అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలి…

అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలి.

చిట్యాల, నేటిదాత్రి :

చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు జన్నే యుగేందర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశాని రాష్ట్ర ప్రచార కార్యదర్శి పుల్ల మల్లయ్య విచ్చేసి మాట్లాడుతూ అంబేద్కర్ 69 వ వర్ధంతి కార్యక్రమమును ఘనంగా నిర్వహించాలని.అన్నారు,. గ్రామాలలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తూ అంబేద్కర్ భావజారాన్ని ప్రజలకు తెలియ పరచాలని , మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే వర్ధంతి కార్యక్రమంలో అందరూ హాజరు కావాలని మహానీయుడు కన్న కలలను నిజం చేయాలని భారత రాజ్యాంగ రచయిత ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరివాడని , అందుకు కుల మతాలకు వివిధ రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలు అంబేద్కర్ వాదులు మేధావులు ఉద్యోగులు శ్రేయోభిలాషులు ప్రతి ఒక్కరూ ఈనెల 6న అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనాలన్నారు.
ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం మండల ప్రచార కార్యదర్శి కట్కూరి రాజు మండల నాయకులు గురుకుంట్ల కిరణ్ శ్రీలపాక ప్రణీత్ గడ్డం సదానందం కట్కూరి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు

భవాని మాతను దర్శించుకున్న నాయకులు…

భవాని మాతను దర్శించుకున్న నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండల శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శ్రీ దుర్గాభవాని మాత అమ్మవారిని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు హనుమంతరావు పటేల్ దర్శించుకున్నారు. ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆయనతోపాటు శ్రీ కేతకి సంగమేశ్వర దేవస్థాన చైర్మన్ శేఖర్ పటేల్ ఎంపీడీవో మంజుల ఏపీవో రాజ్ కుమార్ గ్రామ కార్యదర్శి వీరన్న పటేల్ ఫీల్డ్ అసిస్టెంట్ నర్సింలు మోహన్ సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

వనపర్తిలో ఇండోరా స్టేడియంలో పనులను తనిఖీ చేసిన కలెక్టర్…

వనపర్తిలో ఇండోరా స్టేడియంలో పనులను తనిఖీ చేసిన కలెక్టర్
వనపర్తి నేటిదాత్రి .

 

 

వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రజల ఆరోగ్యం కోసం అందుబాటులోకి రానున్న ఇండోర్ స్టేడియాన్ని ప్రజలు సద్వినియోగించుకునేలా అన్ని రకాల సదుపాయాలను కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు సమర్థవంతంగా స్టేడియాన్ని ఉపయోగించుకునేలా అన్ని సదుపాయాలను కల్పించాలని కోరారు క్రీడాకారుల సౌకర్యార్థం సరైన మెయింటెనెన్స్, సీటింగ్, లైటింగ్‌తో పాటు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించేందుకు ఇంజినీరింగ్, క్రీడా శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. వీలైనంత త్వరగా అన్ని అవసరమైన సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చి ప్రారంభానికి సిద్ధం చేస్తామని అధికారులు బదులిచ్చారు.
పంచాయతీరాజ్ కార్యనిర్వాహక ఇంజనీర్ మల్లయ్య, అధికారులు కలెక్టర్ వెంట ఉన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version