ఘనంగా ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి వేడుకలు…

ఘనంగా ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి వేడుకలు :

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

శ్రీ శ్రీ ఛత్రపతి శివాజీ మహరాజ్ యువజన సభ్యులకు శివాజీ విగ్రహ ప్రతిష్టాపనకి కాళీ స్థలాన్ని ఇవ్వాలని కోరిన ఛత్రపతి శివాజీ మహరాజ్ యువజన సభ్యుల కోరికమేరకు గ్రామ సర్పంచ్ చింతలగట్టు శివరాజ్ గ్రామకంఠంలోని కొంత కాళీ స్థలాన్ని కొల్లూరు గ్రామ పంచాయతీ అధ్వర్యం లో ఇవ్వడం జరిగింది…ఈ రోజు శివాజీ మహరాజ్ జయంతి సందర్బంగా కాళీ స్థలంలో శివాజీ మహారాజ్ జెండాను ఎగురవేసి పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు…ఈ కార్యక్రమములో మాజీ ఎంపీటీసీ రాజ్‌కుమార్, గ్రామ సర్పంచ్ చింతలగట్టు శివరాజ్, మాజీ వార్డు సభ్యులు ఎం విష్ణు గ్రామ పెద్దలు మంగలి మొగులయ్య, చింతలగట్టు మొగులయ్య, డప్పూరు రాములు, డప్పూరు బీరప్ప మరియు శివాజీ మహారాజ్ యువజన సంఘ అధ్యక్షులు మరియూ నాయకులు,సభ్యులు యువకులు పాల్గొని శివాజీయహరాజ్ విగ్రహానికి పూలమాల వేసి పూజ చేసి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

సిడిసిఏ కార్యదర్శి సతీష్ యాదవ్ కు ఘన సన్మానం…

సిడిసిఏ కార్యదర్శి సతీష్ యాదవ్ కు ఘన సన్మానం…

తిరుపతి, నేటిధాత్రి:

చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ (సిడిసిఏ) కార్యదర్శి సతీష్ యాదవ్ ను తిరుపతి యాదవ నాయకులు ఘనంగా సన్మానించారు. శ్రీమాన్ సన్నిధి శరభయ్య యాదవ్ విగ్రహ స్థాపన సమావేశంకు సతీష్ యాదవ్ ను గౌరవంగా ఆహ్వానించారుఈ సందర్భంగా తిరుపతి యాదవ నాయకులు, బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్, పలువురు యాదవ నాయకులతో కలిసి సిడిసిఏ కార్యదర్శి సతీష్ యాదవ్ కు పుష్పగుచ్చం అందజేసి దుశ్యాలతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ప్రతిష్ట భూమి పూజ…

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ప్రతిష్ట భూమి పూజ

నేటిధాత్రి, వరంగల్

హన్మకొండ హంటర్ రోడ్డులోని గౌడ హాస్టల్ ముందు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ప్రతిష్ట భూమి పూజ కార్యక్రమం సోమవారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా వరంగల్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు తీగల జీవన్ గౌడ్ మాట్లాడుతూ భరత మాత ముద్దుబిడ్డ తొలి తెలుగు చక్రవర్తి శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చరిత్ర ప్రపంచ ప్రసిద్ధిగాంచిందన్నారు. తెలాంగాణకె తిరుగుబాటు నేర్పిన యోధుడు సర్వాయి పాపన్న గౌడ్ అని పేర్కొన్నారు. గౌడ జాతి గర్వకారకుడైన తెలంగాణా బహుజన యోధుడు సర్వాయి పాపన్న గౌడ్ స్ఫూర్తితో గౌడ కులస్తులందరు రాజకీయలకు అతీతంగా ఐక్యంగా ఉండి ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలని పిలిపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గోపా పౌండర్ అధ్యక్షులు పెరుమాండ్ల మధుసూదన్ గౌడ్, డా. బైరి లక్ష్మి నారాయణ గౌడ్, పులి శ్రీనివాస్ గౌడ్, చిర్ర రాజు గౌడ్, విగ్రహ ప్రతిష్టాపన కమిటీ సభ్యులు జనగాం శ్రీనివాస్ గౌడ్, జూలూరి రంజిత్ గౌడ్, బండారి జనార్ధన్ గౌడ్, అనంతుల రమేష్ గౌడ్, మార్క రవి గౌడ్, మాచర్ల శరత్ గౌడ్, కునురీ రంజిత్ గౌడ్,గట్టు నరేష్ గౌడ్, గోపగాని వెంకటేశ్వర్లు గౌడ్, కార్పొరేటర్ పోశాల పద్మ స్వామి గౌడ్, ఏసీపి. కె. నాగయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version