నాగూర్లపల్లిలో ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు-చలివేంద్రం ప్రారంభం
నర్సంపేట, నేటిధాత్రి:
నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డు నాగూర్లపల్లిలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ యువజన సంఘం అధ్యక్షుడు తనుగుల దేవేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి 16వ వార్డు కౌన్సిలర్ బానోత్ నవీన్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.అనంతరం అంబేడ్కర్ సెంటర్ వద్ద సాదుల శ్రీనివాస్ (శీను) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కౌన్సిలర్ ప్రారంభించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని బాటసారుల కోసం ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మాచిక నర్సయ్య, మాజీ ఉపసర్పంచ్ తనుగుల రవీందర్, బుర్రి సాగర్, బూరి ఆంజనేయులు, కటస్వామి, ఎలందుల భాస్కర్, తనుగుల రాజు, బుర్రి సునీల్, గుర్రం రవి, జవాజి చంద్రమౌళి, సాదుల ముత్తిలింగం, కరుణాకర్, తనుగుల శ్రీకాంత్, సుధాకర్, తనుగుల అంజి, శివకోటి, బాబు, కొండం జ్యోతి, భాగ్య, అంబేడ్కర్ యువజన సంఘం నాయకులు, గ్రామ పెద్దలు మరియు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
