డబ్ల్యూసీ 2026 వేళ.. పాకిస్థాన్‌కు ఘోర అవమానం..

డబ్ల్యూసీ 2026 వేళ.. పాకిస్థాన్‌కు ఘోర అవమానం..

 

దేశాలతో ఆల్‌ఫార్మాట్ సిరీస్‌లు ఆడుతోంది. తాజాగా ఆస్ట్రేలియా.. పాకిస్థాన్‌ పర్యటనలో ఉంది. ఈ క్రమంలో పాక్‌కు ఘోర అవమానం జరిగింది..

స్పోర్ట్స్ డెస్క్: మరికొద్ది రోజుల్లో టీ20 ప్రపంచ కప్-2026 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మెగా టోర్నీలో పాల్గొనే అన్ని జట్లు సన్నాహక మ్యాచులతో బిజీగా ఉన్నాయి. అలానే గత కొంతకాలంగా మన పొరుగు దేశం పాకిస్థాన్ కూడా వివిధ దేశాలతో ఆల్‌ఫార్మాట్ సిరీస్‌లు ఆడుతోంది. తాజాగా ఆస్ట్రేలియా.. పాకిస్థాన్‌ పర్యటనలో ఉంది. ఈ క్రమంలో పాక్‌కు ఘోర అవమానం జరిగింది. మరి.. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం…

ఇదే సమయంలో పాక్‌తో తొలి టీ20 సందర్భంగా ఆస్ట్రేలియా ఏకంగా ముగ్గురు ఆటగాళ్లను అరంగేట్రం చేయించింది. మహ్లి బియర్డ్‌మాన్‌, జాక్‌ ఎడ్వర్డ్స్‌లకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తొలిసారి క్యాపులు అందించింది. అలానే మ్యాట్‌ రెన్షాకు తొలి టీ20 అవకాశం ఇచ్చింది. అయితే, అంతకుముందు మిగిలిన SENA (సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియా) దేశాల జట్లు కూడా తమ కీలక ఆటగాళ్లను కాకుండా.. మెజారిటీ భాగం ద్వితీయ శ్రేణి జట్లతోనే పాక్‌లో పర్యటించాయి.

ఘోర అవమానం ఏంటంటే..

ఇలా టాప్ దేశాలు తమ ద్వితీయ శ్రేణి జట్టును బరిలో దింపడంతో పాకిస్థాన్ క్రికెట్‌ స్థాయి దిగజారిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.. పాక్‌ను తేలికగా తీసుకుంటున్నందునే ఈ మేటి జట్లు తమ కీలక ఆటగాళ్లు లేకుండానే బరిలోకి దిగుతున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పాక్‌ క్రికెట్‌ విశ్లేషకుడైన ఒమైర్‌ అలవి ఇవే మాటలు అన్నాడు. ఆస్ట్రేలియా కొంతమంది ప్రధాన ఆటగాళ్లు లేకుండానే పాకిస్థాన్ వచ్చిందని, అదే విధంగా.. తొలి టీ20లో వారి అత్యుత్తమ ప్లేయర్లను ఆడించనేలేదని అన్నాడు. ఇది పాకిస్థాన్ క్రికెట్‌ అభిమానులకు ఘోర అవమానమని ఒమైర్‌ విచారం వ్యక్తం చేశాడు. న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా దేశాలు తమ వీకెండ్‌ జట్లతో పాకిస్థాన్‌కు వచ్చాయని, ఏదో సిరీస్‌ ఆడాలి కాబట్టి మొక్కుబడిగా ఈ పని చేస్తున్నాయని అనిపిస్తోందని పాక్‌ మాజీ కెప్టెన్‌ మొయిన్‌ ఖాన్‌ అన్నాడు.

తొలి టెస్టు గెలుపు.. ఆస్ట్రేలియా క్రికెట్‌కు భారీ నష్టం..

తొలి టెస్టు గెలుపు.. ఆస్ట్రేలియా క్రికెట్‌కు భారీ నష్టం

 

యాషెస్ 2025 సిరీస్ లో భాగంగా తొలి టెస్టులో ఆస్ట్రేలియా గెలిచింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుకు భారీ నష్టం వచ్చిందట. రెండు రోజుల్లోనే ఆట ముగియడంతో ఈ నష్టం వాటిల్లింది.

 యాషెస్ 2025 సిరీస్‌లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ పై 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ట్రావిస్ హెడ్(Travis Head) విధ్వంసకరమైన బ్యాటింగ్ తో మ్యాచ్ రెండో రోజే ముగిసింది. దీంతో ఐదు మ్యాచుల యాషెస్ సిరీస్ లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించడం సంతోషమే అయితే.. మరోవైపు ఆసీస్ బోర్డుకు మాత్రం భారీ నష్టాన్ని తీసుకొచ్చింది.

పెర్త్‌ వేదికగా జరిగిన తొలి టెస్టు రెండు రోజుల్లోనే ముగియడంతో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు(financial loss Cricket Board)కు ఆదాయ పరంగా భారీ నష్టాన్ని చూసింది. గార్డియన్‌లోని ఒక నివేదిక ప్రకారం.. రెండు రోజుల్లో ఆడ ముగియడంతో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు 3 మిలియన్ల ఆస్ట్రేలియన్ డాలర్లు నష్టాన్ని చవిచూస్తోంది. పెర్త్ టెస్టులో మొదటి రెండు రోజుల్లో రికార్డు స్థాయిలో 101,514 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. తొలి రోజు(శుక్రవారం) 51,531 మంది, రెండో రోజు(శనివారం) 49,983 మంది హాజరయ్యారు. 3, 4వ రోజుల్లో కూడా ఇదే విధంగా ఉంటుందని క్రికెట్ ఆస్ట్రేలియా అంచనా వేసింది. కానీ బౌలింగ్ లో మిచెల్ స్టార్క్, బ్యాటింగ్ లో ట్రావిస్ హెడ్ ఆట ముందుగానే ముగిసేలా చూశారు. దీంతో ఆదివారం, సోమవారం మ్యాచ్ చూసేందుకు టికెట్ బుక్ చేసుకున్న వారికి నిరాశే ఎదురైంది.శనివారం మ్యాచ్ ముగిసిన అనంతరం సెవెన్ నెట్‌వర్క్‌తో ట్రావిస్ హెడ్(Travis Head) మాట్లాడుతూ.. ప్రేక్షకులకు క్షమాపణలు తెలిపాడు. ఆదివారం టికెట్ బుక్ చేసుకున్న ప్రేక్షకులు తనను క్షమించాలని కోరాడు. మరోవైపు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు రీఫండ్ పాలసీ ప్రకారం.. మిగిలిన మూడు రోజులకు టిక్కెట్లను ఇప్పటికే బుక్ చేసుకున్న వారి వారి డబ్బులుకి తిరిగి చెల్లించనుంది. ఈ విధంగా రెండు రోజుల్లోనే ఆట ముగియడంతో, మూడు రోజుల ఆటకు సంబంధించిన భారీ రెవెన్యూను ఆస్ట్రేలియా బోర్డు(Cricket Australia) కోల్పోయింది. ఈ విధంగా మ్యాచ్ గెలిచిన ఆస్ట్రేలియా.. ఆర్ధికంగా మాత్రం భారీ నష్టం చేకూరిందని నిపుణులు చెబుతున్నారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version