భారత్-న్యూజిలాండ్ ఆఖరి టీ20.. టీమిండియా తుది జట్టులో కీలక మార్పులు..

భారత్-న్యూజిలాండ్ ఆఖరి టీ20.. టీమిండియా తుది జట్టులో కీలక మార్పులు!

 

 

 

భారత్-న్యూజిలాండ్ జట్లు శనివారం తిరువనంతపురం వేదికగా ఆఖరి టీ20లో తలపడనున్నాయి. ఈ ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 3-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఆఖరి పోరులో గెలిచి.. రానున్న టీ20 ప్రపంచ కప్ 2026ను ఘనంగా ప్రారంభించాలని టీమిండియా భావిస్తోంది.

ఇంటర్నెట్ డెస్క్: భారత్-న్యూజిలాండ్ జట్లు శనివారం తిరువనంతపురం వేదికగా ఆఖరి టీ20లో తలపడనున్నాయి. ఈ ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 3-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. విశాఖపట్నం వేదికగా జరిగిన నాలుగో టీ20లో కివీస్ జట్టు 50 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే నామమాత్రపు ఈ ఐదో టీ20లో భారత్ గెలిచి.. విజయంతో సిరీస్‌ను ముగించాలని చూస్తోంది. రానున్న టీ20 ప్రపంచ కప్ 2026( T20 World Cup 2026)ను ఘనంగా ప్రారంభించాలని భావిస్తోంది. కాగా ఫిబ్రవరి 7 నుంచి వరల్డ్ కప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
అయితే నేడు జరిగే ఐదో టీ20లో భారత జట్టులో పలు మార్పులు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వరుసగా నాలుగు మ్యాచుల్లోనూ విఫలమైన సంజు శాంసన్‌కు మరో అవకాశం దక్కనుంది. ఇందులోనైనా ఫామ్ అందుకుని సంజు తనను తాను నిరూపించుకోవడానికి ఓ చక్కటి అవకాశం. నాలుగో మ్యాచులో విశ్రాంతి తీసుకున్న ఇషాన్ కిషన్.. ఐదో టీ20లో బరిలోకి దిగే అవకాశం ఉంది. తొలి టీ20లో చేతి వేలికి గాయం అవ్వడం వల్ల ఆటకు దూరమైన అక్షర్ పటేల్.. ఈ మ్యాచులో ఆడే సూచనలు కనిపిస్తున్నాయి. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తుది జట్టులో చోటు సంపాదించుకునే ఛాన్స్ ఉంది. తొలి నాలుగు టీ20ల్లో ఆడిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు ఐదో టీ20లో విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది.

 సంజూ నాకు పెద్దన్నలాంటోడు.. జితేశ్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు..

 సంజూ నాకు పెద్దన్నలాంటోడు.. జితేశ్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు

 

టీ20 ప్రపంచ కప్ 2026 దగ్గర పడుతున్న సమయంలో టీమిండియా సన్నాహక పోరు ప్రారంభించింది. తుది జట్టులో వికెట్ కీపింగ్ స్థానం కోసం సంజూ శాంసన్, జితేశ్ శర్మ పోటీ పడుతున్నారు. సౌతాఫ్రికాతో తొలి టీ20 గెలిచిన తర్వాత సంజూపై జితేశ్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

టీ20 ప్రపంచ కప్ 2026కి సంబంధించి ఇప్పటికే సన్నాహక మ్యాచులు ప్రారంభమయ్యాయి. సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా 101 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే జట్టులో వికెట్ కీపర్ స్థానం కోసం సంజూ శాంసన్, జితేశ్ శర్మ మధ్య తీవ్రమైన పోటీ నడుస్తుంది. ఈ క్రమంలో తొలి టీ20లో సెలక్టర్లు జితేశ్ వైపే మొగ్గు చూపడంతో.. సంజూ తుది జట్టులో స్థానం పొందలేకపోయాడు. ఈ మ్యాచులో జితేశ్ శర్మ(Jitesh Sharma) అద్భుతమైన కీపింగ్ చేశాడు. ఏకంగా నాలుగు క్యాచులు అందుకుని జట్టులో విజయంలో కీలక పాత్ర పోషించాడు. అటు బ్యాట్‌తోనూ 10 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
ఈ మ్యాచ్ అనంతరం జితేశ్ శర్మ.. తనకు, సంజూ శాంసన్‌కు మధ్య ఉన్న అనుబంధాన్ని గురించి మాట్లాడాడు. ‘అతడు జట్టులో ఉన్నందుకు ఆనందంగా ఉంది. నిజం చెప్పాలంటే సంజూ నాకు పెద్దన్న లాంటోడు. మా మధ్య పోటీ ఉన్న మాట వాస్తవం.. కానీ అప్పుడే మనలో దాగున్న ప్రతిభ బయటకు వస్తుంది. ఇది జట్టుకు కూడా ఎంతో మంచిది. సంజూ అద్భుతమైన ఆటగాడు. మేమిద్దరం టీమిండియా తరఫున ఆడుతున్నాం. మేం సోదరుల్లాంటివారం. అతడు నాకు చాలా సాయం చేశాడు’ అని జితేశ్ శర్మ అన్నాడు.

ఆసియా కప్ 2025: ఓపెనర్‌గా గిల్, సందేహంలో శాంసన్ స్థానం..

ఆసియా కప్ 2025 భారత జట్టు ఎంపికపై చర్చలు ఊపందుకున్నాయి.
సంజు శాంసన్ ఇటీవల తన 12 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో మూడు సెంచరీలు చేసినప్పటికీ, ఓపెనర్‌గా శుభ్‌మన్ గిల్‌కు అవకాశమివ్వాలనే ఆలోచన జట్టులో చర్చనీయాంశమైంది.

ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో గిల్ ప్రదర్శన టీ20 జట్టులో అతని స్థానం కోసం డిమాండ్ పెంచింది. దీంతో శాంసన్ మిడిల్ ఆర్డర్‌కు నెట్టబడే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా మాట్లాడుతూ – “గిల్ ఆడితే, ఎవరిని జట్టులోంచి తొలగిస్తారు? శాంసన్ అయితే, వికెట్ కీపింగ్ ఎవరు చేస్తారు? మిడిల్ ఆర్డర్‌లో ఇప్పటికే సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఉన్నారు. శాంసన్ నంబర్ 5లో ఆడతాడా?” అని ప్రశ్నించారు.

అభిషేక్ శర్మ కూడా ఓపెనర్‌గా బలమైన ప్రత్యామ్నాయమని ఆయన సూచించారు. ఇంగ్లాండ్‌పై 279 పరుగులు 219.68 స్ట్రైక్ రేట్‌తో సాధించిన అభిషేక్, ఈసారి జట్టులో చోటు దక్కించుకోవచ్చని అంచనా.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version