భవాని మాతను దర్శించుకున్న నాయకులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ దుర్గాభవాని మాత అమ్మవారిని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హనుమంతరావు పటేల్ దర్శించుకున్నారు. ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆయనతోపాటు శ్రీ కేతకి సంగమేశ్వర దేవస్థాన చైర్మన్ శేఖర్ పటేల్ ఎంపీడీవో మంజుల ఏపీవో రాజ్ కుమార్ గ్రామ కార్యదర్శి వీరన్న పటేల్ ఫీల్డ్ అసిస్టెంట్ నర్సింలు మోహన్ సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.