*ప్రతిఒక్క విద్యార్ధి జీవితంలో టెన్త్ పరీక్షలు కీలకం *…
*పదవ తరగతి విద్యార్థులకు, వంగ ఫౌండేషన్” ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్స్ పంపిణీ *…
మొగుళ్లపల్లి నేటి దాత్రి
భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలోని మొట్లపల్లి పాఠశాలలో పదవ తరగతి ఎగ్జామ్ నేషనరీ అందించిన వంగ ఫౌండేషన్ చైర్మన్ వంగ మహేష్ మాట్లాడుతూ ప్రతిఒక్క విద్యార్థి కస్టపడి ఉన్నత చదువులు అభ్యసించి చదివి పాఠశాలకు, కన్న తల్లిదండ్రులకు, స్వంత ఊరుకు, దేశానికి, సేవ చేసే ప్రతిభవంతులుగా ఎదగాలని, విద్యావంతుడు ప్రపంచంలో ఎక్కడఉన్నా పూజింప బడుతాడని, ప్రతిఒక్కరూ ఉన్నత చదువులు చదివి మంచి స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు. పదవ తరగతి విద్యార్థులకు పదవ తరగతి కీలక దశఅని, ఈ సమయంలో సరైన స్టడీ మెటీరియల్, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో నడుచుకోవడం ఏoతో అవసరమని, విద్యార్థులు కస్టపడి చదివి మంచి ఫలితాలు సాధించాలని కోరినారు.
