ఆ ట్రోఫీ గెలవాలనేదే నా లక్ష్యం.. రోహిత్ శర్మ..

ఆ ట్రోఫీ గెలవాలనేదే నా లక్ష్యం.. రోహిత్ శర్మ

 

టీమిండియా వెటరన్ ప్లేయర్ రోహిత్ శర్మ.. టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2027లో జరిగే వన్డే ప్రపంచ కప్ గెలవాలనే పట్టుదలతోనే ముందుకు సాగుతున్నాడు. ఈ నేపథ్యంలో హిట్‌మ్యాన్ వన్డే వరల్డ్ కప్ 2027 గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా వెటరన్ ప్లేయర్ రోహిత్ శర్మ.. టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికి కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్న విషయం తెలిసిందే. 2027లో జరిగే వన్డే ప్రపంచ కప్ గెలవాలనే పట్టుదలతోనే ముందుకు సాగుతున్నాడు. దానికోసమే ఫిట్‌నెస్ పరంగా, ఫామ్ పరంగానూ అదరగొడుతున్నాడు. మరి ఆ మెగా టోర్నీలో రోహిత్‌కు అవకాశం దక్కుతుందా? లేదా? అనే అనిశ్చితి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో హిట్‌మ్యాన్(Rohit Sharma) వన్డే వరల్డ్ కప్ 2027 గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.

‘నా దేశం కోసం ప్రపంచ కప్ నెగ్గాలని కోరుకుంటున్నాను. వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లు చూస్తూ పెరిగాను. అప్పట్లో టీ20 ప్రపంచ కప్, ఐపీఎల్ వంటి టోర్నీలు లేవు. అయితే నాలుగేళ్లకు ఒకసారి జరిగే వన్డే ప్రపంచ కప్‌నకు మాత్రం ఎంతో విలువ ఉంది. ప్రస్తుతం ఆ ట్రోఫీ(2027 ODI World Cup) గెలవాలనేదే నా లక్ష్యం. దాన్ని గెలిచేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తా’ అని రోహిత్ శర్మ ఓ ఐసీసీ ఈవెంట్‌లో అన్నాడు. మరోవైపు ఇటీవలే బీసీసీఐ(BCCI) ఆటగాళ్లకు సంబంధించి సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను ప్రకటించింది. ఇందులో రోహిత్ శర్మ గ్రూప్ ఏ ప్లస్ నుంచి గ్రూప్ బికి మారిన సంగతి తెలిసిందే. గ్రూప్ ఏ ప్లస్ కేటగిరీని తొలగించిన బీసీసీఐ.. ఇప్పుడు గ్రూప్ ఏ, బి, సి కేటగిరీలను మాత్రమే కేటాయించింది. కాగా గ్రూప్ ఏలో శుభ్‌మన్ గిల్, బుమ్రా, రవీంద్ర జడేజా మాత్రమే చోటు దక్కించుకున్నారు. టెస్టు, టీ20 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ కూడా గ్రూప్ బికి మారిన విషయం తెలిసిందే.

ఆ విషయంలో సూర్యకు క్రెడిట్ దక్కట్లేదు: ఇర్ఫాన్ పఠాన్…

ఆ విషయంలో సూర్యకు క్రెడిట్ దక్కట్లేదు: ఇర్ఫాన్ పఠాన్

 

టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్సీ పరంగా సూర్యకు రావాల్సినంత క్రెడిట్ రావడం లేదని అభిప్రాయపడ్డాడు. కెప్టెన్‌గా సూర్యకు అద్భుతమైన రికార్డు ఉన్నప్పటికీ.. బ్యాటర్‌గా రాణించాల్సిన అవసరం ఉందని వెల్లడించాడు.

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్.. దాదాపు ఏడాది కాలంగా ఫామ్ లేమితో ఇబ్బంది పడ్డాడు. కెప్టెన్సీ విషయంలో అజేయంగా నిలుస్తున్నప్పటికీ.. సూర్య బ్యాట్ నుంచి పరుగులు రాకపోవడంతో అభిమానుల నుంచి క్రికెట్ మాజీల వరకు ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు న్యూజిలాండ్‌తో సిరీస్‌లో ఫామ్ అందుకుని అద్భుత ప్రదర్శనలు ఇస్తున్నాడు. టీ20 ప్రపంచ కప్ ముందు స్కై ఫామ్ అందుకోవడం కాస్త ఊరటనిచ్చే విషయమే. ఈ నేపథ్యంలో సూర్య కెప్టెన్సీపై టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫార్ పఠాన్(Irfan Pathan) కీలక వ్యాఖ్యలు చేశాడు.
‘సూర్యకుమార్ యాదవ్‌(Suryakumar Yadav)కు కెప్టెన్‌గా అద్భుతమైన రికార్డ్ ఉంది. టీ20 ఫార్మాట్లో కెప్టెన్‌గా అతడికి విజయాల శాతం 84. ఇది చాలా ఎక్కువ. కానీ మనం సూర్యకుమార్‌కు ఇవ్వాల్సినంత క్రెడిట్ ఇవ్వడం లేదు. అలాగే సూర్య బౌలర్ల కెప్టెన్. అతడిలో రోహిత్ శర్మ ఛాయలున్నాయి. అతడు బౌలర్లపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తాడు. జట్టు కోసం సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటాడు.

టీమిండియాకు మరో షాక్.. సిరీస్ నుంచి స్టార్ ఆల్‌రౌండర్ ఔట్…

టీమిండియాకు మరో షాక్.. సిరీస్ నుంచి స్టార్ ఆల్‌రౌండర్ ఔట్!

 

భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఆదివారం వడోదర వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో కివీస్‌పై టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో టీమిండియాకు మరో షాక్ తగిలేలా ఉంది. మ్యాచ్ మధ్యలో స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ వెన్నునొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు.

ఇంటర్నెట్ డెస్క్: భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఆదివారం వడోదర వేదికగా తొలి వన్డే మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో కివీస్‌పై టీమిండియా 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్ కనబర్చారు. అయితే ఈ మ్యాచ్‌కు ముందే స్టార్ బ్యాటర్, వికెట్ కీపర్ రిషభ్ పంత్.. ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడి ఈ సిరీస్ నుంచే దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీమిండియాకు మరో షాక్ తగిలేలా ఉంది. మ్యాచ్ మధ్యలో స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్(Washington Sundar) వెన్నునొప్పితో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. ఈ మ్యాచులో కేవలం 5 ఓవర్లపాటే బౌలింగ్ వేసి మైదానాన్ని వీడాడు. అతడి బదులు ధ్రువ్ జురెల్ ఫీల్డింగ్ చేశాడు. బ్యాటింగ్ సమయంలో మాత్రం క్రీజులోకి వచ్చిన వాషీ.. ఇబ్బంది పడుతూనే కనిపించాడు. అయితే తర్వాతి మ్యాచ్‌లో సుందర్ బరిలోకి దిగుతాడా? సిరీస్‌కే దూరమవుతాడా? అనే విషయంలో క్లారిటీ లేదు.

శ్రేయస్ ఆ విషయంలో తొందరపడకు.. మాజీ బ్యాటింగ్ కోచ్ సూచన…

శ్రేయస్ ఆ విషయంలో తొందరపడకు.. మాజీ బ్యాటింగ్ కోచ్ సూచన

 

టీమిండియా.. న్యూజిలాండ్‌తో వడోదర వేదికగా తొలి వన్డేలో నేటి నుంచి తలపడనుంది. అయితే గాయం బారిన పడిన స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్.. ఈ సిరీస్‌తో పునరాగమనం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్.. అయ్యర్‌కు పలు జాగ్రత్తలు సూచించాడు.

మంచి వన్డే కెప్టెన్ అవుతాడు..

‘కెప్టెన్‌గా శుభ్‌మల్ గిల్‌పై ఇప్పుడే ఒక అంచనాకు రాలేము. అతడికి మైదానంలో సీనియర్ల నుంచి మద్దతు ఉంటుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అనుభవం అతడికి అందుబాటులో ఉంటుంది. అతడు క్రమంగా ఎదుగుతాడు. చివరికి మంచి వన్డే కెప్టెన్ అవుతాడు’ అని బంగర్ పేర్కొన్నాడు.

టీమిండియా స్టార్ ప్లేయర్‌కు అస్వస్థత.. ఏమైందంటే…

టీమిండియా స్టార్ ప్లేయర్‌కు అస్వస్థత.. ఏమైందంటే?

 

 

టీమిండియా స్టార్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ అస్వస్థతకు గురయ్యాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్ తర్వాత తీవ్రమైన కడుపు నొప్పితో బాధ పడ్డాడు. దీంతో అతడిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ అస్వస్థతకు గురయ్యాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మంగళవారం రాజస్థాన్‌తో జరిగిన సూపర్ లీగ్‌ మ్యాచ్ అనంతరం యశస్వి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడ్డాడు. అతడిని వెంటనే పుణెలోని ఆదిత్య బిర్లా ఆసుపత్రికి తరలించారు. స్కాన్ల అనంతరం అతడికి అక్యూట్ గ్యాస్ట్రోఎంటెరిటిస్స్(పొట్టలో తీవ్రమైన ఇన్ఫెక్షన్) ఉన్నట్లు వైద్యులు తేల్చారు. ప్రస్తుతం యశస్వి(Yashasvi Jaiswal) ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. కాగా కొద్ది రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలుస్తోంది.
కాగా రాజస్తాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో జైశ్వాల్ అస్వస్థతతో ఉన్నప్పటికీ ముంబై తరపున మైదానంలోకి దిగాడు. బ్యాటింగ్ చేసే సమయంలో అతడు చాలా అసౌక్యరంగా కన్పించాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన జైశ్వాల్ 16 బంతుల్లో 15 పరుగులు చేసి ఔటయ్యాడు.

అయినప్పటికీ..

యశస్వి జైస్వాల్(15) విఫలమైనప్పటికీ.. సూపర్ లీగ్ గ్రూప్ బీ మ్యాచులో అజింక్య రహానే(72*), సర్ఫరాజ్ ఖాన్(73) మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. దీంతో రాజస్థాన్ జట్టు ముంబైపై మూడు వికెట్ల తేడాతో ఓడింది.సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జైస్వాల్ మూడు మ్యాచ్‌లలో 48.33 సగటు, 168.6 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 145 పరుగులు సాధించాడు. ఈ దేశవాళీ టీ20 టోర్నమెంట్‌కు ముందు యశస్వీ జైస్వాల్ దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో పాల్గొని 78 సగటుతో 156 పరుగులు చేసి మంచి ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version