కవేలి గ్రామంలో బడిబాట కార్యక్రమం.

కవేలి గ్రామంలో బడిబాట కార్యక్రమం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలంలోని కవేలి గ్రామంలో శుక్రవారం పంచాయతీ కార్యదర్శి సురేఖ ఆధ్వర్యంలో బడిబాట గ్రామ సభ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్ దొండి రావు పెట్లోళ్ల మాట్లాడుతూ ప్రభుత్వ బడిలో ఉన్న సౌకర్యాలను ఉచిత పుస్తకాలు, రెండు జతల దుస్తులు, మధ్యాహ్నం భోజనంలో వారానికి మూడుసార్లు గుడ్డు, రాగి జావ వడ్డిస్తారన్నారు.

ఆరు నుంచి బడిబాట కార్యక్రమం

ఆరు నుంచి బడిబాట కార్యక్రమం

జహీరాబాద్ నేటి ధాత్రి;

సంగారెడ్డి జిల్లాలో 6 నుంచి 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు బుధవారం తెలిపారు. ప్రతిరోజు ఓ కార్యక్రమాన్ని అన్ని మండలాల్లో నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఒకటవ తరగతిలో 11247 మంది విద్యార్థులను చేర్పించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు. బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

గృహ ప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న.

గృహ ప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్న టిజిఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్వీర్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

ప్యాలారం బసవరాజ్ ఝరాసంగం పట్టణంలోని నూతనంగా గృహప్రవేశం చేస్తున్న బసవరాజ్ గారికి గృహప్రవేశం శుభాకాంక్షలు తెలిపిన టిజిఐడిసి మాజీ చైర్మన్ మొహమ్మద్ తన్విర్ వాడితోపాటు కాంగ్రెస్ నాయకులు కుతుబుద్దీన్ సత్తార్ భాయ్ ఎజాస్ బాబా బిజీ సందీప్ తదితరులు ఉన్నారు.

ఉచిత యోగ మరియు ధ్యాన శిక్షణ కార్యక్రమం.

ఉచిత యోగ మరియు ధ్యాన శిక్షణ కార్యక్రమం

ధ్యానోత్సవాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

శాయంపేట నేటిధాత్రి:

ఈనెల 3 నుంచి 5వ తేదీ వరకు మూడు రోజులపాటు మండల కేంద్రంలోని నవోదయ హై స్కూల్ లో శ్రీరామ చంద్ర మిషన్ హార్ట్ ఫుల్ నెస్ సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత యోగ ధ్యాన శిక్షణలో ప్రజలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని ఆరోగ్యంగా ఉండాలని ఎస్సై జక్కుల ప రమేష్ తెలిపారు. ఈ సంద ర్భంగా మాట్లాడుతూ మనిషి తన శరీరాన్ని పరిశుభ్రంగా ఆరోగ్యంగా ఉంచుకునేందుకు స్నాన పానాధులు ఎలా అవ సరమో మనసుని హృదయా న్ని పరిశుభ్రంగా స్వచ్ఛంగా ఉంచుకునేందుకు ధ్యానం ఎంతో అవసరమని తెలిపారు. విద్యార్థులు ధ్యానం చేయడం వల్ల ఏకాగ్రత పెరిగి జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతాయని తెలి పారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఉచిత యోగ మరియు ధ్యాన శిక్షణ కార్యక్రమంలో యువకులు విద్యార్థులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయ వంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ రామచంద్ర మిషన్ సంస్థ కోఆర్డినేటర్ ఎం శారద, జిల్లా కోఆర్డినేటర్ అ చ్చయ్య,రమేష్, రాంబాబు, సత్యనారాయణ, సుధాక ర్, సురేందర్ పాల్గొన్నారు

ఎంపీ నిధులతో ప్రారంభించిన కార్యక్రమంలో.

ఎంపీ నిధులతో ప్రారంభించిన కార్యక్రమంలో మాజీ మేయర్ల పాత్ర ఏంటి?

అధికారిక కార్యక్రమాల్లో వేదికపై మాజీలను పిలిచినమున్సిపల్ కమిషనర్ పైచర్యలు తీసుకోవాలి

బిజెపికి తొత్తుగా వ్యవహరిస్తున్న కమిషనర్

_సిపిఐ

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

 

 

 

 

కరీంనగర్ నగరంలో ఎంపీ బండి సంజయ్ నిధులతో మున్సిపల్ కార్యాలయంలో డ్రిల్లింగ్ మిషన్ల పంపిణీ అధికారిక కార్యక్రమంలో వేదికపై బిజెపి పార్టీకి చెందిన మాజీ మేయర్ సునీల్ రావు,
డి.శంకర్ కొంతమంది మాజీ కార్పొరేటర్లూ వేదికపై ఉండటం వేదికపై సీట్లలో కూర్చోవడానికి ఆహ్వానించిన నగరపాలక కమిషనర్ పైచర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఐ నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్ రెడ్డి, నగర సహాయ కార్యదర్శి పైడిపల్లి రాజులు డిమాండ్ చేశారు. ఇష్టారాజ్యంగా బిజెపికి చెందిన నాయకులు వేదిక పై కూర్చున్న కమిషనర్ మౌనంగా ఉండటం ఉండి ప్రజలను అవమానపరుస్తున్నారని బిజెపి కార్యక్రమాల్లాగా అధికార కార్యక్రమాలు కమిషనర్ నిర్వహించడం సిగ్గుచేటన్నారు.

Municipal Commissioner

 

 

పదవి కాలం పూర్తయిన ఇంకా మాజీ మేయర్, కొందరు కార్పొరేటర్లు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో వేదికలపై పాల్గొనకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, మున్సిపల్ కార్యాలయంలో అరవై మంది కార్పొరేటర్ల పదవి కాలం పూర్తయిన బోర్డుపై ఉన్న వారి పేర్లు ఇంకా తొలగించడం లేదని వెంటనే వాటిని తీసేయాలని సురేందర్ రెడ్డి,రాజు ఈసందర్భంగా ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో డ్రై డే కార్యక్రమం.

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో డ్రై డే కార్యక్రమం

సిరిసిల్ల టౌన్: (నేటి ధాత్రి)

 

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రజిత ఆకస్మిక తనిఖీల్లో భాగంగా డెంగ్యూ,మలేరియా జ్వరాల నివారణలో భాగంగా డ్రై డే కార్యక్రమంలో పాల్గొని (డ్రము )తొట్టి లలో లార్వా లు గల నీటి ని తొలగించడం, టైర్లు, కూలర్లు, రోళ్ళు గల లార్వాలను తొలగించడం, నీటి నిల్వలు గల ప్రాంతాలను గుర్తించి పూడ్చి వేయడం, డ్రైనేజ్ లలో నీరు నిల్వ ఉండకుండా, రోడ్లపై చెత్త చెదారము నిల్వ ఉండకుండా, ఇంటి చుట్టూ పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ వ్యక్తిగత పరిశుభ్రత లో భాగంగా తరచుగా చేతులు శుభ్రపరచుకోవడం, గుంపులలో, ప్రయాణ సమయంలో మాస్కులు ధరించడం ద్వారా వర్షాకాలంలో వచ్చే వైరల్ జ్వరాలు నివారించవచ్చునని

Program Officer Dr. Anitha,

ఈ సందర్భంగా సిబ్బందికి, ప్రజలకు అవగాహన కల్పించినారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ అనిత, మలేరియా సూపర్వైజర్ లింగం, వాణి మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

కొనసాగుతున్న బడిబాట కార్యక్రమం.

కొనసాగుతున్న బడిబాట కార్యక్రమం.

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లాలో యుటీఎస్ ఆధ్వర్యంలో బడిబాట చేపట్టారు. మునిపల్లి, కోహీర్, జహీరాబాద్, మొగుడంపల్లి తదితర మండలాలలోని వివిధ గ్రామాల్లో బడిబాట జీపీ యాత్ర కొనసాగించారు. ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

నేటి కార్యక్రమం విజయవంతం చేయాలి.

నేటి కార్యక్రమం విజయవంతం చేయాలి

పిప్పాల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్

భూపాలపల్లి నేటిధాత్రి:

గురువారం భూపాలపల్లి జవహర్ నగర్ కాలనీలోని 8వ వార్డు 27వ వార్డు కాలనీలో గత 30సంవత్సరాల నుండి కాలనీలో రేషన్ షాపు లేదని ఎమ్మెల్యే సత్యనారాయణ రావు దృష్టికి తీసుకువెళ్లిన కాంగ్రెస్ పార్టీ పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ పిప్పాల రాజేందర్ వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేసి నేడు ఉదయం 9:00 గంటలకు ఐస్క్రీం కంపెనీ దగ్గర రేషన్ షాపు ఓపెన్ చేయాలని అధికారులు ఆదేశించడం జరిగింది రేషన్ షాప్ ఓపెనింగ్ తో పాటు పోచమ్మ టెంపుల్ ఆలయం లో బోరు ఓపెనింగ్ కార్యక్రమం కూడా ఉన్నది కాబట్టి ఈ కార్యక్రమానికి పార్టీలకు అతీతంగా కాలనీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అనంతరం జై బాపు జై భీమ్ జై సంవిధానం అభియాన్ వార్డు బాట కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఐత ప్రకాష్ రెడ్డి హాజరవుతారు
కావున కాంగ్రెస్ పార్టీ పట్టణ కమిటీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు ఐఎన్ టియుసి యూత్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ ఎన్ఎస్ యుఐ నాయకులకు కార్యకర్తలకు అండ్ వార్డు ప్రజలకు పిలుపునిస్తున్నాం

నేడు పెద్దింటి కథల కార్యశాల కార్యక్రమం.

నేడు పెద్దింటి కథల కార్యశాల కార్యక్రమం

సిరిసిల్ల టౌన్ ( నేటిధాత్రి ):

తెలంగాణ ప్రభుత్వం సాహిత్య అకాడమీతో కలిసి యువ కథకుల కోసం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కథల కార్యశాల తేదీ 27 మే మంగళవారం ఉదయం 10 గంటల నుంచి రవీంద్రభారతి మినీ హాల్ లో జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రొహిబిషన్, ఎక్సైజ్, పర్యాటక మరియు సాంస్కృతిక పురావస్తు శాఖ మాత్యులు జూపల్లి కృష్ణారావు ముఖ్య అతిథిగా, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ విశిష్ట అతిథిగా హాజరుకానున్నారు. ఈ కథల కార్యశాలలో ప్రముఖ సినీ రచయిత పెద్దింటి అశోక్ కుమార్ “కథలు ఎలా రాయాలి” అనే అంశంపై యువ కథకులకు రోజంతా శిక్షణ ఇవ్వనున్నారు. ఇది కొత్తగా రాస్తున్న యువ రచయితలకోసమే నిర్వహిస్తున్న కార్యశాల అని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోజు బాలా చారి పేర్కొన్నారు.పెద్దింటి ఇప్పటికే యూనివర్సిటీలలో, డిగ్రీ కళాశాలలలో అనేక కథల కార్యశాలలు నిర్వహించారు. ఆయన రచించిన కథలు, నవలలు పలు యూనివర్సిటీల సిలబస్‌లలో భాగంగా ఉన్నాయి. ప్రస్తుతం సినిమాలకు కథలు పాటలు మాటలు రాస్తున్నారు.

నూతన వస్త్రధారణ కార్యక్రమంలో పాల్గొన్న.

నూతన వస్త్రధారణ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం చర్చ్ లో జరిగిన విల్లాస్ గారి కుమారులు
నూతన వస్త్రధారణ కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించిన శాసనసభ్యులు కోనింటీ మాణిక్ రావు ,మాజి మండల పార్టీ అధ్యక్షులు బొగ్గుల సంగమేశ్వర్ ,యువ నాయకులు మిథున్ రాజ్ ,పట్టణ అధ్యక్షులు ఏజాస్ బాబా, నాగేశ్వర్,సంతోష్ మాలి పటేల్, బొగ్గుల నాగన్న, సమేల్, బాల్ రాజ్ ,గాల్ అప్ప,అనిల్ , విజయ్ తదితరులు.

కుమ్మరికుంటలో అమృత్ మిత్ర కార్యక్రమం..

కుమ్మరికుంటలో అమృత్ మిత్ర కార్యక్రమం..

నర్సంపేట,నేటిధాత్రి :

 

 

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని కుమ్మరికుంట చెరువు వద్ద అమృత్ మిత్ర 2.0 కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ భాస్కర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆ ప్రాంతానికి సంబంధించిన ధరణి సృష్టి మహిళా సమైక్యల సంఘాల మహిళలతో చెట్లు నాటించుట కొరకు అమృత్ మిత్ర 2.0 కిట్లను మున్సిపల్ కమిషనర్ భాస్కర్ అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ రాజేష్ సానిటరీ ఇన్స్పెక్టర్ నాగరాజు, మెప్మా డిఎంసి రేణుక,ఏడీఎంసి ఎస్.కె వహీదా టీఎల్ఎఫ్ ఆర్పి లు మాధవి సిఎల్ఆర్బి సుమలతతో పాటు సంఘాల మహిళలు పాల్గొన్నారు.

ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం.

ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఐదు రోజుల శిక్షణ కార్యక్రమం

శిక్షణ అందించిన జిల్లా కలెక్టర్

సిరిసిల్ల టౌన్. మే 20:(నేటిధాత్రి)

 

 

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని గీతా నగర్ ప్రభుత్వ పాఠశాల నందు ఐదు రోజుల ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమంను జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగినది.

Collector Sandeep Kumar

 

జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఈరోజు గీత నగర్ ప్రభుత్వ పాఠశాల నందు ప్రభుత్వ ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థిని, విద్యార్థులను గురించి ఏర్పాటు చేసిన సమావేశంలో ఉపాధ్యాయులకు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగినది.

అక్కన్నపేటలో బడిబాట కార్యక్రమం.

అక్కన్నపేటలో బడిబాట కార్యక్రమం.

రామాయంపేట మే 16 నేటి ధాత్రి (మెదక్):

రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో బడిబాట కార్యక్రమం శుక్రవారం అక్కన్నపేట ఎంపీపీ ఎస్ పాఠశాల ఉపాధ్యాయులు నిర్వహించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న సేవలను విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేస్తూ కరపత్రాలు ఆవిష్కరించారు. ప్రభుత్వ బడుల్లో అందుతున్న ఉచిత విద్య, నాణ్యమైన భోజనం, పుస్తకాలు, యూనిఫాం పంపిణీ తదితర అంశాలను గ్రామంలో తిరుగుతూ విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అక్కన్నపేట ఎంపీపీ ఎస్ హెచ్ఎం సావిత్రి, ఉపాధ్యాయులు రాoచంద్రారెడ్డి, సాయి చందర్, పంచాయతీ కార్యదర్శి సరితా దేవి, మాజీ ఉపసర్పంచ్ గంగాధర్, మరియు శ్రీనివాస్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

బడిబాట ఉల్లాస్ పై పేరెంట్స్ కు అవగాహన కార్యక్రమం.

బడిబాట ఉల్లాస్ పై పేరెంట్స్ కు అవగాహన కార్యక్రమం.

చిట్యాల, నేటిధాత్రి :

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాలజడ్పీహెచ్ పాఠశాలలో పేరెంట్ టీచర్ సమావేశాలు బడిబాట మరియు ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా చిట్యాలలో పేరెంట్ టీచర్ సమావేశాలు జరిగినవి. ఈ సందర్భంగాఎంఇఓ కోడేపాక రఘుపతి మాట్లాడుతూ అందరూ విద్యావంతులైనప్పుడే ఆ సమాజం బాగుంటుందన్నారు. ప్రభుత్వ విద్యా సౌకర్యాలను వినియోగించుకొని ప్రతి పౌరుడు అభివృద్ధి పథంలో కొనసాగాలని కోరారు. 15 సంవత్సరాలు పైబడిన పిల్లలు సైతం ఉల్లాస్ కార్యక్రమం ద్వారా ప్రాథమిక విద్య, వృత్తి నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ బైరం కల్పన, ఇన్చార్జి ప్రధాన ఉపాధ్యాయుడు శ్రీరామ్ రఘుపతి, మహిళా సంఘం నాయకురాళ్లు,, అంగన్వాడి టీచర్లు భాగ్యలక్ష్మి,మరియు వివో ఏ చందర్, కోమల ఉపాధ్యాయులు బండారి సదయ్య, గోపగాని భాస్కర్, బొమ్మ.రాజమౌళి మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమo .!

పిజేటిఏయూ వారి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమo

కరీంనగర్, నేటిధాత్రి:

 

 

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో గల వ్యవసాయ పరిశోధన స్థానం, కరీంనగర్ వారి ఆధ్వర్యంలో రైతులకు మేలైన సాగు పద్దతులపై అవగాహన కల్పించడంతో పాటు, వానాకాలం సాగుకు రైతులను సమాయత్తం చేసేందుకు వ్యవసాయ శాఖతో కలిసి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే వినూత్న కార్యక్రమాన్ని కరీంనగర్ జిల్లా రామడుగు మండలo దేశరాజుపల్లి గ్రామంలోని రైతువేదిక నందు నిర్వహించడం జరిగినది. వ్యవసాయ పరిశోధన స్థానం, శాస్త్రవేత్త మరియు అధిపతి డా.ఉషారాణి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశంతో పాటు ముఖ్యమైన అంశాలైన తక్కువ యూరియా వాడండి, సాగు ఖర్చుని తగ్గించండి, అవసరం మేరకు రసాయనాలను వినియోగించండి, నేల తల్లి ఆరోగ్యాన్ని కాపాడండి, రశీదులను భద్రపరచండి, కష్టకాలంలో నష్ట పరిహారాన్ని పొందండి అని తెలిపారు. ఈకార్యమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎఎంసి చైర్మన్ బొమ్మరవేణి తిరుమల మరియు జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మిలు మాట్లాడుతూ రైతులందరూ యూరియ వాడకాన్ని తగ్గించి, చెట్లని పెంచి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. నెల రోజుల పాటు జిల్లాలో వివిధ గ్రామాలలో జరిగే ఈరైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని రైతులందరూ వినియోగించుకోవాలని సూచించారు. ఈకార్యక్రమానికి విచ్చేసిన వ్యవసాయ పరిశోధన స్థానం, కరీంనగర్ శాస్త్రవేత్త డా . ఏ.విజయభాస్కర్ సాగు నీటిని ఆదా చేయండి, భావి తరాలకు అందించండి, పంట మార్పిడి పాటించండి, సుస్థిర ఆదాయాన్ని పొందండి, చెట్లను పెంచండి పర్యావరణాన్ని కాపాడండి అనే విషయాలు రైతులకు తెలిపారు. జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ అధికారి శ్రీనివాస్ రావు రైతులను ఉద్దేశిస్తూ మామిడి, కూరగాయ, ఆయిల్ పామ్ సాగు వివరాలు తెలిపారు. అనంతరం టిఎస్ఎస్డిసి రీజినల్ మేనేజర్ విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతు నాణ్యమైన విత్తన లభ్యత మరియు ధరల వివరాలను వివరించారు. ఈకార్యక్రమంలో చొప్పదండి సహ సంచాలకులు ప్రియదర్శిని, మండల వ్యవసాయ అధికారి త్రివేదిక, సీడ్ ఆఫీసర్ మౌనిక , ఉద్యాన శాఖ ఆఫీసర్ రోహిత్, విఏఎస్ మనోహర్ కుమార్, వ్యవసాయ విస్తరణ అధికారులు రమేష్, సంపత్, గోవర్ధన్ సుమారు నూటా యాభై ఏడు మంది రైతులు పాల్గొన్నారు.

రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం.

వెంకటాపూర్ గ్రామంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం

ముఖ్య అతిధిగా హాజరైన మార్కెట్ చైర్మన్ రాజిరెడ్డి

పరకాల నేటిధాత్రి

 

 

మండలంలో వెంకటాపురం గ్రామం లో ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు రైతుల అవగాహన కార్యక్రమానికి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ తక్కువ యూరియా వాడకం,సాగుఖర్చును తగ్గించుట,అవసరం మేరకు రసాయనాలు వినియోగం,రైతు సోదరులకు రసీదులను భద్రపరుచుకోవడం,పంట మార్పిడి వలన కలిగే ప్రయోజనాలు,చెట్లను పెంచడం,సాగునీటిని ఆదా చేయడం వలన కలిగే ప్రయోజనాలు రైతులకు గ్రామంలోని వివిధ పంటలలో సస్యరక్షణ చర్యల గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో భాగంగా మండల వ్యవసాయ అధికారి శ్రీనివాస్,వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ బి. రాజు,డాక్టర్ కే.స్వాతి, వ్యవసాయ విస్తరణాధికారులు కాటంరాజు,వ్యవసాయ కళాశాల వరంగల్ విద్యార్థులు, వెంకటాపూర్ గ్రామ రైతులు పాల్గొన్నారు.

రాష్ట్రీయ బసవ దళ్ పూజా కార్యక్రమంలో పాల్గొన్న..

రాష్ట్రీయ బసవ దళ్ పూజా కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు

◆ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి,

◆ మాజీ టిజిఐడిసి చైర్మన్ మహ్మద్.తన్వీర్*

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

రాష్ట్రీయ బసవ దళ్ వారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శంకర్ పటేల్ గారి ఆహ్వానం మేరకు మంగళవారం పట్టణం లోని బసవ మంటపం లో జరిగిన పూజా కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి ,మాజీ టిజిఐడిసి చైర్మన్ మహ్మద్.తన్వీర్
ఈ సంధర్బంగా డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి మాట్లాడుతూ అందరికీ ముందుగా బసవ జయంతి శుభాకాంక్షలు తెలిపారు,ప్రేమతత్వం, సమానత్వం,సౌభ్రాతృత్వాన్ని విశ్వమానవాళికి ప్రబోధించిన మహాత్మ శ్రీ బసవేశ్వరుడి చూపిన మార్గంలో నడవాలాన్నారు.బసవేశ్వరుడి జయంతి సందర్భంగా రక్త దాన కార్యక్రమాలు చేయడం ఒక పుణ్య కార్యం అని,బసవ జయంతి పురస్కరించుకొని రాష్ట్రీయ బసవ దళ్ వారు ప్రతి సంవత్సరం రక్త దాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయం అని అన్నారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు పి.నర్సింహారెడ్డి,యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు పి.నాగిరెడ్డి, మాజీ కౌన్సిలర్ రాజశేఖర్,సీనియర్ నాయకులు శ్రీకాంత్ రెడ్డి,అశ్విన్ పాటిల్,రంగా అరుణ్ కుమార్, కుతుబోద్దిన్,తాజోద్దిన్,యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి హర్షవర్ధన్ రెడ్డి,నర్సింహా యాదవ్,బి.జి.సందీప్ మరియు రాష్ట్రీయ బసవ దళ్ తెలంగాణ అధ్యక్షులు శంకర్ పటేల్ ,రాష్ట్రీయ బసవ దళ్ డాక్టర్ శర్నప్ప ,వైద్యులు డాక్టర్ రాజ్ కుమార్,డాక్టర్ సచిన్ ,కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

దూరదర్శన్ ఆటపాట ప్రోగ్రాంకు ఎన్నికైన ప్రతాప్.!

దూరదర్శన్ ఆటపాట ప్రోగ్రాంకు ఎన్నికైన ప్రతాప్.

చిట్యాల నేటి ధాత్ర

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రానికి చెందిన పుల్ల ప్రతాప్ సోమవారం రోజున హైదరాబాద్ రామంతాపూర్ దూరదర్శన్ యాదగిరి ఛానల్ లో ఆట పాట సీజన్ 2 పల్లె పాటల కార్యక్రమం లో గడ్డం రమేష్ బృందం లో పుల్ల ప్రతాప్ పాల్గొని రమేష్ చంద్ర గడ్డం రాసినటువంటి మల్లి మరుమల్లె పువ్వా అనే పాటను పాడి తరువాత ఎపిసోడ్ కి సెలక్షన్ కావడం జరిగింది.ఈ కార్యక్రమం లో న్యాయనిర్ణేత యాశ్ పాల్ మాట్లాడుతూ కనుమరుగు అవుతున్న జానపదాలను కాపాడుకోవడం అలాగే కనుమరుగు అవుతున్న కళాకారులను వెలికి తీయడం. ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం అని అన్నారు. ఈ కార్యక్రమం లో నిర్మాత మధు రాయుడు యాంకర్ నాగలక్ష్మి నిర్మాణ సహకారం
ఎ వి సత్యనారాయణ (చంటి )మరియు దూరదర్శన్ యాజమాన్యం పాల్గొన్నారు.

మిషన్ ఫర్ ద పూర్ చారి టేబుల్ ట్రస్ట్.!

మిషన్ ఫర్ ద పూర్ చారి టేబుల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి )

సిరిసిల్ల పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఈరోజు మిషన్ ఫర్ ద పూర్ చారి టేబుల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో సిరిసిల్ల కమిటీ మెంబర్స్ పద్మశాలీల ఉద్యోగ శిక్షణ కార్యక్రమం ప్రకటన ప్రెస్ క్లబ్ లో వెల్లడించడం జరిగినది. అనంతరం కమిటీ మెంబర్స్ గుంటుక మహేష్ మాట్లాడుతూ 10వ తరగతి పాస్ మరియు ఫెయిల్ అయిన విద్యార్థులు,24 నెలలు మరియు ఇంటర్మీడియట్ పాస్, ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకు18 నెలలు ఉచిత భోజన,వసతి మరియు శిక్షణ పని కాలంలో స్టాయిపాయండ్ కూడా , ఇస్తుంది అని మిషన్ ఫర్ ద పూర్ చారి టేబుల్ ట్రస్ట్ కమిటీ సిరిసిల్ల మెంబర్స్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మిషన్ ఫర్ ద పూర్ చారి టేబుల్ ట్రస్ట్ కమిటీ మెంబర్స్ గుంటుక మహేష్, గోనే ఎల్లప్ప, కోడం ఆంజనేయులు, చిమ్మని ప్రకాష్, గంట్యాల సురేష్, కొండ ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.

బాధితుల సమస్యల పరిష్కారమే.!

బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం

జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపీఎస్

* సిరిసిల్ల టౌన్:( నేటి ధాత్రి )*

సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బాధితులకు సత్వర న్యాయం చేయడానికి ప్రతి సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ మహేష్. బి.గితే ఐపీఎస్ తెలిపారు. ఈరోజు నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి 18 ఫిర్యాదులు స్వీకరించి, ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలను చట్టపరంగా త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.
ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా, ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందని, పోలీస్ అధికారులు, సిబ్బంది పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించి, వినతులు, ఫిర్యాదులు స్వీకరించి, అవసరమైతే క్షేత్ర స్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడాలన్నారు. తద్వారా ఫిర్యాదుదారునికి పోలీస్ శాఖపై భరోసా, నమ్మకం కలుగుతుందన్నారు. గ్రీవెన్స్ డే లో వచ్చిన ఫిర్యాదులు ఆన్ లైన్ లో పొందుపరుస్తూ ఏ మేరకు పరిష్కారం అయ్యాయో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలందించడం జరుగుతుందని అన్నారు. గ్రీవెన్స్ డే ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావడం ద్వారా సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించేలా చూస్తామని ఎస్పీ తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version