తీర్మానం లేకుండానే జి పి నిధుల డ్రా…

తీర్మానం లేకుండానే జి పి నిధుల డ్రా…?

ఎంపీడీవో కార్యాలయంలో ఫిర్యాదు చేసిన వార్డు సభ్యులు గ్రామ ప్రజలు

గెలిసి మూడు నెలలు అయిందో లేదో 10 లక్షల నిధులు విడుదల

గ్రామ సభ తీర్మానాలు ఉన్నాయా…! లేదా అనేది ప్రశ్న…!?

ఉప్పరపల్లి గ్రామ సర్పంచ్ చేతివాటమా…?

కేసముద్రం/ నేటి ధాత్రి

ఎలాంటి తీర్మానం లేకుండా రికార్డ్ లేకుండా నిధులు దురర్వినియోగం చేశారని గురువారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పరపల్లి గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు ఆ గ్రామ ప్రజలు ఫిర్యాదు చేయడం జరిగింది. జిపి లోని నిధులు ఎలాంటి తీర్మానం లేకుండా గ్రామసభ నిర్వహించకుండా నిధులు ఎలా తీస్తారని ఆ గ్రామ సర్పంచిని ఇదేంటి అని వార్డ్ సభ్యులు ప్రశ్నిస్తే మాకు తీసే అధికారం ఉంది అని సమాధానం దాటవేస్తూ బెదిరిస్తున్నారని వార్డు సభ్యులు ఆరోపిస్తున్నారు. గెలిచి వచ్చి మూడు నెలలు గడవ కా ముందే సుమారు 10 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీ నిధుల నుండి ఎలాంటి గ్రామసభ లేకుండా వార్డు సభ్యుల తీర్మానం లేకుండా నిధులు డ్రా చేయడం జరిగిందని వార్డు సభ్యులు ఉప్పరపల్లి గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. చేసిన పనులకే ఇన్నాళ్లు పైసా దిగ్గు లేదని చేయని పనులకు చేసినట్టు గా రికార్డ్ లు చూపించి నిధులు తీసుకోవడం జరిగిందని ఎంపీడీవో కార్యాలయం అధికారికి వివరించడం జరిగింది. ఎలాంటి తీర్మానం లేకుండా జిపి నిధుల దుర్వినియోగం చేసిన సర్పంచ్ పై చట్టరీత్య పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని ఇలాంటి వారి పట్ల జిల్లా కలెక్టర్ మండల పరిషత్ కార్యాలయ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని వార్డు సభ్యులు ఆ గ్రామ ప్రజలు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో ఫిర్యాదు చేయడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version