భారత్ చేతిలో పాక్ చిత్తు.. మ్యాచ్ పూర్తికాక ముందే స్టేడియం నుంచి వెళ్లిపోయిన పీసీబీ చీఫ్….

భారత్ చేతిలో పాక్ చిత్తు.. మ్యాచ్ పూర్తికాక ముందే స్టేడియం నుంచి వెళ్లిపోయిన పీసీబీ చీఫ్..

 

ఎన్నో అంచనాల మధ్య ఆదివారం జరిగిన భారత్, పాకిస్థాన్ హై వోల్టేజ్ టీ-20 మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా చేతిలో పాక్ ఘోర పరాజయం చవిచూసింది.

ఎన్నో అంచనాల మధ్య ఆదివారం జరిగిన భారత్, పాకిస్థాన్ హై వోల్టేజ్ టీ-20 మ్యాచ్ ఏకపక్షంగా ముగిసింది. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా చేతిలో పాక్ ఘోర పరాజయం చవిచూసింది. భారత్ నిర్దేశించిన 176 పరుaమదాస స్టేడియంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది (India vs Pakistan T20 World Cup).
ఈ మ్యాచ్ చూసేందుకు కొలంబోలోని ప్రేమదాస స్టేడియంకు పాకిస్థాన్ మంత్రి, ఆ దేశ క్రికెట్ బోర్డ్ అధ్యక్షుడు మొహ్సిన్ నఖ్వీ హాజరయ్యారు. గ్యాలరీ నుంచి చాలా సేపు మ్యాచ్ వీక్షించారు. అయితే ఛేజింగ్‌లో పాక్ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోవడంతో నిరాశకు లోనయ్యారు. పాక్ పరాజయం తప్పదని తెలియడంతో మ్యాచ్ పూర్తి కాకముందే స్టేడియం నుంచి బయటకు వెళ్లిపోయారు. భారత్‌తో మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని ముందుగా ప్రతిపాదించింది నఖ్వీ అనే సంగతి తెలిసిందే (Mohsin Naqvi stadium exit).

భారత్‌ను పాక్ ఓడిస్తుందని కలలో కూడా ఊహించలేం….

భారత్‌ను పాక్ ఓడిస్తుందని కలలో కూడా ఊహించలేం.. అతడు అనర్హుడు: షోయబ్ అక్తర్

 

మరోసారి భారత్ చేతిలో ఓడిపోవడంతో పాకిస్థాన్ జట్టుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం కొలంబో వేదికగా జరిగిన టీ-20 ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోయింది. కనీస పోటీ కూడా ఇవ్వకుండా చేతులెత్తేసింది. దీంతో మాజీ క్రికెటర్లు, అభిమానులు ఆ జట్టుపై దుమ్మెత్తి పోస్తున్నారు.

మరోసారి భారత్ చేతిలో ఓడిపోవడంతో పాకిస్థాన్ జట్టుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం కొలంబో వేదికగా జరిగిన టీ-20 ప్రపంచకప్ మ్యాచ్‌లో భారత్ చేతిలో పాకిస్థాన్ చిత్తుగా ఓడిపోయింది. కనీస పోటీ కూడా ఇవ్వకుండా చేతులెత్తేసింది. దీంతో మాజీ క్రికెటర్లు, అభిమానులు ఆ జట్టుపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఆ జట్టు మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీపై విమర్శలు చేశాడు (Akhtar on Pakistan loss).
‘మేము మ్యాచ్‌లో ఏ దశలోనూ పోటీలో లేము. షాహీన్ 125 కి.మీ./గం. వేగంతో బౌలింగ్ చేస్తున్నాడు. ఇంత వేగం ఆధునిక క్రికెట్‌కు అవసరం లేదు. వీరు ఒత్తిడిని తట్టుకునే ప్రతిభావంతులు కాదు. మ్యాచ్ జరిగిన తీరు చూస్తే ఏ దశలోనూ భారత్‌ను పాక్ ఓడిస్తుందని కలలో కూడా ఊహించలేము. గత 15-20 సంవత్సరాలుగా క్రికెట్‌పై మేం నిజాయితీగా పెట్టుబడి పెట్టలేదు. ప్రతిభావంతులకు అవకాశాలు కల్పించలేదు’ అని అక్తర్ పేర్కొన్నాడు 

భారత్, పాక్ మ్యాచ్: వర్షం పడాలని కోరుకున్న పాక్ మాజీ ప్లేయర్..

భారత్, పాక్ మ్యాచ్: వర్షం పడాలని కోరుకున్న పాక్ మాజీ ప్లేయర్

 

 

పొట్టి ప్రపంచ కప్2026లో భాగంగా చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ మధ్య ఇవాళ (ఫిబ్రవరి 15) మ్యాచ్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో వర్షం పడే అవకాశం ఉండటంతో.. వాన పడకూదని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. ఇదే సమయంలో వాన పడాలని దేవుడిని ప్రార్థిస్తున్నానంటూ పాక్ మాజీ క్రికెటర్ విచిత్ర వ్యాఖ్యలు చేశాడు.

స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్(World Cup 2026)లో ఇప్పటికే అనేక సంచలనాలు చోటుచేసుకున్నాయి. ఐర్లాండ్, అమెరికా, స్కాట్లాండ్, జింబాబ్వే వంటి పలు జట్లు పెద్ద జట్లకు గట్టి పోటీ ఇస్తున్నాయి. అంతేకాక ఇంగ్లాండ్, పాకిస్థాన్ వంటి జట్లను ఓడించినంత పని చేశాయి. జింబాబ్వే అయితే ఏకంగా ఆస్ట్రేలియా లాంటి టాప్ జట్టును ఓడించి.. ఈ టోర్నీలో పెను సంచలనం సృష్టించింది. ఇలా సాగుతున్న పొట్టి ప్రపంచ కప్2026లో క్రికెట్ ప్రేమికులు ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ మధ్య ఆదివారం (ఫిబ్రవరి 15) మ్యాచ్‌ జరుగనుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా.. వరుణుడు అభిమానులను భయపెడుతున్నాడు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version