం వల్ల ఈ కాలం అత్యంత శుభఫలితాలను ఇస్తుందనే నమ్మకంతో వివాహాలకు శ్రీకారం చుడుతున్నారు.
ఈ తేదీల్లో వివాహాలకు అనుకూలమైన ముహూర్తాలు లభ్యమవుతున్నాయి. వీటిలో ముఖ్యంగా ఏప్రిల్ 30వ తేదీ ‘అక్షయ తృతీయ’ కావడంతో వేల వివాహాలు జరగనున్నాయి. ఇది హిందూ సంప్రదాయంలో అత్యంత శుభదినంగా భావించబడుతుంది.
ఆషాఢ మాసంలో విరామం… శ్రావణంలో మళ్లీ ప్రారంభం జూన్ 11 నుంచి జూలై 12 వరకు ఆషాఢ మాసం వస్తుందట. ఈ కాలంలో శుభకార్యాలు నిర్వహించరాదని శాస్త్రం చెబుతుంది. అందువల్ల ఈ నెలలలో ముహూర్తాలు లేవు. కానీ జూలై 25 నుంచి ప్రారంభమయ్యే శ్రావణ మాసంలో మళ్లీ మంచి ముహూర్తాలు లభ్యం కానున్నాయి.
తెలుగింట పెళ్లి పంట సిద్ధం: పెళ్లికి అనుకూలమైన రోజులు అధికంగా ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల పంట పండబోతోంది. మండుటెండల మధ్య కుటుంబాల్లో కొత్త ఉత్సాహం నిండి ఉంది. పెళ్లిళ్ల కోసం హాలులు, పెండ్లి కాన్వాయ్లు, తాళిబొట్టు కొట్టు, సంగీతం, సప్తపదుల సమయాలు అన్నీ సిద్ధమవుతున్నాయి. పిండి వంటలు, వేదికలు, అలంకరణలు—ఇవన్నీ ప్రస్తుతం వివాహబంధానికి తెరతీయబోతున్న సన్నాహక దృశ్యాలే!
ఝరాసంగం: మండల కేంద్రమైన ఝరాసంగంలోని తహసీల్దార్, శ్రీ శక్తి (ఐకెపి) కార్యాలయాల మధ్య పెరుగుతున్న చెట్టు గత వారం రోజులు క్రితం విచిన ఈదురు గాలుల కు కూలింది. ఈ చెట్టు శ్రీ శక్తి (ఐకెపి) కార్యాలయం మీద కూలడంతో ఎప్పుడూ ప్రమాదం జరు గుతుందో తేలియాని దుస్థితి ఉంది. ప్రతి రోజు ఐకెపి కార్యాలయంలోకి వివిధ గ్రామాల నుంచి మహిళ సంఘాల సభ్యులు వస్తుంటారు. ప్రమాద వశాత్తు చెట్టు పడుతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. చెట్టు వంగి కూలేందుకు సిద్ధంగా ఉన్న అధికారులు పట్టించుకోకపోవడంపై పలు వురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఖమ్మం – మహబాద్ రోడ్డుకు వనజీవి రామయ్య పేరు పెట్టాలి: వద్దిరాజు
రామయ్య కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎంపీ “వద్దిరాజు”.
“నేటిధాత్రి”,ఖమ్మం రూరల్, ఏప్రిల్, 15:
తన జీవితం మొత్తం మొక్కలు నాటాడానికే అంకితం చేసిన పద్మశ్రీ దరిపల్లి రామయ్య ధరిత్రి ఉన్నంతకాలం చిరస్థాయిగా నిలిచి ఉంటారని రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఇటీవలే మృతి చెందిన వనజీవి రామయ్య కు మంగళవారం రవిచంద్ర నివాళులు అర్పించారు. రెడ్డిపల్లి లోని ఆయన నివాసానికి వెళ్లి చిత్ర పటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించిన, అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా వద్దిరాజు మాట్లాడుతూ.. రామయ్య పేరు ఎప్పటికీ గుర్తుండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఖమ్మం – మహబూబాబాద్ రోడ్డుకు వనజీవి రామయ్య మార్గ్ పేరుతో నామకరణం చేయాలని ఎంపీ రవిచంద్ర కోరారు.
Vanajeevi Ramaiah
ఖమ్మం నుంచి రెడ్డిపల్లి వరకు 8 కిమీ మేర వనజీవి రామయ్య మొక్కలు నాటారని గుర్తు చేశారు. రోడ్డు విస్తరణలో భాగంగా ఆ చెట్లన్నీ కూల్చేసినందున, మళ్ళీ అదే వరసలో మొక్కలు నాటి.. సంరక్షించి రామయ్య కు నివాళులు అర్పించాలని కోరారు. ఈ విషయం లో రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా మంత్రులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. రామయ్య చరిత్ర భావి తరాలకు తెలిసేలా కర్ణాటక తరహాలో తెలంగాణ ప్రభుత్వం కూడా పాఠ్య పుస్తకాల్లో ఆయన చరిత్ర ను ప్రవేశ పెట్టాలని ఎంపీ రవిచంద్ర కోరారు. జిల్లాలో కూడా ఆయన స్మారకం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
వరంగల్ రజతోత్సవ సభ ఎలా వుంటుందనే విషయాన్ని కళ్లకు కట్టినట్లు ‘‘నేటిధాత్రి’’ ఎడిటర్ ‘‘కట్టా రాఘవేంద్రరావు’’ కు వివరించిన ఎమ్మెల్సీ ‘‘పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి’’ వివరాలు…ఆయన మాటల్లోనే..
`తెలంగాణను తెర్లు చేస్తున్న కాంగ్రెస్ గుండెలు అదిరిపోవాలే..
`రజతోత్సవ సభ తరతరాల తెలంగాణ చరిత్రకు గుర్తుగా నిలుస్తుంది
`తెలంగాణ నలు మూలల నుంచి దండు కదిలితే ఎలా వుంటుందో అలా వుంటుంది
`పుట్టల్లో నుంచి చీమలు వచ్చినట్లు ప్రజలు వరంగల్ సభకు వస్తారు
`వరంగల్ రజతోత్సవ సభను చూసి కాంగ్రెస్ పార్టీ అతలాకుతలం అవుతుంది
`సభలంటే బిఆర్ఎస్ సభలే అని ప్రపంచమంతా మాట్లాడుకునేలా వుంటుంది
`చరిత్రలో రజతోత్సవ సభ సువర్ణాక్షరాలతో లిఖించేలా జరుగుతుంది
`తెలంగాణ మీద ప్రేమ లేని వాళ్ల చేతిలో పెడితే విధ్వంసమౌతుంది
`60 ఏళ్ల కలను నిజం చేసింది కేసిఆర్
`14 ఏళ్లు కొట్లాడి తెలంగాణ తెచ్చింది కేసిఆర్
`పదేళ్లలో తెలంగాణను వందేళ్లు ముందుకు తీసుకెళ్లింది కేసిఆర్
`ఒక్క ఏడాదిలోనే మళ్ళీ వందేళ్లు వెనక్కి నెట్టింది కాంగ్రెస్
`కాంగ్రెస్ అంటేనే కరువు…తెలంగాణకు బరువు
`కాంగ్రెస్ అంటేనే కష్టం.. నష్టం
`యాభై ఏళ్లు పాలించి 50 వేల ఎకరాలు పారించలేదు
`పదేళ్లలో కోటి ఎకరాలకు సాగునీరిచ్చింది కేసిఆర్
`మాయ మాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది
`అలవికాని హామీలు అమలు చేయలేక ఆపసోపాలు పడుతోంది
`పాలించడమంటే నోటి కొచ్చింది చెప్పడం కాదు
`ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం
`అవి రెండూ కాంగ్రెస్ కు చేతకాదు
`భవిష్యత్తులో మరో పాతికేళ్లు ప్రజలు ఇక కాంగ్రెస్ ను జనం నమ్మరు
హైదరాబాద్,నేటిధాత్రి:
ఏనుగు వెళ్తుంటే మొరిగే శనకాలు వుంటాయి. అవి శునకానందం పొందుతుంటాయి. అల్పులు, అజ్ఞానులు అంతటా వుంటారు. తెలంగాణ ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేని వాళ్లు ఏవేవో మాట్లాడుతుంటారు. కాని తెలంగాణ ఆత్మతో పెనవేసుకున్న బిఆర్ఎస్ను విమర్శిస్తేనే రాజకీయ మనుగడ అనుకునే వారు కూడా చాల మంది వుంటారు. అలాంటి వారికి బిఆర్ఎస్ రజతోత్సవ సభ మరోసారి పాఠమే కాదు, గుణపాఠం కూడా నేర్పుతుంది. సభలంటే అవి తెలంగాణకే పరిమితం. తెలంగాణ ఉద్యమానికే తలనమానికం. బిఆర్ఎస్ పార్టీకే సొంతం. ఆ చరిత్రను తిరగరాసే శక్తులు లేవు. రావు. మళ్లీ మళ్లీ సింహగర్జన లాంటి సభలు నిర్వహించాలన్నా, ఆ చరిత్రను తిరగరాయాలన్నా అది బిఆర్ఎస్కే సాధ్యం. కేసిఆర్ పేరు చెబితే తప్ప అంత గొప్పసభలు జరగవు. అందుకే ఈసారి బిఆర్ఎస్ రజతోత్సవ సభ నభూతో నభిష్యతి అని ప్రపంచమంతా మాట్లాడుకునేలా జరుగుతుందని ఎమ్మెల్సీ పోచం పల్లి శ్రీనివాస్రెడ్డి జోస్యం చెప్పారు. ప్రజాస్వామ్యంలో ప్రజాసభలకు కూడా అనుమతులు ఇవ్వని చరిత్ర కాంగ్రెస్ది. కాంగ్రెస్కు ఈ నికృష్ట సంప్రదాయంకొత్తది కాదు. తెలంగాణ ఉద్యమ కాలంలోనే సభ నిర్వహణకు ప్రతిసారి కోర్టును ఆశ్రయించి తెచ్చుకోవాల్సి వచ్చేది. తెలంగాణ వ్యతిరేకులు పాలిస్తున్న ఈ సమయంలో కూడా బిఆర్ఎస్ సభకు మళ్లీ అనుమతి కోసం పోరాటం చేయాల్సి వచ్చింది. ఇది కాంగ్రెస్ నైజం. ఆ పార్టీలో తెలంగాణ ఉద్యమకారులులేరు. తెలంగాణ కోసం గొంతిత్తిన వాళ్లు లేరు. వున్న వారు పదవుల కోసం ఆరాటం తప్ప, తెలంగాణ కోసం నొరెత్తే శక్తి లేని వాళ్లు వున్నారు. అందుకే కాంగ్రెస్ను నమ్మి, తెలంగాణ మళ్లీ ఒకసారి ఆగమైంది. ఒక్క అవకాశమంటూ ప్రజలను వేడుకొని, అడుగడుగునా ఆచరణ సాధ్యం కాని హమీలిచ్చి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు వాటి అమలు చేయలేక, కనీసం కేసిఆర్ వేసిన బాటలో నడవలేక తెలంగాణను తెర్లు చేస్తున్నారు. బంగారు తెలంగాణను ఆగం చేస్తున్నారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజు నునంచే ప్రజలకు ఆ ప్రభుత్వం ఏమిటో తెలిసిపోయింది. వారి పాలన చేతగాదని తేలిపోయింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీలు కాంగ్రెస్ పాలనలో అమలు కావని అర్ధమైపోయింది. అందుకే ఇంత తొందరగా ప్రజా వ్యతిరేక మూటగట్టుకున్న ప్రభుత్వం ప్రపంచంలోనే కూడా ఎక్కడా వుండదు. అందుకే ప్రజలు ఎప్పుడెప్పుడు మళ్లీ బిఆర్ఎస్ ప్రభుత్వమొస్తుందా? కేసిఆర్ మళ్లీ ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారా? పచ్చని తెలంగాణను ఎండబెట్టిన కాంగ్రెస్ దరిద్రం పోతుందా? అని చూస్తున్నారు. బిఆర్ఎస్ రజతోత్సవ సభతో ప్రజలకు భరోసా కల్పించడానికి, భవిష్యత్తు బంగారంగా వుంటుందని చెప్పడానికి వరంగల్ సభ గొప్పగా జరగనుంది. తెలంగాణ నలు మూలల నుంచి పది నుంచి పదిహేను లక్షల మంది ప్రజల హజరయ్యే అవకాశం వుంది. అందుకే 1200 ఎకరాలలో చరిత్రలో నిలిచిపోయే మరో గొప్ప సభకు శ్రీకారం చుడుతున్నాం..ఈ రజతోత్సవేడుక సాక్షిగా మరో వందేళ్ల చరిత్రకు, ప్రయాణానికి పునరంకితం కావాలనుకుంటున్నామంటున్న ఎమ్మెల్సీ పోచం పల్లి శ్రీనివాస్ రెడ్డి తన అభిప్రాయాలను నేటిధాత్రి ఎడిటర్ కట్టారాఘవేంద్రరావుతో పంచుకున్నారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే…
కేసిఆర్ అంటేనే ఒక చరిత్ర. కేసిఆర్ అంటేనే యుగకర్త. కేసిఆర్ అంటేనే తెలంగాణ జీవనాడి. తెలంగాణ ఉద్యమ వేడి. తెలంగాణ కారణజన్ముడు. తెలంగాణ ప్రజల గోస తీర్చేందుకు కదం తొక్కిన వీరుడు. అందుకే తెలంగాణ తెలంగాణ వచ్చింది. అందుకే తెలంగాణ జాతి పిత కేసిఆర్ అని ప్రజలు కొనియాడుతున్నారు. ఆయనను గుండెల్లో పెట్టుకున్నారు. ఒక రాజకీయ పార్టీకి 25 వసంతాల ప్రయాణం సామాన్యమైనవిషయం కాదు. తెలంగాణ పేరు మీద అనేక పార్టీలు ఏర్పాటయ్యాయి. అవకాశ వాద రాజకీయాలు చేయాలనుకున్న వారు మధ్యలోనే తెలంగాణ మంత్రం మర్చిపోయారు. తెలంగాణ కోసం జై తెలంగాణ అనడమే మానేశారు. తెలంగాణ ఉద్యమాన్ని ఒక యజ్ఞంగా కొనసాగించి, కడదాకా కొట్లాడి సాధించిన నాయకుడు కేసిఆర్. దేశంలో ఉద్యమ పార్టీలు చాలా తక్కువ. అందులోనూ బిఆర్ఎస్ లాంటి పార్టీ మరొకొటి లేదు. రాదు! ఇంకా వందేళ్లయినా చెక్కు చెదరని పార్టీ బిఆర్ఎస్. ఇంకా వెయ్యేళ్లైనా తెలంగాణ సమాజం మర్చిపోని ఏకైక నాయకుడు కేసిఆర్. అలాంటి నాయకులు లేరు. భవిష్యత్తు చూడదు. తెలంగాణ తేవడమే కాదు..తెచ్చిన తెలంగాణను పదేళ్లలో బంగారు తెలంగాణ చేసిన పాలకుడు కేసిఆర్. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేసి, రైతులుకు నీటి కష్టాలు తీర్చిన భగీరధుడు. కాంగ్రెస్ పార్టీ యాభై ఏళ్లుగా పునాది రాయితప్ప, తట్టెడు మట్టి తీయని ప్రాజెక్టులు అనేకం వున్నాయి. దశాబ్దాలుగా వాటి పేరు చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎప్పటికిప్పుడు పబ్బం గడుకున్నదే తప్ప చుక్క నీరివ్వలేదు. ఎకరం పొలం పారించలేదు. తెలంగాణ ఎడారిగా మారుతున్నా గుడ్లప్పంచి చూశారు. తెలంగాణ ప్రజలు కన్నీరు కారుస్తుంటే, కాంగ్రెస్ నాయకులు చూసి నవ్వుకున్నారు. ప్రజల ముందుకు వచ్చి మొసలి కన్నీరు కార్చారు. ఉమ్మడి పాలకులను ఎదిరించే ధైర్యం లేక చేష్టలుడిగి చూశారు. ఉమ్మడి పాలకుల మోచేతినీళ్లు తాగడం అలవాటు చేసుకున్నారు. అందుకే తెలంగాణ గురించి ఏనాడు పట్టించుకోలేదు. కేసిఆర్ పేరు తెలంగాణలో నిత్య స్మరణ కావడానికి, ప్రజల గుండెల్లో కేసిఆర్ నిలిచిపోవడానికి, తెలంగాణ సాధనతోపాటు, కాళేశ్వరం, యాదాద్రి దేవాలయాలు చాలు. ఇప్పటి కాలంలో ఎవరికీ సాద్యం కాని యాదాద్రి గుడి నిర్మాణం జరిగింది. అలాంటి గుడి నిర్మాణం జరగాలంటే కనీసం 25 సంవత్సరాలు పడుతుంది. కాని ఏడేళ్ల కాలంలో యాదాద్రి గుడి నిర్మాణం జరగడంత ప్రపంచమంతా విస్తుపోయింది. కాళేశ్వరంతో మొదలైన పోలవరం ఎక్కడున్నదో..కాళేశ్వరం పూర్తయి నీళ్లు ఎలా ఇస్తున్నదో ప్రజలు చూస్తూనే వున్నారు. కేసిఆర్ నాయకత్వ పటిమను కొనియాడుతూనేవున్నారు. ఇరవైదేళ్ల పాటు ఒక రాజకీయ పార్టీని నడపడం అంటే సామాన్యమైన విషయం కాదు. అయినా తలా తోకలేని కొంత మంది నాయకులు వేస్తున్న ప్రశ్నలు విచిత్రంగా వున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకుల పసలేని వాదన అద్వాహ్నంగావుంది. మాటకు ముందు కాంగ్రెస్ పార్టీ చరిత్ర గురించి మాట్లాడే నాయకులు ఆ పార్టీ చరిత్ర ఏమిటో తెలుసుకోవాలి. కాంగ్రెస్ పార్టీని బారతీయుడు పెట్టింది కాదు. ఏవో హ్యూమ్అనే ఆంగ్లేయుడు పెట్టిన పార్టీ. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సార్లు చీలికలు, పీలికలైన పార్టీ కాంగ్రెస్ పార్టీ. పార్టీ చీలిన ప్రతీసారి కొత్త గుర్తుతో ప్రజల ముందుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలా పలుసార్లు అంతరించి, మిగుతూవచ్చిన పార్టీ కాంగ్రెస్. ఇప్పుడున్నది అసలైన కాంగ్రెస్ కాదు. స్వాతంత్య్ర ఉద్యమానికి ఇప్పుడున్న కాంగ్రెస్కు ఎలాంటి సంబంధం లేదు. కాని టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ పేరు పార్టీయే పేరు మార్చుకున్నది. టిఆర్ఎస్ నాయకుడైనా, బిఆర్ఎస్ నాయకుడైనా ఒక్కరే..ఆ ఒక్కరు కేసిఆరే…పార్టీ పేరు మాకు మేముగా మార్చుకున్నాం..పార్టీ జెండా మారలేదు. గుర్తు మారలేదు. ఎన్నికల సంఘం ఒప్పుకున్నది. ఎన్నికల సంఘం నియమాళికి లోబడి పేరు మార్పు జరిగింంది. పార్టీ పేరు మార్పును అంగీకరించింది. ఈ మాత్రం అవగాహన లేని కాంగ్రెస్ నాయకులు లేనిపోని ప్రచారం చేస్తే ప్రజలు నమ్మరు. వారి మాటలు అసలే నమ్మరు. బిఆర్ఎస్ రజతోత్సవ సభను చూసి కాంగ్రెస్ పార్టీ గుండెలు అదిరిపోతుంది. ఆ పార్టీ అతలా కుతలమౌతుంది. రాజకీయసభలంటే బిఆర్ఎస్ సభల్లా వుండాలని ప్రపంచమంతా 27 తర్వాత మాట్లాడుకంఉటుంది. చరిత్రలో వరంగల్ సభ మరోసారి సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. బిఆర్ఎస్ రజతోత్సవ సభ అంటే కేవలం రాజకీయ సభ కాదు. అది ప్రజల సభ. తెలంగాణ వాదుల సభ. తెలంగాణ ఉద్యమకారుల సభ. త్యాగాల వీరులైన బిఆర్ఎస్ అభిమానులసభ. తెలంగాణ తెచ్చిన ధీరుల సభ. తెలంగాణ కోసం అలుపెరగని పోరాటం చేసిన స్వాప్నికుల సభ. తెలంగాణ తలరాత మార్చిన బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ. తెలంగాణ కోసం జీవితమే త్యాగం చేసిన పోరాట యోధుడు కేసిఆర్ సభ.
అల్లరిమూకల దాడుల్లో ప్రాణాలు అరచేతపట్టుకొని పారిపోయిన హిందువులు
మైనారిటీలకు రక్షణగా వుంటానన్న మమతా బెనర్జీ
అధికారం తప్ప బాధితుల గోడుపట్టని ప్రభుత్వం
హింసకు కారణమైనవారికి అండగా వుండటం ఎంతవరకు న్యాయం?
కేంద్ర బలగాలు వస్తే తప్ప పరిస్థితి అదుపులోకి రాలేదు
బెంగాల్లో సమన్యాయం ఎక్కడ? కేవలం మైనారిటీ న్యాయం తప్ప!!
డెస్క్,నేటిధాత్రి:
హింసాత్మక రాజకీయాలకు, అరాచకానికి మారుపేరుగా పశ్చిమబెంగాల్ తయారైంది. వక్ఫ్బిల్లును పార్లమెంట్ ఆమోదించి, రాష్ట్రపతి ఆమోదముద్ర పడిన తర్వాత ఏప్రిల్ 8నుంచి అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్లో ముర్షిరాబాద్ జిల్లాలో ముస్లిం మెజారిటీలుగా వున్న షం షేర్గంజ్, సుతి ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయి. వాహనాలు, దుకాణాలు, ఇళ్లను యదేచ్ఛగా తగులబెట్టారు. రాళ్లు రువ్వడంతో కొందరు పోలీసులు గాయపడ్డారు. హిందువుల ఇళ్లపై యదేచ్ఛగా దాడులు జరగడంతో సుమారు 300 కుటుంబాలు పొరుగునే వున్న మాల్డా ప్రాంతానికి పారిపోయాయి. వీరంతా బైష్ణవ్నగర్లోని పర్లాల్పూర్ హైస్కూల్లో ఆశ్రయం పొందుతున్నారు. ధూలియాన్ ప్రాంతానికి చెందిన చాలామంది భాగీరథి నదిలో పడవల ద్వారా బైష్ణవ్నగర్కుపారిపోయారు. అల్లరిమూకలు తాగునీటి ట్యాంకుల్లో విషం కలపడమే కాకుండా, పురుషులను చితకబాది, మహిళలను వేధింపులకు గురిచేయడమే కాదు తక్షణమే ఈ ప్రాంతం నుంచి వెళ్లి పోవాలని డిమాండ్ చేయడంతో ప్రాణాలు అరచేతపట్టుకొని పారిపోవాల్సి వచ్చిందని ధూలియాన్ ప్రాంత వాసులు చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. మరికొందరు పక్క రాష్ట్రమైన రaార్ఖండ్కు పారిపోయారు. షంషేర్గంజ్లో ఒక కుటుంబానికి చెందిన హరగోవింద్ దాస్ అనే 72ఏళ్ల వృద్ధుడు, ఆయన కుమారుడు చరణ్దాస్ (40)లను బయటకు ఈడ్చుకువచ్చి హతమార్చినట్టు వార్తలు వచ్చాయి. వీరి కుటుంబ సభ్యులను చితకబాదారు. ఈ దారుణంపై పోలీసులు ఎటువంటి వ్యాఖ్య చేయకపోవడంగమనార్హం. అల్లర్లకు పాల్పడుతున్న మూకలపై పోలీసులు కాల్పులు జరిపిన ప్పుడు ఇజాజ్ అహ్మద్ (25) అనే యువకుడు గాయపడ్డట్టు అడిషనల్ డైరెక్టర్ జనరల్ (శాంతిభద్రతలు) జావెత్ షమీమ్ తెలిపారు. ఇతడిని ఆసుపత్రి లో చేర్పించగా చికిత్స పొందుతూ మృతిచెందినట్టు పోలీసులు తెలిపారు.
పార్లమెంట్ ఆమోదం పొందిన వక్ఫ్బిల్లుపై రాష్ట్రపతి ఏప్రిల్ 5న సంతకం చేసిన తర్వాత, నాలుగు రోజులకు అంటే 8వ తేదీన ముర్షిరాబాద్లో అల్లర్లు జరిగినా పోలీసులు వాటిని అదుపులోకి తెచ్చారు. తర్వాత ఏప్రిల్ 11న ఒక ప్రదర్శన సందర్భంగా అల్లర్లు ప్రారంభమై విధ్వంసకాండ చెలరేగింది. హిందువుల ఆస్తులు యదేచ్ఛగా లూటీలు చేయడమే కాకుండా వారి దుకాణాలను, వాహనాలను అల్లరిమూకలు తగులబెట్టాయి. గత శనివారం కలకత్తా హైకోర్టు కేంద్రబలగాలనురంగంలోకి దించాలని ఆదేశించడంతో, వాటి ప్రవేశం తర్వాత అల్లర్లు అదుపులోకి వచ్చాయి. ఈ విధ్వంసకాండ నేపథ్యంలో కోల్కతాలో బీజేపీ నేతృత్వంలో పెద్ద నిరసన ర్యాలీ జరిగింది. మమతా బెనర్జీ తక్షణమే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని, రాష్ట్రపతి పాలన విధించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. హిందువులపై దాడులు, వారి ఆస్తుల లూటీలు జరిగాయని ఈ విధ్వంసకాండపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీతో విచారణ జరపాలని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుసుకాంత ముజందార్ డిమాండ్ చేశారు. ఇక తృణమూల్ కాంగ్రెస్ ‘‘బంగ్లాదేశ్ నుంచి అల్లరి మూకలను కావాలనే ఇక్కడికి రప్పించి బీజేపీ ఈ విధ్వంసరచన చేసిందని, ఈ అల్లరి మూకలు తిరిగి బంగ్లాదేశ్కు పారిపోయాయంటూ’’ ఆరోపించింది. శాంతిభద్రతలను కాపాడటంలో విఫలమైంది కాకుండా, ఈవిధంగా ఆరోపించడం తృణమూల్ కాంగ్రెస్కే చెల్లింది. ఇదిలావుండగా పరూలియా బీజేపీ ఎం.పి. జ్యోతిర్మయి సింగ్ మహతో కేంద్ర మంత్రి అమిత్షాకు ఒక లేఖ రాశారు. ఇందులో ఆమె పశ్చిమ బెంగాల్లోని ఐదు జిల్లాల్లో సాయుధ దళాల ప్రత్యేక అధికార చట్టాన్ని అమల్లోకి తేవాలని కోరారు. సీనియర్ బీజేపీ నేత సుబేందు అధికారి మాట్లాడుతూ తృణ మూల్ కాంగ్రెస్ పాలనలో రాడికల్ మూకలు రెచ్చిపోతున్నాయని, ముర్షిరాబాద్ జిల్లా ఇప్పుడు వీరి హింసాకాండకు సాక్ష్యంగా నిలిచిందన్నారు. తృణమూల్ కాంగ్రెస్ అనుసరిస్తున్న మితిమీరిన బుజ్జగింపు రాజకీయాలు హిందువులకు ప్రాణసంకటంగా మారిందన్నారు. అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలున్నాయా? అంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ముర్షిదాబాద్ జిల్లాలో ప్రాణా లు అరచేత పట్టుకొని పారిపోతున్న ప్రజల ఫోటోలను ఆయన ప్రదర్శించారు. అయితే బీజేపీ చూపిస్తున్నవన్నీ ఫేక్ ఫోటోలంటూ తృణమూల్ రాజ్యసభ ఎం.పి. సాగర్ ఘోష్ ఆరోపించారు.
అరాచకానికి కూడా ఒక హద్దుంటుంది. మమతా బెనర్జీ పాలనలో ఆ హద్దులు కూడా చెరిపేసినట్టు వర్తమాన పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. వక్ఫ్ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసిన తర్వాత నాలుగు రోజులకు అల్లర్లు చెలరేగాయంటే దీని అర్థం ఏమిటి? ఇప్పటికే సర్వభ్రష్ఠ పాలనతో రాష్ట్రాన్ని అధోగతి పాల్జేసిన మమతాబెనర్జీ ఇంకా తన పదవీకాంక్షకోసం మరెంతమంది హిందువుల ఉసుర్లు తీసుకుంటారనేది ప్రశ్న. హింసకు పాల్పడిన మూకలను అదుపులోకి తీసుకురాక పోగా, వక్ఫ్బిల్లును రాష్ట్రంలో అమలు చేయనని, మైనారిటీలకు రక్షణగా వుంటానని ప్రకటించా రంటే మమతా బెనర్జీని ఏమనుకోవాలి? ఒకపక్క వందలాది హిందూ కుటుంబాలు ప్రాణాలు అరచేతపట్టుకొని స్వస్థలాలను వదిలేసి పారిపోతే, బాధితులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం, ఏకంగా అల్లర్లకు కారకులైనవారికి అండగా నిలవడమేంటి? రాజకీయంగా అభిప్రాయ భేదాలుం టే రాజకీయంగానే పరిష్కరించుకోవాలి తప్ప, హిందువులు బలిపశువులవుతున్నా పట్టించుకోని మమతా బెనర్జీ వైఖరి ఖండనార్హం. కేంద్ర బలగాలు వస్తే తప్ప అల్లర్లు సర్దుమణగలేదంటే, అల్లరి మూకలకు ప్రభుత్వం అండగా వున్నట్టేగా అర్థం? ఓట్లకోసం, అధికారం కోసం అమాయక హిందువులను బలి తీసుకోవడమేంటి? ఇంత జరిగినా బాధితులకు అండగా వుంటామన్న ఒక్క ప్రకటన కూడా మమతా బెనర్జీ నోటివెంట రాకపోవడం ఎంత విచిత్రం? పశ్చిమ బెంగాల్లో అసలు ప్రభుత్వం ఎవరికోసం పనిచేస్తున్నది? ఇటీవల యు.పి. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ఒక సందర్భంలో మాట్లాడుతూ ‘‘వందమంది ముస్లింల మధ్య 50మంది హిందువులు బతకగలరా?’’ అని ప్రశ్నించారు. కుహనా సెక్యులర్ వాదులు దీనిపై నానా రాద్ధాంతం చేశారు. మరిప్పుడు బెంగాల్లో జరుగుతున్నదేంటి? దీనిపై ఒక్కరూ నోరు మెదపరు. మీడియా కూడా పెద్దగా ప్రాధాన్యం ఇవ్వదు. ఎందుకంటే బాధితులు హిందువులు కదా! అదే ఏ ఒక్క ముస్లిం బాధపడి నా ప్రపంచమంతా కొట్టుకుపోయినంత రాద్ధాంతం చేస్తారు! అందరూ మనుషులే! అందరి ప్రా ణాలు సమానమే. దేశంలో ఎక్కడాలేని గొడవలు కేవలం పశ్చిమ బెంగాల్లోనే…అది కూడా బంగ్లాదేశ్ సరిహద్దులో వున్న ముర్షిరాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఎందుకు జరుగుతున్నాయి? వ్యవసాయ బిల్లుల విషయంలో కేవలం పంజాబ్, హర్యానాలకు చెందిన ‘రైతులమని చెప్పుకుంటున్నవారు’ ఆందోళనకు దిగారు. మిగిలిన రాష్ట్రాల్లో ఎక్కడా వీటిపై గొడవ జరగలేదు. ఎందుకంటే రైతులకు ఈ చట్టాలవల్ల కలిగే ప్రయోజనం తెలుసు. కానీ పంజాబ్, హర్యానాల్లోని దళారీలు ఇంతటి అల్లర్లకు బాధ్యులు. చివరకు ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను ఉపసం హరించుకుంది. కానీ నష్టపోయింది రైతులు, ప్రయోజనం పొందింది దళారీలు. ఇప్పుడు పశ్చి మ బెంగాల్లో అల్లర్లు, విధ్వంసకాండకు పాల్పడినవారికి పూర్తి రక్షణ, బుజ్జగింపులు కాగా హిందువులకు మాత్రం కష్టాలు, కన్నీళ్లు! ఈ ప్రాంతాల్లో స్వస్థలాల్లోనే హిందువులు బతకలేని పరిస్థితినెలకొంటే, ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు?
తృణమూల్ కాంగ్రెస్లో ఇటీవల బయల్పడిన విభేదాల నేపథ్యంలో, పార్టీపై మమతా బెనర్జీ క్ర మంగా పట్టు కోల్పోతున్నారన్న అనుమానాలు పొడచూపాయి. బీజేపీ క్రమంగా బలపడుతూ, తృణమూల్పై ఎప్పటికప్పుడు పైచేయి సాధిస్తున్న తరుణంలో, ప్రజల దృష్టిని మరల్చడానికే ఈ అ లర్లను సృష్టించారా? అన్నది తేలాలి. మెజారిటీ ప్రజల మనోవేదన, ఆక్రందనల నేపథ్యంలో వ చ్చే అధికారం ఆనందాన్నిస్తుందా? ప్రస్తుతం బెంగాల్ వాతావరణం చూస్తుంటే, ఒకప్పుడు కశ్మీర్ లో హిందువులు అనుభవించిన దుర్భర పరిస్థితులు గుర్తొస్తున్నాయి. బుజ్జగింపు రాజకీయాలు పరాకాష్టకు చేరి, దాల్చిన వికృతరూపానికి బెంగాల్ ఒక గొప్ప ఉదాహరణగా నిలుస్తోంది.
సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి ఆధ్వర్యంలో అంబెడ్కర్ జయంతి వేడుకలు.
సిరిసిల్ల టౌన్: (నేటిధాత్రి)
రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితి సమితి అధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ కార్య నిర్వహణలో లక్ష్మణ్ ప్రింటర్స్ లో 11 గంటలకు అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి .అధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడుతూ భారతరత్న బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి రాజ్యాంగ రచనల్లో ప్రధాన పాత్ర వహించిన డాక్టర్ అంబేద్కర్ సేవలు ఎనలేనివి. దేశ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి అందరికీ ఆమోదయోగ్యమైన రాజ్యాంగ రచన చేసిన భారతరత్న బాటలో అందరం కలసి నడుద్దాం అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్, సహధ్యక్షులు కోడం నారాయణ, ఉపాధ్యక్షులు బూర దేవానందం, ముడారి సాయి మహేష్, గుండెల్ని వంశీ, దొంత దేవదాసు ,సిరిసిల్ల తిరుపతి, అంకారపు రవి కవులు, రచయితలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దీక్షకుంటలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు. నెక్కొండ,నేటిధాత్రి:*
నెక్కొండ మండలం దీక్షకుంట గ్రామంలో మాల మహానాడు ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించుకున్నారు.డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన సందర్భంగా నెక్కొండ మండల మాల మహానాడు కన్వీనర్, కో కన్వీనర్ కారు కరుణాకర్, పోనగంటి స్వామిరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారతదేశానికి చేసిన సేవలు మర్చిపోకుండా ఆయన ప్రజలు ఆయనను దేవుడని కొలవాలని భారత రాజ్యాంగం నిర్మాణం కోసం ఆయన ఎన్నో త్యాగాలను చేసి బడుగు బలహీన వర్గాలకు కొరకు అహర్నిశలు కృషి చేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు.ఆయన జయంతిని ప్రపంచవ్యాప్తంగా పండుగలాగా బడుగు బలహీన వర్గాల ప్రజలు మేధావులు అంగరంగ వైభవంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను జరుపుకోవాలని వారు కొనియాడారు ఈ కార్యక్రమంలో జామండ్ల రంజిత్, కారు అనిల్, బొల్లెపల్లి విష్ణు, చీర కుమారస్వామి, సర్కిల్ రవి, చీపురు భాస్కర్, పోనకంటి ప్రశాంత్, పులి సుధాకర్, దునకన రఘుపతి, చీపురు స్వామి, తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల సామాజిక ఉద్యమ కెరటం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అని ఆయన స్ఫూర్తితో భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకొని దేశాన్ని కాపాడుకోవాలని ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ అన్నారు.భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ 134వ జయంతి సందర్భంగా ఎంసిపిఐ(యు) ఆధ్వర్యంలో స్థానిక ఓంకార్ భవన్ లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళిలర్పించారు.ఈ సందర్భంగా పెద్దారపు రమేష్ మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారతదేశాన్ని మతం భాషా ప్రాంతం పేరుతో విచ్ఛిన్నం చేసి అధికారాన్ని కాపాడుకునేందుకు దోపిడి పాలకులు నిరంతరం ప్రయత్నిస్తున్నారని ఈ క్రమంలో అన్ని వర్గాలకు సమన్యాయం కోసం ఏర్పాటుచేసిన భారత రాజ్యాంగాన్ని సైతం మార్చేందుకు బిజెపి మతోన్మాద పాలకులు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎన్నో కలలుకని దేశాన్ని సామాజికంగా ఆర్థికంగా బలోపేతం చేసేందుకు రాజ్యాంగాన్ని రచిస్తే అందు విరుద్ధంగా పాలకులు వివరిస్తూ అంబేద్కర్ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని అలాంటి వారే మళ్లీ అంబేద్కర్ పేరు జపం చేయడం సిగ్గుచేటు అన్నారు. అంబేద్కర్ ఆశయాలను భారత రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు గోనె కుమారస్వామి హన్మకొండ జిల్లా కార్యదర్శి ఎన్ రెడ్డి హంసారెడ్డి రాష్ట్ర నాయకులు మందరవి జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్ రాష్ట్ర జిల్లా నాయకులు సుంచు జగదీశ్వర్ చంద్రయ్య రాజిరెడ్డి కొమురయ్య సావిత్రి నాగేష్ ఉదయ రవి మల్లికార్జున్ నరసయ్య తదితరులు పాల్గొన్నారు.
నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో గల గ్రామ పంచాయితీ కార్యదర్శి శ్రావణకుమారి ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులు అర్పించారు.అంబేద్కర్ 135 వ జయంతికి పురస్కరించుకొని గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పెద్ది శ్రీనివాస్ రెడ్డి,అంగన్వాడి టీచర్ జహీరబేగం,మాజీ ఉప సర్పంచ్ బరిగెల భక్కయ్య,గ్రామస్తులు ఎల్లారెడ్డి, ఉప్పుల ఐలయ్య,రాజు,తదితరులు పాల్గొన్నారు.
భీమారం మండల కేంద్రంలోని ఆవడం ఎక్స్ రోడ్ చౌరస్తాలో సోమవారం ఘనంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మంతెన సంపత్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా మంతెన సమ్మయ్య మాట్లాడుతూ మూడు సంవత్సరాల నుంచి అంబేద్కర్ విగ్రహం స్థాపన కొరకు ఆరట పడుతున్నామని చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి విన్నవించారు.అంబేద్కర్ ఆలోచనలే దేశానికి ఆదర్శమని,సమాజంలోని అసమానతలు దురహంకారం పై అలుపెరుగని పోరాట యోధుడు,సమ సమాజ స్వప్నికుడు.దళిత బహుజన వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని అన్నారు.భారత రాజ్యాంగ రూపకర్త జాతీయవాది అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు అన్ని గ్రామాలలో ఘనంగా జరుపుకోవడం జరిగింది.అంబేద్కర్ ఏ ఒకరికి, ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదని సమాజంలోని ప్రజలందరీ వాడని ప్రపంచంలోనే గొప్ప రాజ్యాంగం రాసిన వ్యక్తి ప్రజల హక్కులను కాపాడిన మహోన్నత వ్యక్తి అని అన్నారు.తన జీవితమంతా అణగారిన వర్గాల అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేసిన మహోన్నత వ్యక్తి జాతీయ ఉద్యమంలో అంబేద్కర్ తన జీవితంలో చిన్నప్పటి నుంచి సమాజం ఎన్నో అవమానాలు ఎదురైన వేను తిరగక వాటిని ధైర్యంగా ఎదుర్కొని తన కృషితో కేంద్ర మంత్రి పదవి పొందారు.అంబేద్కర్ జీవిత కాలంలో అనేక సబ్జెక్టులలో 32 డిగ్రీలు పొంది గౌరవ డాక్టరేట్ పట్టాలు పొందిన భారతీయుడుగా నిలిచారన్నారు.విద్యాభ్యాసం తర్వాత ఆర్థికవేత్తగా,ప్రొఫెసర్ గా,న్యాయవాదిగా కొనసాగారు.స్వతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం రాసి పేద వర్గాలకు అండగా నిలబడిన వ్యక్తి అంబేద్కర్ తన జీవిత చివరన బుద్ధుని బోధనలు నచ్చి బౌధమతం స్వీకరించారు.మహిళా హక్కులు,కార్మికుల హక్కులు ఇతర అన్ని వర్గాల పేద ప్రజల కోసం తన జీవితకాలం పోరాటం చేసిన మహోన్నత వ్యక్తిగా ఈ సమాజం చూడాలని ఎవరు తక్కువ చేసి చూడకూడదని సూచించారు.చెన్నూరు నియోజకవర్గం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో భీమారం మండల నాయకులు,గ్రామ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
స్థానిక సీఎస్ఐ చర్చిలో మట్టల పండుగను ఆదివారంఘనంగా నిర్వహించినారు ఈ సందర్భంగా ఉదయం నుంచే భక్తులు రావడంతో చర్చి పరిసర ప్రాంతాలు ఈత మట్టలతో ప్రత్యేకంగా ఆకర్షణంగా కనిపించాయి భక్తులు ఈత మట్టలతో భక్తి గీతాలు ఆలపిస్తూ చర్చి చుట్టూ తిరిగారు అనంతరం చర్చిలో జరిగే ప్రత్యేక ప్రార్థనలు పాల్గొన్నారు ఏసుప్రభు జెరుసలెం పట్టణంలో ప్రధమంగా ప్రవేశించినప్పుడు అక్కడి ప్రజలు ఏసు ప్రభువును గాడిద పై తీసుకొని వస్తూ పెద్ద ఎత్తున వివిధ రకాల ఈత మట్టలతో ఘన స్వాగతం పలుకుతారు దీనినే క్రైస్తవులు మట్టల ( ఈస్టర్) పండుగగా ఆచరిస్తారు ఈ సందర్భంగా పాస్ట్రేట్ ,& గ్రూప్ చైర్మన్ రేవ , కె . టీ .విజయ్ కుమార్ భక్తులను ఉద్దేశించి దైవ సందేశం చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ గడిదేసి సాల్మన్ , పస్ట్రేట్ & గ్రూప్ సెక్రెటరీ, రితీష్ రెడ్డి, ట్రెజర్ , వై .ప్రసాద్ రావు, మరియు కమిటీ సభ్యులు జోసెఫ్ కుమార్ ,రాజు రవికిషోర్ ,మధు సంతాయ్య. పాల్గొన్నారు
భారత రాజ్యాంగ పితామహుడు డా.బి.ఆర్.అంబేద్కర్ గారి జయంతి
జహీరాబాద్. నేటి ధాత్రి:
జహీరాబాద్ శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు పట్టణం లోని *రహదారి,మున్సిపల్,బాబు మోహన్ కాలనీ,లో గల విగ్రహాలకి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాణిక్ రావు మాట్లాడుతూ భారత రాజ్యాంగ శిల్పిగా,ప్రజాస్వామ్య పరిరక్షకునిగా,సంఘసంస్కర్తగా,విఖ్యాతుడైన అంబేద్కర్ గారికి భారత ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇవ్వడం అభినందనీయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజి మార్కెట్ చైర్మన్ గుండప్ప,మాజి ఆత్మ చైర్మన్ లు విజయ్ కుమార్ , పెంట రెడ్డి,జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ, ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మొగుడంపల్లి మండల పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి ,పాక్స్ చైర్మన్ చైర్మన్ మచెందర్, సీనియర్ నాయకులు నామ రవికిరణ్,మాజి పట్టణ అధ్యక్షులు యాకూబ్,మొహి ఉద్దీన్,ఎస్సీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు బండి మోహన్,యువ నాయకులు మిథున్ రాజ్,మహిళ పట్టణ అధ్యక్షురాలు మంజుల, జాగృతి అధ్యక్షురాలు అనుషమ్మ, బి ఆర్ ఎస్వీ అధ్యక్షులు రాకేష్ ,ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షులు శివప్ప,బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
#డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తి తో యువత ముందుకు సాగాలి.
#మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణలో అంబేద్కర్ విగ్రహానికి . బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, సిపిఎం, పార్టీలతోపాటు దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు . అలాగే వివిధ ప్రభుత్వ కార్యాలయంలో అధికారులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి జయంతి వేడుకలను పురస్కరించుకుని దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు కార్యక్రమంలో మండల తాసిల్దార్ ముప్పు కృష్ణ, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు భానోత్ సారంగపాణి, ఫ్యాక్స్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్ రావు, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఉడుగుల ప్రవీణ్ గౌడ్,కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి, చార్ల శివారెడ్డి, మాలోతు రమేష్, వైనాల అశోక్, బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్, పెరుమాండ్ల కోటి, బచ్చు వెంకన్న, బోట్ల ప్రతాప్,సిపిఎం నాయకులు కడియాల వీరాచారి,, మనోహర్, బొడిగ సమ్మయ్య, దళిత సంఘాల నాయకులు బట్టు సాంబయ్య, బోట్ల నరేష్, పవన్, పరికి కోర్నెల్, రత్నం, జన్ను జయరాజ్, గౌడ సంఘ నాయకులు సట్ల శ్రీనివాస్ గౌడ్, పెరుమాండ్ల రాజ్ కుమార్ గౌడ్, ముత్యాల కుమార్ గౌడ్, గాధ గాని రమేష్ గౌడ్, తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల చేసి ఘన నివాళులర్పించారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.