మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం.
చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండలం మల్యాల గ్రామంలో ఇటీవల మరణించిన దేశవేని రామవ్వ కుటుంబానికి ఆర్థిక సాయం అందివ్వాలని ఒక మంచి ఉద్దేశ్యం తో 12వ వార్డు గ్రూప్ సభ్యులు ఈ విషయo పై త్వరితగతిన స్పందించి వాడకట్టులో తలకొన్ని డబ్బులు జమ చేసి (రూ/- 4600) నాలుగు వేల అరువందల రూపాయలు మృతురాలి కుటుంబానికి 12వ వార్డు మెంబర్ పిట్ల మనోహర్ సమక్షంలో అందజేశారు, మరియు ఇటువంటి విషయాలే కాకుండా వార్డులో ఇంకేం సమస్యలున్న ఇలాగే కలిసి కట్టుగా స్పందించి సమస్యలను తీర్చుకోడానికి ప్రయత్నం చేయాలని ఈ సందర్బంగా పిట్ల మనోహర్ తెలియజేసారు,
ఇట్టి కార్యక్రమం లో 12 వార్డు మెంబర్ పిట్ల మనోహర్, వార్డు సభ్యులు కల్లెడ రవీందర్, గండ్ర వెంకటేష్, దొప్పల ఉదయ్, కళ్ళెడ నరేష్, వార్డ్ ప్రజలు మరియు వార్డు సభ్యులు పాల్గొన్నారు.
