ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలులో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం..

ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలులో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలులో ప్రజా ప్రతినిధుల పాత్ర కీలకమైనదని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.గురువారం జిల్లాలోని క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలో గల అమ్మ గార్డెన్స్ లో గ్రామపంచాయతీ సర్పంచ్ లు, మున్సిపల్ కార్పొరేషన్/మున్సిపాలిటీ మేయర్/చైర్ పర్సన్ లు,డిప్యూటీ మేయర్/ వైస్ చైర్ పర్సన్ లు,కార్పొరేటర్లు/ కౌన్సిలర్లకు 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం పై ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి డి సి పి ఎ.భాస్కర్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య,జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు,వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్థానిక సంస్థలు,మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడం జరిగిందని,ఈ క్రమంలో విధులు,అధికారాలపై గ్రామపంచాయతీల సర్పంచ్లకు శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందని,పంచాయితీ రాజ్ చట్టాలు వివరించడం జరిగిందని తెలిపారు.మార్చి 6 నుంచి జూన్ 12వ తేదీ వరకు 99 రోజుల పాటు ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు.గ్రామ,మండల, నియోజకవర్గ,జిల్లా,రాష్ట్రస్థాయి లలో కార్యచరణ అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలలో పారిశుధ్యం,ప్రభుత్వ కార్యాలయాలలో పెండింగ్ లో ఉన్న పైళ్ల క్లియరెన్స్ తదితర అంశాలపై కార్యాచరణ,సమాజ హిత అంశాలపై ప్రణాళికలు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు,అమలు చేయడంలో ప్రజా ప్రతినిధులు తీసుకోవలసిన చర్యల గురించి తెలుసుకోవాలని తెలిపారు.తెలంగాణ పంచాయతీరాజ్ & మున్సిపల్ యాక్ట్ ల గురించి ప్రజాప్రతినిధులకు సంక్షిప్తంగా వివరించడం జరుగుతుందని తెలిపారు.విద్యా రంగ అభివృద్ధి దిశగా అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలలో విద్యార్థుల సౌకర్యార్థం మౌలిక వసతులు, విద్యుత్,త్రాగునీరు, మూత్రశాలలు,ప్రహరీ గోడ నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టడం జరిగిందని,ఇందులో భాగంగా ఉపాధి హామీ క్రింద పనులు చేయడం జరిగిందని తెలిపారు.స్వయం సహాయక సంఘాల మహిళలను అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ అభివృద్ధి పనులలో భాగస్వామ్యలను చేయడం జరిగిందని తెలిపారు.రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకున్నట్లయితే క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన లబ్ధిదారులకు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలలో నెలకొన్న సామాజిక సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని తెలిపారు.నిరుద్యోగ యువత భవిష్యత్తు దృష్ట్యా మాదకద్రవ్యాల నిరోధకం,మద్యం వినియోగంపై ప్రజా ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 2, 3 వార్డులలో 3, 4 రోజుల పాటు పారిశుధ్యం,త్రాగునీటి పైప్ లైన్ల మరమ్మత్తు,ఇతర పనులు చేపట్టడం జరుగుతుందని,ప్రజా ప్రతినిధులు కార్యక్రమాలలో పాల్గొని ప్రజలను భాగస్వామ్యులను చేయాలని తెలిపారు.పారిశుధ్య నిర్వహణలో భాగంగా ప్రతి రోజు ప్రతి ఇంటి నుండి చెత్త సేకరణ నిరంతరాయంగా కొనసాగించాలని తెలిపారు.ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలలో ఒకసారి లబ్ధి పొందిన వారిని గుర్తించాలని, మరల లబ్ధిదారుల జాబితాలో వారి వివరాలు లేకుండా జాగ్రత్త వహించాలని,తద్వారా అర్హత గల మిగిలిన లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరుతుందని, ప్రభుత్వ లక్ష్యాలు విజయవంతం అవుతాయని తెలిపారు.రహదారి ప్రమాదాల నివారణలో భాగంగా ప్రతి ఒక్కరు రహదారి భద్రత నియమాలను పాటించే విధంగా ప్రజాప్రతినిధులు వారి పరిధిలో అవగాహన కల్పించాలని తెలిపారు.మున్సిపల్ పాలకవర్గం ఏర్పాటు చేయబడినందున మున్సిపల్ అభివృద్ధి కొరకు నిధులు మంజూరు అవుతాయని, ఈ నిధులను సక్రమంగా వినియోగిస్తూ ప్రజా ప్రయోజనకర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు.వేసవిలో ప్రజలకు నిరంతరం నీటిని సరఫరా చేసే విధంగా ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను ప్రజాప్రతినిధులు తమ పరిధిలో పకడ్బందీగా అమలు చేయాలని,నీటి వనరులను సమర్ధవంతంగా వినియోగించుకోవాలని తెలిపారు.విద్యుత్ దీపాల ఏర్పాటులో సౌర విద్యుత్ దీపాల ఏర్పాటుపై దృష్టి సారించాలని,తద్వారా విద్యుత్ వినియోగాన్ని నియంత్రించవచ్చని తెలిపారు.ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అమలులో ప్రజా ప్రతినిధుల విధులు, అధికారాలు తెలుసుకొని ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి ప్రజాసంక్షేమం ఉందిగా కృషి చేయాలని తెలిపారు.ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక కార్యక్రమం అమలులో ప్రజా ప్రతినిధుల పాత్ర కీలకమైనదని తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగస్వామ్యం కావాలి: కలెక్టర్

పట్టణాల అభివృద్ధిలో ప్రజాప్రతినిధుల పాత్ర కీలకం..

ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలి..

మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో ప్రతీ ఒక్కరు భాగస్వాములు కావాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పరిధిలోని అమ్మ గార్డెన్ లో జిల్లా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశంపై నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు ఒకరోజు శిక్షణతో పాటు అవగాహన కార్యక్రమం నిర్వహించగా కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్,అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య, మంచిర్యాల డిసిపి భాస్కర్ లు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక పై స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు శిక్షణ తరగతులు నిర్వహించామని అన్నారు. కార్యక్రమం జూన్‌ 12 వరకు కొనసాగుతుందని, ఎమ్మెల్యే, మేయర్, మున్సిపల్ చైర్మెన్ ,సర్పంచ్‌ నుంచి మంత్రి వరకు ప్రతి ఒక్కరూ స్థానికంగా అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని అన్నారు.

పెండింగ్‌ ఫైల్స్‌ పరిష్కారం, పరిశుభ్రతపై ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా మన పనితీరు ఉండాలని తెలిపారు. ప్రభుత్వం అందించిన అవకాశాన్ని వినియోగించుకుంటూ క్షేత్రస్థాయి సమస్యలు అధికారుల దృష్టికి తీసుకుని వచ్చి పరిష్కరించుకోవాలని తెలిపారు. వేసవి కాలంలో జిల్లాలో తాగు నీటి ఎద్దడి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు.

ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలు, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై ప్రజాప్రతినిధులకు అవగాహన అందించేందుకు ఏర్పాటుచేసిన శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ సూచించారు. గ్రామీణ ప్రాంతాలు, మున్సిపాలిటీల్లో నెలకొన్న సమస్యలు, అభివృద్ధి పనుల పురోగతిపై ప్రజా ప్రతినిధులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీల సర్పంచులు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ కార్పొరేటర్లు మునిసిపాలిటీల చైర్ పర్సన్లు వైస్ చైర్ పర్సన్లు కౌన్సిలర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్….

ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…..

తంగళ్ళపల్లి మండలం .జిల్లెల్ల గ్రామంలోనీ. వ్యవసాయ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు .సర్పంచ్లకు. ప్రజా పాలన ప్రణాళికలో భాగంగా 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఈరోజు జిల్లెల్ల గ్రామ శివారులోని నూతనంగా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిలకు సర్పంచులకు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విద్యాలయం జిల్లెల్ల కాన్ఫరెన్స్ హాలులో ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని. ఇందులో భాగంగా ఈరోజు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగ్రవాల్ ఆధ్వర్యంలో. జ్యోతి వెలిగించి అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఈరోజు వ్యవసాయ కళాశాలలో మండలంలోని అలాగే మున్సిపల్ పరిధిలోని అధ్యక్షులు కౌన్సిలర్లు సర్పంచులు ప్రజా ప్రతినిధుల అందరికీ ప్రజా పరిపాలన ప్రణాళికలో భాగంగా ఒక్కరోజు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని. ఇందులో అనేక విషయాలపై పలు సమస్యలపై తెలుసుకోవడంతో పాటు గ్రామ పరిపాలనలో ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా .ఒడిడోడుకులకు. గురికాకుండా శిక్షణ కార్యక్రమంలో అన్ని విషయాలపై క్షుణ్ణంగా పరిశీలనలతోఅవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరీమ అగ్రవాల్. జిల్లా .ఎస్పీ .మహేష్ బి.గితే. అదనపు .కలెక్టర్ .గడ్డం నగేష్. నూతనంగా ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు మున్సిపల్ అధ్యక్షులు గ్రామ సర్పంచ్లు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version