అవమానాన్ని సహించం.. ఐపీఎల్‌పై బంగ్లాదేశ్ కఠిన నిర్ణయం….

అవమానాన్ని సహించం.. ఐపీఎల్‌పై బంగ్లాదేశ్ కఠిన నిర్ణయం?

 

బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడుల నేపథ్యంలో భారత్‌లో నిరసనలు ఊపందుకున్నాయి. దీంతో ముస్తాఫిజూర్‌ను ఐపీఎల్‌ నుంచి తప్పించాలన్న డిమాండ్లు గట్టిగా వినిపించాయి. చివరకు బీసీసీఐ సూచనలతో కేకేఆర్‌ అతడిని జట్టు నుంచి విడుదల చేసింది. ఈ విషయంపై బంగ్లాదేశ్ తీవ్రంగా స్పందిస్తోంది.

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌-బంగ్లాదేశ్ మధ్య రాజకీయ ఉద్రిక్తతలు ఇప్పుడు క్రికెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (KKR) జట్టు నుంచి బంగ్లాదేశ్ పేసర్‌ ముస్తాఫిజూర్‌ రెహమాన్‌ను రిలీజ్ చేయడంతో ఈ పరిణామాలకు మరింత ఆజ్యం పోసింది. బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడుల నేపథ్యంలో భారత్‌లో నిరసనలు ఊపందుకున్నాయి. దీంతో ముస్తాఫిజూర్‌ను ఐపీఎల్‌ నుంచి తప్పించాలన్న డిమాండ్లు గట్టిగా వినిపించాయి. చివరకు బీసీసీఐ(BCCI) సూచనలతో కేకేఆర్‌ అతడిని జట్టు నుంచి విడుదల చేసింది.అయితే ఇదే అంశం భారత్‌-బంగ్లాదేశ్ క్రికెట్ సంబంధాలను మరింత దెబ్బతీసేలా కనిపిస్తోంది. ఇప్పటికే బంగ్లాదేశ్ ప్రభుత్వ సలహాదారు ఆసిఫ్‌ నజ్రుల్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీ20 ప్రపంచకప్‌ 2026కి సంబంధించి భారత్‌లో జరగాల్సిన బంగ్లాదేశ్ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించేలా ప్రణాళికలు చేయాలని ఐసీసీకి లేఖ రాయమని ఆయన బీసీబీ(BCB)కి సూచించారు. పాకిస్తాన్ తరహాలోనే ఈ నిర్ణయం ఉండాలని అభిప్రాయపడ్డారు.

ఖలీదా జియా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం…

ఖలీదా జియా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం..

 

 

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా మృతి మంగళవారం ఉదయం ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో కన్నుమూశారు. ఆమె మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.

బంగ్లాదేశ్ (Bangladesh)మాజీ ప్రధానమంత్రి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) అధినేత్రి బేగం ఖలీదా జియా (80)(Khaleda Zia) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో (Health Issue) బాధపడుతున్నారు. ఈ రోజు (మంగళవారం) తెల్లవారుజామున ఢాకాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) సంతాపం (condolences)వ్యక్తం చేశారు. భారతదేశం – బంగ్లాదేశ్ సంబంధాలను బలోపేతం చేయడంతో ఆమె పాత్రను ప్రశంసించారు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version