అంబేద్కర్ విగ్రహానికి భూమి పూజ

అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కొరకు భూమి పూజ

ఆహ్వానిస్తున్న అంబేద్కర్ యువజన సంఘం

కేసముద్రం/ నేటి ధాత్రి

కేసముద్రం మండలం
కాట్రపల్లి గ్రామంలోని అంబేద్కర్ యువజన సంఘం వారి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టించేందుకు భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి అధికారులు ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని అంబేద్కర్ యువజన సంఘం వారు తెలిపారు.

రేపటి భావితరాల యువత యువకులు విద్యావంతులు మేధావులు అందరూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను స్ఫూర్తిగా ఆదర్శంగా తీసుకోవాలని యువత వారి ఉన్నతమైన భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని వారి ఆశయ సాధనలో ముందుకు పోవాలని, ముఖ్య ఉద్దేశంతో అందరి సహాయ సహకారాలతో,

2026, మార్చ్13 శుక్రవారం ఉదయం 10 గంటలకు భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన కొరకు భూమి పూజ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ఆహ్వానించడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమానికి , కేసముద్రం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఎం ఆర్ ఓ ఎంపీడీవో, నూతన ప్రజా ప్రతినిధులు కేసముద్రం మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లు కౌన్సిలర్లు–
కేసముద్రం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మరియు డైరెక్టర్లు
సింగిల్ విండో చైర్మన్ మరియు డైరెక్టర్లు మరియు
కేసముద్రం మండల పోలీసు అధికారులు మాజీ ప్రజా ప్రతినిధులు

అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు కేసముద్రం మండల నాయకులు అన్ని పార్టీల పెద్దలు నాయకులు అన్ని ప్రజా సంఘాల నాయకులు పెద్దలు విద్యార్థి సంఘాల నాయకులు అన్ని కుల సంఘాల నాయకులు ఎంఆర్పిఎస్ ఎంఎస్పి మాల మహానాడు లంబాడి హక్కుల పోరాట సమితి పెద్దలు నాయకులు విద్యావంతులు మేధావులు కవులు కళాకారులు ఉద్యమకారులు అంబేద్కర్ వాదులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version