టీ20 ప్రపంచ కప్ 2026: చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్…

టీ20 ప్రపంచ కప్ 2026: చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్

 

పొట్టి ప్రపంచ కప్ 2026లో భాగంగా పాకిస్థాన్‌పై భారత్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది. ఇషాన్ కిషన్(77) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో ఇషాన్ ఓ సరికొత్త చరిత్రను సృష్టించాడు.

ఇంటర్నెట్ డెస్క్: పొట్టి ప్రపంచ కప్ 2026లో భాగంగా పాకిస్థాన్‌పై భారత్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటింది. ఆదివారం కొలంబోలోని ప్రేమదాస స్టేడియం వేదికగా పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో 61 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్ ఇషాన్ కిషన్ అద్భుత ఆరంభాన్ని ఇచ్చాడు. కేవలం 40 బంతుల్లోనే 77 పరుగులు చేసి పాక్ బౌలర్లను వణికించాడు. ఈ నేపథ్యంలో ఇషాన్ ఓ సరికొత్త చరిత్రను సృష్టించాడు.

ఇషాన్ కిషన్ సంచలన ఇన్నింగ్స్‌కు గానూ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. దీంతో టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తొలి భారత వికెట్ ‌కీపర్ బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ 114 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి ప్రత్యర్థి పాక్‌ను పూర్తిగా కట్టడి చేశారు. ఈ విజయంతో భారత్ సూపర్ 8 దశకు అర్హత సాధించింది.

నమ్మకం ఉంది..

మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్‌పై ఇషాన్ కిషన్ మాట్లాడాడు. ‘వికెట్ అంత సులభంగా లేదు. కానీ నా బలాల మీద నమ్మకం పెట్టుకున్నాను. ఆఫ్‌సైడ్ ఆటపై ఎక్కువగా శ్రమించాను. పెద్ద గ్రౌండ్ కావడంతో గ్యాప్‌లను ఉపయోగించుకునే ప్రయత్నం చేశాను. 160-170 స్కోరు సరిపోతుందని ముందే అనుకున్నాను’ అని తెలిపాడు.

భారత్-న్యూజిలాండ్ ఆఖరి టీ20.. టీమిండియా తుది జట్టులో కీలక మార్పులు..

భారత్-న్యూజిలాండ్ ఆఖరి టీ20.. టీమిండియా తుది జట్టులో కీలక మార్పులు!

 

 

 

భారత్-న్యూజిలాండ్ జట్లు శనివారం తిరువనంతపురం వేదికగా ఆఖరి టీ20లో తలపడనున్నాయి. ఈ ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 3-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఆఖరి పోరులో గెలిచి.. రానున్న టీ20 ప్రపంచ కప్ 2026ను ఘనంగా ప్రారంభించాలని టీమిండియా భావిస్తోంది.

ఇంటర్నెట్ డెస్క్: భారత్-న్యూజిలాండ్ జట్లు శనివారం తిరువనంతపురం వేదికగా ఆఖరి టీ20లో తలపడనున్నాయి. ఈ ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియా ఇప్పటికే 3-1 తేడాతో సిరీస్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. విశాఖపట్నం వేదికగా జరిగిన నాలుగో టీ20లో కివీస్ జట్టు 50 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే నామమాత్రపు ఈ ఐదో టీ20లో భారత్ గెలిచి.. విజయంతో సిరీస్‌ను ముగించాలని చూస్తోంది. రానున్న టీ20 ప్రపంచ కప్ 2026( T20 World Cup 2026)ను ఘనంగా ప్రారంభించాలని భావిస్తోంది. కాగా ఫిబ్రవరి 7 నుంచి వరల్డ్ కప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
అయితే నేడు జరిగే ఐదో టీ20లో భారత జట్టులో పలు మార్పులు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వరుసగా నాలుగు మ్యాచుల్లోనూ విఫలమైన సంజు శాంసన్‌కు మరో అవకాశం దక్కనుంది. ఇందులోనైనా ఫామ్ అందుకుని సంజు తనను తాను నిరూపించుకోవడానికి ఓ చక్కటి అవకాశం. నాలుగో మ్యాచులో విశ్రాంతి తీసుకున్న ఇషాన్ కిషన్.. ఐదో టీ20లో బరిలోకి దిగే అవకాశం ఉంది. తొలి టీ20లో చేతి వేలికి గాయం అవ్వడం వల్ల ఆటకు దూరమైన అక్షర్ పటేల్.. ఈ మ్యాచులో ఆడే సూచనలు కనిపిస్తున్నాయి. స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తుది జట్టులో చోటు సంపాదించుకునే ఛాన్స్ ఉంది. తొలి నాలుగు టీ20ల్లో ఆడిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యకు ఐదో టీ20లో విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version