ఓవైపు చీఫ్ ఆర్కిటెక్ట్.. మ‌రో వైపు కొత్త ఆర్కిటెక్ట…

ఓవైపు చీఫ్ ఆర్కిటెక్ట్.. మ‌రో వైపు కొత్త ఆర్కిటెక్ట

విజయ్ దేవరకొండ నటిస్తున్న పాన్ ఇండియా బిగ్ మూవీ “కింగ్డమ్” ప్రమోషన్స్ జోరుగా ప్రారంభ‌మ‌య్యాయి.

విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda) కథానాయకుడిగా నటించిన ‘కింగ్‌డమ్‌’ (Kingdom)చిత్రం ఈ నెల 31న పాన్‌ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న విషయం తెలిసిందే. రిలీజ్‌కు మ‌రో వారం మాత్రమే స‌మ‌యం ఉండ‌డంతో మేక‌ర్స్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో వేగం పెంచారు.

ఈ నేప‌థ్యంలో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో పాటు ఈ చిత్ర ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి (Gautam Tinnanuri), అర్జున్ రెడ్డి, యానిమ‌ల్ చిత్రాల ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ముగ్గురు కలిసి కింగ్డమ్ బాయ్స్ పేరుతో ఓ స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు.

ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి నా కింగ్డమ్ ను రూపొందించిన చీఫ్ ఆర్కిటెక్ట్ ఒకవైపు, దాన్ని మరింతగా పెంచుతున్న కొత్త ఆర్కిటెక్ట్ మరోవైపు ఉన్నారని విజ‌య్ దేవ‌ర‌కొండ వ్రాసుకొచ్చాడు.

ఇదిలాఉంటే.. ఈ సినిమా ట్రైల‌ర్‌ను రేపు (శ‌నివారం) తిరుప‌తి ప్ర‌త్యేక ఈవెంట్ నిర్వ‌హించి విడుద‌ల చేయ‌నున్నారు. మ‌రోవైపు ఈ చిత్రాన్ని ‘సామ్రాజ్య’ ( Samrajya) పేరుతో హిందీలో విడుదల చేస్తున్నారు.భాగ్యశ్రీ బోర్సే కథానాయిక న‌టించ‌గా స‌త్య‌దేవ్ కీల‌క పాత్ర‌లో క‌నిపంచ‌నున్నాడు. అనిరుధ్ సంగీతం అందించాడు. సితార బ్యాన‌ర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మించారు.

రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులు.

రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులు.

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మండలంలోని చంద్రయ్యపల్లి గ్రామంలో గల గ్రామ పంచాయితీ కార్యదర్శి శ్రావణకుమారి ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులు అర్పించారు.అంబేద్కర్ 135 వ జయంతికి పురస్కరించుకొని గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ పెద్ది శ్రీనివాస్ రెడ్డి,అంగన్వాడి టీచర్ జహీరబేగం,మాజీ ఉప సర్పంచ్ బరిగెల భక్కయ్య,గ్రామస్తులు ఎల్లారెడ్డి, ఉప్పుల ఐలయ్య,రాజు,తదితరులు పాల్గొన్నారు. 

భారత రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులు.

భారత రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళులు.

#డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తి తో యువత ముందుకు సాగాలి.

#మండలంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

 

భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో బస్టాండ్ ఆవరణలో అంబేద్కర్ విగ్రహానికి .
బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, సిపిఎం, పార్టీలతోపాటు దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు . అలాగే వివిధ ప్రభుత్వ కార్యాలయంలో అధికారులు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి జయంతి వేడుకలను పురస్కరించుకుని దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడారు కార్యక్రమంలో మండల తాసిల్దార్ ముప్పు కృష్ణ, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు భానోత్ సారంగపాణి, ఫ్యాక్స్ చైర్మన్ చెట్టుపల్లి మురళీధర్ రావు, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఉడుగుల ప్రవీణ్ గౌడ్,కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చిట్యాల తిరుపతిరెడ్డి, చార్ల శివారెడ్డి, మాలోతు రమేష్, వైనాల అశోక్, బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్, పెరుమాండ్ల కోటి, బచ్చు వెంకన్న, బోట్ల ప్రతాప్,సిపిఎం నాయకులు కడియాల వీరాచారి,, మనోహర్, బొడిగ సమ్మయ్య, దళిత సంఘాల నాయకులు బట్టు సాంబయ్య, బోట్ల నరేష్, పవన్, పరికి కోర్నెల్, రత్నం, జన్ను జయరాజ్, గౌడ సంఘ నాయకులు సట్ల శ్రీనివాస్ గౌడ్, పెరుమాండ్ల రాజ్ కుమార్ గౌడ్, ముత్యాల కుమార్ గౌడ్, గాధ గాని రమేష్ గౌడ్, తదితరులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల చేసి ఘన నివాళులర్పించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version