మురికి కాలువలశుభ్రం చేయించిన సర్పంచ్. చాట్ల విజయ రవీందర్.
మొగుళ్లపల్లి నేటి ధాత్రి.
భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని సర్పంచ్ గ్రామంలో రెండు సంవత్సరాల నుంచి పేరుకుపోయిన మురికి కాలువలో చెత్త పేరుకుపోవడం వర్షాల పట్ల దోమలు వ్యాప్తి చెంది గ్రామ ప్రజలు ఇబ్బంది పడడం ప్రజల ఆరోగ్యం పరిశుభ్రత కోసం సర్పంచి చొరవ తీసుకొని చెత్తను మట్టిని తొలగింపు చేశారు గత రెండు మూడు రోజుల్లో గ్రామ సర్పంచ్ చాట్ల రవీందర్ విజయ కార్మికులను ఏర్పాటు చేసి గ్రామంలో మురికి కాలువలను శుభ్రం చేయించి గ్రామ వీధుల్లో మురికి నీరు నిలవకుండా ప్రధాన కాలువలో పేర్కొన్న చెత్త చెదారాన్ని కార్మికులతో శుభ్రం చేయించారు దోమల నివారణ గురించి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఊరు మొత్తం స్ప్రే చేయించారు గ్రామ ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని గ్రామంలో వీధి దీపాలు తాగునీటి సరఫరా మురికి కాలువలు శుభ్రం చేయించడం ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడడం గ్రామ సర్పంచ్ గా నా బాధ్యత అని తెలిపారు ఆయన వెంట వార్డు సభ్యులు ఏలేటి మధుకర్ రెడ్డి గుడిమల్ల జయసుధ రమేష్ చెక్క నరేష్ చెక్క వెంకటేష్ పాల్గొన్నారు
