భారత్, పాక్ మ్యాచ్: వర్షం పడాలని కోరుకున్న పాక్ మాజీ ప్లేయర్..

భారత్, పాక్ మ్యాచ్: వర్షం పడాలని కోరుకున్న పాక్ మాజీ ప్లేయర్

 

 

పొట్టి ప్రపంచ కప్2026లో భాగంగా చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ మధ్య ఇవాళ (ఫిబ్రవరి 15) మ్యాచ్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలో వర్షం పడే అవకాశం ఉండటంతో.. వాన పడకూదని క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. ఇదే సమయంలో వాన పడాలని దేవుడిని ప్రార్థిస్తున్నానంటూ పాక్ మాజీ క్రికెటర్ విచిత్ర వ్యాఖ్యలు చేశాడు.

స్పోర్ట్స్ డెస్క్: టీ20 ప్రపంచ కప్(World Cup 2026)లో ఇప్పటికే అనేక సంచలనాలు చోటుచేసుకున్నాయి. ఐర్లాండ్, అమెరికా, స్కాట్లాండ్, జింబాబ్వే వంటి పలు జట్లు పెద్ద జట్లకు గట్టి పోటీ ఇస్తున్నాయి. అంతేకాక ఇంగ్లాండ్, పాకిస్థాన్ వంటి జట్లను ఓడించినంత పని చేశాయి. జింబాబ్వే అయితే ఏకంగా ఆస్ట్రేలియా లాంటి టాప్ జట్టును ఓడించి.. ఈ టోర్నీలో పెను సంచలనం సృష్టించింది. ఇలా సాగుతున్న పొట్టి ప్రపంచ కప్2026లో క్రికెట్ ప్రేమికులు ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. చిరకాల ప్రత్యర్థులైన భారత్, పాకిస్థాన్ మధ్య ఆదివారం (ఫిబ్రవరి 15) మ్యాచ్‌ జరుగనుంది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి కాగా.. వరుణుడు అభిమానులను భయపెడుతున్నాడు.

భారత్ ముందు పాకిస్థాన్ దిగదుడుపే..

భారత్ ముందు పాకిస్థాన్ దిగదుడుపే.. పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యల

 

 

ఆసియా కప్-2025లో మరో ఆసక్తికర మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. సూపర్-4లో భాగంగా ఈ రోజు సాయంత్రం జరగబోయే మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ తలపడబోతున్నాయి. గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను 7 వికెట్ల తేడాతో టీమిండియా సులభంగా ఓడించింది. ఈ రోజు మరోసారి ఈ రెండు జట్లు పోటీపడుతున్నాయి.

ఆసియా కప్-2025లో మరో ఆసక్తికర మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. సూపర్-4లో భాగంగా ఈ రోజు సాయంత్రం జరగబోయే మ్యాచ్‌లో భారత్, పాకిస్థాన్ తలపడబోతున్నాయి (India vs Pakistan). గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను 7 వికెట్ల తేడాతో టీమిండియా సులభంగా ఓడించింది. ఈ రోజు మరోసారి ఈ రెండు జట్లు పోటీపడుతున్నాయి. సూపర్-4 మ్యాచ్‌కు ముందు, పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాజిద్ ఖాన్ (Bazid Khan) ఓ టీవీ షోలో మాట్లాడుతూ ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు.
పాకిస్థాన్ కంటే భారత జట్టు చాలా మెరుగ్గా ఉంది. అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా కనిపిస్తోంది. భారత్ ముందు పాకిస్థాన్ జట్టు చాలా చిన్నగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత్‌పై పాకిస్థాన్ గెలవాలంటే ఏదైనా అద్భుతం జరగాలి. పాక్ బౌలర్లు త్వరగా వికెట్లు తీయగలిగితే ఏదైనా అవకాశం ఉండొచ్చు. ప్రకృతి సహకరిస్తే తప్ప పాక్ గెలుపు కష్టం’ అని బాజిద్ ఖాన్ వ్యాఖ్యానించారు (Asia Cup 2025 Super 4,).

గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్‌ 128 పరుగులు చేసింది (IND vs PAK analysis). టీమిండియా కేవలం 3 వికెట్లు కోల్పోయి సులభంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లతో టీమిండియా ప్లేయర్లు కరచాలనం చేయకపోవడం హాట్ టాపిక్‌గా మారింది. మరి, ఈ రోజు జరగబోయే మ్యాచ్ మరెన్ని వివాదాలకు కారణమవుతుందో చూడాలి.

ఆసియా కప్ 2025: భారత్–పాక్ పోరుపైనే ఆసక్తి..

2025 ఆసియా కప్ సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యుఎఇలోని దుబాయ్, అబుదాబిలలో జరగనుంది. ఇది ఆసియా కప్ 17వ ఎడిషన్. ఈసారి టోర్నమెంట్‌ T20 ఫార్మాట్‌లో జరుగుతోంది.

ఆసియా కప్‌ను తొలిసారి 1984లో ప్రారంభించారు. ఇప్పటివరకు భారత్ 8 సార్లు, శ్రీలంక 6 సార్లు, పాకిస్తాన్ 2 సార్లు టైటిల్ గెలుచుకున్నాయి. బంగ్లాదేశ్ మూడు సార్లు ఫైనల్ చేరినా, ఇంకా ట్రోఫీని దక్కించుకోలేదు.

ఈ సారి 8 జట్లు రెండు గ్రూపులుగా విభజించబడ్డాయి. సెప్టెంబర్ 9న ఆఫ్ఘనిస్తాన్ – హాంకాంగ్ మ్యాచ్‌తో టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. defending champions భారత్ తన తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న యుఎఇతో ఆడనుంది.

అత్యంత ఆసక్తికరంగా, భారత్ – పాకిస్తాన్ ఒకే గ్రూపులో ఉన్నాయి. కాబట్టి లీగ్ దశలో ఒక మ్యాచ్, సూపర్ ఫోర్‌కు చేరితే మరో మ్యాచ్, ఫైనల్‌కు చేరుకుంటే మూడోసారి ఒకరినొకరు ఎదుర్కొనే అవకాశముంది. అంటే అభిమానులకు భారత్ వర్సెస్ పాకిస్తాన్ మూడు ఉత్కంఠభరిత పోరాటాలు దక్కవచ్చు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version