ఆ సమయంలో మా డ్రెస్సింగ్ రూం నిరాశతో నిండిపోయింది: పాక్ హెడ్ కోచ్…

ఆ సమయంలో మా డ్రెస్సింగ్ రూం నిరాశతో నిండిపోయింది: పాక్ హెడ్ కోచ్

 

టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఆదివారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ ఓటమి తర్వాత పాకిస్థాన్ డ్రెస్సింగ్ రూం పరిస్థితిపై ఆ జట్టు హెడ్ కోచ్ మైక్ హెస్సెన్ స్పందించాడు.

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ 2026లో భాగంగా ఆదివారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘోర పరాజయం పాలైంది. భాతర బౌలర్ల ధాటికి పాక్ బ్యాటర్లు పెవిలియన్‌ బాట పట్టారు. 176 పరుగుల లక్ష్య ఛేదనలో 114 పరుగులకే కుప్పకూలారు. దీంతో భారత్ 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమి తర్వాత పాకిస్థాన్ డ్రెస్సింగ్ రూం పరిస్థితిపై ఆ జట్టు హెడ్ కోచ్ మైక్ హెస్సెన్ స్పందించాడు.
‘భారత్‌తో కీలకమైన మ్యాచ్‌లో మేం ఓడిపోయాం. ఆ సమయంలో పాక్ డ్రెస్సింగ్ రూం నిరాశ నిస్పృహలతో నిండిపోయింది. ఈ మ్యాచ్ ఎంత కీలకమో.. భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కున్న ప్రాధాన్యం ఏంటో మాకు తెలుసు. ఈ మ్యాచ్‌కు ముందు వరకు మేం ఇతర జట్లతో ఐదు మ్యాచ్‌లు గెలిచాం. అదే ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాం. కానీ భారత్‌తో మ్యాచ్‌లో ఓడిపోయాం. భారత ఓపెనర్ ఇషాన్ కిషన్ అద్భుతంగా ఆడాడు. బంతి అనూహ్యంగా తిరిగింది. మేం సరిగానే ప్రారంభించాం. కానీ ఇషాన్ కిషన్ మా నుంచి మ్యాచ్‌ను దూరంగా తీసుకెళ్లిపోయాడు. మేం తిరిగి పుంజుకుంటాం. మేం ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో మంచి క్రికెట్ ఆడాం. ఈ టోర్నమెంట్‌లో రాణిస్తామనే ఆత్మవిశ్వాసం మాకుంది’ అని పాక్ హెడ్ కోచ్ మైక్ హెస్సెన్ పేర్కొన్నాడు.

టీ20 ప్రపంచ కప్ 2026: చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్…

టీ20 ప్రపంచ కప్ 2026: చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్

 

పొట్టి ప్రపంచ కప్ 2026లో భాగంగా పాకిస్థాన్‌పై భారత్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది. ఇషాన్ కిషన్(77) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో ఇషాన్ ఓ సరికొత్త చరిత్రను సృష్టించాడు.

ఇంటర్నెట్ డెస్క్: పొట్టి ప్రపంచ కప్ 2026లో భాగంగా పాకిస్థాన్‌పై భారత్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది. ఆదివారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్ ఇషాన్ కిషన్ అద్భుత ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 40 బంతుల్లోనే 77 పరుగులు చేసి పాక్ బౌలర్లను వణికించాడు. ఈ నేపథ్యంలో ఇషాన్ ఓ సరికొత్త చరిత్రను సృష్టించాడు.

ఇషాన్ కిషన్ సంచలన ఇన్నింగ్స్‌కు గానూ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. దీంతో టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తొలి భారత వికెట్ ‌కీపర్ బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 114 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థి పాక్‌ను పూర్తిగా కట్టడి చేశారు. ఈ విజయంతో భారత్ సూపర్ 8 దశకు అర్హత సాధించింది.

నమ్మకం ఉంది..

మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్‌పై ఇషాన్ కిషన్ మాట్లాడాడు. ‘వికెట్ అంత సులభంగా లేదు. కానీ నా బలాల మీద నమ్మకం పెట్టుకున్నాను. ఆఫ్‌సైడ్ ఆటపై ఎక్కువగా శ్రమించాను. పెద్ద గ్రౌండ్ కావడంతో గ్యాప్‌లను ఉపయోగించుకునే ప్రయత్నం చేశాను. 160-170 స్కోరు సరిపోతుందని ముందే అనుకున్నాను’ అని తెలిపాడు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version