నాగూర్లపల్లిలో ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు-చలివేంద్రం ప్రారంభం…

నాగూర్లపల్లిలో ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు-చలివేంద్రం ప్రారంభం

నర్సంపేట, నేటిధాత్రి:

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డు నాగూర్లపల్లిలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ యువజన సంఘం అధ్యక్షుడు తనుగుల దేవేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి 16వ వార్డు కౌన్సిలర్ బానోత్ నవీన్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.అనంతరం అంబేడ్కర్ సెంటర్ వద్ద సాదుల శ్రీనివాస్ (శీను) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కౌన్సిలర్ ప్రారంభించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని బాటసారుల కోసం ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మాచిక నర్సయ్య, మాజీ ఉపసర్పంచ్ తనుగుల రవీందర్, బుర్రి సాగర్, బూరి ఆంజనేయులు, కటస్వామి, ఎలందుల భాస్కర్, తనుగుల రాజు, బుర్రి సునీల్, గుర్రం రవి, జవాజి చంద్రమౌళి, సాదుల ముత్తిలింగం, కరుణాకర్, తనుగుల శ్రీకాంత్, సుధాకర్, తనుగుల అంజి, శివకోటి, బాబు, కొండం జ్యోతి, భాగ్య, అంబేడ్కర్ యువజన సంఘం నాయకులు, గ్రామ పెద్దలు మరియు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

నాగూర్లపల్లిలో అల్ప విద్యుత్ ఒత్తిడి సమస్యకు చెక్….

నాగూర్లపల్లిలో అల్ప విద్యుత్ ఒత్తిడి సమస్యకు చెక్

25 కేవీఏ నూతన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ప్రారంభించిన కౌన్సిలర్

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డు నాగూర్లపల్లిలో నివాసితులు ఎదుర్కొంటున్న అల్ప విద్యుత్ ఒత్తిడి సమస్యకు పరిష్కారం లభించింది. స్థానిక తపాలా కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన 25 కేవీఏ సామర్థ్యం గల నూతన విద్యుత్ మార్పిడి యంత్రాన్ని కౌన్సిలర్ బానోత్ నవీన్ నాయక్ శుక్రవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ బానోత్ నవీన్ నాయక్ మాట్లాడుతూ, వార్డులో విద్యుత్ వినియోగం పెరగడంతో పాత లైన్లపై భారం పెరిగి తరచూ అల్ప విద్యుత్ ఒత్తిడి సమస్య తలెత్తుతోందని తెలిపారు. ఈ సమస్యను అధిగమించేందుకు 25 కేవీఏ మార్పిడి యంత్రాన్ని ఏర్పాటు చేయించినట్లు చెప్పారు. దీనివల్ల పరిసర ప్రాంతాల గృహాలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జూనియర్ లైన్‌మన్ ప్రశాంత్ పాల్గొని విద్యుత్ సరఫరా వ్యవస్థను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో తపాలా పంపిణీదారు పవన్, స్థానిక నాయకులు రాధారపు శ్రీనివాస్, ముప్పారపు గణేష్, తనుగుల బాబు, బండ్ల వెంకటేశ్వర్లు, స్థానిక మహిళలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version